Jayashankar District Latest News
-
నువ్వక్కడ.. నేనిక్కడ
● భూపాలపల్లిలో మగపులి.. మంచిర్యాలలో ఆడపులి సంచారం కాళేశ్వరం :మహదేవపూర్ మండలం గోదావరి పరివాహాక ప్రాంతం అడవుల్లో మగపులి సంచారం చేస్తుండగా..గోదావరి అవతలి ఒడ్డుకు మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ పరిసరాల్లో ఆడపులి కలియ తిరుగుతోంది. 12 రోజులుగా కాటారం, మహదేవపూర్ అడవుల్లో తచ్చాడిన పెద్దపులి వచ్చిన దారిగుండానే శుక్రవారం నస్తూర్పల్లి అడవి బాటపట్టినట్లు అటవీ శాఖ అధికారులు పాదముద్రలను గుర్తించారు. ఆడపులి మాత్రం మగపులి రాక కోసం దాంపూర్ అడవుల్లోనే మూడ్రోజులుగా తలదాచుకుందని తెలిసింది. గురువారం అక్కడే ఓ గేదెను చంపినట్లు అక్కడి అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఈ రెండు జతకట్టడానికే (మేటింగ్) పన్నెండు రోజులుగా రోజుకో చోట తిరుగుతున్నాయి. 15–20 కిలోమీటర్ల మేర మగపులి జాడను అటవీశాఖ అధికారులు నాలుగు బృందాలతో అన్వేషిస్తున్నారు. అక్కడక్కడా ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినా చిక్కకుండా, అధికారుల కన్నుల్లో పడకుండా ఏమార్చి తిరుగుతోంది. ఎక్కడా ఎలాంటి దాడులు కూడా చేయకుండా తెలివిగా తప్పించుకుంటోంది. మగ, ఆడపులి జతకట్టే (మేటింగ్) సమయం కావడంతో వాటి వాసన పసిగడుతూ కచ్చితంగా గోదావరి దాటే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు పులులు దరి చేరాలంటే వాటి మధ్య 30 కిలోమీటర్ల దూరమే ఉంది. గోదావరి దాటి కలిసిపోయి పులుల ప్రేమ ఫలిస్తుందా! లేదా మగపులి వచ్చిన దారిన ఇంద్రావతి వైపు మరలిపోయి విఫలం అవుతుందా తెలియాల్సి ఉంది.నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం భూపాలపల్లి రూరల్: నేడు (శనివారం) పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో కొత్త ట్రాన్స్ఫర్మర్ పనులు చేస్తున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏఈ విశ్వాస్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6 ఇంక్లైన్ రోడ్డు, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. రేపు గురుకుల ప్రవేశ పరీక్ష భూపాలపల్లి అర్బన్: ఈనెల 23న జిల్లాలో ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల జిల్లా కోఆర్డినేటర్ గోల్కొండ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5నుంచి 8వ తరగతులకు ప్రవేశ పరీక్ష, 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, లింగాల క్రాస్, గాంధీనగర్, కాటారం గురుకుల పాఠశాలలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2,360 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. -
కలెక్టర్ హాస్టల్ నిద్ర
● విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాహుల్శర్మ శుక్రవారం రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రించారు. అంతకుముందు ఆయన భోజనశాల, ఆహార పదార్థాల నిల్వలు, వంటకాలను పరిశీలించారు. సమస్యలను ప్రిన్సిపాల్ శారదను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సూచించారు. మీకు మీరే పోటీపడాలని చెప్పారు. పరీక్షలు అంటే భయం లేకుండా మానసికంగా సిద్ధం కావాలని సూచించారు. అనంతరం టెన్త్ విద్యార్థుల స్టడీ అవర్లో పాల్గొని పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి సునీత, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ హుస్సేన్, ఆర్ఐ సురేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్ ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్కు మరో ఐదు రోజులే గడువు ఉంది. ఈనేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నా రు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్ట మైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖ మ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 6,509 పురుషులు, 4,288 సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పా ట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నిరంతరాయంగా పని చేసేలా విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. అలాగే.. 27న జరిగే పోలింగ్ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లా కేంద్రాల్లో డిస్టిబ్య్రూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులపై కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటల కు పోలింగ్ వివరాలను ప్రకటించేలా ఎన్నికల అధి కారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు. వేడెక్కిన ప్రచారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), శ్రీపాల్రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ – టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కై లాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఐదు రోజులే గడువుండడంతో అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలిలా.. జిల్లా మండలాలు పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం కేంద్రాలుహనుమకొండ 11 15 2884 2214 5098 వరంగల్ 13 13 1381 844 2225 జనగామ 12 12 556 365 921 మహబూబాబాద్ 18 16 1083 535 1618 భూపాలపల్లి 07 07 211 112 323 ములుగు 09 09 394 218 612 మొత్తం 70 72 6,509 4,288 10,797ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్రెడ్డి ఆదేశం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఈనెల 27న పోలింగ్.. వచ్చే నెల 3న లెక్కింపు ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు -
సాగునీరు అందించేందుకు చర్యలు
భూపాలపల్లి: రబీ పంటకు అవసరమైన నీటి సరఫరా కోసం తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ పంటకు రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటలకు సమృద్ధిగా సమయానికి సాగు నీరు అందించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నీటి పరిస్థితి, కాలువల ద్వారా నీటి సరఫరా, భూగర్భ జలాల స్థితిగతులు మొదలైన అంశాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటూ పంటలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో గత రబీ సీజన్లో 86వేల ఎకరాల్లో పంట సాగు జరిగిందని, ఈ రబీ సీజన్లో 82 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం నీరందక పంటలు ఎండిపోయిన ప్రాంతాలను, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యాన్మయ ఏర్పాట్లుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే యూరియా కొరత లేకుండా చూడాలని, టాస్క్ఫోర్స్ టీంలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తూ స్టాక్ వివరాలు పరిశీలించాలని ఆదేశించారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే పీడీ యాక్టు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఏఓ విజయ్భాస్కర్, ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలకు పకడ్భందీ ఏర్పాట్లు ఈ నెల 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయం నుంచి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పోలింగ్ స్లిప్పుల పంపిణీ 90 శాతం పూర్తయిందన్నారు. శనివారం వరకు మిగిలిన 10శాతం పూర్తి చేస్తామని తెలిపారు. భూపాలపల్లి డివిజన్లో 7, కాటారం డివిజన్లో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 76 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
కోడ్ అమలేది..!
తిరుమలగిరి గ్రామ పంచాయతీ పరిధిలో..మండల కేంద్రంలో తొలగించని ఫ్లెక్సీ ముసుగు వేయకుండా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహంవరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి 20 రోజులైనా రేగొండ మండలంలో మాత్రం అమలు కావడం లేదు. మండలకేంద్రంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించలేదు. ఇందిరా గాంధీ విగ్రహానికి ముసుగు వేయలేదు. తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధిలో శిలాఫలకానికి ముసుగు వేయకుండానే వదిలేశారు. – రేగొండ -
పన్ను చెల్లింపు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వార్షిక ఆదాయంలో ఏడాదికి రూ.5లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. నూతనంగా ఉద్యోగంలో చేరే ఉద్యోగి నెలసరి రూ.31,400 వేతనంతో ప్రారంభం కాగా జిల్లాలో రూ. 1.24లక్షల వేతనం తీసుకునే ఉద్యోగులు సైతం ఉన్నారు. ఇన్సూరెన్స్లు, మెడికల్ బిల్లులు, స్కూల్ ఫీజులు, సేవింగ్స్ రశీదులతో పన్ను మినహాయింపు పొందవచ్చు. దానితో పాటు హౌసింగ్ లోన్ రూ.3.50లక్షల వరకు చూపించుకోవచ్చు, పన్ను పరిధి దాటిన వారికి రూ.5లక్షలలోపు 5శాతం, రూ.5లక్షలు దాటితే రూ.20శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వేతనం అఽధికంగా ఉన్న ఉద్యోగికి రూ.50వేల నుంచి రూ.లక్షకుపైగా ఐటీ పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐటీని రూ.12లక్షలకు పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. -
ఐటీ ఎగవేత!
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025అక్రమార్జనకు అవకాశం.. వేతన స్థిరీకరణ సందర్భంలో, ఇప్పుడు పన్ను మినహాయింపు బిల్లుల సమర్పణకు డీడీఓలకు, ట్రెజరీ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆయా బిల్లుల సమర్పణకు వెళ్లిన డీడీఓల నుంచి ట్రెజరీ ఉద్యోగులు కొర్రీలు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సాకుతో అసలు విషయం తెలిసిన డీడీఓలు సైతం ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి అందినంత దండుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. నకిలీ బిల్లులు.. ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ ప న్ను నుంచి మినహాయింపు పొందే ందుకు అనేక రకాల నకిలీ బిల్లులు సమర్పిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చెల్లించే వారి పిల్లలు ఫీజులకు అదనంగా రెండింతలు పెంచి, ఎల్ఐసీ, ఇతర ఇన్సూరెన్స్ పాలసీలు లేకున్నా నకిలీ రశీదులు పెట్టినట్లు సమాచారం. లోన్లు లేకున్నా తీసుకున్నట్లు రశీదులు పెడుతున్నారని తెలుస్తోంది. -
ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఏరియాలో పర్యటించారు. అధికారులతో జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి శాతం ఆశించిన స్థాయిలో లేదన్నారు. ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్మికుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. రక్షణ నియమాలు పాటిస్తూ సంస్థ పురోగతికి కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సింగరేణి జనరల్ రాజేశ్వర్రెడ్డి, అధికారులు కవీంద్ర, వెంకటరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటరమణ, భిక్షమయ్య, మారుతి పాల్గొన్నారు. -
వరుస చోరీలతో జనం బెంబేలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం రాత్రి మళ్లీ చోరీ జరిగింది. కాళేశ్వరం గ్రామానికి చెందిన తాజ్బాబా కూల్డ్రింక్స్ దుకాణం తాళం పగులగొట్టి రూ.6వేల వరకు నగదు దొంగిలించారు. ఇదే రాత్రి మజీద్పల్లిలోని కూరపాటి మహేష్, ముంగి రాజయ్య కిరాణం, ముంగి మహేష్ ఇంటి తాళం పగులగొట్టినా నగదు, వస్తువులు పోలేదని బాధితులు పేర్కొన్నారు. ఈనెల 6న కాళేశ్వరానికి చెందిన ముంగి రాజేష్ ఇంటి తాళం గడ్డపారతో పగులగొట్టి రూ.10వేలు అపహరించారు. అదే రాత్రి చిన్న అడప సమ్మయ్య ఇంటితాళం కూడా పగులగొట్టగా అక్కడ ఎలాంటివీ పోలేదు. వరుసగా ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలు జరుగుతున్నా పోలీసులు దొంగలను గుర్తించడం లేదు. దీంతో జనం తాళం వేసి ఊరికి వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు. రాత్రిపూట భయబ్రాంతులకు గురవుతున్నారు. కాళేశ్వరంలో ప్రధాన రహదారి, పలు వార్డుల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీసులు కూడా చోరీలపై దృష్టిసారించడం లే దు. ఈ విషయమై ఎస్సై తమాషారెడ్డిని సంప్రదించగా ఒక అనుమానితుడిని కనిపెట్టినట్లు తెలి పారు. పట్టుకొని వివరాలు వెల్లడిస్తామన్నారు. పనిచేయని సీసీ కెమెరాలు దృష్టిసారించని పోలీసులు -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
భూపాలపల్లి రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కృషిచేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. జిల్లాకేంద్రంలోని సమాఖ్య భవనంలో డీఆర్డీఓ నరేష్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సమాఖ్య సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో రుణాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాలు, మహిళా సభ్యులు అందరూ ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, వీఓలు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
తప్పించుకునేందుకు తప్పుడు పత్రాలు
● పెరిగిన వేతనాలతో ఉద్యోగులపై భారీగా ఆదాయ పన్ను భారం భూపాలపల్లి అర్బన్: ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు వేతన జీవులను ఆదాయపన్ను(ఐటీ) కలవరపెడుతోంది. ఈ నెలలో చేతికి ఏమైనా జీతం వస్తుందా? లేక పన్ను చెల్లింపులకు సరిపోతుందా? అని లెక్కలు వేసుకుంటారు. గత పీఆర్సీ అమలుతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. ఫలితంగా ఆఫీసు సబార్డినేటు మొదలుకొని ప్రతి ఉద్యోగి పన్ను పరిధిలోకి వచ్చారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా నిబంధనలను సాకుగా చూపి పన్ను తప్పించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ● నకిలీ బిల్లులు సమర్పిస్తున్నట్లు ప్రచారం -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. రాత్రిపూట కాస్త చలిగా ఉంటుంది.పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు ● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి భూపాలపల్లి అర్బన్: ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై గురువారం తన చాంబర్లో ఇంటర్మీడియట్ అధికారి, పోలీస్, ఆర్టీసీ, విద్యుత్, వైద్యఆరోగ్యశాఖ, మున్సిపల్, పోస్టల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి, రెండో సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రఽథమ సంవత్సరంలో 1,820 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,795 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకటి, సిట్టింగ్ స్క్వాడ్ 2, జిల్లా పరీక్షల కమిటీ ఒకటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్నాయక్, ఆర్టీసీ డీఎం ఇందు, డీఎస్పీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. జిల్లాస్థాయి క్రీడాపోటీలు భూపాలపల్లి అర్బన్: ఈ నెల 24, 25వ తేదీల్లో జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు నెహ్రు యువకేంద్రం జిల్లా అధికారి చింతల అన్వేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాలీబాల్, రన్నింగ్, షటిల్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 18 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు యువతీ, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వివరాలకు 96408 81670, 76590 71405 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
మండలాల వారీగా సాగు వివరాలు (ఎకరాల్లో..)
రేగొండ 3,652 మహదేవపూర్ 3,597 టేకుమట్ల 1,103 భూపాలపల్లి2,543 చిట్యాల 2,325 మొత్తం 19,637మొగుళ్లపల్లి 1,804 మల్హర్ 1,516 గణపురం 1,291 కాటారం 45 -
నాణ్యమైన విద్యుత్ సరఫరా
భూపాలపల్లి రూరల్: వేసవి కాలం సమీస్తున్న దృష్ట్యా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం ముందస్తు కార్యచరణ చర్యలు చేపట్టామని ఎస్ఈ మల్చూరు నాయక్ తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం ట్రాన్స్ఫర్మర్ను ఏర్పాటు చేసిన సందర్భంగా ఎస్ఈ మాట్లాడారు. వేసవిలో ఎటువంటి అంతరాలు లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టంచేశారు. ఎస్ఈ వెంట డీఈ పాపిరెడ్డి, డివిజన్ అధికారులు ఉన్నారు. కలాం స్ఫూర్తి యాత్ర భూపాలపల్లి అర్బన్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో నిర్వహిసుత్న్న కలాం స్ఫూర్తి యాత్ర గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి హాజరై మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు అవసరమని తెలిపారు. ఈ సందర్శనలో బృందం సభ్యులు విద్యార్థులతో ఆసక్తికరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు మధులాష్బాబు, దిలీప్కుమార్, సాయి సుబ్రమణ్యం, రోహిత్ జలగాం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పన్నుల చెల్లింపునకు సహకరించాలి భూపాలపల్లి అర్బన్: ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని 8, 10వ వార్డులో గురువారం కమిషనర్ పర్యటించారు. కాలనీ శానిటేషన్ పనులు పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ, రోడ్లు శుభ్రం ఉంచటం, డ్రెయినేజీల శుభ్రత గురించి కాలనీవాసులతో మాట్లాడారు. కాలనీల్లో సమస్యలు పేరుకుపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. పన్నులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ దేవేందర్, వార్డు సిబ్బంది పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయంలో ఈ నెల 26నుంచి జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పోలీస్శాఖ తరఫున ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ గురువారం పరిశీలించారు. ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు, స్వామివారి కల్యాణం నిర్వహించే ప్రాంతం, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను చూశారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు శాఖ తరఫున పర్యవేక్షణ చేపడతామని వివరించారు. రామప్ప చెరువులో బోటింగ్, స్నానాలకు అనుమతి లేదన్నారు. 26నుంచి 28వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు ఇద్దరు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 12మంది ఎస్సైలతో కలిపి 300మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ వెంట సీఐ శంకర్, ఎస్సై జక్కుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి గోవిందరావుపేట: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బాలల పరిరక్షణ విభాగం జిల్లా లీగల్ అధికారి డి.సంజీవ అన్నారు. మండల పరిధిలోని చల్వాయి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం యువతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక న్యాయంతో పాటు చట్టాలపై వివరించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయం గురించి అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదువుకుని ఉన్నత స్థానంలోకి చేరుకోవాలన్నారు. -
డిజిటల్ అరెస్టులపై అవగాహన
ములుగు: సైబర్ నేరాల్లో భాగంగా జరుగుతున్న డిజిటల్ అరెస్టులపై జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ఎదుట గురువారం సేయింట్ ఆంథోనీస్ విద్యార్థినులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఖాతాదారులకు అవగాహన కల్పించారు. పరిచయంలేని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్కాల్స్లను రిసీవ్ చేసుకోవద్దన్నారు. బ్యాంకు అకౌంట్, ఓటీపీ వివరాలను వెల్లడించకూడదని ఖాతాదారులకు ప్లకార్డుల ద్వారా వివరించారు. బ్యాంకు ఖాతాలు, సైబర్ నేరాలపై ఎలాంటి ఇబ్బందులు వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాధు చేయాలని స్కీట్ రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యేరవ కవితరెడ్డి, హెచ్ఎం కందాల రమేష్, డైరెక్టర్ వెంకటప్పారెడ్డి, బొల్లం రవి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై దాడులు సరికాదు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ గ్రామంలో రైతులపై ఫారెస్ట్ అధికారులు చేసిన దాడులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఖండించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. రైతులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు. దోషులను శిక్షించాలి.. 15వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యవెనుక దోషులు ఎంతటివారైనా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఈ దాడిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి త్వరగా దోషులను గుర్తించి శిక్షపడేలా చూడాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవడానికి అనేకమార్గాలు ఉన్నాయని.. ఇలా హత్యలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలన్నారు. విచారణలో పూర్తి వాస్తవాలు బయటకు రాకపోతే ప్రభుత్వం నుంచి సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, అధికార ప్రతినిధి గాజర్ల అశోక్,, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, నాయకులు పిప్పాల రాజేందర్, జోగుల సమ్మయ్య, కప్పల రాజేష్ నాయకులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఆడతోడు కోసం..
ఆడపులి వాసనతో.. పదకొండు రోజులుగా మూడున్నరేళ్ల మగ పెద్దపులి ఆడపులి వాసనను పసిగడుతూ ప్రయాణం చేస్తుందని తెలిసింది. గోదావరి అవుతలి వైపున వేమనపల్లి మండలం నీల్వాయి అడవులకు ఓ ఆడపులి చేరి సంచరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇక్కడి మగపులి ఆడతోడు (మేటింగ్)కోసం అడవి అంతా గస్తీ చేస్తుంది. గోదావరి సరిహాద్దుల వరకు వెళ్లి తిరిగి వస్తుందని అటవీశాఖ అధికారుల ద్వారా తెలిసింది. కొన్ని కిలోమీటర్ల మేర ఉన్న పులులు వాటి వాసనను పసిగట్టి తోడు దరిచేరుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మూత్రం, పేడ వాసనను గుర్తించి దరికి చేరుతాయి. రెండు పులుల తోడు కోసం ఏదైనా గోదావరి దాటి కలిసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఆ దిశగా అధికారులు కూడా అన్వేషణ ప్రారంభించినట్లు తెలిసింది. కాటారం, మహదేవపూర్ మండలాల్లో దాడులు మాత్రం ఎక్కడా చేయలేదని తెలిసింది.కాళేశ్వరం: పదకొండు రోజులుగా అటవీశాఖను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి పలుగుల నుంచి బీరాసాగర్కు ప్రయాణం ప్రారంభించింది. ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తూర్పల్లి నుంచి మొదలైన పులి సంచారం వీరాపూర్ గుడూర్, గుండ్రాత్పల్లి, కుదురుపల్లి, బీరాసాగర్, అన్నా రం మీదుగా మహదేవపూర్ మండలం మద్దులపల్లి, పలుగుల వరకు కలియ తిరిగింది. గారెకుంట ఒర్రెలో మకాంవేసి గురువారం ఉదయం మళ్లీ పలు గుల మీదుగా అటవీప్రాంతం గుండా కాళేశ్వరం సమీపంలోని గ్రావిటీ కెనాల్ రోడ్డుపై పులి నడచుకుంటూ వెళ్లిన పాదముద్రలు స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బీరాసాగర్లో కెమెరాలు.. మహదేవపూర్ రేంజ్ అధికారులు నాలుగు బృందాలతో పాటు ఎనిమల్ ట్రాకింగ్ టీంలతో కలిసి అన్వేషణ ప్రారంభించారు. సాయంత్రం వరకు బీరాసాగర్ అడవిలో పాదముద్రలు లభించారు. దీంతో అక్కడా ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గోదావరితీరం, సమ్మక్క–సారలమ్మ గద్దెలు, నీటికుంటల వద్ద ఆరు కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంద్రావతి టు గోదావరితీరం.. పులుల సంచారం ఇంద్రావతి రిజర్వుఫారెస్టులో ఎక్కువగా ఉంది. ఛత్తీస్గఢ్ వైపున మావోయిస్టు ప్రాబల్యం ఉండడంతో పులుల గణన జరుగలేదని తెలిసింది. అక్కడి నుంచి ఇంద్రావతి దాటి గోదావరి తీరం వైపునకు ప్రయాణం చేసినట్లు వాదనలు వినిపిస్తుంది. ఇంద్రావతి వద్ద పలిమెల, మహదేవపూర్ మీదుగా కాటారం నుంచి మళ్లీ బీరాసాగర్ చేరిన పులి అటు వెళ్లడానికి ప్రయత్నించిందా అనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే పెద్దపులిని ప్రత్యక్షంగా చూశారు. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కలేదు. దీంతో సంచారం భయంతో ప్రజలు రాత్రిపూట ప్రయాణాలు చేయడం లేదు. ఎఫ్ఎస్ఓ ఆనంద్ను సంప్రదించగా బీరాసాగర్కు పులి వచ్చినట్లు పాదముద్రలు సేకరించినట్లు తెలిపారు. అడవి మొత్తం సంచరిస్తుందని, ఒక్క దగ్గర నిలకడగా ఉండడం లేదని తెలిపారు.మంచిర్యాల జిల్లా నీల్వాయికి ఆడ పులి రాక ఆ వాసనతోనే అడవిలో తచ్చాడుతున్న మగపులి పదకొండు రోజులుగా మకాం -
ధరలేక దిగాలు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో మిర్చి రైతులు దిగుబడి రాక.. మార్కెట్లో ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఇదే సీజన్లో క్వింటా మిర్చి ధర రూ.20వేలు పలకగా.. ప్రస్తుత సీజన్లో రూ.7వేల నుంచి రూ.11,500 వరకు మార్కెట్ రేటు పలుకుతుండడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. జిల్లాలో ఈ సీజన్లో దాదాపు 19,637 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు.ధరలో భారీ తేడా..గతేడాది ఈ సీజన్లో అన్రాడ్ మిర్చి రకం క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.20వేల దాకా ధర పలికింది. సింజెంటా, బ్యాడిగ, రకం రూ.18వేల నుంచి రూ.30వేలు, మిర్చి రకాలు రూ.14వేల నుంచి రూ. 22 వేల వరకు ధర పలికాయి. ప్రస్తుతం ధరలు దాదాపు 50 శాతానికి తగ్గిపోయాయి.ధరల పతనం..గతేడాది ఎండుమిర్చికి మంచి ధర పలికింది. క్వింటా మిర్చి రూ.20వేల వరకు పలికింది. కొంతమంది మరింత ఎక్కువ ధర వస్తుందని అశతో కోల్డ్ స్టోరేజీలో మిర్చిని దాచారు. గత సీజన్ నుంచి ఈ సీజన్ వరకు సుమారు 50శాతం ధరలు పడిపోవడం గమనార్హం. కోల్డ్ స్టోరేజీలో బస్తాకు ఏడాదికి రూ.170 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. తేజ రకం మిర్చి కోతకూలీ క్వింటాకు రూ.3 వేల వరకు ఖర్చుఅవుతోంది. దీనికితోడు పెటుబడి ఖర్చులు కలుపుకుంటే దాదాపు రూ.7వేల వరకు ఖర్చువస్తుంది. వర్షాల కారణంగా కాయల్లో నాణ్యత లోపించి నాణ్యత తక్కువగా ఉందని మార్కెట్లో ధరలు తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు బోయిని కిష్టయ్య. జంగేడు గ్రామం. ఎకరానికి రూ.25వేల చొప్పున మూడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశాడు. విత్తనాలకు రూ.48వేలు, కూలీలకు రూ.90వేలు, పురుగుమందులకు పదిసార్లకు కలిపి రూ.1.41లక్షలు.. ఇలా ఇతర ఖర్చులతో కలిపి మూడెకరాలకు 4.50లక్షలు పెట్టుబడి పెట్టాడు. దిగుబడి మాత్రం ఎకరాలకు 8 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు మాత్రమే వచ్చింది. మార్కెట్ ధర కూడా తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. జిల్లాలో మిర్చి రైతులందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. -
పోడు రైతులపై ఫారెస్టు అధికారుల దాడులు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ అటవీగ్రామంలో పోడు చేస్తున్నారన్న సమాచారంతో గురువారం డీఆర్ఓ ఉషారాణి ఆధ్వర్యంలో ఫారెస్టు అధికారులు, సిబ్బంది రైతుల ను అడ్డుకున్నారు. దీంతో రైతులకు, ఫారెస్టు అధి కారుల మధ్య జరిగిన తోపులాటలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఫారెస్టు అధికారులు రైతులపై దాడులు చేశారని, ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలయ్యాయని, లంచం ఇవ్వకుంటే దాడులు చేయించిందని ఆరోపిస్తూ.. అధికారిణిపై గురువారం భూ పాలపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు రైతులు చేశారు. విధులకు అటంకం కలిగించారని రైతులపై ఫారెస్టు అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. రైతులు ఏమంటున్నారంటే.. ‘మేము 10 కుటుంబాలకు చెందిన వారము. గత 30ఎళ్లుగా ఆజాంనగర్లో పోడు వ్యవసాయంమీద బతుకుతున్నాం. గతేడాది జూన్ మాసంలో అధికారిణి సాగు అడ్డుకుందని, దీంతో 10 మంది రైతులం కుటుంబానికి రూ. 50వేల చొప్పున రూ. 5లక్షలు లంచం ఇవ్వడంతో పత్తి పంటసాగుకు అనుమతి ఇచ్చింది’ అని రైతులు ఆరోపించారు. ఈ ఏడాది మరో రూ.2లక్షలు కావాలని అడిగిందని, ఇవ్వకపోవడంతో సిబ్బందితో జేసీబీలతో గుంతలు చేయడానికి భూముల మీదకు రావడంతో అడ్డుకున్నామని, అధికారులు, సిబ్బంది ఇస్టానుసారంగా తమపై దాడులు చేసి ముగ్గురిని ఆరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులేమంటున్నారంటే.. రైతుల దాడిలో ఫారెస్టు అధికారుల జీపు అద్దం ధ్వంసమైందని, ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయని, ఆరుగురు రైతులపై ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. లంచం తీసుకున్నట్లు తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, తప్పుడు ఫిర్యాదు చేయించారని అధికారిణి ఉషారాణి తెలిపారు. ముగ్గురు రైతులు పోలీస్స్టేషన్కు తరలింపు లంచం తీసుకున్నారని అధికారిణిపై పోలీసులకు రైతుల ఫిర్యాదు -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రేగొండ: పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నారాయణపూర్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జూబ్లీనగర్ గ్రామానికి చెందిన కొంపల్లి వెంకన్న (42), రవీందర్తో కలిసి తన ట్రాక్టర్లో మిర్చి బస్తాలు లోడ్చేసుకుని వరంగల్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో నారాయణపూర్ వద్ద బస్తాలు జారుతుండటం గమనించి ట్రాక్టర్ ఆపి బస్తాలను తాడుతో కడుతుండగా పరకాల వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. రవీందర్కు తీవ్రగాయాలు కాగా 108లో పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాలో యథేచ్ఛగా గుట్కా దందా
ఇష్టమొచ్చిన ధరలు..! పెద్దపల్లి జిల్లా మంథని, గోదావరిఖనికి చెందిన చెందిన ఇద్దరు వ్యాపారులు గుట్కా, పాన్ మసాలా, పొగాకు ప్యాకెట్లను తమ ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వంద ప్యాకెట్లు (2,500 పౌచ్లు) ఉన్న ఒక పొగాకు బస్తాను రూ.25 వేలకు విక్రయిస్తున్నారు. అయితే ఒక పౌచ్పై ఎమ్మార్పీ ధర రూ.10 ఉండగా, ఆ ఇద్దరు వ్యాపారులు అదే ధరకు ఇక్కడి హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఫలితంగా వారికి రోజుకు రూ.లక్షల్లో లాభం చేకూరుతుంది. ● పక్క జిల్లాల్లో పోలీసుల తనిఖీలు, పట్టివేతలు ● భూపాలపల్లి బాటపట్టిన అక్రమ వ్యాపారులు ● ధరలు పెంచి మరీ విక్రయాలు భూపాలపల్లి: గుట్కా దందాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సేఫ్ జోన్గా మారిందా.. అంటే ఔననే సమాధానమే వస్తుంది.. ఇతర జిల్లాల్లో పోలీసులు నిత్యం దాడులు చేస్తూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా తదితర పొగాకు ఉత్పత్తులను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో అక్కడి వ్యాపారులంతా భూపాలపల్లి బాట పడుతున్నారు. ప్రతీరోజు సరుకుల మాటున వివిధ వాహనాల్లో గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
సైబర్ మోసం.. ఖాతా ఖాళీ
రేగొండ: ఎస్బీఐ క్రెడిట్ కార్డు కావాలా..? అంటూ వచ్చిన ఫోన్కాల్కు స్పందించిన ఓవ్యక్తి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు ఖాళీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నారాయణపురానికి చెందిన పోలు తిరుపతికి జనవ రి 24న 6268040772 నంబరు నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు కావాలా..? అని కాల్ వచ్చింది. ఒకే అనడంతో అవతలి వ్యక్తి పంపిన లింక్ను తిరుపతి ఓపెన్ చేయగా వచ్చిన ఓటీపీని నేరగాళ్లకు చెప్పా డు. దీంతో ఖాతా నుంచి రూ.12 వేల నగదు బదిలీ అయింది. బుధవారం బాధితుడి ఫిర్యాదుతో ఎస్సై సందీప్కుమార్ కేసు నమోదు చేశారు. -
ఈ జిల్లాలోనే ఎందుకిలా..?
జిల్లా సరిహద్దులోని వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో ప్రభుత్వం నిషేధించిన పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రతీరోజు దాడులు నిర్వహిస్తూ నిషేధిత గుట్కా, పాన్మసాలా తదితర పొగాకు ఉత్పత్తులను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో అక్కడి వ్యాపారులు వాటిని అమ్మేందుకు జంకుతున్నారు. అయితే భూపాలపల్లి జిల్లాలో మాత్రం పోలీసులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారుల దందా మూడు పూవులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతుంది. ఇప్పటికై నా జిల్లా పోలీసు అధికారులు స్పందించి క్యాన్సర్కు కారకమవుతున్న నిషేధిత గుట్కా, పాన్ మసాలాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎస్టీ హాస్టల్ తనిఖీ
మల్హర్: మండల కేంద్రం తాడిచర్లలోని ఎస్టీ హాస్టల్ను బుధవారం సంక్షేమ శాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏసీఎంఓ) రాజారత్నం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం అందజేస్తున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని సమస్యలలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని విద్యార్థులకు సూచించారు. టెన్త్లో ప్రతి విద్యార్థి 10 జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు సబ్బులు, దుప్పట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో వార్డెన్ కిరణ్, తదితరులు ఉన్నారు. నేడు ఇసుక రీచ్ల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలోని పలు ఇసుక క్వారీలను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ గురువారం పరిశీలించనున్నట్లు తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి పలు క్వారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారులు క్వారీలను పరిశీలిస్తూ తనిఖీలు చేపడుతున్నారు. అయితే.. ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించొద్దు భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లలో సిబ్బంది అలసత్యం వహించొద్దని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వార్డు అధికారులు, బిల్ కలెక్టర్ల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. ఇప్పటి వరకు 45శాతం మాత్రమే పన్నులు వసూళ్లు చేయడం జరిగిందని, మార్చి 31వ తేదీ లోపు వంద శాతం వసూలు చేయాలని తెలిపారు. పట్టణంలో పేరుకుపోయిన ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూలు విషయంలో అలసత్వం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు బకాయి లేకుండా చెల్లించాలని కోరారు. -
బాబోయ్ పులి..
పాదముద్రలు పరిశీలిస్తున్న ఎనిమల్ ట్రాకింగ్ టీం సభ్యులుకాళేశ్వరం: రెండు రోజులుగా పలుగుల గ్రామ శివారు అటవీప్రాంతాల్లో పెద్దపులి తలదాచుకుంది. మహదేవపూర్ మండలం పలుగుల పంచాయతీలోని ఎస్సీకాలనీ సమీపంలోని నీలగిరి వనం వైపు ఉన్న గారెకుంట ఒర్రెలో ఆవాసం కో సం కలియతిరుగుతుంది. బుధవారం ఉదయం కుంట్లం వైపు ఇసుక క్వారీకి వెళ్తున్న ఓ లారీడ్రైవర్ నీలగిరి వనం నుంచి భయటికి వచ్చిన పెద్దపులిని రోడ్డుపై చూశాడు. తను చూసిన పులి పెద్ద ఎద్దులా ఉందని డ్రైవర్ చెప్పడంతో కొందరు యువకులు అటవీశాఖకు సమాచారం అందించారు. దీంతో ఎఫ్ఎస్ఓ ఆనంద్తోపాటు కవ్వాల్ ఎనిమల్ ట్రాకింగ్ టీం సభ్యుడు యోగి బృందం పాదముద్రలను పరిశీలించింది. ఆరు ట్రాకింగ్ కెమెరాలు.. పెద్దపులి రోజుకో చోట సంచరిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు పులి పాదముద్రలను పరిశీలిస్తూ ట్రాకింగ్ టీంలతో అన్వేషిస్తున్నారు. మహదేవపూర్, మంచిర్యాల జిల్లా కోటపల్లి అటవీశాఖ ఉద్యోగులు సైతం గాలింపు చర్యలో పాల్గొంటున్నారు. మంగళవారం గారెకుంట పోచమ్మ ఒర్రె ప్రాంతంలో పులి నీరుతాగిన ఆనవాళ్లు లభించాయి. దీంతో పలుగుల, ఒర్రె ప్రాంతం, కుంట్లం, మద్దుపల్లి అడవిలో ఆరు ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడున్నరేళ్ల మగపులి.. పది రోజులుగా కాటారం, మహదేవపూర్ రేంజ్లో సంచరిస్తున్న పులి వయస్సు సుమారుగా మూడున్నరేళ్ల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అది మగ పెద్దపులి అని అనుమానుస్తున్నారు. మ్యాన్ఈటర్ కాదని, త్వరలోనే సరిహద్దు దాటి భయటికి వెళ్తుందని చెబుతున్నారు. ఆవాసం కోసం చూస్తున్న పులి గోదావరి సరిహద్దుల్లోనే తచ్చాడుతోందంటున్నారు. 2022లో వచ్చిన పెద్దపులి కూడా అన్నారం వైపు నుంచి పలుగుల మీదుగా కుంట్లం వద్ద గోదావరి దాటిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అటవీశాఖ మౌనం.. పదిరోజులుగా పెద్దపులి రెండు మండలాల్లోని రేంజ్లో తిరుగుతున్నా అటవీశాఖ అధికారులు మౌనంపాటిస్తున్నారు. వివరాలు వెల్లడించడానికి వెనుకాడుతున్నారు. ఉన్నతాధికారులు తెలుపుతారని దాటవేసే సమాధానం చెబుతున్నారు. అధికారులు అమర్చిన ట్రాకింగ్ కెమెరాలకు పులి చిక్కిందా..? లేదా? చిక్కినా భయటికి చెప్పడంలేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవిషయమై ఎఫ్ఎస్ఓ ఆనంద్ను సంప్రదించగా ఆరు కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. కెమెరాలకు చిక్కలేదన్నారు. పులి సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. పులికి హాని కలిగించొద్దని పేర్కొన్నారు. పలుగుల వద్ద రోడ్డుపై లారీడ్రైవర్కు కనిపించిన పెద్దపులి నాలుగు బృందాలతో అటవీశాఖ గాలింపు కవ్వాల్ ఎనిమల్ ట్రాకింగ్ టీంతో అన్వేషణ -
ఆ ఇద్దరిదే హవా..
రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాలను భూపాలపల్లికి రవాణా చేయడంలో ప్రస్తుతం ఇద్దరు వ్యాపారుల హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందిన ఓ వ్యాపారి, గోదావరిఖనికి చెందిన మరో వ్యాపారి భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాటారం డివిజన్ను గుత్తా పట్టినట్లుగా తమ దందాను కొనసాగిస్తోండడం గమనార్హం. తమ సొంత వాహనాల్లో ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రూ.15 లక్షలకు పైగా విలువైన సరుకును జిల్లాలోని హోల్సేల్, కిరాణా షాపులు, మధ్య దళారులకు దిగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు వ్యాపారులు కొయ్యూరు మీదుగానే రవాణా చేస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరినీ కట్టడి చేస్తే జిల్లాలో నూటికి 90 శాతానికి పైగా నిషేధిత పొగాకు ఉత్పత్తుల దందా ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే హనుమకొండకు చెందిన ఓ వ్యాపారి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా గుట్కాలను భూపాలపల్లి జిల్లాకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. -
సామాన్యుల వద్దకే న్యాయసేవలు
భూపాలపల్లి అర్బన్: సామాన్యుల వద్దకే న్యాయసేవలు తీసుకెళ్లడంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ చొరవ తీసుకుంటుందని డిప్యూటీ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ, ప్రియాంక తెలిపారు. మున్సిపల్ పరిధిలోని వేశాలపల్లిలో బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన, నిమ్న కులాల వారికి, మహిళలకు, వయో వృద్ధులకు ఉచిత న్యాయసాయం అందించడమే జిల్లా న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని తెలిపారు. మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. -
తాగునీటి ఇబ్బందులు రావొద్దు
లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదవాలి రేగొండ: ప్రతీవిద్యార్థి లక్ష్యాలను నిర్ధేశించుకుని ప్రణాళిబద్ధంగా చదవాలని కలెక్టర్ రాహుల్శ ర్మ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. వి ద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివి ఉత్తమ ఫలి తాలు సాధించేలా ప్రోత్సహించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్ను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇదిలా ఉండగా.. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్మి స్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే రైతువేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ మనోరమ, గృహనిర్మాణ పీడీ లోకిలాల్, డీఆర్డీఓ నరేష్, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, విద్యుత్, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ రాహుల్శర్మ బుధవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా మంచినీటి సరఫరా పరిస్థితిని ఎంపీడీఓలు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతుల ఉంటే వెంటనే చేయాలని ఆదేశించారు. గ్రామ, పట్ట ణాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూ చించారు. విద్యుత్ సమస్య వస్తే 1912 కాల్ సెంటర్కు ఫోన్ చేయాలన్నారు. మంచినీటి సమస్య వ స్తే ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేయాలని తెలి పారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 26న కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవాలయంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో మహాశివరాత్రి వేడుకలపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచా యతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య, ఇరిగేషన్, మత్స్య, విద్యుత్, ఆబ్కారీ, సింగరేణి, ఆర్టీసీ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు నడపాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. మహాశివరాత్రి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నా యక్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, డీపీఓ నారాయణరావు, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, మత్స్యశాఖ అధికారి అవినాశ్, దేవస్థానం ఈఓ మహేష్ పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ రాహుల్శర్మ -
ఆర్థిక ఒడిదుడుకులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనుకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధిరేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనే.. ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు ఆ తర్వాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7,583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు. పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్.... ఉమ్మడి వరంగల్లో 38,20,369 మంది జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డిల తర్వాత స్థానంలో హనుమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లల్లోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148లకు 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణ వాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763లకు 3,74,376 ( 89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671లకు 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం)మంది పట్నవాసం చేస్తున్నారు. జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..జిల్లా మొత్తం గ్రామీణం పట్టణ/నగరం జనాభా జనాభా జనాభా హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 మొత్తం 38,20,369 28,28,036 9,92,333జిల్లాల వారీగా జీడీడీపీ (రూ.కోట్లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 17,684 16,181 19,877 23,868 వరంగల్ రూరల్ 12,903 13,901 16,509 18,677 జనగామ 10,939 10,353 11,672 13,875 మహబూబాబాద్ 12,244 13,092 16,317 18,245 జేఎస్.భూపాలపల్లి 12,157 10,298 11,848 11,481 ములుగు 5,695 5,382 6,147 7,583జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 1,40,994 1,26,594 1,55,055 1,86,618 వరంగల్ రూరల్ 1,55,802 1,65,549 1,95,115 2,20,877 జనగామ 1,79,229 1,66,392 1,86,244 2,21,424 మహబూబాబాద్ 1,37,562 1,44,479 1,79,057 2,00,309 జేఎస్.భూపాలపల్లి 2,42,945 2,03,564 2,34,132 2,28,655 ములుగు 1,68,702 1,55,821 1,75,527 2,15,772తలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్.. 2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132లు కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174 లకు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే రూ.1,86,278లున్న జనగామ ఈసారి రూ.2,21,424లతో 16, రూ.1,79,222లతో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309లతో 25, రూ.1,77,316లతో 21లో ఉన్న ములుగు రూ.2,15,772లతో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086లతో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్భన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉంది.జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనుకబాటు రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి... ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే ‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్స్టేషన్ల వారీగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల విచారణ, స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు. కేసుల దర్యాప్తులో పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, నేర స్థల పరిశీలన, సాక్ష్యాధారాల సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, చార్జిషీటు దాఖలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు విజిబుల్ పోలిసింగ్కు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో గ్రామ సందర్శనలు, పట్టణంలో వార్డుల సందర్శనలు పెంచాలన్నారు. స్థానికంగా ఉండే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందేలా చూసుకోవాలని చెప్పారు. జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్ట నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మహిళల పట్ల జరిగే నేరాలపై వేగంగా స్పందించి న్యాయం చేయాలన్నారు. వివిధ దొంగతనాల కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, వర్టికల్ డీఎస్పీ నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్పీ కిరణ్ ఖరే -
కరువు పనిపై పెరుగుతున్న ఆంక్షలు
కాటారం: గ్రామాల్లో వలసలు తగ్గించి స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జాతీయ ఉపాధిహామీ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై విధి విధానాలు మారుస్తుండడంతో క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరు అగమ్యగోచరంగా మారిపోయింది. గతంలో ఉపాధి పనులను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న కూలీలు ప్రస్తుతం పనుల పట్ల పూర్తిస్థాయి విముఖత చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కారణంగా ఉపాధి పనులపై పెరిగిన ఆంక్షలతో గ్రామాల్లో పనులకు వచ్చే కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జిల్లాలోని మొత్తం కూలీలలో కనీసం 10శాతం కూలీలు కూడా ఉపాధి పనులకు రావడం లేదు. -
రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్
కాటారం: ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో కాటారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మంగళవారం ఆన్లైన్ పద్ధతిలో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. గతంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న మణిదీప్, అలేఖ్య, అభిరాంకళ్యాణ్ ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అనంతరం విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్బంగా ఎంఈఓ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్పై ఆసక్తి పెంచుకొని భవిష్యత్లో శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం ఉమారాణి, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గండు రాజబాబు, ఉపాధ్యాయులు రాజేందర్, రాజయ్య పాల్గొన్నారు. నేడు తిరుగువారం పండుగ ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క–సారలమ్మ పూజారులు నేడు (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవార్ల వస్త్రాలు, పూజా సామగ్రిని భద్రపరుస్తారు. అమ్మవార్లకు యాట నైవేద్యంగా సమర్పించనున్నారు. తిరుగువారం పండుగ రోజు పూజారుల కుటుంబీకులు, స్థానిక గ్రామస్థులు ఇళ్లను శుద్ధి చేసుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. తిరుగువారం పండుగతో మినీజాతర (మండమెలిగె) పండుగ పూజా కార్యక్రమాల ముగియనున్నాయి. -
రోజుకో చోట..
పలుగుల అటవీప్రాంతంలో పెద్దపులి..కాటారం/కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామ అటవీప్రాంతంలో మంగళవారం పెద్దపులి కనిపించింది. పదిరోజులుగా పెద్దపులి కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్టవేసి అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తూర్పల్లి శివారులో ఓ రైతు పులి పాదముద్రలు(పగ్మార్క్) చూసి భయాందోళనకు గురయ్యాడు. మహదేవపూర్ మండలం అన్నారం, బీరాసాగర్, కుదురుపల్లి అడవిలో రెండు రోజులు సంచరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి మాత్రం కెమెరాల్లో చిక్కడం లేదని అటవీశాఖ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా.. నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు(ప్లగ్ మార్క్స్) గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి కదలికలపై దృష్టి సారించారు. మొదటి రోజు కాటారం, మహదేవపూర్ రేంజ్ పరిధిల్లోని అటవీ ప్రాంతం మొత్తాన్ని అధికారులు, సిబ్బంది జల్లెజ పట్టారు. పులి ఆనవాళ్లు కానరాకపోవడంతో నస్తూర్పల్లి, వీరాపూర్, అన్నారం, బీరాసాగర్, మహదేవపూర్ అటవీప్రాంతాల్లో ఝెనిమల్ ట్రాకర్ నిపుణులతో కలిసి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరు బృందాలుగా విడిపోయి అటవీశాఖ అధికారులు పులి జాడను కనుక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ పులి ఎక్కడ కూడా ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా సంచరిస్తుంది. భయాందోళనలో ప్రజలు.. పెద్దపులి రోజుకో చోట కనిపిస్తుండటంతో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి ఎప్పుడు ఎక్కడికి వస్తుందో తెలియని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి సమయంలో అటవీ ప్రాంతానికి సమీపంలోని పంట పొలాల వద్దకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. ఆందోళనకు గురికావద్దు.. పులి సంచారం పట్ల ప్రజలు, రైతులు ఆందోళనకు గురికావద్దని, కాటారం రేంజ్ అధికారిణి స్వాతి, అటవీశాఖ రేంజర్ రవికుమార్ తెలిపారు. రా త్రి సమయాల్లో అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూ చించారు. పులి, పులి ఆనవాళ్లు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. 10రోజులుగా కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్ట ట్రాకింగ్ కెమెరాలకు చిక్కని ౖటైగర్ అటవీశాఖ అధికారులకు ముప్పుతిప్పలుగారెకుంటలో నీరుతాగి.. మంగళవారం ఏకంగా మహదేవపూర్ మండలం పలుగుల ఎస్సీకాలనీ పక్కన నీలగిరి వనంలో పులి సంచారం చేసింది. అదేగ్రామానికి చెందిన నిట్టూరి బాపు అనే రైతు ఎడ్లబండితో పత్తిచేనుకు వెళుతున్నాడు. కొంత దూరం నడిచిన ఎద్దులు ముందుకు నడిచేందుకు వెనుకడుగు వేశాయి. రైతు ఎద్దులను దబాయించినా ముందుకు సాగలేదు. దీంతో రైతు పరీక్షించి చూడడంతో ముందు పెద్దపులి నడుచుకుంటూ వెళ్తోంది. దీంతో రైతు భయానికి గురై వెంటనే ఎడ్ల బండిని వెనుకకు తిప్పి ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పులికోసం చెట్టు, పుట్ట, వాగు, వంకల్లో ముమ్మరంగా అన్వేషించారు. గారెకుంట పొచమ్మ కుంట వద్ద పులి నీరుతాగి వెళ్లినట్లు పాదముద్రలను అధికారులు సేకరించారు. అక్కడి నుంచి కాళేశ్వరం వైపున నల్లవాగుకు చేరినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
కల్యాణం.. కమనీయం
రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. మంగళవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణం జరిపించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, చై ర్మన్ ముల్కనూరి భిక్షపతి, కాంగ్రెస్ రాష్ట్ర నా యకులు కత్తి వెంకటస్వామి, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు. నాగేపల్లిలో వైద్యశిబిరం కాళేశ్వరం: కాళేశ్వరం పీహెచ్సీ పరిధిలోని అన్నారం సబ్సెంటర్లోని నాగేపల్లిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం 38మందికి వైద్య పరీక్షలు చేశారు. 14 మంది రక్తనమూనాలు సేకరించి మలేరియా రాపిడ్ టెస్టులు చేసి మందులు పంపిణీ చేశారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య, సబ్ యూనిట్ ఆఫీసర్ రమేష్, ఎంపీఓ ప్రసాద్, పీహెచ్ఎస్ నీరజ, హెల్త్ అసిస్టెంట్ అడప రాజరమణయ్య, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. డ్రంకెన్డ్రెవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష భూపాలపల్లి అర్బన్: మద్యం తాగి జిల్లాకేంద్రంలో వాహనం నడుపుతూ పట్టుబడిన కేసులో ఒకరికి జైలు శిక్ష పడినట్లు సీఐ నరేష్కుమా ర్ తెలిపారు. పట్టణంలోని సుభాష్కాలనీకి చెందిన అల్వాల వంశీ ఇటీవల మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడగా కోర్టులో ప్ర వేశపెట్టారు. రెండు రోజుల జైలు శిక్ష, రూ.వే యి జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. గుడుంబా పట్టివేత కాటారం: మండలంలోని ఆదివారంపేటలో ఓ మహిళ గుడుంబా విక్రయిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మ్యాక అభినవ్ తెలిపారు. గుడుంబా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దుర్గం లక్ష్మి ఇంట్లో తనిఖీ చేయగా 10 లీటర్ల గుడుంబా లభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. గుడుంబా స్వాధీనం చేసుకుని లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా గుడుంబా తయారీ, రవాణ, విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత కాటారం: మండలంలోని విలాసాగర్ మానేరు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై మ్యాక అభినవ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ సిబ్బంది విలాసాగర్, గంగారం గ్రామాల మధ్య పెట్రోలింగ్ నిర్వహిస్తూ గంగారం క్రాస్ వద్ద ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను నిలిపి పత్రాలు అడిగారు. ఇసుక రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు లేకపోవడంతో పాటు వాహన పత్రాలు, డ్రైవర్కు లైసెన్స్ లేనట్లు గుర్తించారు. దీంతో ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో సర్వే కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో గోదావరి నీటి ప్రవాహంపై కేంద్ర జలశక్తి శాఖ(సీడబ్ల్యూసీ)ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. మంగళవారం సర్వే జేఈఈ సందీప్ ఆధ్వర్యంలో సర్వే బృందం గోదావరి, పరిసర ప్రాంతాల్లో సర్వే చేశారు. ప్రతి వర్షాకాలంలో గోదావరిలో వరదల కారణంగా కోతకు గురైన ప్రాంతాన్ని సర్వే చేస్తున్నారు. వర్షాకాలంలో ఎంత మేర నీటిమట్టం ప్రవహిస్తుంది, కోతకు గురైన తరువాత ఎంత మేర ప్రవహిస్తుందనే హెచ్చుతగ్గులను సర్వే చేసి వర్షాకాలంలో దీని ఆధారంగా నీటి లెక్కలను సీడబ్ల్యూసీ అధికారులు చెబుతారని ఆయన వివరించారు. ఆయన వెంట సర్వే బృందం ఉన్నారు. -
భోజన సౌకర్యం మెరుగుపరచాలి
భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, సంక్షేమ గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అల్పాహారం, భోజన సౌకర్యాల అమలును మరింత మెరుగుపరిచేందుకు మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మండలాల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో భోజన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇదొక నిరంతర ప్రక్రియగా జరగాలన్నారు. ఆహార పదార్థాల శుభ్రత, పోషక విలువలు, వంట గదుల నిర్వహణ, భోజన పరిమాణం, మెనూ అమలు తదితర అంశాలను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తొద్దు.. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా సమగ్ర కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ నుంచి మంగళవారం వివిధ అంశాలపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలోని 53 సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. క్రమం తప్పక వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తాగునీటి కొరత వచ్చిన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, స్థానిక వనరులను గుర్తించాలని తెలిపారు. లీకేజీలు అరికట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి
చిట్యాల: టెన్త్ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలను డీఈఓ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుని అత్యుత్తమ మార్కులు సాధించాలని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ రాజగోపాల్ విద్యార్థులను వివిధ సబ్జెక్టులలో ప్రశ్నలను అడిగి జవాబులు తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాం రఘుపతి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజమౌళి, నీలిమారెడ్డి, విజయలక్ష్మి, కల్పన, మౌనిక, ఉస్మాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి పాల్గొన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచాలి మొగుళ్లపల్లి: పదిలో జీపీఏ సాధనే లక్ష్యంగా ప్రతీ విద్యార్థి శ్రద్ధగా చదవాలని డీఇఓ రాజేందర్ అన్నారు. మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొట్లపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి పాఠశాలలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను, విద్యార్థుల ప్రగతి రికార్డులను, ఉపాధ్యాయుల డైరీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. టెన్త్ విద్యార్థులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకొని సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. డీఈఓ వెంట జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి, నరసింహస్వామి, శ్రీనివాస్, మహేష్, కోటేశ్వర్, శ్రీమంజరి, వెంకన్న, అనిల్కుమార్ ఉన్నారు.డీఈఓ రాజేందర్ -
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వేసవి భత్యం ఊసేలేదు.. వేసవికాలం దృష్ట్యా గతంలో ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపాధి కూలీలకు 20శాతం అదనపు వేసవి భత్యం ఇచ్చేది. రెండేళ్ల వేసవి భత్యం నిలిచిపోగా ఈసారి కూడా వేసవి భత్యం అందేలా లేదు. దీంతో కూలీల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఉపాధి పనిదినాలు పెంచేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు అదనపు భత్యాన్ని అందజేసేది. దీంతో పనిచేసిన కూలీలకు ఆ రోజు పొందే కూలీలో ఫిబ్రవరి నెలలో 20శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30శాతం, జూన్లో 20శాతం అదనపు భత్యం చెల్లిస్తుండేవారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వినియోగించిన సాఫ్ట్వేర్ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా నేషనల్ ఇర్మమెటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. దీంతో మూడేళ్లుగా ఉపాధి చెల్లింపులు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసీ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే వీలు లేకుండా పోయింది. ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజుకు గరిష్టంగా రూ.300 కూలీ చెల్లిస్తుంది. కూలీల వేతనాలు సైతం వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వేసవి భత్యం ఇచ్చే అవకాశం లేకపోవడంతో వేసవిలో పనిచేసే కూలీల అలవెన్స్కు బ్రేక్ పడింది. దీనికి తోడు ఉపాధి పనులు జరిగే పని ప్రాంతంలో ఎండల తీవ్రత, వసతుల లేమి కారణాలతో పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.● నిలిచిన వేసవి భత్యం ● కేంద్రం కొత్త సాఫ్ట్వేర్తో అందని అదనపు కూలి ● కూలీల అలవెన్స్ హుష్కాకి ● ఉపాధి పనులపై కూలీల విముఖతన్యూస్రీల్ -
సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
ఏటూరునాగారం: సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని పీఎం ఎస్ఆర్ఐ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ లక్ష్మణ్ తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 130 మంది మంగళవారం హనుమకొండలోని ఎన్ఐటీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్య, శాసీ్త్రయ విద్య పెంపొందించేందుకు స్టెమ్ సంస్థ ద్వారా స్టడీ టూర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించామని వివరించారు. ఈ టూర్లో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఎద్దడి రాకుండా తగు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణంలోని పలు కాలనీల నుంచి మంగళవారం ఫిర్యాదులు అందగా అప్పటికప్పుడు మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. కాశీంపల్లిలో ఒక చేతిపంపు మరమ్మతు, క్రిష్ణాకాలనీ, ఎల్బీ నగర్లలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ మరమ్మతు, గడ్డిగానిపల్లిలో బోరు మోటారు కాలిపోతే అప్పటికప్పుడు రిపేరు చేయించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. తాగునీటి సమస్య ఏర్పడితే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ -
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం
ములుగు రూరల్: విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి సర్కిల్ డీఈఈ(టెక్నికల్) వెంకటేశం, ములుగు డీఈఈ నాగేశ్వర్రావు సూచించారు. ఈ మేరకు మండల పరిధిలోని జగ్గన్నపేట రైతులకు మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కెపాసిటర్లు బిగించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టుకోకూడదని, చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ సర్వీస్ వైరు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల క్రమబద్ధీకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏడీఈ వేణుగోపాల్, ఏఈ బానోత్ రవి, ఏఎల్ఎం కమలాకర్ పాల్గొన్నారు. -
నీటి మట్టం వివరాలు (మీటర్లలో..)
తగ్గుతున్న భూగర్భజలాలు ● పెరుగుతున్న నీటి వినియోగం ● ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తున్న ఎండలుమండలం డిసెంబర్ జనవరి 2024 2025భూపాలపల్లి 6.35 7.20 చిట్యాల 3.81 4.76 గణపురం 5.59 6.74 కొత్తపల్లిగోరి 4.12 4.49 కాటారం 16.50 17.84 మహదేవపూర్ 11.5 11.40 మహాముత్తారం 2.86 3.22 మల్హర్ 8.28 9.31 మొగుళ్లపల్లి 4.73 6.12 పలిమెల 6.56 7.46 రేగొండ 3.51 4.56 టేకుమట్ల 4.14 4.43భూపాలపల్లి రూరల్: యాసంగి పంటల సాగుకు నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలమట్టం క్రమంగా తగ్గుతోంది. ఎండలు సైతం ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తుండడంతో నెల రోజుల్లో దాదాపు ఒక మీటరు లోతుకు పడిపోయింది. వేసవిలో సాగునీటి అవసరాలు పెరిగితే భూగర్భ జలాలు పాతాళానికి చేరే అవకాశాలున్నాయి. జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకుంది. ఇప్పటికే 85,675 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గణపురం సరస్సు కింద 2వేల ఎకరాలు, భీం ఘన్పూర్ చెరువు కింద 1,500 ఎకరాలలో పంటలు సాగవుతుండగా, బోర్లు, బావుల కింద 82,175 పైగా సాగవుతున్నట్లు అంచనా. దీనికితోడు 16,843 ఎకరాల్లో మొక్క జొన్న, ఉద్యాన పంటలు, కూరగాయలతో కలిపి మొత్తం 22,670 ఎకరాలు సాగు చేస్తున్నారు. వరికే నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగవుతుండడంతో సాగునీటి అవసరం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. డిసెంబర్లో సాధారణ నీటిమట్టం 7.48 మీటర్లు కాగా, జనవరిలో 8.38 మీటర్లకు పడిపోయింది. దాదాపు ఒక మీటరు లోతుల్లోకి వెళ్లాయి. ఈసారి వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. అది కూడా ఒకేసారి దంచికొట్టిన వానలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయి. తర్వాత వర్షాల జాడ కరువైంది. చాలా చెరువులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. గణపురం మండలంలో 1.15 మీటర్లు పడిపోగా కాటారం 1.35, మల్హర్ 1.03, మొగుళ్లపల్లి 1.39, రేగొండ 1.15 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. దంచికొడుతున్నాయి.. సాధారణంగా మార్చిలో ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. జిల్లాలో 34.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా ఎండలు ముదరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత యాసంగి పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎండలతో పంటలకు ఎంత నీరు అందించినా వెంటవెంటనే ఆరిపోతూనే ఉంది. ముఖ్యంగా వరి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ముందు నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి పొట్ట దశకు వస్తుండగా, చాలా ప్రాంతాల్లో ఈ మధ్యే నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాలలో నాట్లు వేస్తూనే ఉన్నారు. ఆ పంటకు ఇంకా రెండున్నర నెలలకు పైగా నీరందించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి పొట్ట దశలో ఉన్నప్పుడు నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. ఇప్పుడే భూగర్భ జలమట్టం పడిపోతుండడంతో బోర్లలో ఊటలు తగ్గిపోతున్నాయి. ఎండలు మరింత ముదిరితే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి, బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో పంటలు గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొదుపుగా వాడుకోవాలి.. ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో నీటి వినియోగం పెరిగి భూగర్భ జలమట్టం పడిపోతోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఏ పంటకు ఎంత అవసరమో అంతమేర నీటినే వాడాలి. – కె.శ్రీనివాస్రావు, జిల్లా భూగర్భజల శాఖ అధికారి -
మేడారం పరిసరాలు క్లీన్
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక–సారలమ్మ మినీజాతరలో పారిశుద్ధ్య కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. జాతర వారం రోజుల ముందు నుంచి స్థానిక పారిశుద్ధ్య కార్మికులతోపాటు రాజమండ్రి నుంచి కార్మికులను అధికారులు రప్చించారు. దీంతో జాతరలో సుమారు 400 మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పడేసిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. తిరుగువారం వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగనున్నాయి. 10 ట్రాక్టర్లలో చెత్త తరలింపు.. జాతర ముందు, జాతర నాలుగు రోజుల్లో సుమారు 5వేల టన్నుల చెత్త సేకరించారు. ఈ చెత్తను కార్మికులు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ ప్రాంతాలకు తరలించారు. జాతరలో రోజుకు 10 ట్రాక్టర్ల ద్వారా రెండు షిప్టుల వారీగా చెత్త తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. తిరుగువారం అనంతరం పారిశుధ్ధ్య పనులను స్థానిక గ్రామ పంచాయతీ అధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు. గద్దెల ప్రాంగణంలో.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో భక్తులు వేసే బంగారం (బెల్లం), కొబ్బరినీళ్లు, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, ఇతర వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు కార్మికులను జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో నియమించా రు. వీరు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు గద్దెల వద్ద చెత్తాచెదారం తొలగిస్తున్నారు. భక్తులకు మెరుగైన సేవలందించాం.. మేడారం మినీజాతరలో భక్తులకు మెరుగైన సేవలందించాం. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాతరకు 10 రోజుల ముందు, జాతర నాలుగు రోజుల్లో 400 మంది కార్మికులు నిత్యం విధుల్లో ఉంటూ మెరుగైన సేవలందించారు. తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తాం. డీఎల్పీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సమష్టిగా పనిచేయడంతో భక్తులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలను అందించాం. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. – దేవరాజ్, డీపీఓ -
నో పార్కింగ్.. నాకేంటి!
మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఇటీవల ఆలయ రాజగోపురం నుంచి రామాలయం వరకు సీసీ రోడ్డుతో పాటు మెట్ల మార్గాన్ని పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు దర్శనానికి భారీగా తరలివచ్చారు. భక్తులు తమ కార్లను నో పార్కింగ్ బోర్డు వద్దనే పార్కింగ్ చేసి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లారు. కార్లు పార్కింగ్ చేయడంతో ఆ వీధిలో రహదారి పొడవు అంతా ట్రాఫిక్ జామ్ అయింది. దేవస్థానం అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ రోడ్డుపై వెళ్లడానికి ప్రయాణికులు, భక్తులు ఇబ్బంది పడ్డారు. – కాళేశ్వరం -
నేటి ప్రజావాణి రద్దు
భూపాలపల్లి అర్బన్: నేడు (సోమవారం) జరగనున్న ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణిని రద్దు చేసినట్లు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి భూపాలపల్లి అర్బన్: పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని నియంత్రిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని హెచ్పీసీఎల్ సెల్స్ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అధికంగా వినియోగిస్తున్నారని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. ఎలక్ట్రికల్, సోలార్ వైపు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు గండ్ర హరీశ్రెడ్డి, శ్యామ్, అశోక్రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. టీజీఎండీసీ పీఓ బాధ్యతల స్వీకరణ కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల టీజీఎండీసీ పీఓగా పి.రంగారెడ్డి కాళేశ్వరంలోని టీజీఎండీసీ కార్యాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పీఓ ఇసుక క్వారీలను పరిశీలించారు. స్టాక్యార్డులు, లోడింగ్, వేబ్రిడ్జిల నిర్వహణను పరిశీలించారు. ఆయన వెంట బదిలీపై వెళ్లిన ఇద్దరు పీఓలు తారక్నాథ్రెడ్డి, శ్రీరాములు ఉన్నారు. ప్రశాంతంగా సీఓఈ ఎంట్రెన్స్ పరీక్ష కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఆదివారం నిర్వహించిన కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రవేశ పరీక్ష (సీఓఈ) ప్రశాంతంగా ముగిసింది. 320మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 295 మంది విద్యార్థులు హాజరుకాగా.. 25మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, గురుకులం డీసీఓ రాజేందర్ తెలిపారు. పరీక్ష అనంతరం విద్యార్థులకు పులిహోర ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మాధవి, అబ్జర్వర్ నాగమణి, డిప్యూటీ వార్డెన్ నరేశ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి రూరల్: ఫిబ్రవరి 20న నిర్వహించనున్న చలో విద్యుత్ సౌధ కార్యక్రమం పోస్టర్ను జేఏసీ నాయకులు ఆదివారం సబ్డివిజన్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీవీఏసీ జేఏసీ జిల్లా కన్వీనర్ మోత్కూర్ కోటి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ చేయాలన్నారు. ఐటీఐ చేసిన వారికి జేఎల్ఎం, డిగ్రీ చేసిన వారికి జూనియర్ అసిస్టెంట్, టెన్త్ క్లాస్ చదివిన వారికి ఆఫీస్ సబార్డినేట్, డిప్లమో చేసిన వారికి సబ్ ఇంజనీర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులుు ఎండీ అంకుషావలి, సురేందర్ రెడ్డి, మచ్చిక వెంకటేశ్వర్లు, బత్తుల రాజేందర్, శ్యామ్ వేణు, శ్రీనివాస్, రంజిత్, దేవేందర్ పాల్గొన్నారు. సింగరేణి కార్మికుడి మృతి భూపాలపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూపాలపల్లి ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు పూజారి అనిల్(31) మృతిచెందాడు. మంచిర్యాలలో వివాహ వేడుకకు పట్టణానికి చెందిన నలుగురు కారులో వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనిల్ ఏరియాలోని కేటీకే 5వ గనిలో జనరల్ మజ్ధూర్గా పని చేస్తున్నారు. అదే గనిలో పని చేస్తున్న అండర్ మేనేజర్లు రాము, సంజయ్, దేవేందర్లకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. -
కార్పొ‘రేట్’ వేట
భూపాలపల్లి అర్బన్: కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థుల కోసం ఇప్పటినుంచే వేట మొదలుపెట్టాయి. టెన్త్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాకముందే పీఆర్ఓలను రంగంలోకి దింపి విద్యార్థులను కళాశాలల్లో చేర్చుకునేలా కార్యాచరణను ముమ్మరం చేశాయి. పాఠశాలల యాజమాన్యాలకు భారీగా ముడుపులు అందించి ఏఏ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారో వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలల్లో చదువు బాగుందని, ఇక్కడ చదవిన వారు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు అయ్యారని ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో పీఆర్ఓల సందడి కనిపిస్తుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పలు కార్పొరేట్ కళాశాలల గురించి వివరాలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు మొదటి సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్, ఎయిమ్స్ సూపర్ 60, ఇంజనీరింగ్లో ఐఐఐటీలతో పాటు గ్రూప్స్కు సంబంధించిన శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వివరాల సేకరణ కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమ సంస్థల తరఫున పీఆర్ఓలకు ఏర్పాటు చేసుకున్నాయి. వారి ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు నజరానాలు ప్రకటించి, విద్యార్థుల వివరాలు సేకరించుకొని ఏ ప్రైవేట్ పాఠశాలలో ఎంత మంది ఉన్నారో, వారు ఎలా చదువుతున్నారో వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అన్న విషయాలను ఆరా తీస్తున్నాయి. సుమారు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పీఆర్ఓలకు నజరానాలు ఇచ్చి విద్యార్థుల వివరాలను సేకరించి ఆ వివరాల ఆధారంగా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. ఆదేశాలు బుట్టదాఖలు వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం ఎవరూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశాలు గతంలోనే జారీ చేశారు. అయినా వాటిని బేఖాతరు చేసి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్ఓలను రంగంలోకి దింపి విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఎన్నికలను ప్రచారానికి మించి ప్రచారం చేయిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు జిల్లాలో పీఆర్ఓలను నియమించుకొని ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు. అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై నియంత్రణ చేయడం లేదు. ఆఫర్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి. – పాండవుల తిరుపతి, విద్యార్థి తండ్రి భూపాలపల్లిరూ.10వేలు అడ్వాన్స్ ప్రైవేట్ కళాశాలల్లో సీట్ కావాలంటే కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.10వేలను అడ్వాన్స్గా చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కుడా సీట్ దొరకదేమోనన్న ఆతృత, ఫీజులో రాయితీ ఉంటుందో అన్నదానితో పీఆర్ఓలు వచ్చిన వెంటనే ఏ కళాశాల, బోధన ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకొని సీట్ బుక్ చేసుకుంటున్నారు. ఏసీ బుకింగ్ అయితే మరో రూ.10వేల నుంచి రూ.30వేల వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. టెన్త్ విద్యార్థుల కోసం ప్రైవేట్ కళాశాలల అన్వేషణ మెడికల్, ఇంజనీరింగ్ శిక్షణ ఇస్తామని ఎర ప్రైవేట్ పాఠశాలలకు ప్రత్యేక నజరానా రహస్యంగా విద్యార్థుల వివరాల సేకరణ పీఆర్ఓలను నియమించుకున్న సంస్థలు -
ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ
హన్మకొండ: ‘ప్రజాసమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది.. గెలుస్తాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేధ బాంక్వెట్ హాల్లో విలేకరులతో, సత్యం కన్వెన్షన్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నదని, పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అసంతృప్తి మూటగట్టుకుంటే.. కాంగ్రెస్ ఏడాదిలోనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అన్నారు. గ్యారంటీలు, హామీల అమలులో.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులందరినీ మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకుని శాసన మండలి ఉద్దేశాలను దెబ్బతీశారని అన్నారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి పులి సరోత్తంరెడ్డి, మెదక్–కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య, పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, అందరూ విజయం సాధించి తీరుతారని పేర్కొన్నారు. సరోత్తంరెడ్డికి ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, అన్ని సంఘాలు అభిమానించే వ్యక్తి అని చెప్పారు. జేఏసీలోని సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి, అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు, ఆర్.పి.జయంత్లాల్, డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, చాడా శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి -
జిల్లా జడ్జిని కలిసిన మున్సిపల్ కమిషనర్
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబును మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేశారు. భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వచ్చిన సందర్భంగా కలిసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్, వెల్నెస్ ప్రోగ్రాంపై శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, వారి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తుండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఉపాధ్యాయులకు సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఉపాధ్యాయులకు అవగాహర కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, పీహెచ్సీల వైద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన సీఎండీ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని శుక్రవారం రాత్రి సింగరేణి సీఎండీ బలరాంనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పురుషుల వార్డు, ఐసీయూల్లోకి వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో వసతులు, కావాల్సిన సౌకర్యాల గురించి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీఎం రాజేశ్వర్రెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సీఎండీకి వినతి భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు వినతిపత్రం అందజేసినట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, జీఓ నంబర్ 22 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరారు. ఈఎస్ఐ కార్డులు అందించాలని, సీఎంపీఎఫ్ పాసు బుక్కులు అప్డేట్ చేయాలని వినతిలో కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఆనంద్, రమేష్, సరళ, రమ, భిక్షపతి, బాబు, సారయ్య, శంకర్, సంపత్, తిరుపతి పాల్గొన్నారు. ఇసుక క్వారీ తనిఖీ మల్హర్: మల్లారం శివారులోని ఇసుక రీచ్ను మైనింగ్ ఏడీ స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్, ఆర్ఐ ప్రతాప్రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్వారీలోని ఇసుక నిల్వలపై ఆరా తీశారు. లారీలో ఇసుక ఎంత మేరకు తీసుకెళ్తున్నారు. లోడింగ్ ఎంత చేస్తున్నారు.. వేబ్రిడ్జి కాంటాను, రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేబిల్లు లేకుండా, లారీల్లో అధిక లోడ్తో ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని క్వారీ నిర్వాహకులను హెచ్చరించారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ భూపాలపల్లి అర్బన్: 2008 డీఎస్సీ అభ్యర్థులకు శనివారం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాకు 43మంది అభ్యర్థులను కేటాయించగా 37మంది అభ్యర్థులు హాజరై సర్టిఫికెట్లు పరిశీలించుకున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఎస్జీటీలు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేయనున్నారు. -
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సామగ్రికి ప్రసిద్ధి.. తెలంగాణ జానపద సంస్కృతిలో నిర్వహించే పూజల్లో భాగంగా ధరించే గజ్జెల లాగుల తయారీకి నడికూడ గ్రామం ప్రసిద్ధి. కొమురెల్లి మల్లన్న, ఐనవోలు, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతరలో, పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న జాతరల్లో ఈ గజ్జెల లాగులు, పసుపుపచ్చని అంగీలు ధరిస్తారు. వేములవాడ, కొండగట్టు, శ్రీశైలం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ తదితర తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చి సామగ్రిని తీసుకెళ్తారు. గజ్జల లాగులకు బ్రాండ్గా నడికూడ గ్రామం నిలుస్తోంది. వీటిని ధరించే వారు ఎంత నిష్టగా ఉంటారో.. తయారు చేసేవారూ అంతే నిష్టతో ఉంటారు.పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా.. ● వీటి తయారీని నమ్ముకున్న 200 మంది ● 60 ఏళ్లుగా ఉపాధి పొందుతూ..న్యూస్రీల్ -
టీజీఎండీసీ ప్రాజెక్టు మేనేజర్ బదిలీ
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల టీజీఎండీపీ ప్రాజెక్టు మేనేజర్ కె.శ్రీరాములును బదిలీ చేస్తూ ఆ శాఖ ఎండీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇక్కడికి నల్లగొండ జిల్లా నుంచి పి.రంగారెడ్డి పీఓగా రానున్నారు. ఆయన స్థానంలోకి శ్రీరాములు నల్లగొండకు బదిలీ అయ్యారు. శ్రీరాములుపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆశాఖ విచారణ జరిపి బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. శ్రీనివాస్కు సన్మానం ఏటూరునాగారం : రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్గా ఎన్నికైన వసంత శ్రీనివాస్ను మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో సన్మానించారు. బానాజీబందం గ్రామానికి చెందిన శ్రీనివాస్ డైరెక్టర్గా ఎంపికగా శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, చింతామణి జలపాతం, వనదేవత(దైత) అమ్మవారి ప్రాంత పరిసరాల్లో కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు చేసి హేమాచల కొండపైకి చేరుకున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం నిర్వహించారు.సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
ప్రత్యేక పూజలకు ఉపయోగించే సామగ్రి తయారీకి ప్రసిద్ధి నడికూడ
మాకు ఇదే జీవనాధారం నేను మా పూర్వీకుల నుంచి గజ్జల లాగుపోయడమే వృత్తిగా ఎంచుకున్నా. ఒక్కొక్క గజ్జెల లాగు తయారు చేయడానికి ఐదు రోజుల నుంచి వారం రోజుల సమయం పడుతుంది. చేతి పని ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇదే జీవనాధారం ఆదాయం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ దేవుడిపై భక్తితో ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. – బుర్ర రవీందర్, నడికూడ 20 ఏళ్లుగా వస్తున్నాను.. ఏ పట్నం వేయాలన్నా కావాల్సిన పూజా సామగ్రి కోసం నడికూడకు రావాల్సిందే. నేను 20 ఏళ్లుగా వచ్చి తీసుకుని వెళ్తున్నాను. రూ.12వేల నుంచి రూ.15 వేలలో నాణ్యమైన గజ్జెల లాగు సెట్టు దొరుకుతుంది. – రామ్మూర్తి, కేసముద్రం కొత్తకొండ ఈరన్న.. కొమురెల్లి మల్లన్న.. ఎములాడ రాజన్న.. ఓదెల, ఐనవోలు మల్లికార్జున స్వామి.. ఇలా దేవాలయాలు, జాతరలు ఏవైనా శివసత్తులు, పోతరాజులుంటేనే భక్తజన సందోహం. చిన్నపట్నం, పెద్దపట్నం, అమ్మవారి బోనాలు.. పూజా కార్యక్రమాల్లో పరవశించిన శివసత్తుల శిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఈరకోల ఆటలు.. మేకపోతులు, కోడిపుంజులను గావుపట్టే పూనకాలు భక్తులను మైమరిపిస్తాయి. ఆయా ఉత్సవాలకు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువుల తయారీ, సరఫరా కేంద్రం హనుమకొండ జిల్లా నడికూడలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర.. ప్రాంతాల్లోని పేరున్న దేవాలయాల్లో శివసత్తులు, పోతరాజులు, భక్తులకు సుమారు 60 ఏళ్లుగా గజ్జెల లాగులు మొదలు ఈరకోలలు, పట్నాల గొంగడి, ఢమరుకం, శూలం.. వరకు ప్రతి ఒక్కటీ నడికూడ నుంచే సరఫరా అవుతున్నాయి. ఇరవై కుటుంబాలు సుమారు 200 మంది నిరంతరం శ్రమిస్తూ ఉపాధి పొందుతుండగా.. ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు నడికూడకు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు. -
మేడారం జాతర సక్సెస్
ములుగు : మినీ మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎన్.రవీందర్ ఆధ్వర్యంలో భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని 1,000 మంది పోలీసులకు ఆయా ప్రాంతాల్లో భద్రత కోసం విధులు కేటాయించారు. బుధవారం నుంచి శనివారం వరకు జరిగిన జాతర రెండు చైన్స్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, సీసీ కెమెరాల ఆధారంగా సీసీఎస్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో 25 మంది సిబ్బందిని కేటాయించి అప్పటికప్పుడు వాటిని ఛేదించారు. దీంతో పాటు మంచిర్యాలకు చెందిన దొంగల ముఠాను గుర్తించి వారి నుంచి ఆటో, కారుతో పాటు రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన పర్యాటకురాలు పద్మ మినీ జాతరకు వచ్చి బ్యాగ్తో పాటు పాస్పోర్ట్ పోగొట్టుకోగా స్పందించిన పోలీసులు అరగంటలో ఛేదించి ఆమెకు పాస్పోర్టు అందజేశారు. ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి ఓఎస్డీ మహేష్ బిగితే ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా చర్యలు తీసుకున్నారు. జంపన్నవాగు నుంచి సమ్మక్క గద్దెల మీదుగా ఆర్టీసి బస్టాండ్ కి వెళ్లే దారిలో, చిలుకలగుట్టకు వెళ్లే దారిలో ప్రతి క్షణం ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు సక్సెస్ అయ్యారు. పస్రా సీఐ జి.రవీందర్ గత మేడారం అనుభవం జాతరలో చాలా ఉపయోగపడింది. -
జిల్లా జడ్జిని కలిసిన మున్సిపల్ కమిషనర్
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబును మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేశారు. భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వచ్చిన సందర్భంగా కలిసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్, వెల్నెస్ ప్రోగ్రాంపై శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. ఆరోగ్య విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, వారి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తుండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఉపాధ్యాయులకు సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఉపాధ్యాయులకు అవగాహర కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, పీహెచ్సీల వైద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన సీఎండీ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని శుక్రవారం రాత్రి సింగరేణి సీఎండీ బలరాంనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పురుషుల వార్డు, ఐసీయూల్లోకి వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో వసతులు, కావాల్సిన సౌకర్యాల గురించి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీఎం రాజేశ్వర్రెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సీఎండీకి వినతి భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు వినతిపత్రం అందజేసినట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, జీఓ నంబర్ 22 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరారు. ఈఎస్ఐ కార్డులు అందించాలని, సీఎంపీఎఫ్ పాసు బుక్కులు అప్డేట్ చేయాలని వినతిలో కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఆనంద్, రమేష్, సరళ, రమ, భిక్షపతి, బాబు, సారయ్య, శంకర్, సంపత్, తిరుపతి పాల్గొన్నారు. ఇసుక క్వారీ తనిఖీ మల్హర్: మల్లారం శివారులోని ఇసుక రీచ్ను మైనింగ్ ఏడీ స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్, ఆర్ఐ ప్రతాప్రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్వారీలోని ఇసుక నిల్వలపై ఆరా తీశారు. లారీలో ఇసుక ఎంత మేరకు తీసుకెళ్తున్నారు. లోడింగ్ ఎంత చేస్తున్నారు.. వేబ్రిడ్జి కాంటాను, రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేబిల్లు లేకుండా, లారీల్లో అధిక లోడ్తో ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని క్వారీ నిర్వాహకులను హెచ్చరించారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ భూపాలపల్లి అర్బన్: 2008 డీఎస్సీ అభ్యర్థులకు శనివారం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాకు 43మంది అభ్యర్థులను కేటాయించగా 37మంది అభ్యర్థులు హాజరై సర్టిఫికెట్లు పరిశీలించుకున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఎస్జీటీలు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేయనున్నారు. -
పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు చర్యలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: పీఎం శ్రీ పథకానికి ఎంపిక చేసిన పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖ అధికారులతో ఐడీఓసీ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకం కింద జిల్లాలోని ఎనిమిది పాఠశాలలు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆ పాఠశాలలకు రూ.73,76,640 నిధులు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.49,29,356 ఖర్చు చేశారన్నారు. మిగిలిన నిధులతో నిర్దేశించిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు, కంపోస్ట్, స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణ, సోలార్ విద్యుత్, గ్రీన్ పాఠశాలలు, ఏకో పార్కు, చారిత్రక ప్రాంతాలకు విజ్ఞాన, విహార యాత్రలు నిర్వహించాలన్నారు. డీఎస్సీ 2008లో ఎంపికై న అభ్యర్థులు జిల్లాలో 43 మంది ఉన్నారని, వారందరి విద్యార్హతలు పరిశీలించి పొరపాట్లుకు తావు లేకుండా పకడ్బందీగా నియామకాలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల నమోదు ఆపార్ ప్రక్రియ 58 శాతం పూర్తయిందని, వంద శాతం నమోదు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్, ఎఫ్ఏఓ కార్తీక్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
గజ్జెల లాగులు.. గవ్వల కుల్లలు
గజ్జెల లాగుశివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు ప్రీతి.. అత్యంత పవిత్రంగా చూస్తారు.. నీసు తగలనివ్వరు.. తల స్నానం చేయనిదే తాకనైనా తాకరు.. మట్టి రేణువులు కూడా లాగును తాకొద్దని నేలపై సంచులు పరిచి విప్పుతారు.. మిగతా వస్త్రాలతో కాకుండా వేరుగా శుభ్రం చేస్తారు.. భక్తులు అంత పవిత్రంగా భావించే ఆ లాగుల్ని తయారు చేస్తున్నాయి నడికూడ మండలకేంద్రానికి చెందిన కొన్ని కుటుంబాలు. ఆ గజ్జెల సవ్వడే భక్తుల నాదమవుతోంది. శివరాత్రి సమీపిస్తున్న సందర్భంలో శిగాలెత్తే శివభక్తుల అలంకరణ వస్తువులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షిప్రతినిధి, వరంగల్/నడికూడదేవతల ప్రతిమలు,ఢమరుకం● -
నిర్వహణకు నిధులేవి..?
కాటారం: రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మూడేళ్లుగా నిధుల మంజూరు లేకపోవడంతో రైతు వేదికల నిర్వహణ ఏఈఓలకు గుదిబండగా మారింది. సొంత ఖర్చులతో నిర్వహణ వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సేవలు అందేలా.. రైతువేదికల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వసతుల ఏర్పాటుతో పాటు స్టేషనరీ, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రతీ మంగళవారం రైతు నేస్తం, రైతు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించినప్పుడు హాజరైన రైతులు, ఇతరులకు టీ, బిస్కెట్లు అందజేయడంతో పాటు ఇతరత్రా వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్వహణ ఖర్చుల కింద గత ప్రభుత్వం నెలకు రూ.9వేలు అందిస్తామని ప్రకటించింది. మూడేళ్లుగా నిలిచిన నిధులు.. జిల్లాలో 45 క్లస్టర్లలో 45 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఐదు నెలల పాటు నెలకు రూ.9వేల చొప్పున గతంలో ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేసినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. 2022 మే నుంచి ఇప్పటి వరకు మూడేళ్లుగా ప్రభుత్వం రైతువేదికల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయకపోవడంతో విస్తరణ అధికారులు నెల నెలా ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతు వేదికకు నెలకు రూ.9వేల చొప్పున 36 నెలలకు గాను సుమారు రూ. 3.24 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అన్నింటి భారం ఏఈఓలపైనే... రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతుంది. కనీసం మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ద్యం, కరెంటు బిల్లుల చెల్లింపు, రైతులతో సమావేశాలు, ప్రభుత్వ చేపట్టిన రైతునేస్తం ముఖాముఖి కార్యక్రమాల నిర్వహణ సమయంలో టీ, బిస్కెట్లు, స్వీపర్ జీతం వంటి వాటికి నిధులు లేకపోవడంతో అన్నింటిని తామే భరించాల్సి వస్తుందని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏఈఓల వద్ద డబ్బులు లేకపోవడంతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రైతు వేదికల్లో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, వివిధ శాఖల సమావేశాల నిర్వహణ సైతం జరుగుతుంది. సమావేశం తర్వాత వేదికను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఏఈఓలపై పడుతోంది. రైతువేదికల్లో అటెండర్ నుంచి ఏఈఓ వరకు అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. మరోవైపు మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి, పైప్లైన్, నల్లాలు వంటివి సమకూర్చుకోవడానికి నిధులు లేక ఏఈఓలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలు, కోతుల బెడద కారణంగా జిల్లాలోని పలు రైతు వేదికల్లో మరమ్మతు పనులు నెలకొనగా నిధులు లేక అవి అలానే ఉండిపోతున్నాయి. రైతు వేదికల నిర్వహణ కోసం నెల నెలా నిధులు మంజూరు మంజూరు చేస్తే ఇబ్బందులు ఉండవని వ్యవసాయ విస్తరణాధికారులు పేర్కొంటున్నారు. నిధుల విడుదల నిలిచిపోయింది జిల్లాలోని రైతు వేదికల నిర్వహణ కోసం గతంలో ఐదు నెలలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుతం మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం వాస్తవమే. విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుద్ద్య నిర్వహణ కష్టతరంగా ఉంది. ప్రభుత్వం నిధులు మంజురు చేస్తుందేమో చూడాలి. – విజయ్భాస్కర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మూడేళ్లుగా రైతువేదికలకు అందని నిధులు తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఏఈఓల పాట్లు ఇబ్బందులు పడుతున్న వ్యవసాయశాఖ అధికారులుజిల్లా సమాచారం..మండలాలు – 12 రెవెన్యూ గ్రామాలు – 215గ్రామపంచాయతీలు – 242అగ్రికల్చర్ డివిజన్లు – 2 (భూపాలపల్లి, మహదేవపూర్) క్లస్టర్లు – 45రైతు వేదికలు – 45ఏఈఓలు – 45రైతులు – 1,16,756పంట సాగు – 2.52 లక్షల ఎకరాలు -
సెట్టు రూ.13వేల వరకు..
శివసత్తులు, పోతరాజులు, భక్తులు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువులు 10–12 రకాలను ఒక సెట్టుగా విక్రయిస్తారు. అవసరాలను బట్టి విడివిడిగా కూడా అమ్ముతారు. ఒక సెట్టులో ఎల్లమ్మ గవ్వలు, ఈరకోల, ఢమరుకం, వల, ప్రతిమలు, కాళ్ల గజ్జలు, తౌతులు, శూలం, గొంగళి, కుల్ల(గవ్వల టోపీ), నిలువు ప్యాంట్లు ఉంటాయి. నాణ్యతను బట్టి ఈ సెట్టును రూ.6వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత ఆకర్షించేలా మెషిన్ ఎంబ్రాయిడరీతో గజ్జెల లాగుల తయారీ వస్త్రాలపై దేవతల నమూనాలను కూడా వేస్తున్నారు. పూజకు కావాల్సిన ప్రతీ సామగ్రి ఇక్కడ లభిస్తుండడంతో జాతరల సీజన్లో వివిధ ప్రాంతాల భక్తులు నడికూడ బాట పడుతున్నారు. ఎల్లమ్మ గవ్వల బుట్ట -
భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం..
గజ్జెల లాగులు కొనడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం. వర్క్ కూడా చాలా బాగా ఉంటుంది. – రావుల సుమలత, నడికూడ నడికూడకు రావాల్సిందే.. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తారు. పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న ఏ జాతరైనా మా తాతల కాలం నుంచే గజ్జెల లాగుల కోసం నడికూడకు వచ్చేవారు. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. – రాజ్కుమార్ యాదవ్, సిరిసేడు, కరీంనగర్ జిల్లా -
వసతి గృహాల్లో మెరుగైన వసతులు
భూపాలపల్లి: వసతి గృహాల్లోని విద్యార్థులు బాగా చదువుకోవడానికి అవసరమైన వసతి, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతులు తదితర అంశాలపై ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, విద్యా, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ప్రణాళిక, ఎస్సీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ, జ్యోతిబా పూలే సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనపై అధికారులు అందచేసిన ప్రతిపాదనల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులు, సౌకర్యాలు కల్పనపై అందచేసిన ప్రతిపాదనలకు సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. వసతి గృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, హైమస్ట్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అన్ని వసతి గృహాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, కమిటీలు క్రమం తప్పక ఆహార నాణ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు క్రమం తప్పక వసతి గృహాల్లో మెనూ అమలును తనిఖీలు చేస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులు వెలకట్టలేని సంపద అని వెల్లడించారు. విద్యార్థులకు తాజా ఆహారాన్ని పెట్టాలని సూచించారు. సౌకర్యాలు, మరమ్మతులు ప్రతిపాదనలు సీపీఓకు అందచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యాశాఖ అధికారి రాజేందర్, సీపీఓ బాబురావు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు శైలజ, సునీత, గిరిజన సంక్షేమ శాఖ అకడమిక్ మోనిటర్ రాజరత్నం పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
డీసీసీబీ, ‘పాక్స్’ల పదవీకాలం పొడిగింపు
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు పదవిలో కొనసాగే విధంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం గడువు శుక్రవారంతో ముగియగా.. అదే రోజున మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే పదవీకాలం ముగిసిన గ్రామ పంచాయతీలు, ఎంపీపీ, జిల్లా పరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. సహకార సంఘాలకు కూడా ప్రత్యేక అధికారుల నియామకం ఇబ్బందికరం కాగా.. పాలకవర్గాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ‘పాక్స్’ల పదవీకాలం ఆరు నెలలు పొడిగించినట్లు చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి వరంగల్లో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాలు మరో ఆరు నెలలు సేవలు అందించనున్నాయి. ఇదిలా ఉండగా.. సహకార సంఘాల పదవీ కాలం పొడిగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖలకు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం -
డీసీసీ పీఠాలపై ఎవరు..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లపై కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంటోంది. ప్రభుత్వ పథకాల ప్రచారంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలు ఉండాలని అధిష్టానం భావిస్తోంది. ఈ ఏడాదంతా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. మరోవైపు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీల నియామకంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఎమ్మెల్యేలు లేదంటే సీనియర్లు.. టీపీసీసీ, అధిష్టానం సంకేతాల మేరకు త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త జిల్లా అధ్యక్షులు రానున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సమన్వయం చే యగలిగే వ్యక్తులను ఎంపిక చేయాలని ఆలోచిస్తు న్న అధిష్టానం.. ఆర్థికంగా బలంగా ఉండే వాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను గానీ, సీనియర్లను గానీ ఈసారి నియమించే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నా యి. హనుమకొండ జిల్లాలో ఇద్దరు, వరంగల్లో ముగ్గురు, మహబూబాబాద్లో ఇద్దరు అధికార పా ర్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జనగామలో ఇద్దరు, ము లుగు, జేఎస్ భూపాలపల్లిలో ఒక్కరేసి ఉన్నారు. ● హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి కొనసాగాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని అధిష్టానం కోరుతున్నా ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. పార్టీ సీనియర్, తనకు అనచరుడిగా ఉండే ఇద్దరు పేర్లు సూచిస్తున్నట్లు చెబుతున్నారు. ● వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలని కొందరు.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని మరికొందరు సూచించినట్లు సమాచారం. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి నిర్ణయం ఫైనల్ కానుంది. ● మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భరత్చందర్రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిల నిర్ణయం కీలకంగా కానుంది. ● జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడు అయిత ప్రకాశ్రెడ్డి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నందున.. ఆయననే కొనసాగించాలా? మార్చాలా? అన్న విషయమై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో టీపీసీసీ చర్చించింది. ● ములుగు జిల్లా నుంచి మళ్లీ పైడాకుల అశోక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ● జనగామ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడుతోంది. కొమ్మూరి ప్రతాప్రెడ్డిని కొనసాగించలేని పరిస్థితి వస్తే ఎలా? అన్న చర్చపై ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అత్త, పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పేరును ఆ జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు ప్రచారం ఉంది. అనివార్యంగా మారిన డీసీసీ అధ్యక్షుల నియామకం.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల తర్వాత రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డీసీసీ కమిటీలను ప్రకటించారు. రెండు విడతల్లో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మొదటి విడతలో నియమితులైన అధ్యక్షుల పదవీకాలం రెండేళ్లు దాటిపోగా.. రెండో విడత డీసీసీలకు రెండేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి కొత్త కమిటీల ఏర్పాటు అనివార్యంగా మారింది. 2022, డిసెంబర్ 10న హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా నాయిని రాజేందర్ రెడ్డి, నల్లెల కుమారస్వామి, జె.భరత్చందర్రెడ్డిలను నియమించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ములుగు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి అనారోగ్యంతో మృతిచెందాడు. 2023, మే 16న కుమారస్వామి స్థానంలో పైడాకుల అశోక్ను ములుగు అధ్యక్షుడిగా.. వరంగల్కు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జయశంకర్ భూపాలపల్లికి ప్రకాశ్రెడ్డిలను నియమించారు. జనగామ జిల్లా అధ్యక్షుడి నియామకం అప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి మధ్య వివాదంగా మారినా.. చివరకు కొమ్మూరి ప్రతాప్రెడ్డినే నియమించారు. ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది రేవంత్రెడ్డి సీఎం కావడం, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్ నియమితులయ్యారు.జిల్లా కాంగ్రెస్ కమిటీలపై టీపీసీసీ కసరత్తు ‘స్థానిక’ ఎన్నికలే లక్ష్యంగా కొత్త కమిటీలు జిల్లా అధ్యక్షుల నియామకంపై అభిప్రాయ సేకరణ ఎమ్మెల్యేలు, సీనియర్లతో అధిష్టానం సంప్రదింపులు అవకాశం రాని సీనియర్లకు టీపీసీసీలో స్థానం నెలాఖరులో కొలిక్కి వచ్చే అవకాశం -
సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి భవిష్యత్లో ఐదు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సంస్థ సీఎండీ బలరాంనాయక్ తెలిపారు. సింగరేణి కార్మిక చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లుతో కలిసి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1, 5, 6, 8, ఓసీపీ–2, 3 గనులను సందర్శించారు. అంతకుముందు కేటీకే 5వ గని ఏర్పాటుచేసి బలరామ నందనవనంను సీఎండీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. భూగర్భ గనులు నష్టాల బాటలో ఉన్నాయని, వాటిలో సౌకర్యాలు మెరుగుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఏరియాలో తాడిచర్ల, వెంకటాపూర్ బ్లాక్లను సింగరేణికి కేటాయించి బొగ్గు ఉత్పత్తి చేపట్టేలా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు కృషి చేస్తున్నట్లు వివరించారు. సింగరేణి అధికారుల అలసత్వంతోనే సంస్థలో క్షేత్రస్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి రావడం లేదని.. అందులో భాగంగా కార్మిక చైతన్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ తమకు కేటాయించిన విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలన్నారు. భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవుతూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషిచేయాలని ఆదేశించారు. గనులలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో చైర్మన్ మాట్లాడి వారికి కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ అలసత్వాన్ని వదిలి ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ఆస్పత్రుల అడ్మినిస్ట్రేషన్కు మిలిటరీ డాక్టర్ను నియమిస్తున్నట్లు తెలిపారు. సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్న సందర్భంగా వారికి కావలసిన అన్ని ఏర్పాట్లను సంస్థ చేస్తుందని అన్నారు. సంస్థలో చేరిన మహిళలకు ఈపీ ఆపరేటర్లుగా వెళ్లడానికి అవకాశం ఉందని.. దానిని మహిళా కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, కార్పొరేట్ జీఎంలు మనోహర్, రఘునాథరెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, అధికారులు వెంకటరామరెడ్డి, వెంకటరమణ, జాకీర్హుస్సేన్, గుర్తింపు, పాతినిధ్య సంఘాల నాయకులు కొరిమి రాజ్కుమార్, రాజేందర్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. అలసత్వం వీడితేనే అభివృద్ధి సమస్యలు తెలుసుకునేందుకు కార్మిక చైతన్య యాత్ర సింగరేణి సీఎండీ బలరాం -
శనివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వీఐపీ ఘాటు నుంచి సాధారణ పుష్కర ఘాటు వరకు భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. స్నానాలు చేసిన అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు, దర్శనాలు చేసుకుంటారు. మహాశివరాత్రి రోజున సుమారు లక్షకుపైగా భక్తులు పుణ్యస్థానాల చేసి దర్శనాలకు వెళుతుంటారు. సరస్వతీ పుష్కరాలకు 12 రోజుల పాటు రోజుకు 50వేల నుంచి లక్ష వరకు భక్తులు స్నానాలు చేస్తారని అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్నానాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం ముందస్తుగా గోదావరి ప్రాంతంలో కిలోమీటర్ మేర రక్షణ వలయాలు, ఎరుపు రంగు జెండాలు ఏర్పాటు చేయాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, చెన్నూర్, గోదావరిఖని, మంథని, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, జనగామ, బెల్లంపల్లి, మందమర్రి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కాటారం, మహారాష్ట్ర వైపు సిరొంచ తదితర ప్రాంతాల యువకులు ఇక్కడ మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు, ఎరుపు రంగు జెండాలు, గజ ఈతగాళ్లను జిల్లా అధికార యంత్రాంగం ముందస్తుగా ఏర్పాటు చేయాలి.కాళేశ్వరంలోని త్రివేణిసంగమ గోదావరి పుణ్యస్నానాలకు గోదావర్రీ కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 25 నుంచి 27 వరకు మహా శివరాత్రి ఉత్సవాలు, మే 15నుంచి 26వరకు సరస్వతీ నది పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. వేసవి సమీపిస్తుండడంతో గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతుంది. గోదావరిలో అక్కడక్కడా ఇసుక తరలిపోయి కయ్యలు, గోతులు ఏర్పడ్డాయి. దీంతో భక్తులు పుణ్యస్నానాలకు దిగి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. దేవాదాయ, ఇరిగేషన్, పోలీసు, పంచాయతీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. రక్షణ ఏర్పాట్లు అధికారయంత్రం చేపట్టడం లేదు. ఎంతో మంది మృత్యువాత.. యువత, పెద్దలు, మహిళలు, చిన్నారులు గోదావరిలో దైవదర్శనానికి వచ్చి స్నానాలకు దిగి లోతు ప్రవాహంలో చిక్కుకుని మృత్యుఒడికి చేరిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. కొంతమంది యువకులు ఈత వచ్చిన వారు కూడా గోతులు, కయ్యల్లో పడి మృతిచెందారు. ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై తమ తల్లుల కడుపుకోతను మిగిల్చారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత అర్ధాంతరంగా గోదారి పాలు కావడంతో తల్లిదండ్రుల రోదనలే మిగిలుతున్నాయి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. నిత్యం విధుల నిర్వహణ.. గోదావరి వద్ద ఉత్సవాల రోజుల్లో కాకుండా నిత్యం ప్రమాద హెచ్చరిక బోర్డులు, రక్షణ వలయాలు, గత ఈతగాళ్లు గోదావరిలో ప్రమాదాల నివారణకు విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేయాలి. సంబంధితశాఖ తమ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కాపాడుతున్న పోలీసులు.. ఆత్మహత్యకు పాల్పడేవారు సైతం కాళేశ్వరం త్రివేణి సంగమం గోదావరికి వచ్చి పురుగుల మందు, నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంట్లో గొడవపడి వచ్చిన అలాంటి వారిని సైతం చాలామంది వృద్ధులను, మహిళలను స్థానికులు పోలీసులు కాపాడి తమ వారికి అప్పగించారు. బ్యాక్ వాటర్తో పెన్సింగ్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 100ఎఫ్ఆర్ లెవల్ వరకు నీటి ప్రవాహం పెరిగితే భక్తులు స్నానాలు చేసేందుకు ఫెన్సింగ్ను కాళేశ్వరం పుష్కరఘాటు పొడవునా నిర్మించారు. అప్పుడు భక్తులు పెన్సింగ్ ఇవుతల స్నానాలు చేసేవారు. కానీ ఇప్పుడు మేడిగడ్డ బరాజ్లో నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో బ్యాక్వాటర్ నిల్వ లేదు. దీంతో గోదావరిలో నీరు రోజురోజుకూ తగ్గుతుంది. స్నానాలకు వచ్చే భక్తులకు సైతం నీటిలో చాలా దూరం వరకు వెళ్లాల్సి వస్తుంది. రక్షణ చర్యలు చేపడుతాం.. భక్తులు లోతు ప్రవాహంలోకి వెళ్లకుండా మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాల కోసం ముందస్తుగానే రక్షణ చర్యలు తీసుకుంటాం. సంబంధిత శాఖలో సమన్వయంతో కలిసి పనిచేస్తాం. నిత్యం రక్షణ వలయాలు ఉండేలా ప్లాన్ చేస్తాం. ఉత్సవాలు జరిగినప్పుడే కాకుండా నిత్యం ఉండేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళుతాం. – తిరుపతిరావు, ఈఈ, ఇరిగేషన్శాఖ, మహదేవపూర్న్యూస్రీల్కిలోమీటరు మేర.. ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు శూన్యం వివిధ రాష్ట్రాల నుంచి పుణ్యస్నానాలకు భక్తజనం రాక కయ్యలు, గోతుల్లో లోతు తెలియక ప్రమాదాలు కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయని అధికారులు -
ఉపాధ్యాయులు సమర్థవంతంగా పనిచేయాలి
భూపాలపల్లి అర్బన్: ఉపాధ్యాయులు సమర్థవంతంగా పని చేసి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని డీఈఓ రాజేందర్ ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. విద్యార్ధులు చదవడం, రాయడం, సంఖ్యా భావన, ప్రక్రియల చతుర్విద ప్రక్రియల్లో సామర్థ్యాలను పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించే విధంగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, సెక్టోరియల్ అధికారి రాజగోపాల్, ఉపాధ్యాయులు పాల్గోన్నారు. సాంకేతికతను వినియోగించాలి రేగొండ: విద్యా భోధనలో సాంకేతిక నైపుణ్యాలను వినియోగించి, భోదించడం వల్ల అర్థవంతమైన విద్యాభోదన సాధ్యమౌతుందని డీఈఓ రాజేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కొనసాగుతున్న కాంప్లెక్స్ స్థాయి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్పీ)పై నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ తరగతులను కొనసాగించడం వల్ల విద్యార్థి ప్రత్యక్ష అనుభూతికి లోపై అవగాహన చేసుకుంటాడని అన్నారు. తరగతిలో అవసరం మేరకు సాంకేతికతను వినియోగించాలన్నారు. అలాగే కోటంచ ప్రాథమిక పాటశాలలో విద్యార్థుల గణిత నైపుణ్యాలను పరిశీలించి, ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన విధానాన్ని పరిశీలించారు. శిక్షణ శిబిరంలో మండల విద్యాధికారి వేల్పుల ప్రభాకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి, క్వాలిటీ కో ఆర్డినేటర్ లక్ష్మన్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రాజగోపాల్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రెటరీ కిషన్రెడ్డి ఉన్నారు.డీఈఓ రాజేందర్ -
వందశాతం పన్నులు వసూలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణంలో రావాల్సిన అన్ని రకాల పన్నులను వంద శాతం వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పేరుకుపోయిన ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ల రూపంలో పన్నులపై అలసత్వం వహించ వద్దని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 40శాతం పన్నులు మాత్రమే వసూళ్లు చేశారన్నారు. సమన్వయంతో పని చేస్తేనే వంత శాతం లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించి పన్నులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు సహకరించాలని కోరారు. డంపింగ్ యార్డ్ పరిశీలన సీఆర్ నగర్ సమీపంలోఓని డంపింగ్ యార్డ్, వర్మి కంపోస్ట్ షెడ్, డీఆర్సీసీ, ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లను మంగళవారం కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఆయా సెంటర్లలో జరుగుతున్న పనులు పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో సేకరించిన చెత్తను వర్మి కంపోస్ట్ తయారు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని. డంపింగ్ యార్డ్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరు. విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు మానస, దేవేందర్, సానిటరీ ఇన్ప్ఫెక్టర్ నవీన్, జవాన్లు పాల్గొన్నారు.మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ -
ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం
ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ ములుగు: నేటినుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నల్లాలు, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునే గదులను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య పనులు చేపట్టారని, వైద్యశాఖ తరఫున శిబిరాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. అమ్మవారి గద్దెల ప్రాంగణంలో, క్యూలైన్ వద్ద ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. ఏటూరునాగారం మండలం కొండాయి, ఐలాపూర్ మినీ మేడారం జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ తరఫున చిన్నబోయినపల్లి నుంచి కొండాయి వరకు, ఊరట్టం నుంచి కొండాయి వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకొని ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
మొగుళ్లపల్లి: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మండలంలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల హాజరు నమోదు పట్టిక, ల్యాబ్, ఫార్మాసి, వార్డులను తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, వైద్య సేవలుకు ఎలాంటి ఇబ్బంది రావొద్దన్నారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వంటగది, డైనింగ్ హాల్, విద్యార్థుల కోసం తయారు చేసిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతి రోజు భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్దేశిత డైట్ మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్ర పై అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక అధికారి, వార్డెన్ ప్రతి రోజు భోజ నాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యమైన కూరగాయలు, మాంసం అందించాలని పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్ధార్ సునీత, ఎంపీడీఓ హుస్సేన్, ప్రత్యేక అధికారి శారద, ఏటీపీలు ప్రభాకర్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. భూముల పరిశీలన.. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రహదారి నిర్మాణంలో కోల్పోతున్న రైతుల వ్యవసాయ భూములను కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు. మండలంలోని ఇస్సీపేట, రంగాపురం గ్రామాలలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పుతున్న రైతులతో మాట్లాడారు. నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు నూతనంగా నిర్మిస్తున్న నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే భూపాలపల్లి జిల్లాలో టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల మీదుగా వెళ్తున్న క్రమంలో భూ సేకరణ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సీపేట, రంగాపూర్, మేదరమెట్ల, మొగుళ్లపల్లి గ్రామాల్లో సుమారు 8.78 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే వెళ్తున్న క్రమంలో రైతులనుంచి భూసేకరణ చేపట్టామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు పరిహారం అందిస్తామన్నారు. రంగాపూర్ గ్రామ శివారులో 20 ఎకరాల విస్తీర్ణంలో రెస్ట్ పాయింట్ (పార్కింగ్ ఏరియా)ఏర్పాటు చేస్తున్నారని నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి దానిని ప్రభుత్వ భూమి ఉన్న చోటకు మార్చాలని రైతులు కోరగా నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి మార్చుటకు ప్రయత్నిస్తానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ హైవే పీడీ దుర్గా ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఏడీ సునీల్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ సునీత, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
‘మండమెలిగె ’కు పూజారులు సిద్ధం..
బుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025– 8లోuమేడారం, కన్నెపల్లిలో మండమెలిగె పండుగకు పూజారులు సిద్ధమయ్యారు. మంగళవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు సమావేశమై మండమెలిగె పూజా కార్యక్రమాలపై చర్చించుకున్నారు. బుధవారం, గురువారం రెండు రోజులు జరగనున్న పూజా కార్యక్రమాలపై సమావేశంలో సమీక్షించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. దేవాదాయ శాఖ తరఫున పూజారులకు దుస్తులు, పూజా సామగ్రిని అధికారులు అందించారు. మండమెలిగె పండుగ సందర్భంగా మేడారం, కన్నెపల్లిలోని ఆదివాసీలు, ఆదివాసేతరులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ మినీ జాత ర (మండమెలిగె) పండుగ నేటి (బుధవారం) నుంచి ప్రారంభంకానుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాలు, గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. జాతర మొదటి రోజు (బుధవారం) మేడారం, కన్నెపల్లిలోని అమ్మవార్ల ఆలయాల్లో మండమెలిగె పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు నిర్వహించనున్నారు. ముందుగా సమ్మక్క గుడి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆడపడుచులు రంగవల్లులు వేసి ముస్తాబు చేస్తారు. డోలు వాయిద్యాలతో తూర్పు, పడమర పొలిమేర్లలో ధ్వజస్తంభాలు (దిష్టి తగలకుండా) మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ముందుగా పూజారులు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేస్తారు. అనంతరం గుడికి చేరుకొని అమ్మవారి దీప, ధూపాలతో పూజలు నిర్వహించి యాటతో నైవేద్యం సమర్పిస్తారు. రాత్రి సమయంలో పూజారులు అమ్మవారి పూజాసామగ్రి, పసుపు, కుంకుమలను తీసుకొని డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు వెళ్లి అమ్మవారి గద్దె వద్ద కూడా పూజలు చేస్తారు. అలాగే, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కూడా సారలమ్మ పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహించి రాత్రి సమయంలో గద్దెల ప్రాంగణంలోకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క–సారలమ్మ పూజారులు గద్దెల వద్ద కలుసుకొని శాకాహానం (ఇప్పపువ్వు సారా) ఇచ్చి పుచ్చుకొని రాత్రంతా గద్దెల వద్ద డోలు వాయిద్యాలతో జాగారం చేస్తూ సంబురాలు జరుపుకుంటారు. నేటినుంచి మినీ మేడారం (మండమెలిగె) ముస్తాబైన మేడారం ● ఆదివాసీ సంస్కృతీసంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలుముస్తాబైన గద్దెల ప్రాంగణం... దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని శుభ్రం చేసి విద్యుత్ దీపాలతో ఆలకరించారు. భక్తుల క్యూలైన్లపై చలువ పందిళ్లు వేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో పాటు అమ్మవార్ల గద్దెలు జిగేల్మనేలా సాలాహారం చుట్టూ విద్యుత్ దీపాలను అలంకరించారు. మధ్యాహ్నం సమయంలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రాంగణ ఆవరణలో కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేశారు. న్యూస్రీల్జల్లు స్నానాలకు తిప్పలే..? -
బర్డ్ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి
కాటారం: పలు ప్రాంతాల్లో బర్డ్ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల పెంపకదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పశువైద్యాధికారి, సిబ్బంది కాటారం మండలంలోని గట్లకుంట, గంగారం గ్రామాల్లోని పౌల్టీఫాంలను పరిశీలించారు. ఫాంలో పెరుగుతు న్న కోళ్ల ఆరోగ్య పరిస్థితి, నిర్వాహణపై ఆరా తీశా రు. కోళ్లఫాంలలో అకారణంగా కోళ్లు చనిపోతే వెంటనే పశువైద్యాధికారులకు సమచారం అందించా లని సూచించారు. ఫాంల నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బర్డ్ఫ్లూ వ్యాధి.. కోళ్లు, ఇతర పక్షుల నుంచి మనుషులకు, జంతువులకు తొందరగా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. బర్డ్ఫ్లూ సోకిన కోళ్ల ముక్కు, కళ్లు, నోటి నుంచి స్రావాలు కారుతాయని శ్వాస తీసుకోవడం వాటికి ఇబ్బంది గా ఉంటుందని, దగ్గు, గురక శబ్ధం వచ్చి ఆకలిమందిగించడం లాంటి లక్షణాలు ఉంటాయని తెలిపా రు. కోళ్లలో ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే సమాచారం అందించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో బర్డ్ఫ్లూ ప్రభావం లేదన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పశువైద్యశాలను సందర్శించి రికార్డులు, మందుల స్టాక్ పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ధీరజ్, పశువైద్యులు రమేశ్ ఉన్నారు.జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి -
ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దు
భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దని ఎస్పీ కిరణ్ ఖరే జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయంచేయాలని ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు.ఎస్పీ కిరణ్ ఖరే -
బొమ్మల కొలువు
భూపాలపల్లి అర్బన్: మంజూర్నగర్లోని ఇల్లందు లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ఏరియాలో బొమ్మల కొలువు నిర్వహించారు. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి దేవాలయం నమూనాతో ఏర్పాటు చేసిన బొ మ్మల కొలువు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి సీఎండీ సతీ మణి శారద బలరాం హాజరై సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి, లేడీస్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. బొమ్మల కొలువును ప్రారంభిస్తున్న సీఎండీ సతీమణి శారద -
ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలను నిర్వహించినట్లు ఫోరం జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రథమ బహుమతి ఎన్.సందీప్ (టైబల్ వెల్ఫేర్ కాటారం), రెండో బహుమతి కె.అలేఖ్య(జెడ్పీహెచ్ఎస్ కాళేశ్వరం), మూడో బహుమతి అభి రఘువరన్కల్యాణ్ (ట్రైబల్ వెల్ఫేర్, కాటారం) సాఽధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు లక్ష్మన్, రమేష్, రాజగోపాల్, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి గండు రాజబాబు, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోటెత్తిన ఎర్రబంగారం
మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ ఏనుమాముల మార్కెట్లో విక్రయించేందుకు రైతులు పెద్ద మొత్తంలో మిర్చి బస్తాలు తీసుకువస్తున్నారు.– 8లోuఈ ఫొటోలో కనిస్తున్నది జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి సబ్సెంటర్–2. 2023 ఆగస్టు మాసంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పనులు ప్రారంభించారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు. ఫిల్లర్ల దశలోనే ఉంది. ఎనిమిది నెలలుగా పనులు నిలిచిపోయాయి. సొంత భవనం లేకపోవడంలో అద్డె భవనంలో సబ్ సెంటర్ కొనసాగుతుండగా.. సరైన సౌకర్యాలు లేక అక్కడికి వచ్చే బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. -
అసంపూర్తిగా పల్లె దవాఖాన నిర్మాణాలు
మంగళవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సా..గుతున్న పనులుభూపాలపల్లి అర్బన్: పల్లె దవాఖాన భవన నిర్మాణ పనులు మూడేళ్లుగా సా..గుతున్నాయి. దీంతో పల్లె దవాఖానాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా.. 17 భవనాల పనులు మాత్రమే పూర్తిచేశారు. జిల్లాలో ఉపకేంద్రాల పరిస్థితి జిల్లాలోని 13 ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 90 ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటిలో 21 పాత భవనాలలో నిర్వహిస్తున్నారు. 63 భవనాలకు అఽధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. వాటిలో ఆరు భవనాలకు మినహా మిగితా 57కు అనుమతులు జారీచేసి నిధులు కేటాయించారు. నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో 41 భవనాలు, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఆరు భవనాలు, ఐటీడీఏ కింద రెండు, రూర్బన్ పథకంలో రెండు భవనాలకు నిధులు మంజూరయ్యారు. ఒక్కో భవనానికి రూ.20లక్షలతో పనులు చేపడుతున్నారు. ఎన్హెచ్ఎం కింద ఒక భవనానికి టెండర్ కాలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనా ఆరు భవనాల పనులు చేపట్టగా.. నిధులు రాక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్హెచ్ఎం కింద ఆరు భవనాలు మాత్రమే పూర్తిచేయగా మిగతా 15 నిర్మాణ దశలో ఉండగా.. ఇంకా నాలుగు నిర్మాణ పనులే ప్రారంభించలేదు. ఆరు గ్రామాల్లో స్థల వివాదాలు ఉన్నాయి. నిధులు రాక నిర్మాణాలు ఆలస్యం.. జిల్లాలో ఎన్హెచ్ఎం, 15వ ఆర్థిక సంఘం నిధులతో గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 57 ఆరోగ్య ఉపకేంద్రాల భవనాలకు నిధులు మంజూరయ్యాయి. నిధులు రాక పలుచోట్ల భవన నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇటీవల నిధులు విడుదలయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పనులు వేగవంతం చేస్తాం. పనులు పూర్తిచేసిన భవనాలు ప్రారంభించాం. – డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి●న్యూస్రీల్ఆయా మండలాల పరిధిలో..వివిధ మండలాల పీహెచ్సీల పరిధిలోని ఇస్సిపేట, కొత్తపల్లిగోరి, చల్లగరిగె, బుద్దారం, మైలారం, వేములపల్లి, గణపురం–1, రాఘవరెడ్డిపేట, నిజాంపల్లి, రేగులగూడెం, జూకల్ గ్రామాల్లో పనులు ప్రారంభంకాలేదు. పలిమెల, భూపాలపల్లి–2, కొండాపూర్, సీతారాంపూర్, ఒడిపిలవంచ, మెట్లపల్లి, పిడిసిల్ల, రంగాపూర్, కనిపర్తి, తాడిచర్ల–1, గర్మిళ్లపల్లి, వెలిశాల, కోటంచ, ఎడ్లపల్లి, టేకుమట్ల, కొత్తపల్లి, భాగిర్తిపేట, చెన్నాపూర్, రంగయ్యపల్లి, సుల్తాన్పూర్, మడ్తపల్లి, మొగుళ్లపల్లి గ్రామాల్లోని సబ్సెంటర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మూడేళ్లలో పూర్తి చేసినవి 17 భవనాలే.. జిల్లాలో 90 సబ్ సెంటర్లు నూతనంగా 57 సబ్ సెంటర్లకు నిధులు మంజూరు పలు గ్రామాల్లో స్థల వివాదాలు -
పకడ్బందీగా పోలింగ్ ప్రక్రియ
భూపాలపల్లి: ఈ నెల 27న జరుగనున్న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, రూటు, సెక్టార్, నోడల్ అధికారులకు సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 329 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు 13మంది పీఓలు, 12మంది ఏపీఓలు, 24మంది ఓపీఓలను నియమించామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, శిక్షణ నోడల్ అధికారి సీపీఓ బాబురావు, ఆర్డీఓ రవి తదితరులు పాల్గొన్నారు. బోర్లు మంజూరు చేయాలి.. మా తోట కార్యక్రమంలో భాగంగా పండ్లతోటలు సాగు చేస్తున్న రైతులకు బోర్ బావులు మంజూరు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం రెవెన్యూ, అటవీ, ‘మా తోట’ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో నాబార్డు ఆధ్వర్యంలో మా తోట కార్యక్రమాన్ని చేపట్టి గిరిజన రైతులు పండ్ల తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని మొక్కల సంరక్షణకు నీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నందున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు బోరుబావులు మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి పాల్గొన్నారు. రైతులకు బోర్లు మంజూరు చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
భూపాలపల్లి రూరల్: గ్రూప్–1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు, ఉచిత శిక్షణ కోసం ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల నిరుద్యోగ యువతీ యువకులు, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి కార్యాలయం, కలెక్టరేట్, రూమ్ నంబర్ 5లో సంప్రదించాలన్నారు. బ్లాక్ లెవల్ క్రీడాపోటీలు భూపాలపల్లి అర్బన్: నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి చింతల అన్వేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాలీబాల్, గ్రూప్ రన్నింగ్, షెటిల్ సింగిల్స్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయస్సులోపు ఆసక్తిగల యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల క్రీడాకారులు జిల్లా యూత్ క్లబ్ అధ్యక్షుడు చల్ల దీపక్ 75697 68191 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు. ఉత్తమ సేవలు భూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేశామని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారు డు తన అప్లికేషన్ స్థితిని ట్రాకింగ్ సిస్టంద్వారా తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు. అప్లికేషన్ నంబర్తో టీజీఎన్పీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి 1912కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో బర్డ్ఫ్లూలేదు భూపాలపల్లి రూరల్: జిల్లాలో కోళ్లకు బర్డ్ఫ్లూ లేదని, వినియోగదారులు, కోళ్ల యజమానులు అధైర్యపడవద్దని జిల్లా పశు, సంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి అశోద సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా చలిలో వ్యాప్తి చెందుతుందని, ఇప్పటికే జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని కోళ్లకు ఇబ్బంది లేదన్నారు. కోళ్లు నిరసించినట్లయితే మండల పశువైద్యాధికారుల సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి నివారణ అవగాహన కోసం కోళ్ల ఫారాల యజమానులతో 12న బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తాడిచర్లలో క్షుద్రపూజల కలకలం మల్హర్: తాడిచర్ల శివారులోని తోళ్లపాయ వైపు.. పెద్దమ్మ గుడి, బీసీ కాలనీ పోయే మూడు బాటల వద్ద ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయడం కలకలం రేగింది. మూడు రోడ్లు కలిసే చోట నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో కూడిన ముద్దలు చేసి, గొర్రె పిల్లను బలిచ్చారు. క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురువుతున్నారు. ఈ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. మరి కొంతమంది రైతులు బిక్కుబిక్కుమంటూ వారి పనులకు వెళ్తున్నారు. -
జోరుగా ‘ఉపాధ్యాయ’ నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి చివరిరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులనుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నామినేషన్లు స్వీకరించారు. సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు వేయగా.. మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి దాఖలు వేశారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో మంగళవారం వాటి పరిశీలన జరగనుంది. వాటిల్లో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. భారీగా సమావేశాలు, ర్యాలీలు ఇంతకుముందే నామినేషన్లు వేసిన వారు కూడా సోమవారం పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి మరోసెట్ దాఖలు చేశారు. అందులో ప్రధాన సంఘాల మద్దతు కలిగిన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్రెడ్డి, పులి సరోత్తమ్రెడ్డి, పూల రవీందర్, ఎస్.సుందర్రాజు యాదవ్ తదితరులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. పూల రవీందర్ బహుజన వాదంతో పెద్దఎత్తున ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయగా, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి కూడా ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా, టీపీయూఎస్ మద్దతుతో పులి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించారు. సుందర్రాజు యాదవ్ వాహనాల్లో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. సుందర్రాజుయాదవ్, పూల రవీందర్ నామినేషన్ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జేఏసీ అభ్యర్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి గతంలోనే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు కూడా హర్షవర్ధన్రెడ్డి తరఫున ఆయన కూతురు హేమంత సంధ్యారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు వేశారు. 13 వరకు ఉపసంహరణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బుధ, గురువారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 13వ తేదీన 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి చివరి రోజున 18 మంది నామినేషన్ మొత్తంగా 23 మంది 50 సెట్లు దాఖలు భారీ ర్యాలీలతో హోరెత్తిన నల్లగొండ నేడు నామినేషన్ల పరిశీలనఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య 25,797 నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు పెరిగారు. డిసెంబరు 30న ప్రకటించిన జాబితా ప్రకారం ఉపాధ్యాయ ఓటర్లు 24,905 మంది ఉన్నారు. అయితే నామినేషన్ల వరకు కూడా ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. దీంతో మరో 892 మంది ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. తుది ఓటరు జాబితాకు ఈ సప్లిమెంటరీ జాబితా జత చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 25,797 మంది ఓటర్లు ఉన్నారు. -
మినీ మేడారానికి సిద్ధం
వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. రాత్రివేళ కాస్త చలితో పాటు మంచు కురుస్తుంది.– 8లోuఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 15వ తేదీ జరగనున్న జాతరకు వచ్చే భక్తుల సేవల కోసం అన్ని ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్టీసీ కూడాబస్టాండ్ కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఆగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారించేందుకు మేడారం ఎండోమెంట్ కార్యాలయంలో ఒక ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచారు. అడుగడుగునా నిఘా.. మేడారంలో భక్తుల రద్దీ, దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా నిత్యం పర్యవేక్షించేందుకు అర్టీసీ బస్టాండ్ ప్రాంతం, ఆర్టీసీ వై జంక్షన్, మేడారం ఐలాండ్ ప్రాంతం, గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు, తదితర ప్రాంతాల్లో గతంలో ఉన్న సీసీ కెమెరాలను మరమ్మతులు చేయించారు. అన్నింటినీ మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. ఫుటేజీలను నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తాత్కాలిక డ్రెసింగ్ గదుల ఏర్పాటు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు జీఆర్ షీట్స్తో 10 తాత్కాలిక డ్రెసింగ్ గదులను అందుబాటులో ఉంచారు. భక్తుల జల్లు స్నానాల కోసం కూడా 10 బాటరీ ఆఫ్ ట్యాప్లను ఏర్పాటు చేశారు. ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వ్యాపారస్తులకు కోళ్ల, మేకల వ్యర్థాలను వేసేందుకు డస్ట్బిన్లను పంపిణీ చేశారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కుగా కోళ్ల సమర్పిచండంతో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు వేయకుండా షాపుల వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు. గద్దెల సమీపంలో, రోడ్ల వెంట, భక్తులు విడిది చేసే షెడ్ల వద్ద ఈగలు, దోమలు వ్యాపించకుండా కెమికల్ పిచికారీ చేశారు. – వివరాలు 8లోu ముగింపు దశకు చేరుకున్న పనులు రేపటినుంచి 15వ తేదీ వరకు జాతరభారీ పోలీస్ బందోబస్తు జాతర విధులకు వెయ్యి మంది సిబ్బంది బుధవారం నుంచి ఆదివారం వరకు కొనసాగనున్న భద్రత -
మళ్లీ పులి సంచారం..!
కాటారం: మండలంలోని నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం ప్రకంపనలు సృష్టిస్తుంది. అడవి ప్రాంతంలో తప్పిపోయిన ఎద్దు కోసం వెళ్లిన వ్యక్తికి పులి కనిపించినట్లు ప్రచారం జరగడంతో ఆ దిశగా విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులకు ఆనవాళ్లు కనిపించాయి. కాటారం మండలం నస్తూర్పల్లికి చెందిన ఓ వ్యక్తి ఎద్దు తప్పిపోవడంతో సోమవారం తెల్లవారుజామున ఎద్దు జాడ కోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఎద్దు ఆచూకీ లభించడంతో తిరిగి వస్తున్న క్రమంలో పులి వెళ్లడం గమనించినట్లు పలువురు గ్రామస్తులకు తెలిపాడు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం చేరడంతో అటవీ ప్రాంతానికి చేరుకొని పులి సంచారంపై విచారణ చేపట్టారు. మహారాష్ట్ర టు చెన్నూర్.. రెండేళ్ల క్రితం డిసెంబర్, జనవరి మాసంలో మండలంలో పులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించి పూర్తి నిఘా పెట్టారు. కానీ పులి మండలంలో పలు ప్రాంతాల్లో తిరిగాడి చివరగా అదిలాబాద్ ఉమ్మడి జిల్లా చెన్నూర్ వైపుగా వెళ్లినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం కూడా మహారాష్ట్ర నుంచి మహదేవపూర్ అటవీప్రాంతం మీదుగా మండలంలోకి ప్రవేశించిన పులి ఒడిపిలవంచ, జాదారావుపేట, దామెరకుంట లేదా విలాసాగర్ మీదుగా చెన్నూర్ అటవీ ప్రాంతంలోకి చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని అటవిలో నీటి వనరులు, శాఖాహార జంతువుల సంఖ్య తక్కువగా ఉండటంతో పులి నిలకడగా ఉండే పరిస్థితి లేదంటున్నారు. పులి అలజడి మొదలవడంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పూట అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు. పాదముద్రలు సేకరించాం.. నస్తూర్పల్లి గ్రామానికి సమీపంలో అటవీప్రాంతంలో పులిని చూసినట్లు ఓ వ్యక్తి చెప్పడంతో సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాం. పలుచోట్ల పాదముద్రలను గుర్తించి సేకరించాం. మరింత సమాచారం సేకరిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పులి ఎటు వైపు నుంచి ఎటు వెళ్లింది అని తెలుసుకుంటాం. – రాజేశ్వర్, డిప్యూటీ రేంజర్, మహదేవపూర్అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు -
నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సోమవారం ముగియనుంది. ఎన్నికల కమిషన్ జనవరి 29న షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం నాటికి పూర్వ వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి ఉపాధ్యాయ ప్రధాన సంఘాలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కలిపి 17 మంది 23 సెట్లలో నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ఆశావహులందరూ చివరి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. రేపు పరిశీలన.. 13న ఉప సంహరణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 13 మంది స్వతంత్రులు 16 సెట్లలో నామినేషన్లు వేశారు. ప్రధాన సంఘాలు బలపరిచిన నలుగురు మరో ఏడు సెట్లలో నామినేషన్లు భారీ ర్యాలీల నడుమ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి టీచర్స్ జేఏసీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ, టీఎస్యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్, ఏలే చంద్రమోహన్, దామెర బాబూరావు, తలకొప్పుల పురుషోత్తంరెడ్డి, డాక్టర్ పోలెపాక వెంకటస్వామి, సంగంరెడ్డి సుందర్రాజ్, చాలిక చంద్రశేఖర్, కంటె సాయన్న తదితరులు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. సోమవారం కూడా పూర్వ మూడు జిల్లాల నుంచి నామినేషన్లు వేసేందుకు నల్లగొండకు తరలనుండగా.. మరుసటి రోజు మంగళవారం ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ఖరారు కానున్నాయి.రసవత్తరంగా ‘ఉపాధ్యాయ’ పోరు..ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఈనెల 14 నుంచి రసవత్తరంగా మారనుంది. ప్రచారం హోరెత్తించేందుకు అభ్యర్థులు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో 191 మండలాల నుంచి 24,905 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా పురుషులు, సీ్త్ర ఓటర్లు కలిపి 5,098 మంది ఉండగా.. అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలోని నాలుగు మండలాల నుంచి 163 మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 4,483, ఖమ్మం 3,955, సూర్యాపేట 2,637, వరంగల్ 2,225, భద్రాద్రి కొత్తగూడెం1,949, మహబూబాబాద్1,618, యాదాద్రి 921, జనగామ 921, ములుగు 612, జయశంకర్ భూపాలపల్లిలో 323 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. కాగా నామినేషన్ల ఘట్టం ముగియడమే తరువాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుందన్న చర్చ ఆ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే 23 సెట్లలో 17 మంది నామినేషన్లు.. రేపు పరిశీలన.. 13న ఉపసంహరణ సై అంటే సై అంటున్న స్వతంత్ర అభ్యర్థులు రసవత్తరంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు