Jayashankar District Latest News
-
ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి
భూపాలపల్లి రూరల్: పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన 21మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలతో పోలీసుస్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందని తెలిపారు.ఎస్పీ కిరణ్ ఖరే -
అవినీతిపై విచారణ చేపట్టాలి..
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025చిట్యాల మండలం కొత్తపేట గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపించాలని చిగురు రాజ్కుమార్, దొడ్డి శంకర్ కోరారు. కారోబార్ దేవేందర్ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీలో అక్రమాలకు పాల్పడ్డాడని, పనిచేయని కూలీలను హాజరు రిజిస్టర్లో నమోదు చేసి, కూలీ డబ్బులు చెల్లించి, అందులో నుంచి సగం డబ్బులు తీసుకుంటున్నాడని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని, తగు విచారణ జరపాలని కోరారు. -
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
రేగొండ: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. సోమవారం కనిపర్తి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఎల్లంకి భిక్షపతి ఉద్యోగ విరమణ సభకు శ్రీపాల్రెడ్డి హాజరై మాట్లాడారు. అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన భిక్షపతిని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రేగొండ ఎంఈఓ ప్రభాకర్, కొత్తపల్లిగోరి ఎంఈఓ రాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుబాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్, మండల నాయకులు పాల్గొన్నారు.టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
కోటగుళ్లను సందర్శించిన ఇటలీ ఆర్కిటెక్చర్ బృందం
గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లను సోమవారం ఇటలీ దేశానికి చెందిన ఆర్కిటెక్చర్ బృందం సందర్శించింది. ఇటలీకి చెందిన రార్టో, మేఘా ఆధ్వర్యంలో ఆర్కిటెక్చర్ బృందం సందర్శించి మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం కోటగుళ్ల శిల్పసంపదను కెమెరాల్లో చిత్రీకరించుకున్నారు. ఆలయ శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. పరీక్ష కేంద్రాల తనిఖీ భూపాలపల్లి రూరల్: జిల్లాలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈఓ రాజేందర్ సోమవారం తనిఖీ చేశారు. కాటారం ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, మహదేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలురు, బాలికల పాఠశాలను సందర్శించారు. రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. పరీక్షలకు సోమవారం 3,449 విద్యార్థులకు 3,435 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడొద్దు ● కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డికాళేశ్వరం: ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు, యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహదేవపూర్ పోలీసుస్టేషన్లో విలేకర్లతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్లు చట్టవిరుద్ధమన్నారు. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని, రోడ్డున పడొద్దన్నారు. యువత, అభిమానులు దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట సీఐ రామచందర్రావు, ఎస్సైలు పవన్కుమార్, తమాషారెడ్డి, రమేష్ ఉన్నారు. 27న ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ మొగుళ్లపల్లి: ఈ నెల 27న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే బీసీల మహాధర్నాకు వేలా దిగా తరలివచ్చి హలో బీసీ.. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదింపజేయడాన్ని స్వాగతిస్తున్నామన్నా రు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి బీసీ విద్యార్థులు, బీసీ యువత, బీసీ మహిళలు, బీసీ ఉద్యోగస్తులు వేలాదిగా తరలి రావాలన్నారు. -
బయోమెట్రిక్ ప్రకారమే వేతనాలు
భూపాలపల్లి: బయోమెట్రిక్ హాజరు ప్రకారమే సిబ్బందికి వేతన చెల్లింపులు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో అన్ని శాఖల అధికారులతో కలిసి బయోమెట్రిక్ హాజరు పరికరాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం నిర్దేశిత సమయం ప్రకారం బయోమెట్రిక్ హాజరు నమోదుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మిల్లెట్ కౌంటర్ అందుబాటులో ఉండాలి.. మిల్లెట్ కౌంటర్ ప్రతీరోజు కలెక్టరేట్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ డీఆర్డీఓ నరేష్కు సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ కౌంటర్ను పరిశీలించారు. వాటర్ షెడ్ యాత్ర విజయవంతం చేయాలి.. ఈ నెల 29న జిల్లాలో నిర్వహించే వాటర్షెడ్ యాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో వాటర్షెడ్ యాత్ర నిర్వహణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేసవిలో నీటి వినియోగం, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఈ నెల 22న ఆదిలాబాద్లో మొదలైన యాత్ర 29వ తేదీన జిల్లాలో కొనసాగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి.. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అవగాహనతోనే క్షయ వ్యాధిని నిర్మూలించగలమని అన్నారు. సమీక్ష అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన క్షయ వ్యాధి అవగాహన స్టాల్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, వైద్యాధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ఈవీఎం గోదాంను పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై నిరంతర పటిష్ట పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి కలెక్టర్ రాహుల్ శర్మ -
అక్రమంగా మట్టి తవ్వకాలు
కాటారం: మహాముత్తారం మండలం యామన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డగూడెం సమీపంలోని ఎర్రకుంట చెరువులో ఆదివారం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. కొందరు వ్యక్తులు జేసీబీ సహాయంతో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి రవాణా చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇరిగేషన్ శాఖకు చెందిన చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి దందా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. -
వేముల శంకర్కు డాక్టరేట్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ఐటీ మాస్టర్ డైరెక్టర్ వేముల శంకర్కు డాక్టరేట్ అవార్డు వరించింది. ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్(యూఎస్ఏ) గౌరవ డాక్టరేట్ను అందించింది. జిల్లాకేంద్రంలో 11 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 350–400 యూనిట్ల రక్తాన్ని ఎంజీఎం ఆస్పత్రికి అందిస్తూ వేలాది ప్రాణాలను రక్షిస్తున్నారు. అవయవదానం ఆవశ్యకతపై విద్యా సంస్థలలో అవగాహన కార్యక్రమాలు, ప్రచార యాత్రలు నిర్వహించారు. హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని ఐదు వేల మొక్కలను నాటించి 8,900మందికి ఉచిత కంప్యూటర్ శిక్షణ, నాలుగు వేల మందికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించారు. ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్లో ఈ ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డును అందించనున్నారు. -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
భూపాలపల్లి రూరల్: మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని భారత్ ఫంక్షన్హాలులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిముల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిములకు ఫలహారాలు తినిపించారు.కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర -
వైద్యశిబిరానికి విశేష స్పందన
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. మెడికవర్ హాస్పిటల్ నేతృత్వంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజపల్లి సుధాకర్రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 500 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో అందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యమే లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తాళ్ల పోశం, నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్, డాక్టర్లు షఫీ పాలగిరి, డాక్టర్ శ్రవణ్ కుమార్ జోగు, టుది ఎకో ప్రకాశ్, పీఆర్ఓ రాజు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. -
కార్పొరేట్ సెలూన్లను రద్దుచేయాలి
భూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలో ప్రారంభం కాబోతున్న కార్పొరేట్ సెలూన్లను వెంటనే రద్దు చేయాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు పందిళ్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాస్ రాజశేఖర్, జిల్లా గౌరవాధ్యక్షుడు కురిమిల్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ ప్రాంతంలో పింక్స్ ఇన్ బ్లూస్ బ్యూటీ పార్లర్ అనే పేరుతో కార్పొరేట్ సెలూన్ అండ్ పార్లర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని, ఆదివారం పార్లర్ముందు నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. కార్పొరేట్ సెలూన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. నిరవధిక నిరాహార దీక్ష చేయడానికై నా సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముల్కనూర్ బిక్షపతి, జిల్లా కోశాధికారి గిద్దమారి సుధాకర్, మండల అధ్యక్షులు మంతెన భూమయ్య, ప్రధాన కార్యదర్శి గిద్దమరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మతోన్మాదంపై పోరాటానికి సిద్ధంకావాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపునిచ్చారు. భగత్సింగ్ 94వ వర్ధంతిని ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. భారతీయుల హృదయాలను ఉత్తేజ పరచిన విప్లవకారుడు భగత్సింగ్కు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసిందన్నారు. నాటి ఉద్యమ పోరాటంలో చేసిన త్యాగాలను గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో నేటితరం యువత బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రామప్పలో యూరప్ దేశస్తులువెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని ఆదివారం యూరప్కు చెందిన జెయో, ఇలోనాలు సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఆదివారం సెలవుకావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు రామప్పకు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రొఫెసర్లు రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. జాతీయ కౌమార విద్యా సదస్సుకు డాక్టర్ రామయ్య ములుగు: ప్రాంతీయ విద్యాసంస్థ(ఎన్సీఈఆర్టీ) బోపాల్లో నేడు, మంగళవారం జరగనున్న జాతీయ కౌమార విద్యా సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి తాను ఎంపికై నట్లు ములుగు మండలం అబ్బాపురం ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, మనో విజ్ఞానవేత్త డాక్టర్ కందాల రామయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కౌమారదశలో బాలికలు ఒత్తిడిని ఎదుర్కొనే విధానాలు అనే అంశంపై చేసిన పరిశోధన, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని తెలిపేలా వివరించనున్నట్లు వెల్లడించారు. -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల షెవర్ల కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం, చీరసారె కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓ ఎన్నారై కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు పూజలు చేశారు. డీజె సౌండ్ నృత్యాలతో పలువురు భక్తులు సందడి చేశారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘అమ్మవార్ల చరిత్ర గొప్పది’ మేడారం సమ్మక్క– సారలమ్మ చరిత్ర చాలా గొప్పదని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు కొనియాడారు. కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవార్లను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వనదేవతల చరిత్ర నలుదిశలా వ్యాపించేలా తమకున్న వనరులతో పుస్తకాలను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చూస్తామన్నారు. సమ్మక్క– సారలమ్మ జాతరకు జాతీయస్థాయి గుర్తింపును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రజల మనో భావాలను గుర్తించాలన్నారు. వనదేవతలను దర్శించుకున్న వారిలో ప్రొఫెసర్లు గోవాకు చెందిన ప్రకాశ్దేశాయ్, తమిళనాడుకు చెందిన లక్ష్మణన్, కేరళ రాష్ట్రానికి చెందిన జోష్జార్జి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన అంజిరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శ్రీనివాసులు, కాకతీయ యూనివర్సిటీకి చెందిన సత్యనారాయణ, యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అంకిళ్ల శంకర్, కలిపిండి వినోద్, చేరాల శివప్రసాద్ ఉన్నారు. -
తల్లిదండ్రులు గమనిస్తుండాలి..
● పిల్లలు ఎక్కువ సేపు టీవీలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను చూస్తే కళ్లు పొడిబారి దృష్టి సమస్య వస్తుంది. ● పిల్లలు ఖాళీ సమయంలో టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోకుండా ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. ● చదివే సమయంలో పుస్తకాలను దగ్గరగా పెట్టుకోకుండా కంటికి కనీసం 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేలా చూడాలి. ● పిల్లలు అన్నం తిననని మారాం చేసే సమయంలో టీవీ, ఫోన్ ఇచ్చే అలవాటు చేయకూడదు. ● పాఠశాలల నుంచి ఇంటికి రాగానే టీవీ, ఫోన్తో గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
నీటి పొదుపు బాధ్యత
కాటారం: నీటిని పొదుపుగా వాడుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని భూగర్భ జలవనరుల శాఖ అధికారి రామకృష్ణ అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని నీటి ఆవశ్యకతపై వెలుగు రేఖ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి వినియోగం, నిర్వహణ, నీటి ప్రాముఖ్యత, నీటి సంరక్షణ చర్యలు, భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షం నీటిని భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలమట్టాన్ని పెంచుకోవచ్చన్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ డీపీఎం కిరణ్, డీబీఎస్ బ్యాంకు మేనేజర్ హరీశ్, సీఈఓ రజిత, రిసోర్స్పర్సన్ లక్ష్మిరాజం పాల్గొన్నారు. -
జీపీ భవన నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ
కాటారం: మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామపంచాయతీ భవన నిర్మాణంపై శనివారం కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టగా పనుల్లో నాణ్యత లోపించిందని పలు కారణాలతో నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో పలువురు మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లగా గ్రామపంచాయతీ నిర్మాణంపై అభిప్రాయాలు సేకరించాలని సబ్ కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. దీంతో పనులు కొనసాగించడమా లేక మరో చోట నిర్మించడమా అనే అంశాలపై అధికారులు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. నివేదిక ఆధారంగా త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు సబ్కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
టేకుమట్ల: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ హెల్ఫ్లైన్ జిల్లా అధికారి కళావతి అన్నారు. శనివారం మండలంలోని రామకిష్టాపూర్(టి) అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు చట్టాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం సుకన్య సమృద్ధియోజన, బేటీ బచావో–బేటీ పడావో, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్లైన్, సఖి కేంద్రాలను నిర్వహింస్తుందని అన్నారు. బాలికల చదువు అనంతరం వివాహానికి సుకన్య సమృద్ధి యోజన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. బాలికలే భవిష్యత్కు పునాదులుగా బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం కొనసాగిస్తున్నారని అన్నారు. బాలికలు సమాజంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఇబ్బందులకు గురయితే చైల్డ్ హెల్ప్లైన్ తోడ్పాటునందిస్తుందన్నారు. మహిళలు కుటుంబ పరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సఖి కేంద్రం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. చైల్డ్ హెల్ప్లైన్, బాలికల సమస్యల కోసం 1098, వృద్ధుల సమస్యల కోసం 14567, మహిళల సమస్యల కోసం 181 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరోజన, సఖి గాయత్రి మిషన్ శక్తి కో ఆర్డినేటర్ అనూష, మమత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
పనుల ప్రతిపాదనలు సమర్పించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాలకు చేపట్టనున్న తాత్కాలిక ఏర్పాట్ల పనులకు సంబంధించిన అంచనా ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, దేవాదాయ, పర్యాటక ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో శాశ్వత పనులకు అంచనాలు అందజేశారని, కొన్ని తాత్కాలిక పనులు చేపట్టాల్సి ఉన్నందున మరోమారు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. పుష్కరాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించేందుకు జోన్ల వారీగా విభజించి, ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఆర్టీసీ, పోలీసు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. భూముల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి.. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూముల కేటాయింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం, మహదేవపూర్ మండలాల్లో ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపు, రేగొండ మండలం బుద్దారం నుంచి రామన్నగూడెం తండా వరకు రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల కేటాయింపు విషయమై అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్అండ్బీకి అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
దృష్టి లోపం
పిల్లల్లో పెరుగుతున్న కంటి సమస్యలు●● జిల్లాలో 3,449మందికి పరీక్షలు ● 676మందికి లోపం ఉన్నట్లు నిర్ధారణ ● ఆర్బీఎస్కే పరీక్షల్లో వెల్లడి భూపాలపల్లి అర్బన్: జిల్లాలో దృష్టి లోపం ఉన్న పిల్లలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమ్ (అర్బీఎస్కే) ఆధ్వర్యంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,449మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా 676 మందికి దృష్టిలోపం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా జిల్లాలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తంగా 3,500మందికి కంటి పరీక్షలు చేయనున్నారు.మూడు, ఆరేళ్లలో పరీక్షలు బాల్యంలోనే కంటి సమస్యలను గుర్తిస్తే భవిష్యత్లో ఇబ్బందులు ఉండవు. మూడేళ్ల వయస్సులో కంటి వైద్య పరీక్షలు చేస్తే బొమ్మలను గుర్తు పడుతున్నారా అనేది తేలుతుంది. తిరిగి ఆరేళ్ల వయసులో పరీక్షించాలి. దృష్టి లోపం ఉంటే అద్దాలు, ఇతర సంరక్షణ చర్యలు తీసుకోవాలి.ప్రతి విద్యార్థినీ పరీక్షిస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. దృష్టి లోపాలను గుర్తిస్తూ అద్దాల పంపిణీకి నివేదిస్తున్నాం. సమస్య అధికంగా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేస్తాం. జిల్లాలో ఇప్పటివరకు శస్త్ర చికిత్సలు చేసే అవసరం రాలేదు. – బండి శ్రీనివాస్, జిల్లా నోడల్ అధికారిపెరుగుతున్న మానసిక సమస్యలు విద్యార్థులు ఎక్కువ సమయం ఫోన్లు వాడుతుండటంతో దృష్టి లోపంతో పాటు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడికి గురై ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నారు. ఆకలి మందగించడంతో పాటు ఏకాగ్రత, ఆలోచనా శక్తి కోల్పోతున్నారు. బరువు పెరగడంతో పాటు ఎదుగుదల క్షీణిస్తోంది. తలనొప్పితో బాధపడుతున్నారు. అయిదేళ్లలోపు పిల్లలకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇస్తుండటంతో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో ఎస్పీ
భూపాలపల్లి: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మామునూరు బెటాలియన్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలీసు అధికారులు ఈ ఏడాదికి సంబంధించిన ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సాధనలో ఎస్పీ కిరణ్ ఖరే, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పిస్టల్, ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, వివిధ ఆటోమేటిక్ ఆయుధాలతో ఫైరింగ్ సాధన చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫైరింగ్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని మంచి మెలకువలు నేర్చుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమైనవని, అత్యవసర సమయాల్లో ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణకోసం ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఫైరింగ్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్రావు, నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 3,449మంది విద్యార్థులకు గాను 3,441 మంది హాజరుకాగా 8మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. మొదటిరోజు పరీక్ష కావడంతో విద్యార్థులు ఉదయం 8గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 9గంటల తరువాత విద్యార్థులను క్షణ్ణంగా పరిశీలిస్తూ పరీక్ష హాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల తనిఖీ.. జిల్లావ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్శర్మ, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఇన్చార్జ్ డీఈఓ రాజేందర్ వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో వైద్యం, కరెంట్, రవాణా సౌకర్యం, ఇతర వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్శాఖ ఆధ్వర్యంలో 144 సెక్షన్ విధించి పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి..
ములుగు రూరల్: జిల్లాలోని సమ్మక్క–సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని యూనివర్సిటీ వీసీ వై.ఎల్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన వర్సిటీలో ప్రస్తుతం రెండు కోర్సులు బీఏ ఎకానామిక్స్, బీఏ లిటరేచర్ ఉన్నాయని వచ్చే అకడమిక్ ఇయర్లో ఎంబీఏ, బయో టెక్నాలజీ, బీబీఏ కోర్సులు ప్రారంభించేలా కృషి చేస్తానన్నారు. విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యం, క్లాస్ రూంల ఏర్పాటు, ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని వర్సిటీకి నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్ను తీసుకొస్తామన్నారు. త్వరలో ట్రైబల్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన వర్సిటీ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించిందని, గిరిజన వర్సిటీపై టోఫో గ్రాఫికల్ సర్వే నిర్వహిస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్పారు. విద్యార్థులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో హాస్టల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు త్వరలోనే బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తామన్నారు.గిరిజన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ -
ఆయుష్ భవనంలోకి నర్సింగ్ కళాశాల
భూపాలపల్లి అర్బన్: నర్సింగ్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ‘ఆన్లైన్లోనే తరగతులు’ శీర్షికతో నర్సింగ్ కళాశాలకు భవనం కరువు అని బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్తులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని సూచించారు. ప్రధాన ఆస్పత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం నుంచి అవసరమైన సిబ్బందిని సర్దుబాటు చేసి, కళాశాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నర్సింగ్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. తాత్కాలికంగా భవనం వినియోగంపై కమిషనర్తో మాట్లాడతానని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నవీన్, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజేశం, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు. జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడదెబ్బ తగలడానికి గల ప్రధాన కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశం అనంతరం వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నవీన్, వివిధ శాఖల అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. రెండు అంతస్తుల వినియోగం జిల్లా ప్రధాన ఆస్పత్రి, డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి సిబ్బంది సర్దుబాటు కలెక్టర్ రాహుల్ శర్మ -
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్ జారీకి ఇ–టిమ్స్ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు. వరంగల్ రీజియన్లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులతో టికెట్ల జారీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సంస్థ వరంగల్ రీజియన్కు చేరుకున్న 750 ఇ–టిమ్స్ టికెట్ జారీపై మరింత స్పష్టత ప్రతి స్టేజీ వారీగా వివరాలు తెలుసుకునే సౌకర్యం -
ఆలిండియా పోటీలకు ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన గుర్సింగ విజయలక్ష్మి ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీలకు ఎంపికై ంది. తెలంగాణ తరఫున జట్టులో శుక్రవారం నుంచి ఈనెల 24 వరకు న్యూఢిల్లీలో జింఖాన గ్రౌండ్లో జరుగనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తెలంగాణ తరఫున ఎంపికై నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ క్రీడలో తెలంగాణ తరఫున జట్టులో ఆడినట్లు పేర్కొన్నారు. ఆమె కాటారంలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె ఎంపిక కావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక రాష్ట్రస్థాయి అధ్లెటిక్స్ పోటీలకు మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల, బాలుర పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ గుర్సింగ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలికల విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో 9వ తరగతి విద్యార్థిని బద్దెల విష్ణుప్రియ, 8వ తరగతి విద్యార్థిని వసంత అనుజ్ఞ, 7వ తరగతి విద్యార్థిని మాడిగ అక్షిత, 6వ తరగతి విద్యార్థిని పెద్ది మధులత, బాలుర విభాగం నుంచి 9వ తరగతి విద్యార్థి సంగం అభిరాంప్రసాద్, 6వ తరగతి విద్యార్థి సుంకరి ప్రద్యున్ ఎంపికయ్యారు. ఈనెల 23న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను పాఠశాల హెచ్ఎం సరిత, ఉపాధ్యాయులు అభినందించారు. -
విచ్చలవిడిగా పార్కింగ్
కాళేశ్వరం: ఇసుక లారీలు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తుండడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై రెండు వరుసల్లో లారీలు వెళ్తుండడంతో జనం ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. జిల్లాలోని మహదేవపూర్ మండలం పలుగుల, మద్దులపల్లి, పూస్కుపల్లి, బొమ్మాపూర్, ఎలికేశ్వరం తదితర గ్రామాల్లో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక క్వారీలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీంతో నిత్యం హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ తదితర నగరాలు, పట్టణాలకు లారీలు, టిప్పర్లలో ఇసుక రవాణాతో తరలిపోతుంది. నెలన్నర రోజులుగా నిత్యం క్వారీ ల్లో ఇసుక క్వాంటిటీ మునుపటి కన్నా ఎక్కువగా పెంచడంతో లారీలు భారీగా క్యూ కడుతున్నాయి. ఊపందుకున్న నిర్మాణాలు.. వేసవికాలం కావడంతో నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు ఇతర పనులకు ఇసుక అవసరం. దీంతో ఇసుకకు బాగా డిమాండ్ పెరిగింది. లారీలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నాయి. దీంతో ట్రాఫిక్జాం అవుతుంది. ఆయా గ్రామాల్లో రోడ్డుపై నిలిచి ఉండడంతో రోజువారి పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. డబుల్ రోడ్డుపై రెండు వరుసల్లో లారీలు ఖాళీ, లోడ్ లారీలు పక్కపక్కనే నిలిచి ఉండడంతో మధ్య నుంచి ప్రయాణించడానికి రోడ్డు లేక జనం అవస్థలు పడుతున్నారు. కనీసం ఆటో కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. సమయ పాలన ఏది.. గతంలో విధులు నిర్వర్తించిన టీజీఎండీసీ అధికారులు, పోలీసులు సమయపాలన పాటించి ప్రమాదాలకు చెక్పెట్టారు. సంబంధిత టీజీఎండీసీ, పోలీసుల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో సమయపాలనతో లారీలకు అనుమతి ఇచ్చేవారు. ఉదయం ఆరు గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9గంటల వరకు లారీలను నిలిపి అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం కూడా మళ్లీ సమయ పాలనను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఘటనలు ఇలా.. ఉన్నతాధికారులు ఇప్పుడు ఇసుక తరలించాలనే ఉద్దేశంతో ఇబ్బడిముబ్బడిగా లారీలతో ఇసుక తరలించి అక్కడక్కడ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నారు. వారం రోజుల్లో రెండు ఘటనలు జరిగాయి. కాళేశ్వరంలోని ఎస్సీ కాలనీ వద్ద లారీ డైవర్ మద్యం మత్తులో ఇంట్లోకి దూసుకెళ్లాడు. ఇళ్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. పలుగుల వద్ద లారీలు జాం కావడంతో మంచిర్యాల జిల్లా మద్దికాల రాజు అనే యువకుడు లారీ రెండు చక్రాల కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్ నుజ్జునుజ్జు కాగా రాజు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇలా నిత్యం రోడ్డుపై లారీలతో ప్రమాదాలు జిల్లాలో ఎక్కడో ఓచోట జరుగుతున్నాయి. అధికారులతో మాట్లాడుతా.. పరీక్షలు జరుగుతున్నందున సమయపాలనపై ఉన్నతాధికారులతో మాట్లాడుతా. విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. పార్కింగ్ కోసం స్థలాల పరిశీలన చేస్తున్నాం. ట్రాఫిక్జాంకు త్వరలో చెక్పెడుతాం. – శ్రీకాంత్, టీజీఎండీసీ పీఓ, భూపాలపల్లిఇసుక క్వారీలువిద్యార్థులకు ఇబ్బందులు.. రోడ్డుకు రెండు వరుసల్లో లారీలు పట్టించుకోని అధికారులు టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తప్పని తిప్పలుపదవ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభం కాగా ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఉదయం వేళలో లారీల రాకపోకలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే పరీక్ష సమయానికి వెళ్లరు. ఒక్క పరీక్షకు అందకపోయినా భవిష్యత్కు ఇబ్బంది తప్పదు. ప్రమాదం జరిగితే ఇబ్బందులకు గురవుతారు. బైక్, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చేటప్పుడు లారీలతో దారిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పరీక్ష సమయాల్లో ఉదయం ఏడు గంటల నుంచి 9.30గంటలు, మద్యాహ్నం 12.30.గంటల నుంచి 2గంటల వరకు సమయపాలన ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆవైపుగా ఆలోచన చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి రూరల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల అటవీ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డితో కలిసి భూపాలపల్లి మండలంలో రూ.4.73 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించేలా చూస్తున్నామన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బస్సులకు మహిళలను ఓనర్లను చేసినట్లు తెలిపారు. ప్రతీ మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 12 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మండలపార్టీ అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్యతోపాటు ఆయాగ్రామాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
మే 10లోపు పనులు పూర్తి చేయాలి
కాళేశ్వరం: మే 10 లోపు పనులన్ని పూర్తి చేసి సరస్వతి నది పుష్కరాలకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించా రు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరేలతో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా వీఐపీ ఘాట్ వద్ద మెట్ల నిర్మాణ పనులను పరి శీలించారు. 150మీటర్ల పొడవు మెట్లను 86మీటర్ల పొడవుకు కుదించిన విషయమై చర్చించారు. ఘాట్ వద్ద రహదారి వీఐపీ ఘాట్ వద్ద రూ.కోటితో కొనసాగుతున్న సరస్వతి విగ్రహం, సుందరీకరణ పనులు పరిశీలించి, విగ్రహ ఏర్పాటుకు స్థలం నిర్ణయించారు. వీఐపీ ఘాట్ నుంచి గోదావరి ఘాట్ వరకు గోదావరిలో కర్రలు లేదా స్టీల్తో రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. పురుషులు, మహిళల కోసం వేర్వేరుగా శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాల్లో 12 రోజులపాటు గోదావరి హారతి నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగొద్దు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళిక, సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి చేయాల్సిన శాశ్వత, తాత్కాలిక పనులకు ముందుగానే షెడ్యూల్ తయారు చేసుకోవాలని, సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో నియమించుకోవాలని పెంచాలని సూచించారు. అంచనాల్లో వ్యత్యాసాలతో చేపట్టే పనులపై రెండు రోజుల్లో నివేదికలు అందచేయాలని సూచించారు. పుష్కరాలకు ప్రత్యేక యాప్ పుష్కర సమాచారం తెలిసేలా ప్రత్యేకంగా యాప్ తయారు చేయాలని, విస్తృత ప్రచారానికి అంబాసిడర్ను నియమించాలని తెలిపారు. 12 రోజుల కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ తయారు చేయాలని ఈఓ మహేష్ను ఆదేశించారు. వేసవి దృష్ట్యా గోదావరిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరిలో నీటి నిల్వలను పరిశీలించాలన్నారు. అన్న సత్రాన్ని అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆర్టీసీ బస్సులు నిలిపే ప్రదేశం, 86గదుల వసతి గృహాన్ని పరిశీలించారు. సమీక్షలో సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టనున్న పనుల ప్రగతిని వివరించారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, ఏసీ సునీత, ఈఓ మహేష్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సైలు తమాషారెడ్డి, పవన్ పాల్గొన్నారు. మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష -
ఆర్థికాభివృద్ధివైపు అడుగులు పడట్లే!
జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు..అట్టడుగున ఆరు జిల్లాలు.. ● తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి ● 15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం.. గతంతో పోలిస్తే పరవాలేదు ● అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్.. మూడో స్థానంలో భూపాలపల్లి ● తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ – 2025లో వెల్లడిజిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలు ఈసారి కూడా వెనుకబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విడుదల చేసిన తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 32, 33వ స్థానంతో అట్టడుగున నిలిచాయి. ఈ జిల్లాల వృద్ధి రేటు రాష్ట్ర వ్యాప్తంగా వెనకబడి ఉంది. 2022–23 సంవత్సరాలకు ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ విడుదల చేసిన ‘‘తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025’’ గణాంకాల ఆధారంగా ప్రత్యేక కథనం IIలోu – సాక్షి ప్రతినిధి, వరంగల్ -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
భూపాలపల్లి రూరల్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత, విద్యార్థులు మాదక ద్రవ్యానికి దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి, నివారించాలని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యులు, బంధువులకు దూరమవుతారని తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి సంబంధిత సమాచారం తెలిస్తే 87126 58111 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ ని ఎస్పీ పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సీ హెచ్చరించారు. దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఈ విద్యానిధికి www. telanganaepass. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 20వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి ఫోన్ నంబర్ 99088 43340 ద్వారా సంప్రదించాలని కోరారు. పెట్రోల్ బాటిల్తో వ్యక్తి హల్చల్ మల్హర్: మండలంలోని తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశాడు. కొయ్యూరు ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లెకుంట గ్రామానికి చెందిన నార శంకర్ కొంత కాలంగా భూమి పట్టా చేయాలంటూ కార్యాలయం చుట్టూ తిరుతున్నాడు. కాగా గురువా రం తహసీల్దార్ కార్యాలయానికి పెట్రోల్ బాటి ల్తో వచ్చి ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తన రికార్డులు రెవెన్యూ సిబ్బంది తారుమారు చేశారని ఆరోపణలు చేస్తూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ను ఆర్ఐ టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. దీంతో బేబుల్ మీద ఉన్న రికార్డులతోపాటు ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కీర్తన మీద కొంత పెట్రోల్ డ్రాప్స్ పడ్డాయి. లైటర్తో వెలిగిస్తాని భయబ్రాంతులకు గురి చేయడంతో తాము వేరే రూములోకి వెళ్లినట్లు ఆర్ఐ రాజశేఖర్ వెల్లడించారు. అప్రమత్తమై పోలీసులకు సమాచార అందించామని, సదరు వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయనట్లు పేర్కొన్నారు. తమ విధులకు ఆటకం కలిగించి, హత్యాయత్నం చేశాడని శంకర్పై చర్యలు తీసుకోవాలని ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేష్ తెలిపారు. బడ్జెట్ కేటాయింపులో బీసీలకు అన్యాయం మొగుళ్లపల్లి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025–2026 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో 56 శాతం పైగా ఉన్న బీసీలకు కేవలం 3.6శాతం రూ.11,405 ఓట్లు కేటాయించి బీసీలను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు. బీసీ లకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎందుకింత వివక్షత చూపుతుందని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. -
తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి
కాటారం: వేసవికాలంలో నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు. కాటారం మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర రాహుల్శర్మతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాటారం, భూపాలపల్లి డివిజన్లలో తాగునీటి సమస్య ఉండకూడదని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరించాలని సూచించారు. సబ్డివిజన్ పరిధిలో 30 బోర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, అవసరం ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కాటారం హెడ్ క్వార్టర్స్లో మినీ స్టేడియం, చిల్డ్రన్స్ పార్క్ నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని, నిర్మాణం పూర్తయిన గ్రామపంచాయతీ భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని అన్నారు. డివిజన్ కేంద్రంలో మంజూరు చేసిన కూరగాయల మార్కెట్, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని, అంబులెన్స్, వైకుంఠ రథాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు వేగంగా చేయాలని, భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇసుక లారీల వేగనియంత్రణకు స్పీడ్ గన్స్, ఇతరాత్ర చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లలో వేగం పెంచాలన్నారు. సమీక్ష సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఆర్డీఓ నరేశ్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని మజీద్లో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి మంత్రి మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందులో భాగంగా ముస్లింలకు స్వీట్లు, పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లిం, మైనార్టీలకు పెద్దఎత్తున నిధులు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్, సమ్మయ్య, ప్రభాకర్రెడ్డి, అజీజ్ పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాల అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారు. జనవరి 18 నుంచి 20వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసిసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్ 19 విభాగంలో కరీంనగర్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో నిర్వాహకులు ఈ జట్టును జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జట్టులో అత్యంత ప్రతిభ కనబర్చిన కాటా రం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థి టి.జితేందర్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. మార్చి 26 నుండి 30వ తేదీ వరకు బీహార్లో జరిగే(హెచ్ఎఫ్ఐ) జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. జితేందర్ను ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్స్ మాధవి, వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, డిప్యూటీ వార్డెన్ నరేశ్, ఉపాధ్యాయులు అభినందించారు. ఖోఖోకు ఎంపికై న ఆనంద్ టేకుమట్ల: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఫిజికల్ ఎడ్యూకేషన్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న చాగంటి ఆనంద్ జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖోకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ జనవరిలో హైదరాబాద్లో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడం ద్వారా నేటి(శుక్రవారం) నుంచి ఈ నెల 24 వరకు ఢిల్లీలో కొనసాగే జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖోలో తెలంగాణ జట్టులో ఆడనున్నట్లు తెలిపారు. -
అందరినోటా ఆరు గ్యారంటీలు..
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలగనుంది. -
ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యం.. మహిళా పథకాలకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, వరంగల్: అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెండో రాజధానిగా హైదరాబాద్కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించిన రేవంత్రెడ్డి.. నగరం అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, మామునూరు ఎయిర్పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేసినట్లు బడ్జెట్లో కనిపించ లేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది. ● విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు ● అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్టు, ‘సూపర్’ ప్రస్తావన లేదు ● కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు ● స్మార్ట్సిటీకి రూ.179 కోట్లు, కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు ● రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం ● ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు -
విద్యారంగానికి మంచి రోజులు..
ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి రూ.23,108 కోట్లు కేటా యించింది. దీంతో సర్కారు చదువులకు ఇంకా మంచి జరగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 20–25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.1400 కోట్లతో ఏడింటిని మంజూరు చేసింది. ఈ బడ్జెట్తో ఈసారి ఆ స్కూళ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్లో మొత్తం 3,331 ప్రభుత్వ బడులు ఉండగా, అందులో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించే అవకాశం ఉంది. -
సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు..
ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరిగాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది. -
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
భూపాలపల్లి రూరల్: పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేందర్, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు. భూపాలపల్లి మండలంలోని గొల్లబద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. కలెక్టర్ సంతకం చేసిన ‘అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి‘ అనే ప్రేరణ కరపత్రాన్ని విద్యార్థులకు అందజేశారు. పరీక్షా ప్యాడ్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ రాజ్ గోపాల్, లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.4లక్షల వరకు ఆర్థిక సాయాన్ని 60 నుంచి 80 శాతం సబ్సిడీతో అందించనుంది. ఈమేరకు ఆసక్తి, అర్హతగల వారు ఆధార్, కులం, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, జిల్లా కలెక్టరేట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలో 10 మంది విద్యార్థుల డీబార్ భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షికల్లో భాగంగా బుధవారం 10 మంది విద్యార్థులు డీబార్ అయినట్లు నోడల్ అధికారి వెంకన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో ఆరుగురు, తేజస్విని గాంధీ జూనియర్ కళాశాల సెంటర్లో నలుగురు విద్యార్థులను స్పెషల్ స్క్వాడ్ డీబార్ చేసినట్లు వెల్లడించారు. కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల ఆందోళన భూపాలపల్లి అర్బన్: వైద్యారోగ్యశాఖ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆశ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉదయం 8గంటలకే కలెక్టరేట్కు చేరుకోని ధర్నా, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేతం విజయ, మెట్టుకొండ లక్ష్మి మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ప్రభుత్వం రూ.18,000 వేతనం నిర్ణయించాలని, పదోన్నతులు కల్పించి పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆకుదార రమేష్, రాజేందర్, ఆశాలు తిరుమల, రాధిక, రాజేశ్వర్రెడ్డి, రమ, సరిత, యాకూబ్, శారద పాల్గొన్నారు. నేడు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాక కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి పనుల పరిశీలనకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్ గురువారం రానున్నారు. ఉదయం 10 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించనున్నారు. కాగా, అభివృద్ధి పనులకు రూ.25కోట్ల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. -
అభివృద్ధి పనుల్లో వేగంపెంచాలి
మల్హర్: పీఎంశ్రీ పథకం ద్వారా మండలంలోని ఎడ్లపల్లి మోడల్ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాల మొదటి అంతస్తులో నిర్మిస్తున్న సైన్స్ ల్యాబ్, మరుగుదొడ్ల నిర్మాణం పనులు, ఆర్ఓ ప్లాంట్ను ఆయన బుధవారం పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల మొదటి అంతస్తులో కిటికీ డోర్స్, గ్రిల్స్ తలుపులు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు.. కలెక్టర్ను కోరగా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపా ల్ పూర్ణచందర్ రావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్యాం సుందర్ పాల్గొన్నారు. రాజకీయ పార్టీల సహకారం అవసరం భూపాలపల్లి: ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు, అబ్బాస్, ఇమా మ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా బోధన సాగిందని తెలిపారు. గత ఏడాది వార్షిక ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
కూలీలు కొలతల ప్రకారం పని చేయాలి
చిట్యాల: ఉపాధి హామీ కూలీలు కొలతల ప్రకారం పని చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అ న్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీపూర్తండా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశారు. కూలీల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీరోజు రూ.300 కూలీ పడే విధంగా కూలీలు కొలతలప్రకారం పని చేసుకోవాలని తెలిపారు. పని ప్రదేశంలో కూలీల కోసం తాగానీరు, నీడ సౌకర్యం, ప్రథమ చికిత్స బాక్స్ను అందుబాటులో ఉంచాలని పంచాయితీ కార్యదర్శికి సూ చించారు. ఆమె వెంట ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, ఏపీఓ అలీంపాషా, ఈసీ సుధాకర్, పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్, ఏఫ్ఏ రాజు ఉన్నారు. ఇళ్ల పనులు పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా ఇళ్ల పనులు పూర్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి కోరారు. మండలంలో ఇటీవల ఎంపికై న ముచినిపర్తి గ్రామంలో నిర్మించుకుంటున్న ఇందిర మ్మ ఇళ్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ ఉన్నారు. కాటారం: మహాముత్తారం మండలం మదారం మామిడికుంటలో కొనసాగుతున్న ఎంఐ ట్యాంక్, ఫిష్ పాండ్ పనులను డీఆర్డీఓ నరేశ్ బుధవారం పరిశీలించారు. పని ప్రదేశంలో సౌకర్యాలు, కూలీల హాజరు, పనుల తీరుపై ఆయన ఆరా తీశారు. కూలీ లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేసి వేసవిలో కూలీ లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎంపీడీఓ శ్రీనివాస్, ఈసీ నాగేందర్, టీఏ, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
హరిబాబును సస్పెండ్ చేయరా.?
భూపాలపల్లి అర్బన్: నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని రాజలింగమూర్తి భార్య సరళ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరళ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలు చేయడం లేదని చెప్పిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త హరిబాబు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలతోపాటు కేటీఆర్, హరీశ్రావుల పాత్ర ఉన్నట్లు దాడి జరిగిన రోజునే పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేస్తే డీఎస్పీ, సీఐలు ఫిర్యాదును రద్దు చేసి వారికి అనుకూలంగా ఫిర్యాదు రాసుకొని సంతకాలు చేయించుకున్నట్లు తెలిపారు. మేడిగడ్డ, బీఆర్ఎస్ నాయకుల అక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై పోరాటాలు నిర్వహించినందుకే హత్య చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్గా ఉన్న తనను అకారణంగా సస్పెండ్ చేశారని, హత్య చేసిన హరిబాబును ఎందుకు ఇప్పటికీ సస్పెండ్ చేయలేదన్నారు. తప్పు చేయని హరిబాబు ఎందుకు తప్పించుకు తిరిగాడ ని ప్రశ్నించారు. తనకు ప్రాణభయం ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇంటి చుట్టూ కొత్త వ్యక్తులు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. హరిబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..? భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల 19న హత్యకు గురి కాగా హరిబాబు ఏ8 నిందితుడిగా ఉన్నాడు. ఈ నెల 4న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు జరుగుతున్న సమయంలోనే మంగళవారం అతడిని భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి, జడ్జి ఆదేశాల మేరకు ఖమ్మం జైలుకు తరలించారు. బుధవారం హైకోర్టులో వాదనలు జరుగగా హరిబాబు బెయిల్ పిటిషన్ను కొట్టివేసినట్లు సమాచారం. -
ఆన్లైన్లోనే తరగతులు..
నర్సింగ్ కళాశాలకు భవనం కరువుభవన నిర్మాణానికి రూ.26కోట్ల నిధులు నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం గతేడాది రూ.26కోట్ల నిధులను కేటాయించింది. రెవెన్యూ శాఖ అధికారులు భూమిని కేటాయిస్తే టెండర్లు పూర్తిచేసి భవన నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారులు స్థల సేకరణపై శ్రద్ధ చూపనట్లు కనిపిస్తుంది. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి భవన నిర్మాణం చేపట్టాలని.. అప్పటివరకు తాత్కాలిక భవనం కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన నర్సింగ్ విద్య అంతంత మాత్రమే నడుస్తుంది. కళాశాలకు భవన సౌకర్యం లేకపోవడంతో గత డిసెంబర్లో వర్చువల్ పద్ధతిలో ప్రారంభమైన నర్సింగ్ కళాశాల తరగతులు నిర్వహిస్తున్నారు. వసతి, తరగతులకు భవనం లేకపోవడంతో విద్యార్థులు ఆన్లైన్ తరగతులతో నెట్టుకొస్తున్నారు. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాల సమీపంలో ఆయూష్ ఆస్పత్రిని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసి భవనానికి నర్సింగ్ కళాశాల అని బోర్డు కూడా పెట్టారు. తీరా కళాశాల ప్రారంభోత్సవ సమయానికి ఆయూష్ విభాగం అధికారులు భవ నం అప్పగించలేమని చెప్పడంతో తాత్కాలికంగా వైద్య కళాశాలలో వర్చువల్ పద్ధతిన కళాశాలను ప్రారంభించగా 45మంది విద్యార్థులు ప్ర వేశాలు పొందారు. సరైన భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ భారమైంది. దీంతో ఆన్లైన్లో విద్యార్థులు తరగతులను వింటున్నా నెట్వర్క్ సమస్యతో పాటు, కొంతమంది విద్యార్థులకు సరైన ఫోన్లు అందుబాటులో లే కపోవడం సమస్యగా మారుతోంది. జూన్ మాసంలో మొదటి సెమిస్టర్ ఉండటంతో ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.● ఆయూష్ ఆస్పత్రి భవనం అప్పగించి.. అంతలోనే రద్దుచేసి.. ● నిధులు మంజూరైనా స్థలం కరువుఅధ్యాపకుల కొరత నర్సింగ్ కళాశాలకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా 60మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ మాత్రం 45మందికి మాత్రమే ప్రవేశాలు కల్పించేలా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మొదటి సంవత్సరంలో 45మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కళాశాల తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సహా ముగ్గురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16మంది అధ్యాపకులు ఉండాలి. కళాశాల నిర్వహణకు సంబంధించి ఒక ఏఓ, ఇద్దరు చొప్పున యూడీసీ, ఎల్డీసీ, ఒక ఆఫీస్ సబార్డినేట్ ఉండాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో శానిటేషన్, క్లీనింగ్ చేసేందుకు మరొక 40మంది సిబ్బంది అవసరం. కానీ ప్రస్తుతం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్తో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రికి చెందిన ఐదుగురు నర్సింగ్ ఆపీసర్లు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.స్థల సేకరణ పూర్తయితే భవన నిర్మాణం.. కళాశాల నిర్మాణానికి స్థలం, తాత్కాలిక భవనం కేటాయించాలని కలెక్టర్ను పలుమార్లు కలిశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా నిత్యం నాలుగు తరగతులను నిర్వహిస్తున్నాం. కళాశాల భవనం, అధ్యాపకులు, సిబ్బంది నియామకంపై ఇప్పటికే అధికారులకు నివేదికలు అందించాం. తరగతుల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఉమామహేశ్వరి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్● -
‘ఎల్ఆర్ఎస్’ను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం కల్పించిన ప్లాట్ల లేఅవుట్ క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియపై ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో మంగళవారం లే అవుట్స్ ఓనర్లు, లైసెన్స్ సర్వేయర్లు, డాక్యుమెంట్ రైటర్స్తో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులో ప్రభుత్వం 25శాతం రాయితీ అవకాశం కల్పించిందని.. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్పష్టంచేశారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31లోగా ఎస్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని అన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎస్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి ఏదేని సలహాల కోసం మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్ రాము, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టిపిఓ సునీల్, లేఅవుట్ ఓనర్లు, లైసెన్స్ సర్వేయర్లు, డాక్యూమెంట్ రైటర్లు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
మల్హర్: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీలకు పని ప్రదేశంలో అన్ని వసతులు కల్పించాలని డీఆర్డీఓ నరేష్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో చేపడతున్న ఉపాధిహామీ పనులను డీఆర్డీఓ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నరేష్ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొలతల ప్రకారం పనిచేస్తే ఒక్క రోజుకు రూ.300 చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని జీపీల్లోని పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ పందిరి, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ హరీశ్, టెక్నికల్ అసిస్టెంట్లు రమేష్, శైలజ, శేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. యూరియా వాడకం తగ్గించాలి గణపురం: రైతులు వరి పంటలో యూరియా వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.వీరునాయక్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం పంట నమోదు ప్రక్రియను పరిశీలించి రైతులు వేసిన వరిపంటపై యూరియా ఎక్కువగా వాడుతున్నారని అన్నారు. యూరియా వాడకం తగ్గించాలని కోరారు. యూరియా అధికంగా వాడడం మూలంగా చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఐలయ్య, పీఏసీఏస్ సీఈఓ భిక్షపతి, ఏఈఓలు పాల్గొన్నారు. సౌకర్యాలను పరిశీలించిన ఆర్డీఓ భూపాలపల్లి అర్బన్: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాకేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న సౌకర్యాలను మంగళవారం ఆర్డీఓ రవి తహసీల్దార్ శ్రీనివాసులుతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సింగరేణి హైస్కూల్, జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలలో వంట గదులు, తరగతి గదులను తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని భారతీయ మజ్ధూర్ సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భారతీయ మజ్ధూర్ సంఘ్ జాతీయ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేసి అదనపు కలెక్టర్ అశోక్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈపీఎఫ్ వేతన పరి మితిని రూ.15వేల నుంచి రూ.30వేలకు పెంచాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణ నిషేదం విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజేందర్, మల్లేష్, నర్సింగరావు, మల్లయ్య, రఘుపతిరెడ్డి, మల్లేష్, మొగిలి, భిక్షపతి, సురేష్ పాల్గొన్నారు. -
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు సహకరించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూళనకు సహకరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న సర్వేను విజయవంతం చేయాలని కోరారు. కుష్ఠు వ్యాధి సర్వే, నిర్మూళనపై జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు, అనుమానితులను గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటింటికి వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాధి లక్షణాలు ఉంటే తెలియజేయాలని కోరారు. వ్యాధిబారిన పడిన వారికి ప్రభుత్వం తరఫున రూ.12వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు రవిరాథోడ్, శ్రీదేవి, ఉమాదేవి, సిబ్బంది మల్లయ్య, శ్రీదేవి పాల్గొన్నారు.జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ -
విద్యా సామర్థ్యాలను పెంపొందించాలి
చిట్యాల: పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు విద్యా సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర విద్యా పరిశీలకులు (ఎస్సీఈఆర్టీ) రాంబాబు అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలను మంగళవారం పర్యవేక్షించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. వి ద్యార్థులను గ్రూపులుగా విభజించి వారి విద్యా సా మర్థ్యాలను పెంపొందించే కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మాని టరింగ్ అధికారి కె.లక్ష్మన్, ఎంఈఓ కొడెపాక రఘుపతి, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాం రఘుపతి, ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సద య్య, రామనారాయణ, ఉస్మాన్ అలీ, శంకర్, శ్రీని వాస్, నీలిమా రెడ్డి, సరళాదేవి, విజయలక్ష్మి, కల్పన, సుజాత, మౌనిక, సీఆర్పి రాజు పాల్గొన్నారు. ప్రణాళికలపై సమీక్ష గణపురం: పదో తరగతి విద్యార్థుల ప్రగతి, ఫ్రీ పైనల్ ఫలితాలతో పాటు వారి విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేపట్టిన ప్రణాళికలపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి పరిశోధకులు రాంబాబు సమీక్ష నిర్వహించారు. మండలకేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలను ఆయన సందర్శించారు. అనంతరం పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉప్పలయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఎస్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకులు రాంబాబు -
‘దేవాదుల’ గట్టెక్కించేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్పర్తి/ధర్మసాగర్: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంటలు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడవ దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంప్హౌజ్ మోటార్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌజ్కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్ఐటీ గెస్టుహౌస్లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఫేజ్–3 పనులపైనే దృష్టి... చేతికందే పంటలను కాపాడేందుకు మూడో ఫేజ్ పనులపై అధికారులు దృష్టి సారించారు. దేవన్నపేట పంపుహౌజ్లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక్కటి ఆన్చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60వేల నుంచి 65వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వరకు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది. హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన.. దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్ హడావిడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హసన్పర్తి మండలం దేవన్నపేటకు పంప్హౌజ్కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీరు పంపింగ్ అయ్యేలా మోటార్ ఆన్ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటార్ మొరాయించడంతో స్విచాన్ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు వెళ్లాల్సి వచ్చింది. కాగా దేవన్నపేట పంపుహౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్తోపాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి తదితరుల ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాత్రి వరకు కాని మోటార్ మరమ్మతు చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన ‘ధర్మసాగర్ రిజర్వాయర్’ కార్యక్రమం రద్దు దేవన్నపేట పంపుహౌజ్కు హుటాహుటిన అధికారులు అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు సమాచారం లేకుండా ఉత్త చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, పీసీసీ మాజీ కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్రెడ్డితోపాటు దేవాదుల ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా టెన్త్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 21నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టరేట్లోని కార్యాలయ సమావేశపు హాల్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 21 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 121 పాఠశాలలకు చెందిన 1,725 మంది బాలురు, 1,724 మంది బాలికలు మొత్తం 3,449 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని చెప్పారు. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచిఉండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను తహసీల్దార్లు పరిశీలించి ధృవీకరణ నివేదికలు అందచేయాలని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. సెంటర్ కస్టోడియన్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఇన్చార్జ్ డీఈఓ రాజేందర్, క్రైం డీఎస్పీ నారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కళ్లద్దాల పంపిణీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కంటి పరిరక్షణకు అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గత నెలలో కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కంటిచూపు సమస్యలున్నట్లు గుర్తించిన విద్యార్థులకు తిరిగి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి భూపాలపల్లిలో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ పరీక్షల ద్వారా దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన 658 మంది విద్యార్థుల్లో 292మందికి మొదటి విడతగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామని, మిగిలిన విద్యార్థులకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్బీఎస్కే కో–ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్, పీఓ ప్రమోద్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
బ్యాంక్ మేనేజర్పై కలెక్టర్ ఆగ్రహం...
పంట సాగు కోసం తీసుకున్న రుణం చెల్లించలేదని ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి డబ్బులు ఆపారని కొత్తపల్లిగోరి మండలంలోని బాలయ్యపల్లికి చెందిన యాదగిరి కలెక్టర్ ఎదుట వాపోయాడు. ఇందుకు కలెక్టర్ వెంటనే స్పందించి.. కొత్తపల్లిగోరి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు ఫోన్ చేసి.. ప్రభుత్వ పథకాల నుంచి వచ్చిన డబ్బులను ఇవ్వకుండా ఎందుకు హోల్డ్లో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి డబ్బులు ఇవ్వకుండా ఆపే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. చల్లగరిగెలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని, మరోమారు పునరావృతం అయితే బ్యాంకర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
ఒక్కొక్కరిది ఒక్కో బాధ
సాదుకున్న కొడుకు తిండి పెడుతలేడు.. నా పేరు అల్లూరు జగదీశ్వర్, అంకుశాపూర్ గ్రామం, టేకుమట్ల మండలం. నాకు పిల్లలు లేకపోవడంతో మా ఊరికి చెందిన రాజేంద్రప్రసాద్ను చిన్నతనంలోనే దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివించాను. నా భార్య అనారోగ్యంతో ఇటీవలే చనిపోయింది. నాకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నాను. సాదుకున్న కొడుకు నాకున్న ఎకరం 10 గుంటల భూమిని తన పేరుపై ఎక్కించుకొని హనుమకొండకు వెళ్లాడు. కనీసం తిండి పెట్టే వారు కరువయ్యారు. సాదుకున్న కొడుకు నా బాగోగులు చూసేలా చూడండి అని జగదీశ్వర్ వేడుకున్నాడు.ప్రజావాణికి 51 దరఖాస్తులు ● ఎక్కువగా భూ సమస్యలు, పింఛన్ కోసమే.. ● బ్యాంకు అధికారుల తీరుపై కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం ● ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు భూపాలపల్లి: జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 51 వినతులు వచ్చాయి. అందులో ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్ల మంజూరు దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. పంట రుణం మాఫీ విషయంలో చోటుచేసుకున్న తప్పిదాలు, పంట రుణం డబ్బుల కోసం కల్యాణలక్ష్మి చెక్కును ఆపిన బ్యాంకు అధికారులపై కలెక్టర్ రాహుల్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజావాణికి గైర్హాజరైన జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఏఓను ఆదేశించారు. -
ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
వెంకటాపురం(కె): మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామ సమీపంలోని రాళ్లవాగు సమీపంలో బ్రిడ్జి కుంగిపోవటంతో వాగులో నుంచి తాత్కాలికంగా రోడ్డును వేశారు. వాహనాల రాకపోకలతో వాగులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు గుంతలమయంగా మారటంతో పాటు వాహనాలు రోడ్డు పై దిగబడుతున్నాయి. సోమవారం రోడ్డుపై మట్టిపోసి డోజర్తో చదునుచేసే పనులు చేపట్టారు. దీంతో సుమారు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇసుక లారీలు భారీగా వచ్చి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
అడవిలో కార్చిచ్చు!
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పూసుకుపల్లి–మద్దులపల్లి అటవీప్రాంతంలో సోమవారం రా త్రి కార్చిచ్చు అంటుకొని మంటలు చెలరేగాయి. రహదారి పక్కన మంటలు వ్యాపించడంతో అడవి జీవరాశులు పరుగులు తీశాయి. అటవీ సంపద కా ర్చిచ్చుతో బూడిద అవుతున్నా అటవీశాఖ అధికారులు స్పందించలేదు. వేసవికాలం కావడంతో ఆకులన్నీ ఎండిపోయి ఉండడంతో నిప్పు అంటుకొని కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తున్నా సంబంధిత అధికా రులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. మంటలు, పొగలతో రోడ్డుపైన వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అడవిలో చిన్న చిన్న మొక్కలు, చెట్లు కాలిపోయాయి. మొబైల్ ఫైర్ టీంలు సంచరించకపోవడంతో విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతుందని ఆరోపణలు ఉన్నాయి. -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలు– 8లోuఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ మొత్తం విద్యార్థులు 42,262బాలికలు 20,600బాలురు 21,662ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలిపదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం. – పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివరాలు 8లోu -
జీరో మద్యం కేసులో నిందితుల అరెస్ట్
కాటారం: మహాముత్తారం మండలంలో పట్టుబడిన జీరో మద్యం కేసులో మరో ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య తెలిపారు. ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం కనుకునూరు, సింగంపల్లి, నర్సింగాపూర్, మహాముత్తారం గ్రామాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(జీరో మద్యం) విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఈ నెల 11న ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. కనుకునూర్లో బొచ్చు అనసూర్య ఇంట్లో తనిఖీలు చేపట్టగా కొంత మేర ఎన్డీపీఎల్, అక్రమ మద్యం లభించింది. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా సింగంపల్లిలో శ్రీరామ్ ప్రేమ్కుమార్, నర్సింగాపూర్లో గాదె సారయ్య జీరో మద్యం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రేమ్కుమార్ ఇంట్లో సోదాలు చేపట్టగా కొంత అక్రమ మద్యం లభించింది. అనంతరం విచారణలో ఇందులో సంబంధం ఉన్న నర్సింగాపూర్కు చెందిన సంది సుధాకర్, మారగోని బాపు పేర్లు తెలపడంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మహాముత్తారానికి చెందిన మహబూబ్ పాషా మధ్యప్రదేశ్ నుంచి ఎన్డీపీఎల్ మద్యం సరఫరా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. మహబూబ్పాషా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య తెలిపారు. ఈ దాడుల్లో 9.375 లీటర్ల ఎన్డీపీఎల్ మద్యం, 26.96 లీటర్ల అక్రమ మద్యం, 22.1 లీటర్ల బీర్లు స్వాధీనపర్చుకొని సీజ్చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. -
నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు నేటినుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెనుకబడిన తరగతుల జిల్లా అధికారిణి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రకటించిందన్నారు. ఇతర వివరాల కోసం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. హుండీ ఆదాయం రూ.55,767 భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని శ్రీ భక్తాంజనేయస్వామి దేవాలయ హుండీ ఆదాయం రూ.55,767 వచ్చినట్లు ఈఓ మహేష్ తెలిపారు. పరకాల డివిజన్ ఇన్స్పెక్టర్ కవిత ఆధ్వర్యంలో సోమవారం హుండీ లెక్కింపు చే పట్టినట్లు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ నుంచి మార్చి వరకు హుండీకి వచ్చిన ఆదాయాన్ని లెక్కించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. రుసుం కోసం ట్రెంచ్ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ముక్తివనం పార్కు అభివృద్ధికి, సిబ్బంది జీతాల కోసం అటవీశాఖ ఆర్థిక వనరుల కోసం దృష్టి సారించింది. సోమవారం పలుగుల బైపాస్రోడ్డులోని హనుమాన్ దేవాలయం ఎదుట ఖాళీ స్థలంలో వాహనాలు నిలుపకుండా ట్రెంచ్(గోయి) తవ్వించారు. కాళేశ్వరం వచ్చే యాత్రికులు వంటలు చేసుకునేవారికి, ఇసుక లారీలకు, ఇతర వాహనాలకు కొంత రుసుం తీసుకొని ముక్తివనం పార్కు అభివృద్ధికి కేటాయించనున్నారు. రెండు రోజుల్లో రుసుం ప్రారంభం కానుందని అధికారుల ద్వారా తెలిసింది. మహా శివరాత్రి, ఏదైనా ఉత్సవాలు, పుష్కరాలు జరిగినప్పుడు ఆర్టీసీకి సంబంధించిన బస్టాండ్గా ఈ ప్రాంతాన్ని వినియోగించేవారు. ట్రైబల్ యూనివర్సిటీని సందర్శించి వీసీ ములుగు: మండల పరిధిలోని జాకారంలో గల సమ్మక్క–సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి వీసీగా బాధ్యతలు స్వీకరించిన వైఎల్.శ్రీనివాస్ సోమవారం వర్సిటీని సందర్శించారు. ఓఎస్డీ వంశీకృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. యూనివర్సిటీలోని గ్రూపులు, ఎంత మంది విద్యార్థులు. యూనివర్సిటీలోని సౌకర్యాలు తదితర అంశాలపై ఆరా తీశారు. -
లొంగిపోయినా.. ఇంటి జాగ ఇస్తలేరు..
నా పేరు అనపర్తి సన్యాసి, నా భార్య పేరు బాలక్క. మాది సర్వాయిపేట గ్రామం. పలిమెల మండలం. మేము ఇద్దరం కలిసి 1996లో అప్పటి పీపుల్స్వార్ పార్టీలో చేరాం. ప్రభుత్వం, పోలీసుల సూచన మేరకు 2006లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ ఎస్పీ డీఎస్ చౌహాన్ ఎదుట లొంగిపోయాం. మాకు పునరావాసం కింద ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కలెక్టర్ను కోరగా తహసీల్దార్కు లేఖ రాశారు. అయినప్పటికీ తహసీల్దార్ ప్రభుత్వ భూమి లేదంటూ ఇప్పటి వరకు భూమి మంజూరు చేయడం లేదు. 19 ఏళ్లు వనవాసంలో ఉన్నాం. ఇప్పటికై నా ప్రభుత్వ భూమి కేటాయిస్తే ఇళ్లు కట్టుకుంటాం. -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు..
● సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన –8లో -
హైదరాబాద్తో
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuసభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిబహిరంగ సభకు హాజరైన ప్రజలు, రిమోట్ ద్వారా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, ప్రజాప్రతినిధులుసాక్షి ప్రతినిధి, వరంగల్/జనగామ/స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ శివారు శివునిపల్లిలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు. మరోవైపు బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు గుప్పించారు. శివునిపల్లిలో ఈ కార్యక్రమం రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసింది కాదని, ఓట్ల కోసం రాలేదన్న ఆయన.. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధిలో భాగంగా రూ.800 కోట్ల నిధులతో ప్రగతి కోసం తలపెట్టిన బహిరంగ సభ అని స్పష్టం చేశారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని, ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఇందుకోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని ప్రకటించారు. మరోవైపు వరంగల్ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్న ముఖ్యమంత్రి.. ఉమ్మడి జిల్లాను విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్లుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. సీఎం సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కడియం శ్రీహరిని నేనే రమ్మన్నా.. ఈ ప్రభుత్వం వచ్చాకే వరంగల్కు ఎయిర్పోర్టు, కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, వరంగల్కు రింగ్రోడ్డు వచ్చాయని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఎంపీ కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా జీఎంఆర్ నుంచి క్లియరెన్స్ తీసుకుని కేంద్ర మంత్రులను కలిసి ఎయిర్పోర్టు సాధించామని తెలిపారు. అలాగే, రైల్వే కోచ్ఫ్యాక్టరీని సాధించామని, కాజీపేట రైల్వే డివిజన్ చేయడం కోసం ఎంపీ కావ్యతోపాటు తన కృషి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డుతోపాటు పలు అభివృద్ధి పథకాల కోసం రూ.6,500 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే ఆ పనులు మొదలవుతాయన్నారు. జయశంకర్ సర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా చేసింది ఈ ప్రభుత్వమేనన్న ఆయన.. మహిళలకు వెయ్యి బస్సులు ఇచ్చి ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని చెప్పారు. మహిళల చేత వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం ద్వారా ఉమ్మడి వరంగల్కు చెందిన మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్, వంద పడకల ఆస్పత్రి, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు వంటి శాశ్వత ప్రాతిపదికన స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక కడియం శ్రీహరి సేవలు గుర్తెరిగి ఆయన నిజాయితీ, అనుభవం కావాలని, తానే అక్కున చేర్చుకొని పార్టీలో చేరాలని కోరినట్లు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మా కోరిక మేరకు ఆయన పార్టీలో చేరగా.. చెల్లెలు డాక్టర్ కావ్యను ఎంపీగా గెలిపించారన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికావాలంటే శ్రీహరి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై ఘాటైన విమర్శలు.. జనగామ జిల్లా శివునిపల్లి వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, టి.హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైన ఆయన కామెంట్స్ చేశారు. ‘అధికారం ఉంటే తప్ప కేసీఆర్ ప్రజల్లోకి రాలేరా? ఆయన బయటకు రాకుండా కొడుకు, అల్లుడిని ఊరు మీదకు వదులుతున్నారు. బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? జీతభత్యాలు ఎందుకు?.. ఇలా చేస్తేనే కదా కాంగ్రెస్ దెబ్బ ఎలా ఉంటుందో 2023లో ప్రజలు చూపించారు’ అంటూ విమర్శలు చేశారు. ‘క్యాప్సికం పండిస్తే రూ.కోట్లు వస్తాయన్న కేసీఆర్.. ఆ టెక్నిక్ ఏంటో ప్రజలకు చెప్పండి.. నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో ప్రజలకు చెప్పండి.. వెయ్యి మంది యువకులను నీ ఫామ్ హౌస్కు పంపిస్తాం. ఆ టెక్నిక్ ఏంటో వారికి నేర్పించండి’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకుని పేపర్, టీవీ చానళ్లు పెట్టుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆయనతోపాటు కేటీఆర్, హరీశ్రావు, కవితకు ఫామ్హౌస్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, నాయకులు ఝాన్సీరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య పాల్గొన్నారు. న్యూస్రీల్స్పీకర్ను అవమానించడం దురదృష్టకరం భూపాలపల్లి రూరల్: అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ను అవమానించడం దురదృష్టకరమని ట్రేడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో కేటీఆర్, జగదీశ్వర్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట గలిపారన్నారు. భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చల్లూరి మధు, పిప్పాల రాజేందర్, చల్లూరి సమ్మయ్య, దాట్ల శ్రీనివాస్, క్యాతరాజు సాంబమూర్తి, బట్టు కర్ణాకర్, మహేష్రెడ్డి, బేతల్లి మధుకర్ రెడ్డి, గద్దె సమ్మిరెడ్డి, స్వామి పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి మల్హర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డి స్పీకర్కు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేశ్ డిమాండ్ చేశారు. తాడిచర్ల సెంటర్లో ఆది వారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రమేశ్ మాట్లాడారు. జగదీశ్వర్రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దుచేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అయిత రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ మల్హల్రావు, జిల్లా యూత్ కార్యదర్శి, మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు రాజసమ్మయ్య పాల్గొన్నారు.మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ చిట్యాల: మండల కేంద్రానికి చెందిన బుర్ర కనుకయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మృతుడి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ నాయకులు కామిడి రత్నాకర్రెడ్డి, ఆరెపల్లి మల్లయ్య, దొడ్డి కిష్టయ్య, బుర్ర శ్రీనివాస్, చిలుకల రాయకోంరు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పరామర్శ బుర్ర కనుకయ్య కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పరామర్శించి మృతుడి చిత్ర పటానికి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, నాయకులు కుంభ క్రాంతి కుమార్రెడ్డి, ఏరుకొండ రాజేందర్ గౌడ్, పాండ్రాల స్వామి, పెరుమాండ్ల రవీందర్ గౌడ్, బుర్ర శ్రీధర్ ఉన్నారు. పక్కాగా సంక్షేమ పథకాల అమలు మామునూరు ఎయిర్ పోర్ట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ఘనతే.. ప్రతిష్టాత్మకంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తామని స్పష్టీకరణ విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్గా ఓరుగల్లుకు ప్రాధాన్యం.. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ విజయవంతం -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు..
● సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన –8లో -
టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
భూపాలపల్లి రూరల్: పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి.. జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు సూచించారు. భూపాలపల్లి మండలం గుర్రంపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ ప్రేరరణ కరపత్రం పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలంటే భయపడకుండా రాయాలన్నారు. ఒత్తిడిని జయించినప్పుడే విజయం వరిస్తుందని తెలిపారు. సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. విద్య మాత్రమే మనిషిని ఉన్నతస్థాయికి చేర్చగలదన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఎంఈఓ లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన.. భూపాలపల్లి మండలం గుర్రంపేట ఎంపీపీఎస్ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్శర్మ ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విద్యాబోధన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యార్థులను చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రక్రియలలో మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంపై ఈ నెల 11న రాష్ట్రస్థాయిలో ఒక రోజు క్వాలిటీ కోఆర్డినేటర్స్, జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రాథమిక స్థాయిలో ఏఐ బోధన కార్యక్రమ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమ అమలుకు ప్రస్తుతం గుర్రంపేట, చింతకాని పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఏఐ క్వాలిటీ కో–ఆర్డినేటర్ కాగితపు లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఏఐ క్వాలిటీ కో–ఆర్డినేటర్ కాగితపు లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి భూపాలపల్లి: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసినందున యంత్రాంగం పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్ ఫైల్స్ పరిష్కరించాలని సూచించారు. వచ్చే సోమవారం నుంచి ఉదయం 10.30 గంటల నుంచి అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణికి మండల కేంద్రంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని, హాజరు నివేదిక అందజేయాలని స్పష్టంచేశారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
అక్షయ.. అవధాని
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuకాళేశ్వరం: ప్రతియేటా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న తీరు ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిచివేస్తున్న తరుణంలో.. అక్షయ పాత్ర లాంటి ఆణిముత్యం తన విజ్ఞాన ప్రదర్శన ప్రతిభతో ఒక్కసారిగా తళుక్కున మెరిసి అందరినీ సర్కారు బడి వైపు చూసేలా చేస్తుంది. అతికష్టమైన భౌతికశాస్త్రం సబ్జెక్టులో తన గైడ్ టీచర్ ‘దశావధానం’ అనే అంశంపై ప్రోత్సాహం ఇవ్వడంతో తర్పీదు తీసుకుంది. తన ప్రతిభకు సానపెట్టి జ్ఞాన సంపదను పెంచుతూ సమాజానికి అందించడానికి ప్రయత్నం చేస్తుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని నాంచర్ల అక్షయ తన ప్రతిభతో సర్కారు బడిపై ఆశలు సన్నగిల్లకుండా పదికాలాలు పటిష్టం చేస్తుంది. దశావధానం అంటే.. ప్రపంచంలో ఏ భాషకు లేని ప్రత్యేకత తెలుగు భాషకు మాత్రమే ఉంది. దశావధానం, అష్టావధానం, శతావధానం, సహస్రావధానంతో కవులు, రచయితలు తెలుగుభాషకే వన్నె తెచ్చారు. తెలుగు భాషకే పరిమితమై అవధాన ప్రక్రియను భౌతికశాస్త్రంలో చేస్తే ఎలా ఉంటుందని పాఠశాల ఫిజిక్స్ టీచర్ దొనికల రాజేందర్ వినూత్నంగా ఆలోచించి, ప్రయోగం చేశారు. ప్రైవేట్కు దీటుగా సర్కారు బడి పిల్లల్లో సృజనాత్మకతను బయటకు తీసుకురావాలనే ఆలోచనతో భౌతికశాస్త్రంలో న్యూటన్ గమన నియమాలపై తెలుగు దశావదానానికి లింకు కలిపారు. 9వ తరగతి విద్యార్థిని అక్షయ చదువులో రాణిస్తున్న తీరుతో ఆమైపె దృష్టిసారించారు. ఆమెకు భౌతికశాస్త్రంపై పట్టు ఉండడంతో సానపట్టి ఆణిముత్యాన్ని తయారు చేశారు. పదిమంది ప్రశ్నలతో.. పదిమంది ప్రశ్నలు వేస్తారు. ఎనిమిది మంది సంబంఽధిత విషయాలకు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తారు. మరో ఇద్దరిలో ఒక్కరు అప్రస్తుత ప్రసంగం చేసి ఆమెను డైవర్ట్ చేస్తారు. మరొకరు సమాధానాలు చెబుతున్న క్రమంలో ప్రశ్నలు తయారు చేయాల్సి ఉంటుంది. వేదికపై కొనసాగుతున్న అంశంపై సంబంధంలేని అంశం చేసి అలర్ట్, డైవర్ట్ చేస్తారు. అప్పటికప్పుడు చతురోక్తులతో కూడిన సమాధానాలు ఇస్తూ అడిగిన ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు ఇవ్వడం ప్రత్యేకత. న్యూటన్ గమన నియమాలపై ప్రశ్నలు, జవాబులు ● ప్రశ్నకు జవాబు చెప్పడం ● సమాధానాలకు అనువుగా ప్రశ్నలను తయారు చేయడం ● చూపించిన పటంలో దాగున్న న్యూటన్ గమన నియమాన్ని చెప్పడం ● చూపించిన పరికరాలతో ఏ కృత్యం చేయవచ్చునో.. దానిలో దాగున్న నియమాన్ని వివరించడం ● ఇచ్చిన నాలుగు పదాలతో న్యూటన్ గమన నియమాలు అంతర్గతంగా ఉండేలా ఒక కథను చెప్పడం, అందులోని సందర్భాలలో దాగి ఉన్న నియమాలను వివరించడం ● నిర్వహించిన కృత్యంలో గమన నియమాలను వివరించడం ● పెన్ను పేపర్ ఉపయోగించకుండా గమన నియమాల ఆధారంగా ఇచ్చిన వివరాలతో సమస్యను పరిష్కరించడం ● పటాన్ని చూసి శాస్త్రవేత్తను గుర్తించడం ● ఒక పటం లేదా అంశాన్ని గురించి ఏ పేజీలో ఉందో చెప్పడం ● మధ్య మధ్యలో అప్రస్తుత ప్రసంగంతో ఆటంక పరచడం మొదలగు పది అంశాలతో నిర్వహించిన తీరు భౌతికశాస్త్రం ఉపాధ్యాయుల బృందాన్నే సంబ్రమాశ్చర్యంలోకి దించి అబ్బురపరిచింది విద్యార్థిని అక్షయ. ఇటీవల పాఠశాలకు వచ్చిన భూపాలపల్లి భౌతికశాస్త్రం ఫోరం ఉపాధ్యాయులతో ప్రతిభ ప్రదర్శించి ఔరా అనిపించుకుంది. సృజనాత్మకత బయటకు తీయాలనే.. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను బయటకు తీయాలని వినూత్నంగా ఆలోచన చేసిన. దానికి అనుగుణంగా నాకు అక్షయ లాంటి ఆణిముత్యం లభించింది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్డే సందర్భంగా ప్రయత్నం చేసిన. తెలుగు భాషలో కవులు, రచయితలు వాడే దశావధానం లాంటిదే భౌతికశాస్త్రంలో న్యూటన్ మూడో గమన నియమాలపై చేయాలని పట్టుదలతో శిక్షణ ఇచ్చి ప్రదర్శించాం. అద్భుత ప్రదర్శన అమోఘం, అనితర సాధ్యం. ఇలాంటి ప్రదర్శన నాకు తెలిసి ఎవరూ చేయలేదు. – దొనికల రాజేందర్, ఫిజికల్సైన్స్ఐఐటీ సీటు లక్ష్యంనా గైడ్ టీచర్ రాజేందర్ సార్ ప్రోత్సాహంతో న్యూటన్ గమన నియమాలపై దశావధానం చేసిన. మా హెచ్ఎం అన్నపూర్ణ మేడం సహకారం మరువలేనిది. ఆమె నిత్యం చదువుపై శ్రద్ధ, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూస్తుంది. పాఠశాలలోని టీచర్లు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. భవిష్యత్లో ఐఐటీ ముంబయిలో సీటు లక్ష్యంగా చదువుతున్నాను. ప్రభుత్వ బడులపై చిన్నచూపు చూడొద్దు. – నాంచర్ల అక్షయ, 9వ తరగతి ●న్యూస్రీల్ న్యూటన్ గమన నియమాలపై విద్యార్థిని ప్రదర్శన భౌతికశాస్త్రం ఉపాధ్యాయులకే మిరాకిల్ అనిపించేలా.. ప్రశ్నలకు జవాబులు, ప్రశ్నలు తయారు చేయడం ప్రత్యేకత ప్రభుత్వ బడిలో మెరిసిన ఆణిముత్యం -
కలెక్టరేట్ ఎదుట నిరసన
భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధి వేశాలపల్లి శివారు డబుల్బెడ్ రూం కాలనీలో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కాలనీవాసులు కలెక్టరేట్ ఎదుట ఖాళీబిందెలతో నిరసన చేపట్టారు. క్వాటర్స్ కేటాయించిన నాటినుంచి ఇప్పటివరకు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, సొంత డబ్బులతో మోటార్లు, పైపులైన్లు ఏర్పాటు చేసుకొని నీటివసతి కల్పించుకున్నట్లు తెలిపారు. రెండేళ్లుగా అఽధికారులు తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేసవికాలం కావడంతో ప్రస్తుతం ఉన్న బోర్లు పనిచేయడం లేదన్నారు. మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అంద జేశారు. -
‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం
జనగామ: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో సీఎం రేవంత్రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేయనుండగా.. సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన ‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో సీపీ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎంపీ కడియం కావ్య శనివారం పరిశీలించారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు జఫర్గఢ్ మండలం కోనాయచలం సమీపాన రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెట్ స్కూల్(గురుకులం) కాంప్లెక్స్, రూ.146 కోట్లతో ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబు పేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్, రూ.46కోట్ల వ్యయంతో ఘన్పూర్లో విద్యుత్ సబ్స్టేషన్ సమీపాన 100 పడకల ఆస్పత్రి, రూ.26కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్(ప్రభుత్వ కార్యాలయాల సముదాయం), రూ.50 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులు, రూ.26కోట్లతో అంతర్గత సీసీరోడ్లు, డ్రెయినేజీలు, రూ.250 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల(మొదటి విడత) నిర్మాణ పనులను సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సెల్ఫ్హెల్ఫ్ గ్రూపులకు రూ.100కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందజేస్తారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను అనంతరం సీఎం సందర్శిస్తారు. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు మంజూరైన నాలుగు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. శంకుస్థాపనలకు సంబంధించి సభా వేదిక సమీపంలోనే ఒకే చోట శిలా ఫలకాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రెండు రూట్లలో తరలింపు సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో 50 వేల మందిని తరలించనున్నారు. ఇందుకు సంబంధించి వేలేరు, ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల నుంచి వచ్చే వారు ఘన్పూర్ టౌన్ మీదుగా.. జఫర్గఢ్, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల వారు ఇప్పగూడెం మీదుగా రానున్నారు. ఈ రెండు రూట్లలో పోలీసు నిఘా ఉంటుంది. శివునిపల్లి వ్యవసాయ మార్కెట్, విశ్వనాథపురం సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా ఉంచారు. సీఎం పర్యటన నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. నేడు ఘన్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు.. వ్యవసాయ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య, అధికారులు సీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు 1 గంటకు స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లె హెలిపాడ్కు చేరుకుంటారు. 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు 1.25 నుంచి 3 గంటల వరకు శివునిపల్లెలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. 3.10 గంటలకు శివునిపల్లె హెలిపాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య – వివరాలు 8లోu -
సభా వేదిక దేవన్నపేట!
సాక్షిప్రతినిధి, వరంగల్ : బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభకు గ్రేటర్ వరంగల్ పరిధి దేవన్నపేట శివారును నాయకులు ఎంపిక చేశారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేండ్ల పరిపాలనపై ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్.. వరంగల్ సభ ద్వారా ప్రారంభించాలని తలపెట్టింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధి ఉనికిచర్ల, బట్టుపల్లి, దేవన్నపేట ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ముఖ్యనేతలు ఈనెల 10న స్థలపరిశీలన చేశారు. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. సభకు హాజరయ్యే జనం ఈజీగా వచ్చిపోయేలా ఉండాలని భావించి శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి హరీశ్రావు స్థల పరిశీలన చేశారు. జాతీయ రహదారి పక్కన ఉండటంతో పాటు నలుమూలల నుంచి వాహనాల ద్వారా వచ్చిపోయేందుకు దేవన్నపేట అనువుగా ఉంటుందని భావించి అధినేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చివరకు దేవన్నపేటను ఫైనల్ చేసినట్లుగా చెప్పారు. స్థలపరిశీలన అనంతరం హరీశ్రావు సుమారు గంటపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో మాట్లాడారు. సుమారు 15 లక్షల మందితో భారీ సభ నిర్వహించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే సమయంలో సభ సక్సెస్ కోసం ఉమ్మడి వరంగల్కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం.● బీఆర్ఎస్ రజతోత్సవ సభాస్థలం పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్రావు తదితరులు ● సభ సక్సెస్కు త్వరలో కమిటీలు.. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ? -
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
టేకుమట్ల: మండలంలోని రాఘవాపూర్ శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని సుబ్బక్కపల్లి, అంకుషాపూర్, ఆశిరెడ్డిపల్లి, పంగిడిపల్లి, పెద్దంపల్లి, గర్మిళ్లపల్లిలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆశిరెడ్డిపల్లి, శ్రీవెంకటేశ్వరస్వామి, రాఘవాపూర్లో కొనసాగుతున్న శ్రీలక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో సీసీరోడ్డుతో పాటు గ్రామం నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హా మీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సంగి రవి, మాజీ సర్పంచ్లు నందికొండ మహిపాల్రెడ్డి, చింతలపెల్లి స్వామిరావు, రామారావు, ఆలయ చైర్మన్ బండ రఘోత్తంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. నేటి నుంచి ఒంటిపూట బడులు విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ అన్ని పాఠశాలల్లోనూ ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమై కొనసాగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా తరగతులు అయిపోయాక మధ్యాహ్న భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఈనెల 21 నుంచి టెన్త్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉన్నందున.. పరీక్ష కేంద్రాలుగా ఉన్న హైస్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలి. విద్యార్థులకు ముందే మధ్యాహ్న భోజనం అందించి తరువాత క్లాస్లు నిర్వహించాలని విద్యాశాఖాఽధికారులు తెలిపారు. ఆస్పత్రులకు పరికరాల పంపిణీఏటూరునాగారం/వెంకటాపురం(కె) : స్వచ్ఛంద సంస్థ ద్వారా అందించిన పరికరాలను ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్కుమార్ అన్నారు. రూ.27 లక్షల విలువ చేసే పరికరాలను వెంకటాపురం(కె), ఏటూరునాగారం ఆస్పత్రులకు సురేష్కుమార్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడారు. -
రెండు సోలార్ ప్లాంట్లు
భూపాలపల్లి రూరల్: స్వయం సహాయక సంఘాల్లో(ఎన్హెచ్జీ) మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుమ్ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. 33కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ (సౌర శక్తి) ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు వారి అభ్యున్నతికి అండగా నిలవాలని నిర్ణయించింది. జిల్లాలో ఎనిమిది యూనిట్ల లక్ష్యం కాగా తొలి విడతగా రెండు ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేపట్టింది. వాటికి సంబంధించిన డీపీఆర్ సిద్ధమవుతోంది. ప్రభుత్వం ప్రత్యేక చేయూత ఒక్కో ప్లాంటుకు రూ.3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీనికి గాను సంఘాలు 10శాతం పెట్టుబడి పెట్టాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం 90 శాతం బ్యాంకుల ద్వారా అందజేయనుంది. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సీఐఎఫ్) నుంచి ప్రభుత్వమే ఆయా సంఘాలకు రుణ ప్రతిపాదికన వాటిని అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. ఆర్థిక భారం తగ్గించేలా... జిల్లాలో ప్రాజెక్టులు, కాల్వలు అంతగా లేకపోవడంతో వ్యవసాయ ఆధారితంగానే పంటల సాగు జరుగుతుంది. ఇందుకు యాసంగిలో సాగు చేసే రైతులు విద్యుత్ ఆధారిత బోరు మోటార్ల ద్వారా పంటలకు నీటినందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటికి విద్యుత్ సరఫరా ఉచితంగా అందజేస్తుంది. ఇందుకుగాను ప్రభుత్వంపై ప్రతినెలా రూ.కోట్లలో ఆర్థిక భారం పడుతుంది. దీన్ని అధిగమించడంతో పాటు మహిళలకు ఆర్థిక చేయూత నందించేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తోంది. ఇందులో ఉత్పత్తి అయ్యే యూనిట్కు రూ.3.13 పైసల చొప్పున ప్ర భుత్వమే తిరిగి కొనుగోలు చేస్తోంది. దీంతో విద్యు త్ ఖర్చు తక్కువై ప్రభుత్వానికి ఆర్థికభారం తగ్గనుండటంతో పాటు మహిళలకు ఉపాధి లభించనుంది. తొలివిడతలో రెండు ఏర్పాటు జిల్లాలో ఎనిమిది సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలివిడతగా రెండు ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న గ్రామ సమాఖ్యల గుర్తింపుతో పాటు వాటి ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కూడా ఎంపిక చేశాం. ప్రభుత్వం నుంచి వాటి ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ అందాల్సి ఉంది. వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనులు ప్రారంభిస్తాం. ఇది మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడనుంది. – నరేష్, డీఆర్డీఓజిల్లాలో యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు మహిళా సంఘాలకు సౌర శక్తి ప్లాంట్లు స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తిరెండు ప్లాంట్లు ఇలా.. జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన రెండు సోలార్ ప్లాంట్లను మొదటి విడతలో భూపాలపల్లి మండలం వజినపల్లి, మహాముత్తారం మండలకేంద్రంలో మరొకటి ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆసక్తి, ఉత్సాహంగా పనిచేసే సమాఖ్య సంఘాలను ఎంపిక చేశారు. భూపాలపల్లి మండలం వజినపల్లిలో, మహాముత్తారం మండలకేంద్రంలో నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రెవెన్యూ, డీఆర్డీఓ, విద్యుత్, రెడ్కో, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేపట్టి ఎంపిక చేశారు. ఈ రెండు స్థలాలను ఆ గ్రామ సమాఖ్యలకు కేటాయిస్తూ ప్రత్యేక ఐడీ (రిజిస్ట్రేషన్) నంబర్లను కేటాయించారు. ప్లాంట్ నుంచి సమీపంలోని సబ్స్టేషన్ వరకు ప్రత్యేకంగా విద్యుత్లైన్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను సబ్స్టేషన్కు మళ్లించి రైతులకు అందజేయనున్నారు. 25 ఏళ్ల పాటు ప్రాజెక్ట్ నిర్వహణను ఆయా సంఘాలే పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా ఏటా ఆయా సంఘాలకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది. -
హనుమంత వాహనసేవలో లక్ష్మీనరసింహస్వామి
రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి హనుమంత వాహనసేవలో స్వామి వారిని మాడవీధుల గుండా ఊరేగించారు. ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి దీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు. జాతరలో పోలీస్ బందోబస్తు ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తెలిపారు. జాతరలో పోలీస్ బందోబస్తు గురించి పోలీస్ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జాతరలో 10మంది ఎస్సైలు, 170 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు, జంక్షన్లు, గ్రామ పరిధిలో మొత్తం 18 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ఆలయ ఈఓ మహేష్, చిట్యాల సీఐ మల్లేష్, ఎస్సైలు సందీప్కుమార్, షాఖాన్, అశోక్, ఆలయ కమిటీ సభ్యులు మల్లెబోయిన శ్రీధర్, ఆకుల రమేష్, మూల ఓంకార్, కనుకుంట్ల జోగేందర్, ఇల్లా కళావతి రవి, గ్రామ పెద్దలు కనుకుంట్ల దేవేందర్, ఆలయ సిబ్బంది రవిందర్, శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాతరకు ప్రత్యేక బస్సులు కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు, రేపు జరిగే జాతరకు పరకాల, భూపాలపల్లి డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజరు ఇందు తెలిపారు. కోటంచ జాతరకు వచ్చే భక్తుల రద్దీని బట్టి బస్సులు నడిపిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. హోలీరోజున జాతర ప్రారంభం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం హోలీ పండుగ రోజున హోమ, బలిహరణములు మధ్యాహ్నం మహాపూర్ణాహుతి, సాయంత్రం బోనాలు తిరుగుటతో జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం పెద్ద రథోత్సవం, ఎడ్లబండ్లు, ప్రభబండ్లు, ఇతర వాహనాలు తిరుగు కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవ విగ్రహాల ప్రత్యేక అలంకరణ, ఊరేగింపు నేటి నుంచి జాతర షురూ జాతరకు ప్రత్యేక బస్సులు -
భౌతికశాస్త్రంలో దశావధానం
● ఉపాధ్యాయులను అబ్బురపరిచిన విద్యార్థి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం బాసిరి అన్నపూర్ణ అధ్యక్షతన భౌతికశాస్త్రంలో న్యూటన్ గమన నియమాలు అనే అంశంపై విద్యార్థి నాంసాని అక్షయ చేసిన దశావధానం ఫిజిక్స్ ఉపాధ్యాయులను అబ్బురపరిచింది. గురువారం 9వ తరగతి విద్యార్థి అక్షయ ప్రశ్నకు జవాబు, సమాధానాలకు ప్రశ్నలను తయారు చేయడం.. ఇచ్చిన నాలుగు పదాలతో న్యూటన్ గమన నియమాలు అంతర్గతంగా ఉండేలా ఒక కథను చెప్పడం.. పెన్ను పేపర్ ఉపయోగించకుండా గమన నియమాల ఆధారంగా ఇచ్చిన వివరాలతో సమస్యను పరిష్కరించడం మొదలగు పది అంశాలతో దశావధానం నిర్వహించింది. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ మేధావులు నిర్వహించే అవధానాన్ని భౌతికశాస్త్రంలో చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఇంత అలవోకగా అవధానాన్ని చేసిన అక్షయకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. భౌతిక శాస్త్రంలో వినూత్న ప్రయోగం చేసిన గైడ్ టీచర్ దొరికల రాజేందర్ను అభినందించారు. అనంతరం విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భౌతికశాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షుడు బిల్లా రఘునాథ్రెడ్డి, ప్రధానకార్యదర్శి గంటా రాజబాపు, మడ్క మధు, వెంకటేశ్వర్లు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘ఎల్ఆర్ఎస్’కు ఆన్లైన్ కష్టాలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) బాలారిష్టాలు దాటడం లేదు. ఈ క్రమబద్ధీకరణకు 25 శాతం మినహాయింపును ఉపయోగించుకోవాలనుకునే వారికి అవాంతరాలు తప్పడం లేదు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తామనుకునే వారికి వెబ్సైట్ ఓపెన్కాక.. ఆన్లైన్ యాక్సెప్ట్ లభించక.. మున్సిపల్ ఆఫీస్ల చుట్టూ తిరిగి పోతున్నారు. ఈ వెబ్సైట్ అప్డేషన్కు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. దీంతో వారం, 10 రోజుల తర్వాత రమ్మని సిబ్బంది దరఖాస్తుదారులకు చెబుతున్నారు. ఫోన్లు చేసి ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని చెప్పి.. తీరా ఆఫీస్కు వెళ్తే ఆన్లైన్ పని చేయట్లేదని చెప్పడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ తంతు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు ఇచ్చిన 25 శాతం రాయితీ డెడ్లైన్ ఉపయోగించుకోవడం ఎలా అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక సమస్యలు .. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఉమ్మడి జిల్లా పరిధి 9 మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ కోసం 2020 సంవత్సరం 1,58,265 దరఖాస్తులు రాగా, పరిశీలన, ఆమోదం ఆగుతూ సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ దరఖాస్తుల్లో కదలిక రాగా.. మొత్తంగా 2024 వరకు 18,357 అప్లికేషన్లను పరిశీలించి ఆమోదించారు. ఇంకా 1,39,908 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో ఉండగా.. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మళ్లీ ట్రాక్లో పడింది. ఈనెల 31 వరకు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం మినహాయింపు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో దరఖాస్తుదారులు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. అయితే వెబ్సైట్ సరిగా ఓపెన్ కాక తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మున్సిపాలిటీల్లో ఇదీ పరిస్థితి.. ● గ్రేటర్ వరంగల్లో 1,00,989 దరఖాస్తులకు గురువారం 35,007 మంది దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని అధి కారులు సమచారం ఇవ్వగా.. రూ.5.87 కోట్లు చెల్లించి 746 దరఖాస్తులు క్లియర్ చేసుకున్నారు. మిగతా దరఖాస్తులపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ● జనగామ మున్సిపాలిటీ నుంచి ఎల్ఆర్ఎస్ కోసం 18,379 దరఖాస్తులు రాగా.. 7,127 అప్లికేషన్లకు అధికారులు ఆమోదించారు. అందులో 64 మంది రూ.26 లక్షలు చెల్లించారు. మిగతావి ప్రాసెస్లో ఉన్నాయి. ● వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో 5,421 దరఖాస్తులుండగా 1,565 మందికి ఫీజు చెల్లించాలని అధికారులు సమాచారం ఇవ్వగా ఇప్పటి వరకు 81 మంది రూ.41 లక్షలు చెల్లించారు. ● వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో 522 దరఖాస్తులకు 187 ఆమోదించగా.. గురువారం నాటికి 13 మంది మాత్రమే ఫీజు చెల్లించగా రూ.6 లక్షల మేరకు ఆదాయం సమకూరింది. ● హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 3,182 దరఖాస్తులకు 2,320 అప్లికేషన్లు ఆమోదించి సమాచారం ఇవ్వగా ఇప్పటి వరకు 16 డాక్యుమెంట్లపై రూ.5 లక్షల చెల్లింపులు మాత్రమే జరిగాయి. ● మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో 872 దరఖాస్తులకు 652 ఓకే కాగా 25, మరిపెడ మున్సిపాలిటీలో 2,629 అప్లికేషన్లకు 1,278 ఆమోదించగా 29 మంది మాత్రమే రూ.11 లక్షలు చెల్లించారు. తొర్రూరు మున్సిపాలిటీలో 10,299 అప్లికేషన్లకు 4,722 ఆమోదించగా 71 మంది రూ.30 లక్షలు, మహబూబాబాద్ మున్సిపాలిటీలో 12,201 దరఖాస్తులకు 2,522 మంది ఫీజు చెల్లించాల్సి ఉండగా 447 మంది రూ.2.07 కోట్లు చెల్లించారు. ● భూపాలపల్లి మున్సిపాలిటీలో 3,771 అప్లికేషన్లకు 2,234 ఆమోదించగా 127 మంది రూ.61 లక్షలు చెల్లించారు. రాయితీని సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాన్ని లేఅవుట్, నాన్ లేఅవుట్ పాట్ల యజమానులు, డెవలపర్లు, ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత శాఖల అధికారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రెగ్యులరైజ్ చేసుకోవాలి. – అశ్విని తానాజీ వాకడే, కమిషనర్, జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు మున్సిపాలిటీ దరఖాస్తులు గ్రేటర్ వరంగల్ 1,00,989పరకాల 3,182నర్సంపేట 5,421 వర్ధన్నపేట 522మహబూబాబాద్ 12,201 డోర్నకల్ 872 మరిపెడ 2,629 తొర్రూరు 10,299 భూపాలపల్లి 3,771 జనగామ 18,37925 శాతం మినహాయింపు ఈనెల 31 వరకే.. సతాయిస్తున్న వెబ్సైట్.. వినియోగదారుల్లో ఆందోళన 1,58,265 దరఖాస్తులు.. 18,357 ఆమోదం వివిధ స్థాయిల్లో 1,39,908 అర్జీలు -
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంసమయం లేదు.. మే 15నుంచి 26 వరకు జరిగే పుష్కరాలకు ముందే పనులు అన్ని పూర్తి చేయాలి. కానీ ఇక్కడ నిధులు విడుదల చేసి నెలలు గడుస్తోంది. పనులకు టెండర్లు పూర్తయి నెల దగ్గరికి వచ్చినా పనులకు సంబంధించిన ప్లానింగ్, డిజైన్స్ కాంట్రాక్టర్లకు ఇప్పటికీ ఇవ్వలేదు. వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభించాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 15నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో నాన్చుతూ వచ్చారు. మార్చి 3న కోడ్ ముగిసినా ఎలాంటి ఆర్డర్స్ ఇంకా ఇవ్వలేదు. పుష్కరాల సమయం సమీపిస్తుండడంతో సమయం లేకపోవడంతో ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.● పనులకు ఇప్పటికీ ఆర్డర్స్.. డిజైన్స్ ఇవ్వని ఉన్నతాధికారులు ● ఫిబ్రవరి 15న పుష్కరాల పనుల టెండర్లు పూర్తి ● నెలరోజులు కావస్తున్నా ప్రారంభం కాని పనులు ● కాంట్రాక్టర్లు మెటీరియల్ సమకూర్చి ఎదురుచూపుకాళేఽశ్వరం: జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహిణిగా ప్రవహిస్తున్న సరస్వతి నదికి ఈ ఏడాది మే 15నుంచి 26 వరకు పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఘనంగా సన్నాహాలు చేస్తుంది. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సరస్వతి పుష్కరాలు జరుగగా.. మళ్లీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు వస్తుండడంతో ప్రభుత్వం పుష్కరాల అభివృద్ది పనులకు రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకా 62రోజులే మిగిలి ఉండడంతో పాటు సమయం లేకపోవడంతో త్వరగా కలెక్టర్ స్పందించి పనులకు ఆర్డర్స్, డిజైన్స్ అందించేలా చర్యలు తీసుకుని పనులు ప్రారంభించాల్సి ఉంది. కాళేశ్వరంలో చదును చేసిన జ్ఞాన సరస్వతి ఘాట్న్యూస్రీల్ -
పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి
కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. గురువారం ఆయన ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి మే 15నుంచి 26 వరకు జరిగే పుష్కరాల సందర్భంగా చేపడుతున్న పనులపై ఈఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, వైద్యఆరోగ్యశాఖ, దేవస్థానం అధికారులతో పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 25వరకు పుష్కరాల అన్ని పనులు పూర్తి ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం తగదని హెచ్చరించారు. ముఖ్యంగా ఘాట్లు, రోడ్లు, శానిటేషన్, తాగునీటి సదుపాయాల పనులను గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతీవారం సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో సంబంధిత శాఖల సమన్వయం ఎంతో ముఖ్యమన్నారు. వీఐపీ ఘాట్ నుంచి స్నానఘట్టాల వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం, సరస్వతి తల్లి విగ్రహ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గోదావరిలో నీటి నిల్వలు పరిశీలించారు. మే మాసం వరకు ఎంత మేరకు నీరు ఉంటుందో పర్యవేక్షణ చేయాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. త్రివేణి సంగమం వరకు భక్తులు వెళ్లడానికి అనువుగా మట్టి రోడ్డు నిర్మాణం చేసి చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ వాచ్ టవర్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలు గుర్తించి నివేదిక అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్, డీపీఓ నారాయణరావు, అడిషనల్ ఎస్సీ బోనాల కిషన్, సీఐ రామచందర్రావు, విద్యుత్ శాఖ డీఈ పాపిరెడ్డి, దేవస్థానం ఈఓ మహేశ్, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ, ఎస్సై తమాషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు
భూపాలపల్లి: హోలీ పండుగను జిల్లా ప్రజలు ఆనందంగా, భద్రతతో, సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు హోలీ ఆడిన అనంతరం బావులు, వాగులు, చెరువులు, గోదావరిలో స్నానాలకు వెళ్లొదని తెలిపారు. సరదా మాటున ప్రమాదం పొంచి ఉందని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్న పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లకుండా తల్లితండ్రులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. టెన్త్లో మెరుగైన ఫలితాలు సాధించాలి భూపాలపల్లి అర్బన్: పదో తరగతి ఫలితాల్లో గతంలో వచ్చిన ఫలితాలకంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్న తరుణంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఈ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. నవంబర్ మొదటివారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 3,449 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. మావోయిస్టులకు సహకరించొద్దువాజేడు: ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని వారి సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. మండల పరిధిలోని మొరుమూరులో గురువారం వాజేడు ఎస్సై ఎన్.రాజ్కుమార్, సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏఎస్పీ మాట్లాడుతూ యువ త చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దన్నారు. గంజాయి, గుడుంబా, గుట్కా ప్యాకెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువత అతి వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నా రు. వాహనాలను నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడ వద్దన్నారు. వీటి మూలంగానే రోడ్డు ప్రమదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆడ పిల్లలకు బాల్య వివాహాలను చేయవద్దన్నారు. నేటి కాలంలో చాలా మంది సులభంగా డబ్బులను సంపాధించాలని ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి భూపాలపల్లి రూరల్: వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని చీఫ్ ఇంజనీర్ భీకంసింగ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో సర్కిల్ కార్యాలయంలో గురువారం భూపాలపల్లి డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని 33 ఇంటర్లింకింగ్ లైన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ఓవర్ లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు ఎస్టిమేట్స్ వేసి అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని సూచించారు. 33/11 సబ్ స్టేషన్లలో ఫీడర్ల విభజనను పూర్తి చేయాలని కోరారు. సబ్ స్టేషన్లలో ఓవర్లోడ్ పవర్ ట్రాన్స్ఫార్మర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశం అనంతరం పెద్దాపూర్ సబ్ స్టేషన్కి కొత్తగా వేస్తున్న 33కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ను పర్యవేక్షించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి డివిజనల్ ఇంజనీర్ పాపిరెడ్డి, డివిజనల్ ఇంజనీర్ సదానందం, టెక్నికల్ ఇంజనీర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి
రేగొండ: ఉచిత న్యాయ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణ బాబు అన్నారు. బుధవారం ఆయన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జయరాంరెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిలతో కలిసి కోటంచ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో స్టాల్ ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు రూ.3లక్షల లోపు ఆదాయం కలిగిన వారు, బాలురు, బాలికలు, మహిళల అక్రమ రవాణా, భూకంపాలు, విపత్తులు సంభవించినప్పుడు ఏ విధమైన న్యాయ సహాయం కావాలన్న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్సైలు సందీప్ కుమార్, షాఖాన్, ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ పారా లీగల్ వలంటీర్లు శ్రీనివాస్, రమేష్, తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణ బాబు -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
కాటారం: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎలాంటి హాని కల్గకుండా చూసుకోవాలని కాటారం రేంజర్ స్వాతి, డిప్యూటి రేంజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కాటారం మండలం చింతకానిలో బుధవారం గ్రామస్తులకు అడవుల సంరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ, పులి కదలికలపై అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అటవీ చట్టాలు, వన్య ప్రాణాలను వధిస్తే వర్తించే చట్టాలను వివరించారు. అడవులు విస్తారంగా ఉంటేనే సమయానికి వర్షాలు కురుస్తాయని పర్యావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. వేసవి కాలంలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అడవుల్లో మంటలు అంటిస్తే కఠిన చర్యలు తప్పవని, మంటలు వ్యాపించడం గమనిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అడవుల్లో వంటలు చేయడం, పొగతాగడం లాంటివి చేయొద్దని సూచించారు. ఉచ్చులు, కరెంట్ తీగలు లాంటివి అమర్చి వన్యప్రాణులను వధిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో యామన్పల్లి డీఆర్ఓ సురేందర్నాయక్, ఎఫ్బీఓ లు అశోక్, రాజేందర్, బేస్ క్యాంపు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నారసింహుడికి సింహ వాహనసేవ
రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం నాలుగో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి సింహ వాహన సేవలో మాడ వీధుల గుండా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాల చప్పుళ్లతో ఊరేగించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి గరుడోత్సవం, సదస్యం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ఆలయ మహేష్, కమిటీ సభ్యులు మల్లెబోయిన శ్రీధర్, ఆకుల రమేష్, మూల ఓంకార్, కనుకుంట్ల జోగేందర్, గ్రామ పెద్దలు కనుకుంట్ల దేవేందర్, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు. నేడు హనుమంత వాహన సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చమచార్యులు తెలిపారు. రాత్రి చిన్న రథసేవ, దోపోత్సవం కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు.కోటంచలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు -
గ్రూప్–2లో 43వ ర్యాంక్
చిట్యాల: మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నల్ల అజయ్ రాష్ట్రస్థాయిలో 43వ ర్యాంక్ సాధించాడు. 2018లో కానిస్టేబుల్గా, 2024లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించిన అజయ్ ప్ర స్తుతం గ్రూప్–2లో స్టేట్ 43వ ర్యాంక్ సాధించాడు. అలాగే కాళేశ్వరం జోన్లో 7వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధువులు అజయ్ను అభినందించారు. సరస్వతీ పుష్కరాలపై నేడు కలెక్టర్ సమీక్ష కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలపై గురువారం కలెక్టర్ రాహుల్శర్మ సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం హైదరాబాద్లో దేవాదా యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అధ్యక్షతన కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతీ పుష్కరాలపై సంబంధితశాఖ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష చేశారు. కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలనే ఆమె ఆదేశాలతో ఆయన సమీక్ష చేపట్టనున్నట్లు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో నెల రోజులపాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపా రు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కంటే తక్కువ వయ సు ఉన్న అభ్యర్థులు ఈనెల 15నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి బీసీ అభ్యర్థులు మాత్రమే అర్హులని స్ప ష్టం చేశారు. పూర్తి సమాచారానికి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాల యం లేదా ఫోన్ నంబర్ 040–29303130 ద్వారా సంప్రదించాలని కోరారు. ఇంటర్న్షిప్కు.. భూపాలపల్లి రూరల్: మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్న్షిప్కు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 745 జిల్లాలు, 25 సెక్టార్లలో 1.25 లక్షల కంటే ఎక్కువ ఇంటర్న్షిప్స్కు అవకాశం ఉందని తెలిపారు. యువత సొంత రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రంలోనైనా 5 ఇంటర్న్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 1800 116 090 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. భూపాలపల్లి జిల్లాకు 23 ఇంటర్న్షిప్స్ కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులు 21–24 మధ్య వయస్సు కలిగి ఉండాలని, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి 13, డిప్లొమో చేసిన వారికి 2, ఐటీ ఐ చేసిన 8 మందికి అవకాశం ఉందని తెలి పారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.5వేలు ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీభూపాలపల్లి అర్బన్: భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్ష సౌజన్యంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని భవిత కేంద్ర ఆవరణలో 99 మంది దివ్యాంగులకు రూ.9,88,200 విలువ గల వీల్ చైర్, ట్రై సైకిల్, చెవిటి మిషన్స్, రోలేటర్స్, టీఎల్ఎం కిట్స్, బ్రెయిలీ కిట్స్ అందజేశారు. కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఈ కార్యక్రమంలో సీఎంఓ సామల రమేష్, ఎంపీడీఓ నాగరాజు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రియవర్మ, సర్వన్కుమార్, తుపార్, రతన్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పక్క మండలానికి వెళ్లాల్సి వస్తోంది..
పలిమెల మండలం ఏర్పాటై తొమ్మిదేళ్లు అవుతుంది. ఇక్కడ గ్రామపంచాయతీల్లో ఈ–పాలన అందుబాటులోకి రాలేదు. గ్రామపంచాయతీ కార్యాలయానికి సంబంధించి ఏదైన ఆన్లైన్ పని ఉంటే మహదేవపూర్ మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. సమయం, రవాణా ఖర్చులు వృథా అవుతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రామపంచాయతీల్లో ఈ–పాలన అందుబాటులోకి తీసుకురావాలి. – జనగామ మధుకర్, పలిమెల పంచాయతీల్లో ఈ–పాలనపై నివేదించాం గతంలో గ్రామపంచాయతీల్లో ఈ–పాలన అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇంటర్నెట్ సౌకర్యం, సామగ్రి ఏర్పాటు చేశాం. ప్రక్రియ పూర్తికాకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఇటీవల ఉన్నతాధికారులు గ్రామపంచాయతీల్లో కంప్యూటరీకరణపై నివేదిక కోరడంతో అందజేశాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి -
అక్రమ మద్యం పట్టివేత
కాటారం: మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయిస్తున్న బెల్టు దుకాణాలపై ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం సంయుక్త దాడులు నిర్వహించారు. కాటారం ఎకై ్సజ్ ఎస్సై కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంతోపాటు కనుకునూరు, సింగంపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో సుంకం చెల్లించని మద్యం(నాన్ డ్యూటీ పేయిడ్ లిక్కర్), అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ లింగాచారి ఆధ్వర్యంలో దాడులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పలు గ్రామాల్లో బెల్టు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా 9.375 లీటర్ల సుంకం చెల్లించని మద్యం, 21.96 లీటర్ల అక్రమంగా నిల్వ చేసిన మద్యం, 22.1 లీటర్ల బీర్లు గుర్తించి స్వాధీనపర్చుకున్నట్లు ఎకై ్సజ్ ఎస్సై తెలిపారు. వీటి విలువ సుమారు రూ.34,590 ఉంటుందని, ఐదుగురిపై కేసులు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధి కారులు రజిత, చంద్రశేఖర్, ఎకై ్సజ్, టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, హెడ్కానిస్టేబుల్ రాంచందర్, శ్రీకాంత్, బాలు, హరిబాబు, వెంకట్రాజు, కోటేష్, శివకుమార్, రమణ, వరుణ్, తదితరులు పాల్గొన్నారు. ఐదుగురిపై కేసు నమోదు -
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
కాటారం: మారుమూల గ్రామాల్లో విక్రయించడానికి తీసుకొచ్చిన గంజాయితోపాటు విక్రయించే వ్యక్తిని మహాముత్తారం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి, సీఐ నాగార్జునరావు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా గౌరి గ్రామానికి చెందిన గణేశ్ఠాకూర్ మూడేళ్లుగా చెల్పూర్లోని ఓ రైస్మిల్లులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. జీతం సరిపోకపోవడంతో అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి పలుచోట్ల ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం గణేశ్ఠాకూర్ మహాముత్తారం మండలం యా మన్పల్లి సమీపంలో గల చెరువు వద్దకు గంజాయి విక్రయించడానికి వచ్చాడు. ముందస్తు సమాచారంతో మహాముత్తారం ఎస్సై మహేందర్కుమార్, పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకొని గణేశ్ఠాకూర్ను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 12 కిలోల 765 గ్రాముల గంజాయి స్వాధీనపర్చుకొని సీజ్ చేసినట్లు డీఎస్పీ, సీఐ తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం గణేశ్ఠాకూర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. కా గా, నిందితుడు గతంలో సైతం గంజాయి విక్రయిస్తూ ఘన్పూర్ పోలీసులకు పట్టుబడగా జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చినట్లు తెలిపారు. గంజాయి రవాణా చేసినా.. విక్రయించినా.. సేవించినా.. కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా డీఎస్పీ రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో మహాముత్తారం ఎస్సై మహేందర్ కుమార్, సీసీఎస్ ఎస్సై భాస్కర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. 12కిలోల 756 గ్రాముల సరుకు స్వాధీనం -
క్రీడల్లో గెలుపోటములు సహజం
భూపాలపల్లి రూరల్: క్రీడలు మానసికంగా, శారీరకంగా ఉపయోగపడతాయని, క్రీడలలో గెలుపోటములు సహజమని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మహిళలకు క్యారంతో పాటు వివిధ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి మల్లీశ్వరి హాజరై క్రీడలను పర్యవేక్షించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రఘు, మహదేవ్పూర్ సీడీపీఓ రాధిక, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.నేడు సరస్వతీ పుష్కరాలపై సమీక్ష కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ఽబుధవారం హైదరాబాద్ దేవాదాయశాఖ కార్యాలయంలో ఆశా ఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్తో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళేశ్వరం దేవస్థానం అధికారులు, అర్చకులతో పాటు జిల్లాస్థాయి అధికారులు హైదరాబాద్కు తరలివెళ్లారు. రెండు రోజుల కిందట 12న బుధవారం కాళేశ్వరంలో సమీక్ష జరుగునుందని అధికారుల ద్వారా తెలిసింది. రూ.25కోట్ల నిధులు రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసి పరిపాలన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. పనులు కొన్ని ప్రారంభం కాగా, పనుల పురోగతిపై సమీక్షలో చర్చించనున్నారు. కనులవిందుగా కల్యాణ మహోత్సవం కాటారం: మండలంలోని ఒడిపిలవంచలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ భూనీళ సహిత వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనులవిందుగా సాగింది. పురోహితులు మాడుగుల నాగరాజుశర్మ స్వామి వారి కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు కల్యాణ తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు కల్యాణాన్ని వీక్షించి తరించారు. ఈ కార్యక్రమంలో నరివెద్ది సత్యనారాయణ, రఘువరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు. గంజాయి పట్టివేత కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ సమీపంలోగంజాయితో తిరుగుతున్న మండలకేంద్రానికి చెందిన షేక్ లుక్మాన్ను పోలీసులు పట్టుకొని రిమాండుకు తరలించారు. మహదేవపూర్ ఎస్సై పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం పోలీసులు డిగ్రీకాలేజీ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా లుక్మాన్ నంబర్ ప్లేటు లేని నల్లని స్పెండర్ బైక్పై వస్తుండగా అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో బైక్ ట్యాంక్ కవర్లో నల్లని సంచిలో ఎండిన గంజాయి లభించింది. గంజాయి 625గ్రాములు వరకు ఉంటుంది. బైక్, గంజాయిని స్వాదీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దన్నారు. మంచిగా చదువుకోవాలని చెప్పారు. చెడు వ్యసనాలు, మత్తుకు అలవాటుపడితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
రాజశేఖర్రెడ్డికి 8వ ర్యాంక్
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్రెడ్డి గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాఽధించి రాష్ట్ర 8వ ర్యాంక్ సాధించాడు. గతంలో రాజశేఖర్రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పదవులకు కూడా ఎంపికయ్యాడు. ఉన్నతమైన లక్ష్యంతో కష్టపడి చదివి రాష్ట్ర ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పులకించిన కొండపర్తి
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలతో మమేకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీలు నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రావుల సునిత, మేడారం ఈఓ రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు దిశ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి: దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్ధాలనేదే లక్ష్యమని గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్రవ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటన -
ఆవుదూడపై పులి పంజా..
కాటారం: కొన్ని రోజులుగా జాడ లేకుండా పోయిన పెద్దపులి ఒక్కసారిగా తన పంజా విసిరింది. కాటారం మండలంలోని జాదారావుపేట గ్రామపంచాయతీ పరిధిలో రఘుపల్లి అటవీ ప్రాంతానికి సమీపంలోని చెరువు కట్ట వద్ద మంగళవారం ఆరేళ్ల ఆవుదూడను పులి చంపేసింది. అటు వైపుగా వెళ్లిన ఓ మేకల కాపరి మృతి చెందిన ఆవుదూడను గమనించి స్థానికులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లగా పులి ఆవుదూడపై దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. పులి దూడ గొంతు వద్ద గాయం చేసి రక్తం తాగి వదిలేసి వెళ్లినట్లు అఽధికారులు తెలిపారు. పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తుందని పులి మూగజీవాలపై దాడిచేసి మొదటగా రక్తం తాగుతుందని.. మరుసటి రోజు చంపిన జీవిని తినడానికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. పులి ఆవుదూడను చంపిన విషయం తెలియడంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో పులి ఎటు నుంచి వస్తుందో తెలియక అయోమయంతో జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి జాడ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రజలు, రైతులు, కాపర్లు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని కాటారం రేంజ్ రేంజర్ స్వాతి హెచ్చరించారు. అడవుల్లో ఉచ్చులు అమర్చవద్దని, పులికి హాని చేసేలా వ్యవహరించవద్దని చెప్పారు. పులికి సంబంధించిన ఆనవాళ్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రేంజర్ కోరారు. -
ప్రణీత్ ప్రతిభ..
కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్లోని కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. -
కష్టపడ్డారు..
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ– 8లోuముల్కలపల్లి యువకుడు ఉపేందర్.. డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్ను గ్రామస్తులు అభినందించారు. ● పలువురికి మెరుగైన ర్యాంకులు ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు● ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షలు రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్గా పనిచేస్తున్నారు. ప్రవీణ్కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. ఆ సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేశారు. అదే శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్లో జరిగిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. మూడు శ్రీకాంత్ను సన్మానిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులుగూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు. న్యూస్రీల్కాసింపల్లి వాసి -
సమర్థవంతంగా పనిచేయండి
భూపాలపల్లి: పోలీస్ వ్యవస్థను ప్రజలు గౌరవించేలా సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేయడానికి కృషిచేయాలని ఎస్పీ కిరణ్ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 22మంది ఫిర్యాదుదారుల పిటిషన్లను ఎస్పీ స్వీకరించి ఆయా పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలన్నారు. స్నేహభావంతో మెలుగుతూ వారి ఫిర్యాదులను స్వీకరించి సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, సంఘవ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు తెలపాలని ఆయన పేర్కొన్నారు.ఎస్పీ కిరణ్ఖరే -
రాష్ట్రస్థాయికి జంతుశాస్త్ర పరిశోధన ప్రాజెక్ట్ ఎంపిక
ములుగు: ఇంపాక్ట్ ఆఫ్ సాయిల్ ఆర్థోపోర్డ్స్ ఇన్ చిల్లీ క్రాప్ ఇన్ జాకారం విలేజ్ ఆఫ్ ములుగు డిస్ట్రిక్ అంశంపై చేసిన పరిశోధన రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా ఖైరతాబాద్లో ప్రదర్శించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం తెలిపారు. జిజ్ఞాస స్టూడెంట్ స్టడీస్ ప్రాజెక్టు పోటీలలో జంతుశాస్త్ర విద్యార్థుల ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అనిల్కుమార్ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులు పాలెం పునీత, పల్లెపు శృతి, బైరి కావ్య, సయ్యదబీబీ, రబియాలను ప్రిన్సిపాల్ అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలయ్య, అకాడమీ కో ఆర్డినేటర్ భాస్కర్, న్యాక్ కో ఆర్డినేటర్ కవిత, అధ్యాపకురాలు సరిత, నాగమణి, శిరీష, రాధిక పాల్గొన్నారు. -
భూ సేకరణపై గ్రామసభ
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా గారెపల్లిలో నిర్మించనున్న పైప్లైన్ కోసం భూ సేకరణపై సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం గారెపల్లిలో సేకరించనున్న 4.38 గుంటల భూమికి సంబంధించిన రైతుల వివరాలు గ్రామసభలో చదివి వినిపించారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎక్కువ భూమి కోల్పోతున్నప్పటికీ అధికారులు రికార్డుల్లో తక్కువ భూమి నమోదు చేశారని కాటారం సబ్ కలెక్టర్, భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మయాంక్సింగ్ దృష్టికి నిర్వాసిత రైతులు తీసుకొచ్చారు. గతంలో నిర్ణయించిన భూమి కంటే ఎక్కువగా ఎందుకు సేకరించాల్సి వస్తుందని, గతంలో భూమి కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని అధికారులను నిలదీశారు. గతంలో సర్వే చేసిన దానికంటే రీఅలైన్మెంట్ ఎక్కువ ఎందుకు చేయాల్సి వస్తుందని ప్రశ్నించారు. నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని రైతులు కోరారు. నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ వెంకన్న, భూ సేకరణ విభాగం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓసీలో బ్లాస్టింగ్లతో ఇళ్లు ధ్వంసం
గణపురం: మండలంలోని ఓసీ–3 ప్రాజెక్టులో నిత్యం పేలుస్తున్న బాంబులతో తమ ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు తీవ్రంగా దుమ్ము ధూళి బయటకు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని పరుశరాంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓసీ–3 ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. ఓసీ–3 ఓపెన్ కాస్టు గనిలో రోజు బొగ్గు తవ్వకాలకు ఉపయోగిస్తున్న భారీ బాంబులతో తమ ఇండ్లు పగుళ్లు పట్టడంతో పాటు గని నుంచి పెద్దఎత్తున దుమ్ము ఇండ్లలోకి చేరుకుంటుందని ఆరోపించారు. సింగరేణి అధికారులు వెంటనే తమ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తుల ఆందోళనతో పెద్దఎత్తున గనిలోకి వెళ్లి వచ్చే బొగ్గు లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు ఆందోళన వద్దకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ తమకు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ఆందోళన వద్దకు వచ్చి తమకు లిఖిత పూర్వకంగా రాసిస్తే సీఎండీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఆందోళనకు దిగిన సమీప గ్రామాల ప్రజలు సీఎండీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జీఎం హామీ -
ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
భూపాలపల్లి అర్బన్: 2020 సంవత్సరానికి ముందు ఏర్పాటుచేసి నాన్లేఅవుట్కు దరఖాస్తు చేసుకొని ఉన్న ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ రేగళ్ల రాము తెలిపారు. ఎల్ఆర్ఎస్పై సోమవారం ఎస్ఆర్ఓ కార్యాలయంలో సబ్రిజిస్ట్రార్ రాము టౌన్ప్లానింగ్ అధికారి సునిల్తో కలిసి రియల్టర్లు, ఏజెంట్లు, దస్తావేజుల లేఖరులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 31వ తేదీ వరకు రూ.25శాతం ఫీజు రాయితీ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేయనివారు సేల్ డీడీ సమయంలో ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ చార్జీలు ఎస్ఆర్ఓ కార్యాలయంలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
50 నిమిషాల్లోనే..
తూతూమంత్రంగా ప్రజావాణి● 19 దరఖాస్తుల స్వీకరణ ● గ్రీవెన్స్ అనంతరం మరో 26..భూపాలపల్లి అర్బన్: సుమారు రెండు నెలల అనంతరం సోమవారం జరిగిన ప్రజావాణిని అధికారులు కేవలం 50 నిమిషాల్లోపే పూర్తిచేశారు. బాధితులు తమ సమస్యలను విన్నవించేందుకు పది గంటలకే కలెక్టరేట్కు రాగా అధికారులు మాత్రం నెమ్మదిగా చేరుకున్నారు. 10:30గంటల వరకు నలుగురు అధికారులు మాత్రమే వచ్చారు. 11 గంటల వరకు అధికారులందరూ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల నుంచి 11:50 గంటల వరకు ఫిర్యాదులను అదనపు కలెక్టర్ అశోక్కుమార్ స్వీకరించారు. అనంతరం ప్రజావాణి ముగించగా జిల్లా అధికారులు వారివారి కార్యాలయాలకు తిరిగి వెళ్లారు. అనంతరం కూడా మరో 25 మంది దరఖాస్తులు రాగా కొన్ని అదనపు కలెక్టర్ స్వీకరించారు. మరికొందరు ఇన్వార్డ్లో ఫిర్యాదులను అందజేశారు.ఫిర్యాదుదారుడితో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ అశోక్కుమార్ కల్యాణలక్ష్మి రావడం లేదు.. మా అత్తమామలు చంద్రగిరి లక్ష్మి–మల్లయ్య గతేడాది కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి డబ్బులు రావడం లేదు. ఇప్పటికి మూడు సార్లు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో దరకాస్తు పెట్టినం. అయినప్పటికీ డబ్బులు రావడం లేదు. – బీరెల్లి మణికుమార్, వజినపల్లి, మహాముత్తారం సర్వే చేశారు.. బోర్లు వేయడం లేదు.. పోలారం గ్రామశివారులో దళిత కుటుంబాలకు చెందిన 20మంది రైతులం దాదాపు 50 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాం. ఈ భూమిలో పీఎం అజయ్ పథకం ద్వారా 10 బోర్లు వేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాం. ఎస్పీ కార్పొరేషన్, భూగర్భ జలశాఖ వారు సర్వే చేశారు. కానీ బోర్లు మాత్రం వేయడం లేదు. అధికారులు కలెక్టర్ స్పందించి బోర్లు వేయించాలి. – సల్లూరి శంకర్, పోలారం, మహాముత్తారం ట్రాక్టర్ ఉందని.. ఇల్లు రాదన్నారు.. గతేడాది ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. గతంలో అధికారులు సర్వే చేస్తున్న సమయంలో నాకు ట్రాక్టర్ లేకున్నా.. ఉన్నట్లు నమోదు చేసుకున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన అధికారులు ట్రాక్టర్ ఉంది కాబట్టి ఇళ్లు రాదన్నారు. – ఆకుదారి నరేందర్, భూపాలపల్లి ఆస్తులున్నాయని పింఛన్ ఇయ్యట్లే.. 2021 సంవత్సరంలో వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. పింఛన్ మంజూరైందని ఏడాది తర్వాత గ్రామకార్యదర్శి ఫోన్చేసి చెప్పాడు. ఆ తర్వాత నెల పింఛన్ తీసుకునేందుకు వెళ్తే పేరును తొలగించారు. కారణం అడిగితే నీకు ఆస్తులు ఉన్నాయని అందుకే తొలగించామని చెప్పారు. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. – సుద్దాల సదవలి, మహబూబ్పల్లి, మహాముత్తారం● -
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
బ్యాటరీ సైకిల్ కావాలి.. ఈ ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు పూల్యాల చంద్రలింగం. మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామం. షుగర్ వ్యాధితో మూడేళ్ల క్రితం ఎడమ కాలును తొలగించారు. అతనికి సదరం సర్టిఫికెట్ వచ్చినప్పటికీ దివ్యాంగుల పింఛన్ రాకుండా రూ.2వేల వృద్ధాప్య పింఛన్ మాత్రమే వస్తుంది. తనకు బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాటరీ సైకిల్ ఇస్తే కూరగాయల వ్యాపారం చేసుకుంటానని వేడుకున్నాడు. పని చేయకపోవడంతో భర్యాభర్తలం బతకడం ఇబ్బందికరంగా మారిందని అధికారులకు మొరపెట్టుకున్నాడు. -
లీకేజీ సమస్యకు పరిష్కారం
పలిమెల: సర్వాయిపేటలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘తాగునీటి తండ్లాట’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు గ్రామంలో పగిలిన పైప్లైన్ వద్ద మరమ్మతులు చేపట్టారు. నీటి పంపిణీని పునరుద్ధరించినట్లు మిషన్ భగీరథ ఏఈ సాయిరాం తెలిపారు. ఇంటి చుట్టూ ఉచ్చుతీగలు కాటారం: మండలంలోని గూడూరులో ఓ ఇంటి చుట్ట్టూ వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చు తీగలను పలువురు గుర్తు తెలియని దుండగులు అమర్చిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సదాశివ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి రాత్రి వచ్చి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసే సరికి ఇంటి ముందు ఉచ్చు తీగ అమర్చి సమీపంలోని విద్యుత్ స్తంభానికి తీగలను తగిలించి ఉంది. ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై–2 శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరైనా హత్యాయత్నానికి ప్రయత్నించారా, లేక గ్రామ శివారులో ఉండటంతో వన్యప్రాణుల వేట కోసం ఉచ్చుతీగ బిగించి ఉంటారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ అధికారుల పొలంబాట రేగొండ: విద్యుత్ అధికారులు రైతులకు సహాయకారులుగా ఉండాలని ఎస్ఈ మల్సూర్ నాయక్ అన్నారు. మండలంలోని రామన్నగూడెం తండాలో సోమవారం నిర్వహించిన పొలంబాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ట్రాన్స్ఫార్మర్పైన ఉన్న లూస్ లైన్లను సరి చేసి పోల్కు పోల్ తగలకుండా స్పేసర్స్ బిగించుట వలన ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రైతులు తడి చేతులతో స్టార్టర్ బాక్స్లు ముట్టుకోవద్దని సూచించారు. ఐరన్ స్టార్టర్ బాక్స్లకు బదులుగా ప్లాస్టిక్ స్టార్టర్స్ను వినియోగించాలన్నారు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేయవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ నాగరాజు, ఏఈ రాజు, ఏఎల్ఎమ్ రాహుల్, విజయ్కుమార్, రైతులు దేవేందర్, శ్యామరావు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రామప్ప ఒగరుకాల్వకు బుంగ వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప సరస్సు ప్రధాన కాల్వ ఒగరుకాల్వకు అదివారం రాత్రి బుంగపడింది. ప్రధాన తూము సమీపంలోనే బుంగపడి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి నీరంతా చేరడంతో కొంతమేర మునిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న నీటి పారుదల శాఖ ఈఈ నారాయణ, డీఈ రవీందర్రెడ్డి, ఏఈ జయంతిలు బుంగ పడిన ప్రదేశాన్ని సోమవారం పరిశీలించారు. ఈ క్రమంలో ఒగరుకాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. తొందరలోనే బుంగ పడిన ప్రదేశానికి మరమ్మతులు చేపట్టి కాల్వ ద్వారా ఆయకట్టు పంట పొలా లకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. -
సైక్లింగ్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
ములుగు: ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. కోచ్ శ్రీరాంనాయక్ ఆధ్వర్యంలో 24మంది పోటీలలో పాల్గొనగా అండర్–14 విభాగంలో క్రీడాకరులు ఐశు సిల్వర్, బ్రాంజ్, దివ్య బ్రాంజ్, నవీన్ సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. అండర్–16 విభాగంలో సాయి చరణ్ గోల్డ్, వర్షిణి రెండు సిల్వర్ మెడల్స్, అండర్–18 విభాగంలో కుశ్వంత్ రెండు గోల్డ్ మెడల్స్, చక్రవర్తి రెండు గోల్డ్ మెడల్స్ సాధించగా జిల్లాకు మొత్తంగా 12 మెడల్స్ వచ్చాయి. ఈ మేరకు సోమవారం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, డీవైఎస్ఓ తుల రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెళ్లి హరినాథ్లు క్రీడాకారులతో పాటు కోచ్ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాకు మంచి పేరు తీసుకరావడం శుభపరిణామం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం క్రీడాకారులకు సైకిళ్లను అందిస్తానని వివరించారు. -
ముడుపులు చెల్లిస్తేనే..!
భూపాలపల్లి అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఓ అధికారి ఉద్యోగుల నుంచి ప్రతి నెల అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు జిల్లావ్యాప్తంగా బహిరంగంగానే చర్చ జరుగుతోంది. కార్యాలయంలో పైసలు తడపనిదే ఫైళ్లు కదలడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నమ్మకం ఉన్న ఉద్యోగుల నుంచి తానే డబ్బులు తీసుకోవడంతో పాటు కొంతమంది నుంచి తనకు దగ్గరి మిత్రులకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్, నగదు చెల్లింపులు జరిగేలా చూసుకుంటున్నాడు. కొర్రీలతో ఇబ్బందులు.. జిల్లా సమగ్ర శిక్ష అభియాన్లో కేజీబీవీ బిల్లులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలు, పాఠశాల అభివృద్ధి పనుల బిల్లులు, ఇతర అలవెన్స్లకు సంబంధించిన ఫైలు మొత్తం సంబంధిత అధికారి వద్దకు వెళ్తున్నాయి. సంబంధిత అధికారి ఆమోదం పొందిన తరువాత డబ్బుల మంజూరు నిమిత్తం రాష్ట్ర ఫైనాన్స్ అధికారి వద్దకు వెళ్తుంది. అక్కడి నుంచి బిల్లు పాసవుతుంది. అన్ని రకాల బిల్లులు, ఇతర పత్రాలు జతపరిచినప్పటికీ ఇంకా కొన్ని తక్కువగా ఉన్నాయని ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం. జిల్లాలో ముడుపులు చెల్లించని ఫైళ్లను రాష్ట్ర ఫైనాన్స్ అధికారి కార్యాలయంలో మాట్లాడి బిల్లులు ఆపిస్తున్నట్లు సమాచారం. కొంతమందికి రావాల్సిన అలవెన్స్లను మూడు నాలుగు నెలలు పెండింగ్లో పెట్టినట్లు తెలిసింది. సాయంత్రం 5 తర్వాతే పనులు జిల్లాకు ఇన్చార్జ్ అఽధికారిగా పనిచేస్తున్న సదరు అధికారి వరంగల్లో భూపాలపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కార్యాలయానికి వారానికి రెండు రోజులు మాత్రమే హాజరవుతున్నారు. జిల్లాలో కేజీబీవీల నుంచి ఎస్ఓ, అకౌంటెంట్లో ఇతర అధికారులు సంబంధిత బిల్లులు అందించేందుకు డీఈఓ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. సదరు అధికారి వచ్చిన రోజు మాత్రమే బిల్లులు తీసుకురావాల్సి ఉంటుంది. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, ఇతర అధికారులు ఇంటికి వెళ్లిన తరువాతే తన పనులను ప్రారంభిస్తాడు. సాయంత్రం 4, 5 గంటల తరువాత కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. రాత్రి 8 నుంచి 9గంటల వరకు ఉద్యోగినులు సైతం పనుల కోసం వేచిఉంటున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏసీబీ అధికారుల నిఘా.. సంబంధిత అధికారి మామూళ్ల వేధింపులను తట్టుకోలేక పలువురు బాధితులు నెల రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డీఈఓ కార్యాలయంలో అధికారులపై ఏసీబీ నిఘా పెట్టినట్లు తెలిసింది. ముందస్తు సమాచారం తెలుసుకున్న అధికారి తృటిలో తప్పించుకున్నట్లు బాధితులు తెలిపారు. లంచం ఇవ్వొద్దు.. డీఈఓ కార్యాలయంలో బిల్లులు, ఇతర పనుల నిమి త్తం ఎవరికి కూడా లంచం ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే సమాచారం ఇవ్వా లి. కార్యాలయ అధికారులు, సిబ్బందిని ఇప్పటికే పలుమారు ఆదేశించాం. సరైన పత్రాలు అందించి అధికారులకు సహకరించాలి. మామూళ్లు వసూలు చేస్తే సహించేంది లేదు. – రాజేందర్, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారిడీఈఓ కార్యాలయంలో ఓ అధికారి వసూళ్ల పర్వం కేజీబీవీల నుంచి నెలవారీ మామూళ్లు.. ఇబ్బంది పడుతున్న ఉద్యోగులుబిల్లులను బట్టి పర్సంటేజీ.. ఉద్యోగుల బిల్లుల చెల్లింపు కోసం సంబంధిత అధికారికి ప్రతి నెలా మామూళ్లు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులను బట్టి పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పాఠశాలల అభివృద్ధి సివిల్ పనులకు సంబంఽధించిన బిల్లుల చెల్లింపులకు ఇటీవల డబ్బులు డిమాండ్ చేయడంతో పలువురు కాంట్రాక్టర్లు, నాయకులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలు..
● కాటారం మండలం ధన్వాడ సమీపంలోని మీనాక్షి జిన్నింగ్ మిల్లులో నిప్పుంటుకొని సుమారు రూ.కోటి విలువ చేసే పత్తి దగ్ధమైంది. ● గుమ్మాళ్లపల్లిలో వంట గ్యాస్ పేలి ఇల్లు దగ్ధమైంది. సుమారు రూ.6 లక్షల మేర నష్టం జరిగింది. ● కాటారం మండలం చల్లపల్లి సమీపంలోని రుద్ర జిన్నింగ్ మిల్లులో పత్తికి నిప్పుంటుకొని సుమారు రూ.15 లక్షల మేర నష్టం చోటుచేసుకుంది. ● మల్హర్ మండలం నాచారంలో జామాయిల్ తోటకు నిప్పు అంటుకోవడంతో దగ్ధమైంది. ● భూపాలపల్లి మండలం దూదేకులపల్లిలో రైతు పొలంలో ఆరబోసిన మిర్చికి నిప్పు అంటుకుని సుమారు రూ.3.50 లక్షల మేర నష్టం జరిగింది. ● చిట్యాల మండలం గిద్దెముత్తారంలో అయిల్పాం తోటకు నిప్పుంటుకొని కాలిపోయింది.కాటారం: అసలే అటవీ గ్రామాలతో కూడిన జిల్లా.. నిత్యం ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదం.. లక్షలాది రూపాయల ఆస్తినష్టం.. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క ఫైర్స్టేషన్ ఉండటంతో అగ్నిమాపక సేవలు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు జిల్లాకేంద్రం నుంచి ఫైర్ ఇంజన్ చేరుకునే లోపు ఆస్తులన్నీ బుగ్గిపాలవుతున్నాయి. జిల్లా ఏర్పడి ఏళ్లు దాటుతున్నా మరో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు అడుగులు ముందుకు పడటం లేదు. ఇటీవల కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహదేవపూర్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినప్పటికీ ఇంకా అటు ఆ దిశగా చర్యలు ప్రారంభం కాలేదు. ప్రతి ఏటా అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఒకేకేంద్రం నుంచి అగ్నిమాపక సేవలు సకాలంలో అందక బాధితులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వేసవికాలం సమీపిస్తుండటంతో అగ్నిప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చిన్న గది.. అరకొరగా సిబ్బంది.. జిల్లాకేంద్రంలో ఉన్న ఫైర్స్టేషన్కు సొంత భవనం లేక మున్సిపల్ కార్యాలయంలోని ఓ చిన్న భవనంలో కొనసాగుతుంది. జిల్లా అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత సైతం నెలకొంది. అరకొర సిబ్బందితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపైనే పనిభారం అధికమవుతుంది. జిల్లా అగ్నిమాపక శాఖలో అధికారులు, సిబ్బంది కలిసి సుమారు 16మంది వరకు ఉండాల్సి ఉండగా 12మంది మాత్రమే కొనసాగుతున్నారు. డ్రైవర్ ఆపరేటర్లు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే పర్మనెంట్గా ఉన్నారు. ఫైర్మన్లు పదిమంది ఉండాల్సి ఉండగా ఆరుగురు విధులు నిర్వర్తిసున్నారు.ఒక్కటే కేంద్రం.. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క ఫైర్స్టేషన్, ఒక ఫైరింజన్ మాత్రమే ఉండటం జిల్లావాసులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది. జిల్లా పరిధిలో 12మండలాలు ఉండగా 241 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మంథని నియోజకవర్గం పరిధిలోని కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాలు, భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి, రేగొండ, కొత్తపల్లిగోరి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలు జిల్లాలో ఉన్నాయి. ప్రతి మండలం జిల్లా నుంచి 50–70 కిలో మీటర్ల వ్యవధి దూరంలో ఉన్నాయి. ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగిన జిల్లాకేంద్రంలోని ఫైర్స్టేషన్లో ఉన్న ఒక్క ఫైరింజన్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అక్కడి వరకు ఫైరింజన్ సకాలంలో చేరుకోలేకపోతుంది. దీంతో అప్పటికే ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. 30కిలోమీటర్లకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే నిబంధనలు ఉన్నా జిల్లాకేంద్రంలో తప్ప మరెక్కడా అగ్నిమాపక కేంద్రం లేకపోవడం అగ్నిప్రమాదాలు చోటు చేసుకొన్నప్పుడు ప్రజలకు మరింత నష్టం చేకూరుస్తుంది.సమయానికి స్పందిస్తున్నాం.. జిల్లాలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సమాచారం అందిన వెంటనే సమయానికి స్పందిస్తున్నాం. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తగు సూచనలు చేస్తున్నాం. ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు 87126 99209 నెంబర్కు సమాచారం అందించండి. – అడువాల శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్, భూపాలపల్లి -
‘గ్రావెల్’ మాఫియా
హనుమకొండ జిల్లా దామెర మండలంలో యంత్రాలతో యఽథేచ్ఛగా మొరం తవ్వకాలు, తరలింపుసాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారులు, రాజకీయ నాయకుల అండదండతో అనుమతుల పేరిట సహజ వనరుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు అక్రమార్కులు. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలతో గుట్టలు, ప్రభుత్వ భూముల్లో మొరం(గ్రావెల్) తవ్వేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టూ ఉన్న దామెర, హసన్పర్తి, గీసుకొండ, శాయంపేట, ధర్మసాగర్ తదితర మండలాల్లో గ్రావెల్ మాఫియాకు అడ్డు లేకుండా పోయింది. కొందరు మొరం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి టెంపరరీ పర్మిట్ల(టీపీ)తో పట్టా భూములు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వేస్తున్నారు. చాలాచోట్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ గట్లను తవ్వుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దోపిడీ సాగుతోందిలా.. గ్రావెల్ మాఫియా టీఎస్ఎంఎంసీ రూల్స్ 1966–9(4) ప్రకారం పట్టాభూములు, రైతుల పేరిట రెండు నెలల గడువుతో తాత్కాలిక అనుమతులు పొందుతూ ఇష్టారాజ్యంగా మొరం దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన భూమిలో ఏరియాను బట్టి 8–12 అడుగులలోపు లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. అలా చేస్తే రెండున్నర హెక్టార్లలో సుమారు 7–8 వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్ మాత్రమే వస్తుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గ్రావెల్ మాఫియా అందుకు భిన్నంగా 15–30 అడుగుల లోతు వరకు తవ్వి లారీలు, టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో మొరం తరలిస్తున్నారు. ఇందుకు సుమారు రెండున్నర హెక్టార్ల కోసం రూ.1.50 లక్షల వరకు రాయల్టీ చెల్లిస్తూ.. రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు. కళ్లెదుటే ఈ అక్రమం జరుగుతున్నా.. ఏ శాఖ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచికి చేరిన కోమటిపల్లి గుట్ట దందా.. హసన్పర్తి మండలం భీమారం శివారు 340 సర్వే నంబర్లో సుమారు 57 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్డేడియం ఏర్పాటుకు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఓవైపు కళాశాలలకు కేటాయించిన సర్కార్ మరోవైపు 340/1 సర్వే నంబర్ పేరిట రెండున్నర హెక్టార్ల(3.260) భూమిని కె.నవీన్రావు పేరిట క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 సంవత్సరాల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. క్యూబిక్ మీటర్కు రూ.30ల చొప్పున 29,90,900 క్యూబిక్ మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుని గుట్టంతా ఖాళీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రూ.లక్షల ప్రజాధనం పక్కదారి పట్టినా.. ఈ దందాలో తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్గా ఉండటం వల్ల అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మొరం తరలింపులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే మొరం తవ్వకాలు చేపట్టాలి. – జ్యోతివరలక్ష్మీదేవి, తహసీల్దార్, దామెర అంతా అనధికారమే! కొంత అనుమతి తీసుకుని గుట్టలను కరిగించడమే కాదు.. అసలు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడం ఉమ్మడి వరంగల్లో పరిపాటిగా మారింది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొరం, మట్టి దందా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ తవ్వకాల గురించి సమాచారం తెలిసినా అధికారులు ‘మాములు’గా తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం జంగిలిగొండలోని ప్రభుత్వ భూమిలో గతంలో తవ్వకాలు జరుగుతుండగా అధికారులు అడ్డుకుని హద్దులు ఏర్పాటు చేసినా ఆగడం లేదు. ములుగు జిల్లా ములుగు పంచాయతీ శివారు 837 సర్వే నంబర్లోని సుమారు 200 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించగా.. అక్రమార్కులు మట్టి తవ్వకాలు ఆపడం లేదు. వరంగల్ నగరానికి సమీపాన ఉన్న ప్రాంతాల్లో వందలాది ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ట్రాక్టర్కు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున సుమారు 500 ట్రిప్పుల మొరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.12.50 లక్షలు ఆర్జిస్తున్నారు. జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ ఎన్నె చెరువు పక్కన 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను రాత్రి పూట పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తవ్వి మట్టిని తరలించారు. చంపక్హిల్స్ గుట్టల్లోనూ మట్టిని తోడేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకులు, వంచనగిరి ప్రాంతంలోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన, కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు వాటికి ఇరువైపులా బ్యాంకింగ్ పేరుతో పోసిన కట్టల మొరాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారు. యథేచ్ఛగా మొరం తవ్వకాలు అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట కాల్వగట్లు, గుట్టలనూ వదలని అక్రమార్కులు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు -
పట్టుదలతో ఏదైనా సాధ్యమే
● అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల భూపాలపల్లి అర్బన్: మహిళలు ఇంట్లో అందరికీ అన్ని పనులు చేస్తున్నారని.. తన కోసం పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యమేనని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో శనివారం ఏరియాలోని ఇల్లంద్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూర్కోకుండా ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రయత్న లోపం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే అదే వారిని వారి లక్ష్యం వైపు నడిపిస్తుందని తెలిపారు. సాధించిన విజయంలో తల్లిదండ్రులు లేదా భర్త ప్రోత్సాహం ఉంటుందన్నారు. సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో అండర్ గ్రౌండ్లో పనిచేయాలని మహిళా ఉద్యోగులు సంస్థలో చేరుతున్నారని వారిని అభినందించారు. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు మరింత ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్రెడ్డి, ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, సీఎంఓఏఐ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్, శేషరత్నం, అధికారులు మారుతి, క్రాంతికుమార్, శ్రావణ్కుమార్, శ్రీనివాస్, సేవా సభ్యులు పాల్గొన్నారు. -
1052 కేసులు పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1052 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణబాబు మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలకు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవడం వలన కేసుల్లో ఇరుక్కొని నష్టాల పాలవుతారని అన్నారు. ప్రజలు ద్వేష భావాలను తగ్గించుకొని రాజీమార్గాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజా మార్గం అని మనసులో నాటుకోవాలన్నారు. దాంతో విలువైన సమయం, డబ్బు దుర్వినియోగం కాదని తెలి పారు. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకొని పంతాలకు పోయి కేసుల్లో ఇరికితే పొలీస్ స్టేషన్లు, కోర్టులకు ఎక్కితే నష్టమన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జిలు జయరాంరెడ్డి, రామచంద్రరావు, అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్కుమార్, ఉపాధ్యక్షుడు విడ్ణువర్దన్రావు, ప్రధాన కార్యదర్శి బల్ల మహేందర్, న్యాయవాదులు పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూం కాలనీని పరిశీలించిన కమిషనర్ భూపాలపల్లి అర్బన్: వేశాలపల్లి సమీపంలోని డబుల్బెడ్రూం కాలనీని శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ప్రతి రోజు శానిటేషన్ పనులు చేయిస్తానని, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తిచేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ మానస, సానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. మహదేవపూర్కు ఫైర్స్టేషన్ మంజూరు కాళేశ్వరం: జిల్లాలో మరో ఫైర్స్టేషన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాటారం సబ్ డివిజన్ పరిధిలో మరో ఫైర్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చొరవతో మహదేవపూర్ మండలకేంద్రంలో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఫైర్స్టేషన్ ఏర్పాటుతో 18మంది సిబ్బందిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఫైర్స్టేషన్ ప్రారంభం ఎప్పుడు జరుగుతుందో అని వేచిచూడాలి. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు ఈ నెల 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి రూ.25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020 సంవత్సరంలో ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారు ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దీంతో భవన నిర్మాణ అనుమతులు సులభంగా వస్తాయన్నారు. సూచనలు, సలహాల కోసం 94935 52349 ఫోన్నంబర్ను సంప్రదించాలని సూచించారు. స్థల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాలు, 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా టూరిజంశాఖ ఆధ్వర్యంలో టెంట్సిటీ నిర్మాణం కోసం తాత్కాలికంగా ఆరు ఎకరాల గుడిమాన్యం స్థలాన్ని అధికారులు శనివారం పరిశీలించారు. ఆ స్థలంలో మిర్చిపంట ఉండడంతో వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం అంచనా వేశారు. టెంట్సిటీకి స్థలాన్ని కేటాయించగా.. త్వరలో టెంట్సిటీ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో 30కిపైగా ఏసీ, నాన్ఏసీ గదుల మాదిరి టెంట్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. వారివెంట ఈఓ మహేష్, సూపరింటెంటెండ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, అశోక్, నాగరాజు ఉన్నారు. -
కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..
ప్రమాద సమయంలో భార్యతో ప్రవీణ్కుమార్ ఆఖరి మాటలు.. హనుమకొండ, రాంనగర్వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. – పర్వతగిరి/సంగెం/నెల్లికుదురు● ఎస్సారెస్పీ కెనాల్లో పడిన కారు.. తండ్రి, ఇద్దరు పిల్లల మృతి ● స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడిన తల్లి ● వరుసగా సెలవులు రావడంతో స్వగ్రామానికి కారులో వెళ్తున్న కుటుంబం ● గుండెనొప్పి రావడంతో కారు స్టీరింగ్ తిప్పలేని పరిస్థితి.. ● నేరుగా కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం ● మేచరాజుపల్లిలో విషాదఛాయలు11.40 గంటలకు : వరుసగా సెలవులు రావడంతో హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్న సోమారపు ప్రవీణ్(28), భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కుమారుడు ఆర్యవర్ధన్(2)తో కలిసి హుందయ్ ఐక్రాస్ కారులో సొంత గ్రామమైన నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి బయలుదేరారు.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటపల్లికి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు. 4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు. వరంగల్ టు నెక్కొండ రోడ్డు ఎస్సారెస్పీ కాల్వపర్వతగిరి రోడ్డు12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది. ప్రమాదం జరిగిందిలా.. (ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు) -
వేగవంతంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ
భూపాలపల్లి: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేసే అంశంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో మున్సిపల్, పంచాయతీ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత ఇంటి స్థలాలు, లే అవుట్లు క్రమబద్ధీకరణకు జిల్లావ్యాప్తంగా 8,312 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుదారుడికి క్రమబద్ధీకరణ సమాచారం ఇవ్వాలని, సోమవారం మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో దరఖాస్తుదారులతో సమావేశం నిర్వహించి క్రమబద్ధీకరణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరులోగా ఫీజు చెల్లింపులో 25శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి.. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్లో మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుట, వేసవిలో మొక్కల సంరక్షణ చర్యలు తదితర అంశాలపై మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి వ్యర్ధాల సేకరణ జరగాలని ఆదేశించారు. వ్యర్ధాలు ఆరుబయట వేస్తే జరిమానాలు విధించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చికెన్, చేపలు, మాంసం విక్రయించే వ్యాపారులు, నిత్యావసర సరుకులు విక్రయించే వ్యాపారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు చేయొద్దని నోటీసులు జారీ చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133Aమహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 2) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను 73170C623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్లతో.. బి) బస్టాప్లో సి) కాలేజీ లేదా ఆఫీస్లో1) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేను2001107837B4) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్ను పరిశీలించి పేజీ లేఔట్పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
సవాళ్లను అధిగమిస్తేనే సాధికారత
భూపాలపల్లి: ఆధునిక సమాజంలో మహిళలు సాధికారత సాధించాలంటే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీసులు, భరోసా, సఖి సిబ్బందిని ఎస్పీ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని, వారు ఏదైనా సాధించగలరని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని, మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పని చేయాలన్నారు. పోలీస్స్టేషన్లో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్, రైటర్ వంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, డీపీఓ ఫర్హాన తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే -
నేడు నీటి సరఫరా నిలిపివేత
భూపాలపల్లి అర్బన్: మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతుల నేపథ్యంలో నేడు(శనివారం) మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పైపులైన్ మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వీఐపీ ఘాటు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్ల యజమానులు ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణాపై మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, పంచాయతీరాజ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాళేశ్వరం గోదావరి నుంచి రెండు ట్రాక్టర్లతో ఇసుకను రవాణా చేసిన ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం విదితమే. ఇసుక అక్రమ రవాణా విషయమై డిప్యూటీ తహసీల్దార్ కృష్ణను ఫోన్లో సంప్రదించగా అనుమతులు లేవని సీజ్ చేసి కేసు పెడుతామని హెచ్చరించారు. అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ఖాళీగా ఉన్న ఐదు అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసినట్లు ఈఓ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇదే ఐదు అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, వయోపరిమితి విషయమై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సదరు నోటిఫికేషన్ రద్దు చేస్తూ తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఓ తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 5గంటల లోపు కాళేశ్వరం దేవస్థానం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవగాహన కల్పించాలి భూపాలపల్లి అర్బన్: జనరిక్ మందులు వాడటం వలన ప్రజలకు నష్టం ఉండదని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జన ఔషధ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని తన కార్యాలయంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. 50నుంచి 60శాతం తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు జనరిక్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని ఉమాదేవి, ఫార్మసిస్టులు, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత చిట్యాల/రేగొండ: చిట్యాల, రేగొండ మండలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కన్నం కుమారస్వామి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నట్లు సెకండ్ ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు. కుమారస్వామిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రేగొండ మండలంలో.. రేగొండ మండలంలో అక్రమంగా 60 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ షాఖాన్ తెలిపారు. శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన పుట్ట జలంధర్, కొత్తపల్లిగోరి మండలం చిన్నకోడేపాక గ్రామానికి చెందిన కక్కెర్ల సదానందం, చిట్యాల మండలం జూకల్ గ్రామానికి మొలూగురి గణేష్ రెండు వాహనాలలో 65 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పులికాదు.. అడవి పిల్లి
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని శివార్లలోని పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు వదంతులు వచ్చాయని, అది అడవి పిల్లి (వైల్డ్ క్యాట్) అని చెల్పూర్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేష్ తెలిపారు. కొత్తపల్లిగోరి శివారు పంచరాయిలో ఉన్న పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో అటవీ అధికారులు గురువారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. పంట పొలాలు, బొక్కి చెరువు సమీపంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో లభించిన పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఆ పాదముద్రలు అడవి పిల్లివని నిర్ధారించారు. వన్యప్రాణులు కనబడితే తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్, ఎఫ్ఎస్ఓ గౌతమి పాల్గొన్నారు. -
ఇసుక తరలింపు నిలిపివేత
ఏటూరునాగారం: మండల కేంద్రానికి సమీపాన గల సంఘంపాయ, గోదావరి శివారులో కొనసాగుతున్న ఇసుక క్వారీ ప్రారంభమైన నాలుగు రోజులకే నిలిచిపోయింది. క్వారీ నిర్వాహకులు ఇసుకను తరలించడానికి నెల రోజుల నుంచి రోడ్లను వేశారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తరలింపునకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రెవెన్యూ అటవీ మైనింగ్ శాఖలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వేబిల్లులలో ఉన్న క్వాంటిటీ కంటే ఎక్కువ ఇసుకను తరలిస్తున్న లారీలను సీజ్ చేయాలని ఆదేశాలలో పేర్కొంది. క్వారీ నుంచి వచ్చిన ఓవర్ లోడ్ లారీలను గమనించి సీజ్ చేయాలని లేదా ఎంత ఎక్కువ ఇసుక లారీలో ఉందో దానికి తగ్గ ఫైన్ ట్రెజరీకి చెల్లించే విధంగా విధానాన్ని రూపకల్పన చేసింది. నూతన విధానం అమలయ్యాక ఆయా క్వారీల నుంచి వస్తున్న లారీలను పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు ఓవర్ లోడ్ లారీలను నిలిపివేస్తూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 1న ఏటూరునాగారం ఇసుక క్వారీ ప్రారంభమైంది. రెండు రోజులు క్వారీ ఆన్లైన్ డీడీలు తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు రోజుల నుంచి క్వారీకి సంబంధించిన వేబిల్లుల నిర్వహణ ఆన్లైన్ నుంచి తొలగిపోయింది. అయితే ఈ మూడు రోజులుగా వారి యాజమాన్యం పాత వేబిల్లుల ప్రకారం కొనసాగించింది. రెండు రోజుల క్రితం ఏటూరునాగారం క్వారీ నుంచి వెళ్తున్న లారీలను రెవెన్యూ పోలీస్శాఖ అధికారులు గమనించి అధిక లోడ్తో వెళ్తున్నాయని ఒక లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. అటవీశాఖ అధికారులు జోక్యం చేసుకొని క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ ఇసుక తరలింపు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి క్వారీలో ఇసుక తరలింపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇసుక క్వారీ ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ అటవీశాఖ ఆదేశాలు -
సమర్థంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
భూపాలపల్లి రూరల్: అధికారులు సమన్వయంతో పనిచేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో యాసంగి (రబీ) 2024–25 కాలానికి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు.ఽ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పంట కోత, గున్నీలు, పరికరాల లభ్యత టార్పాలిన్లు, కేలిబర్స్, పాడీ క్లీనర్లు సిద్ధంచేయాలని సూచించారు. రవాణా సౌకర్యాల వంటి కీలక అంశాలపై చర్చించారు. రైతులకు గిట్టుబాటు ధర అందించే విధానాలు, పంట కోత అనంతరం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే చర్యలపై సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఎం రాములు, డీఆర్డీఓ నరేష్, డీసీఓ వాలియా నాయక్, తూనికలు కొలతల అధికారి శ్రీలత వ్యవసాయ, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ -
25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్
భూపాలపల్లి: ఈ నెల 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో 25శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ తన కార్యాలయంలో గురువారం మున్సిపల్, పట్టణ ప్రణాళిక, పంచాయతీ అధికారులతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో మున్సిపల్ అధికారులు, పంచాయతీల పరిధిలో పంచాయతీ అధికారులు సమన్వయంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 31వ లోపు ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు చెల్లించే మార్కెటింగ్ ఫీజు చెల్లిస్తే దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక అధికారి సునీల్, పంచాయతీ కార్యాలయ ఏఓ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం తనిఖీ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గురువారం కలెక్టర్ రాహుల్శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని జూనియర్ కళాశాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. విద్యార్థుల హాజరు శాతంపై చీఫ్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలన్నారు. లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. నిశిత పరిశీలనతో విద్యార్థులను అనుమతించాలని స్పష్టంచేశారు. వైద్య సేవల కేంద్రాన్ని పరిశీలించి మందులను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తనిఖీచేసిన డీఈసీ కాళేశ్వరం: మహదేవపూర్ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షాకేంద్రాన్ని డీఈసీ భూక్యా వెంకన్న తనిఖీ చేశారు. పరీక్షలకు జనరల్ విభాగంలో 108, ఒకేషనల్లో 34మందికి గాను ముగ్గురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని పరీక్షల అధికారి ప్రసాద్ తెలిపారు. -
పెద్దపులికి అపాయం..
ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తుర్పల్లికి వచ్చిన పెద్దపులి ఆవాసం కోసం మహదేవపూర్, పలిమెల మండలాల్లో కలియతిరుగుతుంది. రోజుకో చోట సంచరిస్తుంది. ఆవాసం కోసం వస్తే మాత్రం ఉచ్చులకు పడితే పులి మరణించే అవకాశం ఉందని పలువురు జంతుప్రేమికులు పేర్కొంటున్నారు. రక్షించే బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉంది. ఈ అడవుల్లో పులులను వేటాడే వేటగాళ్లు ఏమైనా ఉచ్చులు పెడితే పులికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తగ్గిన నిఘా.. ఎన్ని కౌన్సెలింగ్లు చేసినా వేటగాళ్లు వేటాడటం, తినడం మారడం లేదు. వేసవి కావడంతో అడవులు పలచపడి నీటికోసం కుంటలు, వాగుల వద్దకు అడవి జంతువులు వస్తుండడంతో ఉచ్చులు పెడుతున్నట్లు తెలిసింది. కాపలా ఉండే అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ ప్రత్యేక నిఘా విభాగాలు రాత్రి వేళల్లో గస్తీలు నిర్వహించడం లేదు. పెట్రోలింగ్ టీంలు, ప్లయింగ్స్క్వాగ్ విభాగాల సోదాలు కూడా తగ్గాయని తెలుస్తోంది. వేటాడితే జైలుకే.. ఉచ్చులు పెట్టినా, వేటాడిన జైలుకు పంపుతాం. అనుమాసం ఉన్న ప్రాంతంలో మా బృందాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్ను తీవ్రం చేశాం. ఉచ్చులు బిగించకుండా అడవి మార్గంలో విద్యుత్ లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పులి తిరిగే ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాం. ప్రమాదం లేదు. – నవీన్రెడ్డి, డీఎఫ్ఓ● -
హైకోర్టును ఆశ్రయించిన హరిబాబు..?
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కోర్టుకు వెళ్లిన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న రాత్రి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన ఏ9గా ఉన్న పుల్ల నరేష్ను సైతం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించారు. ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మెన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, ఏ10గా ఉన్న పుల్ల సురేష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న హరిబాబు ఇటీవల హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నట్లు సమాచారం. బెయిల్ పిటిషన్పై ఈ నెల 10న వాదనలు జరుగనున్నట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా కేసు నమోదు -
విద్యార్థినికి అభినందనలు
భూపాలపల్లి అర్బన్: ఇన్స్పైర్ అవార్డు సాధించిన జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థిని మాచర్ల ఆశ్రితను పాఠశాల యాజమాన్యం గురువారం అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మారుతి మాట్లాడుతూ.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, సైన్స్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డులో పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఆశ్రితకు పూలగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాన్సీరాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రవాణాలో జాగ్రత్తలు పాటించాలి భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ఈ మేరకు జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూళ్ల స్పెషల్ అధికారులు, ప్రిన్సిపాళ్లతో గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు రవాణా చేసే సందర్భాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయురాలు లేదా ఉపాధ్యాయుడిని ఎస్కార్ట్గా విద్యార్థులతో పంపాలని, దూర ప్రాంతం ఉన్న పాఠశాలలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఆహార విషయాలలో శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులందరూ పరీక్షకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఆర్టీసీ, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఫైలింగ్పై అవగాహన అవసరం భూపాలపల్లి అర్బన్: కేసుల ఆన్లైన్ ఫైలింగ్ నమోదుపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తెలిపారు. జిల్లా కోర్టులో గురువారం న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యమన్నారు. కేసుల ఈ ఫైలింగ్ విధానం తెలిసినప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడైన కేసులు వేసుకునే వీలుంటుందని తెలిపారు. విలువైన సమయం, డబ్బులు పొదుపు అవుతాయని, ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు. రిసోర్స్ పర్సన్లు అఖిల్రెడ్డి, రవీందర్రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి, ఏఓ అనితావని, న్యాయవాదులు పాల్గొన్నారు. మహదేవపూర్లో గంజాయి స్వాధీనం కాళేశ్వరం: మండలకేంద్రంలోని ఒకరి వద్ద పోలీసులు నిషేఽధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మండలకేంద్రంలో సోదాలు చేయగా ఒకరి నుంచి 350–400 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఐ రాంచందర్రావును ఫోన్లో సంప్రదించగా పూర్తి వివరాలు త్వరలో తెలుపుతామని పేర్కొన్నారు. -
భక్తులకు మెరుగైన వైద్యసేవలు
రేగొండ: కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన వైద్యం అందేలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. ఈనెల 9నుంచి ప్రారంభమయ్యే కోటంచ జాతర సందర్భంగా గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతర సమయంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అత్యవసర వైద్యం కోసం జాతరలో రెండు ఆంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాస్కులు సరిపడా అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందులు ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. జాతీయ సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి చికిత్స అందించి, ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి హిమబిందు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకోవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు మేధాశక్తి పెంపొందించుకోవాలని హనుమకొండ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో రెండు రోజులు జాతీయస్థాయిలో వర్క్షాప్ నిర్వహించారు. రెండోరోజు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ సెమినార్కి ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ‘ఆన్ ఇంటరాక్షన్ విత్ కెరియర్ గైడెన్స్ సెల్’, ‘కోఆర్డినేషన్ కాంపౌండ్స్’ అనే అంశాల మీద విద్యార్థినులకు అవగాహన కల్పించారు. చదువుతో పాటు సమాజంపై విజ్ఞానం పెంచుకోవాలన్నారు. అనంతరం జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్ నాట్కి గెస్ట్గా సంగారెడ్డి డిగ్రీ కళాశాల డాక్టర్ సుప్రభాపాండ మాట్లాడారు. ‘ఇన్బార్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం’ అనే అంశం పైన చర్చించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuకాళేశ్వరం: జిల్లా అడవుల్లో ఉచ్చులతో వేటగాళ్ల అడవి జంతువుల వేట మళ్లీ ప్రారంభమైంది. భూపాలపల్లి, మహదేవపూర్, పలిమెల, టేకుమట్ల, మహాముత్తారం, మల్హర్ అటవీప్రాంతాల్లో ఎక్కువగా వేట జరుగుతుందని సమాచారం. దీనికి తోడు కొన్ని రోజులుగా కాటారం సబ్డివిజన్ పరిధి మహదేవపూర్, కాటారం, పలిమెల మండలాల్లో పెద్దపులి సంచారం పెరిగింది. దీంతో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులకు పెద్దపులి చిక్కితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జిల్లా అడవిలో ఉచ్చులు ● నిర్వీర్యం చేయని అధికారులు ● కాటారం సబ్డిజన్లో పాగా వేసిన పెద్దపులి ● పట్టించుకోని అటవీశాఖ అధికారులుమాంసానికి డిమాండ్ కాటారం సబ్డివిజన్ అడవుల్లో వేటాడిన దుప్పులు, కుందేలు, అడవి పందులు, ఏదు, కొండగొర్లు, అడవిపక్షులను ఉచ్చులు, కత్తులతో హతమార్చి మాంసాన్ని పట్టణాలకు, తమ బంధువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్లో అడవి మాంసం విలువ కిలోకు రూ.600లకు పైగా పలుకుతుండడంతో కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు ఇష్టపడుతున్నారు. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు నిత్యం ఆర్టీసీతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాల్లో తరలిపోతున్నట్లు సమాచారం. ఉచ్చులతో బలి.. అడవుల్లో వేట షరా మామూలుగానే జరుగుతుంది. నిత్యం వేటగాళ్లు వేట కోసం విద్యుత్ తీగలకు ఉచ్చులు తయారు చేసి వేస్తున్నారు. దానికి మూగజీవాలతో పాటు జిల్లాలో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. గతేడాది 2023 నవంబర్లో కాటారం–మహదేవపూర్ అటవీప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న యువ పోలీసు కానిస్టేబుల్ విద్యుత్ ఉచ్చుకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరిలో మల్హర్ మండలం శాత్రాజ్పల్లి వద్ద వేటగాళ్ల ఉచ్చులు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వారంలో కుదురుపల్లి వాగు, మహదేవపూర్ అయ్యప్ప ఆలయం సమీపంలో ఉచ్చులను స్థానికులు గుర్తించారు. నిత్యం అడవి జీవరాశుల కోసం వేటగాళ్లు రాత్రులంతా గస్తీ నిర్వహిస్తూ యథేచ్ఛగా వేటాడుతున్నారు. మండల కేంద్రాలకు కూతవేటు దూరంలో ఉచ్చులు అమర్చి వన్యప్రాణుల ప్రాణాలు తీస్తున్నారు. అధికారులు ఉచ్చులను నిర్వీర్యం చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.న్యూస్రీల్ -
సింగరేణి బకాయిలను చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడారు. 2024 డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి ఆర్థికంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.25వేల కోట్ల బకాయిలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు కొనుగోలు చేసిన డబ్బులను కూడా ఇవ్వడం లేదన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని మోసపూరిత హామీలతో కార్మికులను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ నెల 8వ తేదీన ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో సింగరేణి స్థితిగతులపై జనరల్బాడీ సమావేశం నిర్వహించి భవిష్యత్ పోరాటాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచీ నాయకులు సుజేందర్, మల్లేష్, రాజు, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్పై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: సైన్స్పై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కాకతీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ రమారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సైన్స్ వర్క్షాపును బుధవారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం విద్యార్థులకు అవసరం అన్నారు. కంప్యూటర్, సైన్స్పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు అధ్యాపకులు బోధించిన ప్రతీ విషయాన్ని ఏకాగ్రతతో ఒంట పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన విద్యాసంస్థల సమన్వకర్త శ్రీనివాస్రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, అధ్యాపకులు నవీన్, వెంకటయ్య, జ్యోతి, జీవవేణి, గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణిలతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
కుదురుపల్లి వద్ద లారీలు, ఆర్టీసీ బస్సులుకాళేశ్వరం: ఇసుక లారీలు రోడ్డుపై రెండు వరుసల్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మహదేవపూర్ మండలం కుదురుపల్లి టు మహదేవపూర్ మార్గమధ్యలో లారీలతో ట్రాఫిక్జామ్ ఏర్పడింది. కాటారం టు కాళేశ్వరం, కాళేశ్వరం టు వరంగల్ వైపు వెళ్లే వాహనాలు, ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారి 353 (సీ)పై లారీలు ట్రాఫిక్లో ఇరుక్కుని రెండు గంటల పాటు ప్రయాణికులు తంటాలు పడ్డారు. కుదురుపల్లి నుంచి మహదేవపూర్ సమీపంలోని సర్సరీ వరకు లారీలు జామ్ కావడంతో ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడంతో వారికివారే ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నారు. ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు లారీలు నిలిపేందుకు పార్కింగ్ స్థఽలాలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుపైనే యథేచ్ఛగా నిలిపివేస్తున్నారు. దీంతో నిత్యం ఇసుక లోడు, ఖాళీ లారీలు రోడ్డుకు రెండు వరుసలతో వెళుతుండడంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, వాహనచోదకుల ఇబ్బందులు -
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించినట్లు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాండ్ల తిరుపతి, యాంసాని సంతోష్లు తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇతర జిల్లాలకు సీఎంఆర్ రైస్ను పంపలేమని, బీజీ 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఇవ్వలేమన్నారు. స్పందించిన మంత్రి సీతక్క, సివిల్ సప్లయీస్ కమిషనర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం భూపాలపల్లి రూరల్: నేడు (గురువారం) 11 కేవీ జంగేడు టౌన్లోని ఫీడర్పై చెట్ల కొమ్మలు తీయుట, మరమ్మతు పనుల దృష్యా జంగేడు, ఫకీర్గడ్డ, వేశాలపల్లి, భాస్కర్గడ్డ, డబుల్ బెడ్ రూం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని భూపాలపల్లి పట్టణ ఏఈ విశ్వాస్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. మహిళలకు క్రీడాపోటీలుభూపాలపల్లి అర్బన్: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో బుధవారం లేడీస్ క్లబ్ మహిళలకు క్రీడాపోటీలను నిర్వహించా రు. ఇల్లంద్ క్లబ్లో త్రో బాల్, బాంబ్ ఇన్ సి టీ, బాల్ పాసింగ్ నిర్వహించారు. క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సేవా అధ్యక్షురా లు సునీతరాజేశ్వర్రెడ్డి, క్లబ్ కార్యదర్శి రమణివెంకటరామిరెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంవరంగల్: హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)లో మూడు సంవత్సరాల చేనేత, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు రాఘవరావు ఒక ప్రకటనలో కోరారు. 60 సీట్లు ఉన్న కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులై, జూలై 1 నాటికి బీసీ, ఓసీలు 23, ఎస్సీ, ఎస్టీలు 25 ఏళ్లు ఉండాలన్నారు. వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు ఓఎస్డీ హిమజాకుమార్ 90300 79242 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. మానేరులో తాత్కాలిక రోడ్డు తొలగింపు● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు టేకుమట్ల: మండలంలోని కలికోట శివారు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ శివారు మానేరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. గతంలో మానేరులో నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డుకు కొంత సేవా రుసుం వసూలు చేస్తూ రవాణా సౌకర్యాన్ని కల్పించారు. కొంతమంది స్వలాభం కోసం టోల్ నిర్వాహకులను నగదును డిమాండ్ చేయడం, టోల్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ ప్రచారం చేసి అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ నెల 1న పోలీసుల సమక్షంలో టోల్ ఎత్తివేశారు. అప్పటి నుంచి రాకపోకలు ఉచితంగా వినియోగించుకున్నారు. తాజాగా రోడ్డును తొలగించడంతో పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, భూపాలపల్లి నుంచి పెద్దపల్లి, మంచిర్యాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానేరులో తాత్కాలిక రోడ్డు ప్రతీఒక్కరికి అవసరమని, రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు. -
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్, సీ సెంటర్ క స్టోడియన్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరీక్షలకు హాజర య్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని సూచించా రు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు జిల్లాలో 20 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని 3,449 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్రెడ్డి, జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి చిట్యాల: విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. భోజనం రుచిగా ఉంటుందా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు చదువులో రాణించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
11శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి
భూపాలపల్లి రూరల్: ఎస్సీ వర్గీకరణలో మాదిగ ఉపకులాలకు 11 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం డప్పుచప్పుళ్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో 11 శాతం రిజర్వేషన్లు ఆమోదింప చేయాలని, మాదిగ, మాదిగ ఉపకులాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. లేదనంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా, మండలాల నాయకులు దోర్నాల రాజేందర్ మాదిగ, అంతడుపుల సురేష్, దోర్నాల సారయ్య, నేర్పాటి అశోక్, మంద తిరుపతి, మడిపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు. దొంగనోట్ల కలకలం! రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో దొంగనోట్ల కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మహిళా సంఘంలోని ఓ గ్రూపునకు చెందిన మహిళ నెలవారి కీస్తీలు డిపాజిట్ చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో నగదును క్యాషియర్ లెక్కిస్తుండగా అందులో ఓ 500 రూపాయల నోటు దొంగ నోటుగా గుర్తించారు. దీంతో సంఘ సభ్యులు ఎవరు ఇచ్చారనేది స్పష్టత రాకపోవడంతో మండలంలో దొంగ నోట్ల హవాసాగుతుందని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
భక్తులకు అసౌకర్యం కలగొద్దు
రేగొండ: కోటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కోటంచ బ్రహ్మోత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను అధికా రులతో కలిసి పరిశీలించారు. జాతరలో భద్రత ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు, పార్కింగ్, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అధికారులు, నిర్వాహకులు కలిసి సమన్వయంతో పని చేసి భక్తులకు ఉత్తమ సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కా ర్యక్రమంలో ఈఓ మహేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఏఎస్పీ బోనాల కిషన్, జి ల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్డబ్ల్యూస్ ఈఈ నిర్మల, విద్యుత్ డీఈ పాపిరెడ్డి, తహసీల్దార్ శ్వేత, మండల ప్రత్యేకాధికారి సునీల్ కుమార్, ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ధర్మకర్త శ్రీధర్, ఆ లయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
ఇంటర్ పరీక్షలు షురూ..
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. బుధవారం మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,901 మంది విద్యార్థులకు గాను 1,802 మంది విద్యార్థులు హాజరు కాగా 99 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని గాంఽధీ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి వెంకన్న తనిఖీ చేశారు. అలాగే కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి పరిశీలించారు. -
జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
కాటారం: కాటారం మండలం చల్లపల్లి సమీపంలోని రుద్ర జిన్నింగ్ మిల్లులో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తి జిన్నింగ్ ప్రక్రియలో భాగంగా మిషన్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మెరుగులు రాలి పక్కనే ఉన్న డస్ట్లో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి మిషన్లోని బెల్టులతో పాటు సమీపంలోని పత్తి బేల్స్, పత్తికి మంటలు అంటుకున్నాయి. గమనించిన సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా.. అదుపులోకి రాలేదు. భూపాలపల్లి, మంథని నుంచి ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో వంద క్వింటాళ్ల పత్తి, మూడు పత్తి బేల్స్, యంత్రాలు దగ్ధమయ్యాయని, సుమారు రూ.15లక్షల మేర నష్టం వాటిల్లినట్లు నివ్వాహకులు పేర్కొన్నారు.రూ.15లక్షల మేర నష్టం -
లెప్రసీ మళ్లొస్తున్నది
భూపాలపల్లి అర్బన్: అనారోగ్య సమస్యలతో పాటు.. అంగవైకల్యానికి ప్రధానంగా కుష్ఠు వ్యాధి కారణమవుతోంది. పూర్వీకులు ఈ వ్యాధి పూర్వజన్మ పాప ఫలితమని, వంశపారపర్యంగా వస్తుందని, నయం కాదని అనుకునేవారు. కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో వ్యాధి తీవ్రత తగ్గి వ్యాధిగ్రస్తులు తగ్గుతూ వస్తున్నారు. అంతరించి పోతుందనుకుంటున్న తరుణంలో మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత నెలలో వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి సర్వేలో మళ్లీ ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 62 మంది ఉండగా ఉమ్మడి జిల్లాలో 243 మంది బాధితులు ఉన్నారు. తీవ్రత పెరగకముందే అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించేలా వ్యాధి నియంత్రణలో ప్రత్యేక దృష్టి సారిస్తేనే వ్యాధి నియంత్రణ ఉండే అవకాశం ఉంది. వ్యాధి సోకేదిలా.. కుష్ఠు వ్యాధి మైక్రో బాక్టీరియం లెప్రే అనే బాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుంది. ఇది సాధారణంగా ఒకరకమైన అంటు వ్యాధి కారకం. కుష్టు వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా దగ్గరలో ఉన్న వారికి సోకే అవకాశం ఉంది. శరీరంలోని ఏ భాగంలోనైనా ఒకటి లేదా ఎక్కువ చిన్నవి లేదా పెద్ద మచ్చలు పాలిపోయిన రాగి లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఆ మచ్చలపై స్పర్శ, జ్ఞానం లేనప్పుడు, నొప్పి తెలియనప్పుడు మచ్చలపై చెమట పట్టదు. శరీరంపైన ఉన్న వెంట్రుకలు కూడా రాలి పోతాయి, చర్మంపై అక్కడక్కడా బుడిపెలు ఏర్పడతాయి. చెవి తమ్మెలు, ముఖం, చేతులు కాళ్లపై బుడిపెలు ఏర్పడతాయి. కాళ్లు, చేతులు, పాదాల్లో నిస్సత్తువ ఏర్పడి అంగవైకల్యానికి దారితీస్తాయి. పాదాల్లో గాయాలు ఏర్పడుతాయి. వ్యాధి సోకిన వారు కనురెప్ప పూర్తిగా మూయలేరు. రెండు రకాలుగా చికిత్స కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉంటే వారిని పాసీ బ్యాసిల్లరీ (పీబీ)గా గుర్తిస్తారు. వారికి ఆరు నెలలు వరకు ఖచ్చితంగా చికిత్స ఉంటుంది. కనీసం 9 నెలల్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐదు కంటే ఎక్కువ మచ్చలు. ఉంటే వారిని మల్టీ బ్యాసిల్లరీ (ఎంబీ)గా గుర్తిస్తారు. అలాంటి వారికి 12 నెలలు చికిత్స ఉంటుంది. కనీసం 15 నెలల్లో కోర్సును పూర్తి చేయాలి. బహుళ ఔషధ చికిత్సతో కుష్ఠు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. దాదాపు రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఖర్చయ్యే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తారు. 6 నెలలు నుంచి 12 నెలల వరకు చికిత్స తీసుకుంటే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సకాలంలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తే అంగవైకల్యం సంభవించకుండా చూడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులకు రెండు జతల మైక్రో సెల్యులార్ రబ్బర్ పాదరక్షకులు ఉచితంగా అందిస్తున్నారు. కొందరికీ ఆసరా పింఛన్ పథకంలో కూడా అవకాశం కల్పించారు.రోజురోజుకూ పెరుగుతున్న కేసులు జిల్లాలో 62 మంది వ్యాధిగ్రస్తులు ఆందోళన అవసరం లేదు: డీఎంహెచ్ఓ మధుసూదన్అందుబాటులో వైద్యం, మందులు.. వ్యక్తిలో తెల్లని, గోధుమ రంగులో ఎలాంటి స్పర్శలేని మచ్చలు ఉంటే కుష్ఠుగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనుమానితులు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వెళ్తే అక్కడ స్క్రీనింగ్ చేసి అవసరమైన వైద్యం అందిస్తారు. వ్యాధిని బట్టి 6 నుంచి 12 నెలల చికిత్స ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
పులి కదలికలపై డీఎఫ్ఓ ఆరా
కాటారం: కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి కదలికలపై బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి ఆరా తీశారు. కాటారం మండలం గుండ్రాత్పల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోని వాగులు, అడవి దారుల వెంట పులి పాదముద్రలను డీఎఫ్ఓ పరిశీలించారు. పులి గుండ్రాత్పల్లి మీదుగా అన్నారం, పల్గుల అటవీ ప్రాంతం నుంచి గోదావరి దాటి చెన్నూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పూర్తి స్థాయి నిర్ధారణకు డీఎఫ్ఓ అటవీ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చినట్లు సమాచారం. డీఎఫ్ఓ వెంట కాటారం రేంజర్ స్వాతి, సెక్షన్, బీట్ అధికారులు ఉన్నారు. కొత్తపల్లిగోరిలో పులి సంచారం? రేగొండ: కొత్తపల్లిగోరి మండలకేంద్రంలో పులి సంచారం కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం పల్లెబోయిన రమేశ్ అనే రైతుకు చెందిన పొలం గట్టు మీదుగా బొక్కి చెరువు వైపు వెళ్తుండగా ఓ మహిళ వీడియో తీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఘటనపై చెల్పూర్ ఇన్చార్జ్ రేంజ్ ఆఫీసర్ నరేష్ను వివరణ కోరగా.. కొత్తపల్లిగోరిలో పులి సంచరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. నిజానిర్ధారణ కోసం నేడు పాదముద్రలు సేకరిస్తామన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
రేగొండ: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడెపాక గ్రామంలో ప్రతిష్ఠించిన రేణుకా ఎల్లమ్మ తల్లి, కంఠమహేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల కొంగుబంగారంగా రేణుక ఎల్లమ్మ నిలిచిందన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, నాయకులు పున్నం రవి, సూదనబోయిన ఓంప్రకాశ్, సురేందర్రెడ్డి, ఓమాజీ, మెండయ్య, తిరుపతి పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పరిహారం అందేనా?
గోవిందరావుపేట: చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 5వ బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 10 ఏండ్లు గడిచినా నేటికీ పరిహారం అందలేదు. తెలంగాణ ప్రభుత్వం బెటాలియన్ నిర్మాణానికి 105 ఎకరాలు లాక్కొని పరిహారం కూడా చెల్లించకుండా సుమారు 60 మంది కుటుంబాలను రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు సుమారు ఐదు సంవత్సరాలపాటు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేశారు. బెటాలియన్ గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు సైతం కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా పోరాటం చేసిన పలువురు రైతులపై పోలీసు కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లారు. నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆత్మహత్యాయత్నం.. బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రభుత్వం, నాయకులను కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. చివరకు చల్వాయి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మహిళా రైతులు సైతం ఉండడం గమనార్హం. దీంతో అప్పటి అధికారులు, పోలీసులు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. లబ్ధికోసమే రాజకీయ నాయకుల మద్దతు ? భూ నిర్వాసితులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్ధతు ప్రకటించినా.. అది కేవలం వారి రాజకీయ లబ్ధికోసమేనని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు నిజంగా తమ కోసం పోరాడితే ఎప్పుడో న్యాయం జరిగేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలోని నాయకులు సీతక్క, ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వంటి వారు.. రైతులకు పరిహారం వచ్చేవరకు అండగా ఉంటామని చెప్పి మాయమాటలతో పబ్బం గడిపారని, కేసుల పాలై కోర్టు చుట్టూ తిరుగుతున్నా.. ప్రస్తుతం పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన చిలుకమ్మ వారసత్వంగా వచ్చిన భూమిని నమ్ముకుని 60 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ నలుగురు పిల్లలకి పెళ్లి చేసి వారి పిల్లలతో గడిపే సమయంలో భూమిని ప్రభుత్వం తీసుకుందని తెలిసి గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.హామీ ఇచ్చి మోసం చేశారు.. మా తాతల నాటినుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఉన్న పలంగా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ బెటాలియన్ నిర్మాణం చేపడుతున్నాం.. అని భూమిని లాక్కొని, మా మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు. ఉద్యోగం కల్పిస్తాం.. భూమికి బదులు భూమిస్తాం.. అని మోసం చేశారు. ఇప్పటికై నా భూములు కోల్పోయిన రైతులకు హామీ మేరకు పరిహారం ఇవ్వాలి. రైతులపై ఉన్న కేసులను ఎత్తేయాలి. – జంపాల అనిల్, భూ నిర్వాసితుడు కేసు కోర్టులో ఉంది చల్వాయి బెటాలియన్ కింద భూములు కోల్పోయిన రైతుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు మేము ముందుకు వెళ్తాం. – సృజన్ కుమార్, తహసీల్దార్, గోవిందరావుపేట ●ఆందోళనలో టీజీఎస్పీ 5వ బెటాలియన్ భూనిర్వాసితులు చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ పదేళ్లు గడిచినా తప్పని ఎదురుచూపు -
దళారులను ఏకం చేసి రేగొండలో సమావేశం..
కొన్నేళ్లుగా జిల్లాలోని రేషన్ బియ్యాన్ని పలువురు దళారులు మహారాష్ట్రలోని సిరొంచలోని ఓ రైస్మిల్లుకు అక్రమంగా తరలించేవారు. అక్కడి రైస్మిల్ యజమాని రెండు నెలలుగా ఈ దందాను మానుకున్నాడు. దీంతో జిల్లాకు చెందిన ఓ రైస్మిల్ యజమాని తెరపైకి వచ్చి రేషన్ బియ్యాన్ని పలు రైస్మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గతంలో పని చేసిన దళారులను ఏకం చేశాడు. దందా మానేయాల్సిన అవసరం లేదని, తానే బియ్యాన్ని కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో మండలాల వారీగా ఉన్న దళారులంతా ఏకమై 20రోజుల క్రితం రేగొండలో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అందరం కలిసి సదరు రైస్మిల్ యజమాని చెప్పిన మిల్లులకే బియ్యాన్ని సరఫరా చేయాలని, ఒక మండలం వారు మరో మండలంలోకి వచ్చి కొనుగోలు చేయరాదని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారంతా రేషన్కార్డుదారులు, రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్మిల్ యజమాని చెప్పిన రైస్మిల్కు అర్ధరాత్రి వేళల్లో వివిధ వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం. -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: నేటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో సమస్యలకు తావులేకుండా చూడాలన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు సౌకర్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, నోడల్ అధికారి వెంకన్న పాల్గొన్నారు.పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ -
కొడవటంచ జాతరకు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: కొడవటంచ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి, ఆర్అండ్బీ, సమాచార, దేవాదాయ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక విధుల నిర్వహణకు గ్రామ సిబ్బందిని డిప్యూట్ చేసి, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పనులు చేపట్టాలని ఆదేశించారు. దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయడంతో పాటు పూలతో అందంగా ముస్తాబు చేయాలన్నారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల సౌకర్యార్ధం గ్రామంలోని అన్ని రహదారుల్లో వీధి లైట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు వైపు, పార్కింగ్ స్థలాలు, భక్తులు ఉండే జాతర స్థలాలలో తాత్కాలిక లైట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే కొడవటంచ బైపాస్, రేపాక, కొడవటంచ రోడ్, గుడెపల్లి–కొడవటంచదారులలో అడ్డంగా ఉన్న ముళ్లపొదలు తొలగించి, మొరం పోసి గుంతలు పూడ్చే పనులు పూర్తి చేయాలన్నారు. జాతర రోజులలో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయాలని, నీళ్ల ట్యాంకుల దగ్గర ఇంకుడుగుంతలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళల సౌకర్యార్ధం స్నాన ఘట్టాలు వద్ద బట్టలు మార్చుకొనే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని అనుసరించి తగు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్ధం 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని, భూపాలపల్లి డిపోతో పాటు ఇతర జిల్లాల నుంచి నిరంతరం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్డీఓ రవి, డీఎస్పీ సంపత్ రావు, ఈఓ మహేష్, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో సమీక్ష -
యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్ ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాడని యూనియన్ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య తెలిపారు. మంగళవారం ఏరియాలోని వర్క్షాపులలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు సొంతింటి పథకం వెంటనే అమలు చేయాలని, మారు పేర్లను సవరించాలని, క్యాడర్లకు సంబంధించిన క్యాడర్ స్కీం అమలు చేయాలని, ప్లేడేలను గతంలో మాదిరిగా అమలు చేసి ఎన్–1 రద్దు చేయాలని సీఎండీని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్, రాజిరెడ్డి, బాబు మియా, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీ స్థల పరిశీలన భూపాలపల్లి అర్బన్: గడ్డిగానిపల్లి, కొండంపల్లి గ్రామాల ఆర్అండ్ఆర్ కాలనీ భూ సేకరణ పనులను మంగళవారం ఆర్డీఓ రవి సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. గడ్డిగానిపల్లి, కొండంపల్లి భూసేకరణ పనులను త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేయాలని సింగరేణి అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి, ఓసీ–2 ప్రాజెక్ట్ అధికారి వెంకటరామిరెడ్డి, సివిల్ డీజీఎం రవికుమార్, అధికారులు అరుణ్ప్రసాద్, కార్తీక్ పాల్గొన్నారు. వైద్య సిబ్బంది పాత్ర గొప్పది కాటారం: వైద్యసేవలు ప్రజలకు చేరవేయడంలో వైద్యసిబ్బంది పాత్ర చాలా గొప్పదని వైద్యశాఖ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఉమాదేవి అన్నారు. జన్ఔషధి వారోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉత్తమ విధులు నిర్వర్తిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ స్టాఫ్ నర్స్ అభినయను సన్మానించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ ఏఎన్ఎం, వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మౌనిక, డాక్టర్ హారిక, డాక్టర్ వందన, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ గీతా, డాక్టర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. టెక్నాలజీపై అవగాహన మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ అత్యాధునిక పరికరాల టెక్నాలజీపై ఉమ్మడి జిల్లా 108 ప్రోగాం మేనేజర్ పాటి శివకుమార్ అవగాహన కల్పించారు. తాడిచర్ల ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, సిబ్బందితో మంగళవారం వైద్యాధికారి వినయ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. 108, 102 సర్వీస్లు, నియో నటల్ సేవలు ఎఫ్హెచ్ఎస్ (పార్థివ వాహనం) సర్వీస్ ఉపయోగించుకోవాలని అవేర్నెస్ డెమో ప్రోగ్రాం ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్, పీహెచ్సీ తాడిచర్ల హెల్త్ అసిస్టెంట్ నాగరాజు, ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు, 108 సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహేష్, పైలట్ సంపత్ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuమండలాల దళారులతో ములాఖత్ ● వివిధ శాఖల అధికారులతో సెటిల్మెంట్ ● రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి గోడౌన్కు తరలింపు ● అంతా ఆయన కనుసన్నల్లోనే జరగాలని హుకుం రీసైక్లింగ్ చేసి గోడౌన్కు తరలింపు.. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లర్లకు అప్పగిస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్(ఎస్డబ్ల్యూసీ) గోడౌన్లకు పంపించాల్సి ఉంటుంది. జిల్లాకు చెందిన పలువురు రైస్మిల్లర్లు గోల్మాల్ చేసి రైతుల ధాన్యానికి బదులుగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి హనుమకొండలోని గోడౌన్కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కలర్ టెస్ట్లో పీడీఎస్ బియ్యాన్ని గుర్తు పట్టే అవకాశం ఉంటుంది. దీంతో అక్కడి అధికారులకు డబ్బులు ఎరగా చూపి 290 క్వింటాళ్లకు (ఏసీకే) రూ.15వేలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారు గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఇప్పటివరకు వచ్చిన బియ్యం మొత్తాన్ని ఎంఎల్ఎస్ గోడౌన్ పాయింట్లకు పంపినట్లు సమాచారం.జిల్లాకు చెందిన ఓ రైస్మిల్ యజమాని రెండు నెలలుగా పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేపిస్తూ డాన్గా ఎదిగాడు. పుష్ప సినిమాలో మాదిరిగా మండలాల వారీగా ఉన్న దళారులతో ములాఖత్ అయి అధికారులతో సెటిల్మెంట్లు చేసుకొని పేదల బియ్యాన్ని యథేచ్ఛగా రైస్మిల్లులకు సరఫరా చేయిస్తున్నాడు. – భూపాలపల్లిన్యూస్రీల్ -
నాలుగేళ్లు సాగుచేస్తే రూ.40వేల ఆదాయం
ఏటూరునాగారం: కంకవనాలను సాగు చేసి నాలుగేళ్లపాటు సంరక్షిస్తే రైతులకు సంవత్సరానికి రూ.40వేలు ఆదాయం వస్తుందని సెర్ప్ సీసీ నర్సింహారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శివాపురం గ్రామంలో జగదాంబ గ్రామైక్య సంఘానికి ఆయన కంకవనాల పంట సాగుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆమోదితమైన ఓ కంపెనీ ద్వారా 15 గుంటలు పట్టా భూమి ఉన్న మహిళా రైతుకు 60 కంక మొక్కలను ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రతిరోజూ మొక్కకు నీరుపట్టి సంరక్షించినందుకు రూ.15 నాలుగేళ్లపాటు అందిస్తారని చెప్పారు. నాలుగు ఏళ్ల వరకు పంటను కాపాడితే మొక్కలు ఇచ్చిన కంపెనీ వారు కర్రను తీసుకెళ్లి రూ.40వేలు ఇస్తారని తెలిపారు. ఇలా పంట దిగుబడి వచ్చినన్ని రోజులు కొనుగోలు చేస్తారని వివరించారు. రైతుకు ఉపాధి హామీ కార్డు ఉంటే మొక్కల సంరక్షణ, నాటడం, మట్టి పనులు చేసినందుకు కూలి డబ్బులు కూడా వస్తాయని తెలిపారు. గ్రామంలోని మహిళలు, రైతులు కంకవనం(వెదురు) పంటపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో వీఓఏ ప్రశాంతి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ఎట్టి రమ, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సెర్ప్ సీసీ నర్సింహారావు కంకవనం సాగుపై అవగాహన -
అధికారులను చూసుకుంటున్నా..
పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న సదరు డాన్ మండలాల వారీగా ఉన్న దళారులతో ప్రతీరోజు మాట్లాడుతూ.. ‘అధికారులందరినీ చూసుకుంటున్నా.. మీకేం ఇబ్బంది లేదు. లోకల్ పోలీసులు, నిఘా విభాగం, సివిల్ సప్లయీస్, రెవెన్యూ అధికారులందరికీ నెలవారి మామూళ్లు ఇస్తున్నా..’ అని బాహాటంగానే చెప్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను చెప్పిన చోటకే బియ్యాన్ని పంపాలని, ఇంకెక్కడ అమ్మకూడదని హుకుం జారీ చేసినట్లు సమాచారం. దళారుల వద్ద కేజీ బియ్యం రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్న సదరు డాన్ సుమారు రూ.30 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. -
సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
వెంకటాపురం(ఎం): విద్యుత్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్–2 సీఈ రాజ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని వెల్తుర్లపల్లి విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించి సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని శాలువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ చౌహాన్ మాట్లాడుతూ.. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను వినియోగదారులకు అందించాలన్నారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించాలని చెప్పారు. సమ్మర్ యాక్షన్లో భాగంగా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బందికి పలు సూచనలు అందించారు. అనంతరం వెల్తుర్లపల్లి సబ్స్టేషన్లో ఫెయిల్ అయిన పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను అమర్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఈ సదానందం, ములుగు ఏడీఈ ఆపరేషన్ వేణుగోపాల్, ఏడీఈ కన్స్ట్రక్షన్స్ సందీప్ పటేల్, ఏఈలు రమేశ్, బెనర్జీ, సబ్ ఇంజనీర్ సాంబరాజు పాల్గొన్నారు.రాజ్ చౌహాన్ -
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం. – 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్న మాటలివి..దేవాదుల మూడో దశకు భూసేకరణే అసలు సమస్య●● ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ప్రాజెక్టు ● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల పర్యటన ● హామీలు, ఆదేశాలు.. అయినా పూర్తికాని భూసేకరణ ● రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500కోట్లు.. ● పెరిగిన అంచనా వ్యయం -
నస్తూర్పల్లి అడవిలోకి పులి
కాటారం: మండలంలోని ప్రతాపగిరి పులివాగు సమీపంలో పాదముద్రల ఆధారంగా నస్తూర్పల్లి అడవి ప్రాంతంలోకి పులి తిరిగి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లి నుంచి ప్రతాపగిరి గొంతెమ్మగుట్ట సమీపంలోకి పులి వచ్చిందనే సమాచారంతో కాటారం డిప్యూటీ రేంజర్ సురేందర్నాయక్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పులివాగు వద్ద పులి పాదముద్రలు(ప్లగ్మార్క్స్) గుర్తించి నిర్ధారించారు. ఆదివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది మళ్లీ గాలింపు చర్యలు మొదలుపెట్టగా.. మర్రివాగు వైపుగా పులి వచ్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో పూర్తిగా ఆకురాలి ఉండటంతో పులి అడుగులు గుర్తించలేకపోయామని పులి నస్తూర్పల్లి అడవిలోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పులి జాడ తెలియక అటవీశాఖ అధికారులు అయోమయానికి గురవుతుండగా.. ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. పులి గాలింపు చర్యల్లో కాటారం డిప్యూటీ రేంజర్తో పాటు యామన్పల్లి డిప్యూటీ రేంజర్ శ్రీనివాస్, ఎఫ్బీఓలు మోయినోద్దిన్, మోనకౌసర్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడికి సాయం
కాళేశ్వరం: తమ ఉపాధ్యాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు రూ.లక్షన్నర ఆర్థికసాయం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 2003–2009 వరకు శ్రీసరస్వతి హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసిన కాళేశ్వరం గ్రామానికి చెందిన మానెం శ్రీనివాస్ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని అప్పటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రూ.లక్షన్నర ఆర్థికసాయం కాళేశ్వరం వచ్చి ఆదివారం అందజేశారు. ఉపాధ్యాయులు అయ్యంగార్ తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, విద్యార్థులు శ్రీధర్, కళావతి, మల్లేశ్వరి, సంతోష్, విజయ్, నరేందర్, శ్రీకాంత్ ఉన్నారు. -
విద్యార్థులతో పనులపై కలెక్టర్ సీరియస్
● ఇద్దరిపై చర్యలు కాటారం: మండలంలోని గంగారం మోడల్ స్కూల్లో విద్యార్థులతో పనులు చేయించిన ఘటనపై కలెక్టర్ రాహుల్ శర్మ సీరియస్ అయ్యారు. ఫిబ్రవరి 28న మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని పదో తరగతి విద్యార్థులు ఎత్తడం వివాదాస్పదంగా మారింది. మార్చి 1న పలు పత్రికల్లో ప్రచురితం కావడంతో కలెక్టర్ దృష్టికి వెళ్లింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ నాగరాజు విచారణ జరిపి నివేదిక అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మనోహర్ను సస్పెండ్ చేయడంతో పాటు ఔట్సోర్సింగ్ విధానంలో పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ కేక్యానాయక్ను విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ రాజేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్చరీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కాటారం: మండలకేంద్రానికి చెందిన రామిళ్ల రాజశేఖర్ కుమార్తె రామిళ్ల అనయ ఆర్చరీ విభాగంలో రాణిస్తుంది. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని కొల్లూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అనయ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 17న గుంటూరులో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో అనయ పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రామారావు, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పవన్ కళ్యాణ్ పాల్గొని మెడల్ అందజేశారు. జాతీయ స్థాయికి ఎంపికై న అనయను కోచ్ శ్రీనివాస్, అభిషేక్ అభినందించారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి భూపాలపల్లి అర్బన్: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్శర్మ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజా సేవకు అంకితమై ప్రజాస్వామ్య పరిపరక్షణకు విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రఘు, డీఎల్పీఓ వీరభద్రయ్య, గృహ నిర్మాణ శాఖ అధికారి రాయలింగు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాటారం: కాటారం–మంథని ప్రధాన రహదారిపై కాటారం శివారులో జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రమేశ్ కాటారం వచ్చి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కాటారం శివారు పెట్రోల్ పంప్ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనాన్ని మళ్లించే క్రమంలో ఎదురుగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొని కిందపడి తల, చేతులకు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. రమేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
రైస్ మిల్లులకే..!
భూపాలపల్లి: పేదల బియ్యం పక్కదారి పడుతుంది. రాష్ట్రంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కొందరు దళారులు రెండు నెలల క్రితం వరకు మహారాష్ట్రకు అక్రమంగా తరలించగా.. ఇప్పుడు ఏకంగా జిల్లాలోని రైస్మిల్లులకే పంపిస్తున్నారు. మిల్లర్లు అవే బియ్యాన్ని బస్తాలు మార్చి సీఎంఆర్ కింద సివిల్ సప్లై గోదాంలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దళారులకు ఒకరిద్దరు సివిల్ సప్లయీస్ అధికారులు అండగా నిలుస్తుండటంతో ఈ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. కేజీకి రూ.10నుంచి రూ.12కు కొనుగోలు.. జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 1,23,659 తెల్ల రేషన్కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీ నెల ఒక్కో వ్యక్తికి ఆరు కేజీల చొప్పున రేషన్ డీలర్ల ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తుంది. కొందరు దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మండలానికో దళారి ఉండగా, వారు బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ.10 నుంచి రూ.12 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారికి విక్రయిస్తున్నారు. అంతేకాక దళారులు నేరుగా రేషన్ డీలర్లతో డీల్ కుదుర్చుకొని కేజీకి రూ.10 చొప్పున భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం వరకు ఈ దళారులు రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రలోని ఓ రైస్మిల్లుకు తరలించగా, అక్కడ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో ఇప్పుడు జిల్లాలోని రైస్మిల్లులకే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మిల్లులో భారీగా పట్టివేత... రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు జనవరి 6న రేగొండ మండలం బాగిర్ధిపేట గ్రామంలోని దుర్గా భవాని రైస్మిల్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 453 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నప్పటికీ దందా మాత్రం ఆగడం లేదు. పలువురు రైస్ మిల్లర్లు అదే పనిగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ రీ సైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు జిల్లావ్యాప్తంగా వినిపిస్తున్నాయి. సమాచారం లేదు.. పీడీఎస్ బియ్యం మిల్లులకు తరలిస్తున్నట్లు ఇప్పటి వరకు ఫిర్యాదులు ఏమీ రాలేదు. మాకు సమాచారం కూడా లేదు. జిల్లాలోని రైస్ మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తాం. – శ్రీనాథ్, డీసీఎస్ఓఅర్ధరాత్రి మిల్లులకు రవాణా.. కూలీలు సేకరించిన, రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు కేజీకి రూ. 26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏసీ ట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి తిరిగి సివిల్ సప్లై గోడౌన్లకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లై శాఖలోని ఒకరిద్దరు అధికారులే ఈ దందాను ముందుండి నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ దందా రెండు నెలల క్రితం వరకు మహారాష్ట్రకు.. బస్తాలు మార్చి సివిల్ సప్లయీస్ గోదాంలకు తరలింపు సహకరిస్తున్న సివిల్ సప్లయీస్ అధికారులు..? -
ఇబ్బందులు లేకుండా ‘రంజాన్’ ఏర్పాట్లు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. నేటి(ఆదివారం) నుంచి ప్రారంభమైన రంజాన్ మాసం ఏర్పాట్లుపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలన్నారు. ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ మండలాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా రంజాన్ పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శైలజ, డీఎస్పీ సంపత్రావు, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్నాయక్, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. యూడీఐడీపై అవగాహన కల్పించాలి.. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంపై అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సూచించారు. శనివారం యూడీఐడీ, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు మహిళా సంఘాలు డీపీఆర్ అందజేసే అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్శర్మ జిల్లా అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులు యూడీఐడీ పోర్టల్ ద్వారా స్లాట్బుక్ చేసుకునేందుకు మీసేవా కేంద్రాల నిర్వాహకులు, డీఆర్డీఏ, సంక్షేమ శాఖల సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్ క్యాంప్లో దివ్యాంగులకు సర్టిఫికెట్ జారీ చేయుటకు కావాల్సిన సామగ్రి, టెక్నీషియన్స్, వైద్యుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఆర్డీఓ నరేష్ పాల్గొన్నారు. -
ట్రెజరీలో పైసా వసూల్..?
● ప్రైవేట్ వ్యక్తి ఫోన్కు డిజిటల్ చెల్లింపు కాళేశ్వరం: భూపాలపల్లి, కాటారం సబ్డివిజన్లో ప్రభుత్వ ఉద్యోగులు డీడీఓల ద్వారా ప్రతి నెల ట్రెజరీకి వేతన బిల్లులు సమర్పిస్తున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఐటీ రిటర్న్లు, పన్ను మినహాయింపు బిల్లులు వేతన బిల్లులతో జత చేయాల్సి ఉంది. దీంతో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం అక్రమమార్గంలో బిల్లులు చెల్లించడంతో వాటిని అదునుగా తీసుకున్న ట్రెజరీశాఖ ఉద్యోగులు పైసా వసూల్కు తెరలేపారని సమాచారం. కాటారం, భూపాలపల్లిలో ట్రెజరీ ఉద్యోగులు అందినకాడికి తప్పులు ఎత్తిచూపి డబ్బులు లాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం 28 ప్రభుత్వ పాఠశాలల్లోని స్కూల్కాంప్లెక్సులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు నాలుగువేల మంది వరకు ఉన్నారు. ఇందులో ప్రతీ స్కూల్ కాంప్లెక్సుకు రూ.20వేల నుంచి 30వేల వరకు ఐటీ రిటర్న్లు, పన్ను మినహాయింపుల కోసం డబ్బులు చేతులు మారాయని తెలిసింది. వీరిపైన ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో భూపాలపల్లి, కాటారం డివిజన్లలో పైసావసూల్ అంతా నగదు రూపంలో కాకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా యథేచ్ఛగా సాగినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల తప్పులు కూడా ఉండడంతో ట్రెజరీ ఉద్యోగులపై ఫిర్యాదు చేయడానికి జంకుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహరంతో ట్రెజరీ శాఖ ఉద్యోగులు పదిరోజుల్లో రూ.లక్షల్లో అక్రమమార్గంలో సంపాదించారని కోడై కూస్తుంది. డిజిటల్ చెల్లింపులకు ఓ ప్రైవేట్ వ్యక్తిని కూడా ఏర్పాటు చేసుకొని వారి ఫోన్కు డబ్బులు పంపితేనే ఫైల్ కదులుతుందని ఓ ప్రభుత్వ ఉద్యోగి వాపోయారు. వీరిపై అధికారులు అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. -
రామప్పను దర్శించిన కేరళీయులు
వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప ఆలయాన్ని కేరళకు చెందిన 27 మంది శనివారం సందర్శించారు. అంతర్రాష్ట్ర యువజన సమ్మేళన కార్యక్రమంలో భాగంగా కేరళకు చెందిన యువకులు రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ విజయ్కుమార్ వివరించారు. గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును సందర్శించి వేలాడే వంతెన, ప్రకృతి అందాలను తిలకించినట్లు నెహ్రూ యువకేంద్రం సూపరింటెండెంట్ బానోత్ దేవీలాల్ తెలిపారు. కార్యక్రమంలో భాను, సురేశ్, భిక్షపతి పాల్గొన్నారు. రామప్పను సందర్శించిన విదేశీయుడు.. రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన మార్క్ మెక్ లహ్ సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. నందీశ్వరుడి అందాలను సెల్ఫోన్లో బంధించుకున్నారు. రామప్పను సందర్శించిన పర్యాటకులు అమెరికన్తో ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఉదయాన్నే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలలో హేమాచల క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంతంలోని చింతామని జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. సంతాన ప్రాప్తికి వచ్చిన దంపతులకు ఆలయ పూజారులు నాభిచందన ప్రసాదం అందజేశారు. -
85శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో ఫిబ్రవరి మాసంలో 85శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాకు గడిచిన మాసంలో 4.55లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 3.90లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 85శాతంలో నిలిచినట్లు తెలిపారు. వెలికితీసి బొగ్గులో 3.27లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు చెప్పారు. మార్చి మాసానికి 6.39లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించి ఉత్పత్తి పెంచే విధంగా కార్మికులు కృషి చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంజూర్నగర్లోని ఇల్లంద క్లబ్హౌజ్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
డిజిటల్ క్రాప్ సర్వే
పకడ్బందీగా పంటల లెక్క..జిల్లా వివరాలు..సర్వే ఇలా.. సర్వే నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించింది. ఏఈఓలు పంటల సాగు విస్తీర్ణం, పంట రకం అంశాలను అందులో నమోదు చేస్తున్నారు. సర్వే నంబర్ ఎంట్రీ చేయగానే ఆ పరిధిలో ఉన్న రైతుల వివరాలు కనిపిస్తాయి. కావాల్సిన రైతు పేరు ఎంచుకోగానే వారి పేరిట ఉన్న భూమి వివరాలు దర్శనమిస్తాయి. అందులో రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడో నమోదు చేయాలి. సాగు ఫొటోను అప్లోడ్ చేయాలి. ఒక వేళ సాగులో లేని భూమి ఉంటే వాటిని నాన్క్రాప్ కింద నమోదు చేయాల్సి ఉంటుంది. ● క్షేత్రస్థాయిలో వివరాలు నమోదుచేస్తున్న ఏఈఓలు ● పంటకాలం వరకు గడువు ● నివేదిక ఆధారంగా పంట దిగుబడి కొనుగోళ్లుమండలాలు 12డిజిటల్ క్రాప్ సర్వే చేయాల్సిన భూమి 88,000ఎకరాలువ్యవసాయ శాఖ సబ్ డివిజన్లు – 2 (భూపాలపల్లి, మహదేవపూర్)కాటారం: డిజిటల్ క్రాప్ సర్వేతో పంటల లెక్క ఇక పక్కాగా ఉండనుంది. ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది, ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా పంటల సాగు వివరాలు పక్కాగా తేలనున్నాయి. వీటి ఆధారంగా రైతుల పంట దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పంటకాలం పూర్తయ్యే వరకు సర్వే ముగించాల్సి ఉంటుంది.సర్వే పూర్తయింది 33,000ఎకరాలు వ్యవసాయశాఖ క్లస్టర్లు 45రైతులు 1,33,412ఏఈఓలు 45 మందిజిల్లాలో సాగు భూమి 2,43,112ఎకరాలుప్రతి సర్వే నంబర్కు వెళ్లాల్సిందే.. వ్యవసాయ శాఖ సమకూర్చిన ట్యాబ్స్తో ఏఈఓలు సర్వే చేస్తున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లలో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ యాప్లోనే క్లస్టర్ పరిధిలోని ఏయే సర్వే నంబర్లలో సర్వే చేయాలనే వివరాలు ఉన్నాయి. ప్రతీ సర్వే నంబర్తో పాటు సబ్ సర్వే నంబర్ వద్దకు ఏఈఓలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ సర్వే నంబర్లో 25 మీటర్లకు మించి దూరం ఉంటే వివరాలు చూపించడం లేదు. దీంతో ఏ ఒక్క సర్వే నంబర్ సమాచారం లేకున్నా అప్లోడ్ కాదు. ప్రతీ సర్వే నంబర్ వద్దకు ఏఈఓలు వెళ్తున్నారు. పలుచోట్ల ఇబ్బందులు.. సర్వేలో భాగంగా ఏఈఓలు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఓ పక్క పెరుగుతున్నా ఎండలు ముప్పుతిప్పలు పెడుతుంటే కొన్ని చోట్ల ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, యాప్ ఓపెన్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల సర్వర్ నెమ్మదించడం, మరికొన్ని చోట్ల రైతుల చేలల్లో లొకేషన్ తప్పుగా చూపించడం, సర్వేనంబర్లు కనిపించకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఏఈఓలు చెబుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏఈఓలు క్రాప్ సర్వేను నిర్వహిస్తున్నారు. పంటల నమోదు ఆధారంగా కొనుగోళ్లు.. సర్వేతో రైతులు సాగుచేసే పంటల వివరాలు పక్కాగా తేలనున్నాయి. తదనుగుణంగా వచ్చే దిగుబడిని రైతులు మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థకు మద్దతు ధరతో విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్ క్రాప్ సర్వే రైతులకు ఎంతో మేలు చేకూర్చనుంది. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు బీమా పొందడానికి, పంట నష్టం అంచనా వేయడానికి దోహదపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్కు తీసుకువెళ్లి మద్దతు ధర పొందడానికి ఉపయోగపడుతుంది. వానాకాలంలో డిజిటల్ క్రాప్ సర్వే చేయించుకోకపోవడంతో పత్తి అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.రైతులు సహకరించాలి జిల్లావ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏఈఓలు రైతుల చేలు, పంట పొలాల వద్దకు వెళ్లి సాగు వివరాలు అక్కడే నమోదు చేస్తున్నారు. క్రాప్ సర్వే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి, పంటల బీమా, పరిహారం పొందడానికి సహాయపడుతుంది. రైతులు సర్వేకు వచ్చే ఏఈఓలకు సహకరించాలి. – విజయభాస్కర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి● -
ప్రజల వద్దకే తపాలా సేవలు
రేగొండ: ప్రజల వద్దకు పోస్టాఫీస్ సేవల కార్యక్రమంలో భాగంగా పరకాల ఏఎస్పీ అనంత్రామ్ నాయక్ శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి, చిన్నకోడేపాక, చెన్నాపూర్ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసరా పెన్షన్, ఉపాధిహామీ నగదును లబ్ధిదారులకు అందజేశారు. నిస్సహాయక పెన్షన్దారులు కొండెటి సూరమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టాఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ.755లకు రూ.15 లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని ప్రజలు ఉపఝెగించుకోవాలని అన్నారు. తపాలాశాఖ మినీ ఏటీఎం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట తపాలా సిబ్బంది సంతోష్, కృష్ణ ఉన్నారు. -
18 రోజులుగా ఇక్కడే తిష్ట
కాటారం: పులి నివసించడానికి అనువైన ప్రదేశం కాదు..దట్టమైన అటవీ ప్రాంతం అసలే కాదు.. కానీ ఎక్కడి నుంచో వచ్చిన పెద్దపులి ఇక్కడే 18 రోజులుగా తిష్టవేసింది. ఎటు వెళ్లాలో దారి దొరకకనో లేక స్థిర ఆవాసం కోసం ప్రయత్నిస్తుందో ఏమో కానీ పులి కాటారం, మహదేవపూర్ అడవి ప్రాంతంలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సంచరిస్తుంది. రెండు రోజులకు ఒక చోట ఆనవాళ్లు వదులుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఫిబ్రవరి 10న మహదేవపూర్ రేంజ్ పరిధిలోని కాటారం మండలం నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో ఓ రైతుకు పులి కనిపించడంతో పులి సంచారం ప్రచారంలోకి వచ్చింది. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు (ప్లగ్మార్క్స్) గుర్తించి సంచారంపై ఆరా తీశారు. మరుసటి రోజు కాటారం రేంజ్ పరిధిలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో పులి తిరిగినట్లు అధికారులకు ఆనవాళ్లు లభించాయి. అనంతరం మహదేవపూర్ మండలం కుదురుపల్లి, పల్గుల, బీరాసాగర్, గుండ్రాత్పల్లి అటవీ ప్రాంతంలో పులి కనిపించినట్లు పలువురు తెలపడంతో అధికారులు పాదముద్రలు గుర్తించి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటుచేసి పులి కదలికలపై నిఘా పెట్టారు. కానీ ఎక్కడ కూడా పులి కెమెరాలకు చిక్కిన దాఖలాలు లేవు. మధ్యలో రెండు, మూడు రోజులు జాడా లేకుండా పోయిన పులి రెండు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లిలో దర్శనమిచ్చింది. అక్కడి నుంచి ప్రతాపగిరి అడవుల్లోకి పులి చేరినట్లు శుక్రవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు శనివారం ప్రతాపగిరి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఓ వాగు వద్ద నీరు తాగినట్లు పాదముద్రల ఆనవాళ్లు సేకరించారు. నస్తూర్పల్లి అడవి వైపుగా వచ్చినట్లు కొంత దూరం పాదముద్రలు ఉన్నాయని కానీ ఎటు వెళ్లిందనేది మాత్రం స్పష్టత లేదని అటవీశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక్కడిక్కడే.. గతంలో రెండు మార్లు పులి కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతంలో సంచరించినప్పటికీ ఎప్పుడు కూడా మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉన్న దాఖలాలు లేవు. కానీ 18 రోజులుగా పులి ఇక్కడిక్కడే తచ్చాడుతుండటంతో దారి దొరకక ఎటు వెళ్లలేక ఉండిపోతుందో లేక ఈ అటవీ ప్రాంతంలో శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువైన స్థలం కోసం చూస్తుందో అంతుచిక్కకుండా పోయింది. ఒకటి రెండుమార్లు పులి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గోదావరి నదిని దాటి చెన్నూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికి ప్రయత్నించినట్లు కొన్ని రోజుల క్రితం అటవీశాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. కాటా రం మండలం గుండ్రాత్పల్లి సమీపంలోని గోదావరి నది దాటడానికి వచ్చిన పులి కుక్కలు వెంటపడటంతో తిరిగి మహదేవపూర్ అడవిలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అటు నుంచి మళ్లిన పులి కాటారం, మహదేవపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో కలియ తిరుగుతుంది. పులి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఏ వైపుగా వస్తుందో తెలియక అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులికి సంబంధించిన కదలికలను పూర్తి స్థాయిలో కనుక్కోవడం అటవీశాఖ అధికారులకు క్లిష్టతరంగా మారింది. కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం దారి దొరకకనా..ఆవాసం కోసమా.. -
ఆన్లైన్ మోసాలపై అవగాహన
భూపాలపల్లి అర్బన్: ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల నివారణపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి బ్యాంక్ అధికారులు జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణబాబు ప్రారంభించారు. బ్యాంక్ అధికారులు, రిస్సోర్స్ పర్సన్స్ సాయిచరణ్,, రాకేష్, అనిల్, శ్రీకాంత్ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై వివరించారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్లో కేసులను ఎలా ఫైల్ చేయాలి, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల పట్ల తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జిలు జయరాంరెడ్డి, రామచంద్రరావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ తప్పనిసరి
భూపాలపల్లి రూరల్: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన గుండు నాగభూషణం–పద్మ దంపతులను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. గృహోపకరణాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. పోలీసులంటేనే ఎన్నో రకాల త్యాగాలతో పాటు, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తారన్నారు. సుమారు 40 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాగభూషణం అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చె ప్పారు. ఏదేని సమస్యలు ఉంటే రిటైర్డ్ ఉద్యోగులు తనను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవా లని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఎస్సైలు నగేష్, కిరణ్, శ్రీకాంత్, రత్నం, పోలీసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ఖరే -
పంచాయతీలే ముందంజ
పల్లెల్లో 74.62శాతం ఆస్తిపన్ను వసూలుభూపాలపల్లి: ఆస్తి పన్నుల వసూలులో గ్రామ పంచాయతీలే ముందున్నాయి. జిల్లాలోని ఏకై క భూపాలపల్లి మున్సిపాలిటీ లక్ష్యం చేరుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 30 రోజులు మాత్రమే గడువు ఉండగా పల్లెలు వందశాతానికి చేరువ కానుండగా మున్సిపాలిటీలో మాత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. పల్లెలే బెస్ట్.. జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి నుంచి రూ. 4కోట్ల 4లక్షల 52వేల 378 ఆస్తి పన్ను రావాల్సి ఉండగా నిన్నటి(శుక్రవారం) వరకు 74.62 శాతం వసూలు అయ్యాయి. మిగిలిన బకాయిలను ఈ నెల చివరిలోపు వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా కాటారం మండలంలో 91.36 శాతం, మొగుళ్లపల్లిలో 81.64 శాతం వసూలు అయ్యాయి. టేకుమట్ల 64.98 శాతం వసూలు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఈ నెల చివరిలోపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 90 శాతానికి పైగా పన్ను వసూలు జరిగే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీ లక్ష్యం చేరేనా..? భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో నివాస, వ్యాపార, నివాస, వ్యాపార భవనాలు 12,223 ఉన్నాయి. వాటి నుంచి రూ. 5.75 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా.. నిన్నటి వరకు 60.84 శాతం రూ.3.50 కోట్లు వసూలు అయ్యాయి. రూ.2.25 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. బకాయిల వసూలు కోసం మున్సిపాలిటీ అధికారులు నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఐదుగురు అధి కారులను నియమించారు. వీరు భారీ మొత్తంలో పన్ను బకాయి ఉన్న వారి భవనాల వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. అ యినప్పటికీ పన్నులు చెల్లించని పక్షంలో ఆస్తులను సైతం జప్తు చేస్తున్నారు. అయినప్పటికీ వసూలు అంతంత మాత్రంగానే అవుతోంది. మున్సిపాలిటీలో 60.84 శాతమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంతే మిగిలింది 30 రోజులే -
ఫోన్పేతో బురిడీ..
కాటారం: డిజిటల్ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక్కచోట కొందరు ప్రజలను, వ్యాపారులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా శుక్రవారం ఓ దుకాణం యజమానిని మోసంచేసి చివరకు దుండగుడు దొరికిపోయారు. బాధిత దుకాణం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలకేంద్రంలోని గారెపల్లిలో ముస్కమల్ల సత్యం ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఓ యువకుడు దుకాణానికి వచ్చి పలు రకాల సామగ్రి కొనుగోలు చేశాడు. అనుమానం రాకుండా సామగ్రికి సంబంధించిన ధరపై దుకాణం యజమానితో బేరాలు సైతం చేశాడు. సదరు వ్యక్తి కొనుగోలు చేసిన సామగ్రికి సంబంధించి రూ.4వేలు అయింది. ఫోన్ పే చేస్తానని చెప్పడంతో దుకాణం యజమాని సత్యం స్కానర్ చూపించాడు. ఫేక్ ఫోన్ పే ద్వారా రూ.4వేలు చెల్లించిన దుండగుడు పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించి వెళ్లిపోయాడు. కొంత సమయం వరకు కూడా డబ్బులు జమకాకపోవడంతో అనుమానం వచ్చిన దుకాణం యజమాని అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బుల చెల్లింపు జరగలేదు. అప్రమత్తమైన యజమాని దుండగుడిని వెంబడించాడు. చివరకు భూపాలపల్లిలో పట్టుకొని ప్రశ్నించగా ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లింపు చేసినట్లు ఒప్పుకున్నాడు. దుండగుడిది గొల్లబుద్ధారం సమీపం నర్సింగపురం అని తెలిసింది. మోసానికి పాల్పడిన యువకుడిని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు దుకాణం యజమాని సత్యం తెలిపారు.