Jayashankar District News
-
పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం
వరంగల్ క్రైం : జాతీయస్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) చాంపియన్ షిప్లో తెలంగాణ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి 300 మీటర్ల మహిళా జట్టు విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సు బేదారి ఏఎస్సై సువర్ణను సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులోనూ ఈ క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ, ఆర్టీసీ, వివిధ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖల అధికారులు ఇప్పటికే పనుల షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని, షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులు చేపట్టాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదిలో నీటి సామర్ధ్యం నిశితంగా గమనిస్తూ ఉండాలని, గడిచిన 21 రోజుల నుంచి నీటి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నామని, 13 సెంటిమీటర్లు నీరు తగ్గిందన్నారు. గత మే నెలలో గోదావరి నీటి మట్టం 94 మీటర్ల 540 సెంటిమీటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ తిరుపతి, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మహేష్, డీఈలు పాల్గొన్నారు. అలాగే జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్లకు జిల్లా అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ సరస్వతి పుష్కరాల పనుల పురోగతిపై సమీక్ష -
స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న రిజిస్ట్రేషన్ స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లా డాక్యుమెంట్ రైటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొడ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలని, డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్లు ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నమన్నారు. అనంతరం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు బుర్ర అశోక్, జితేందర్, వినోద్, రమేష్, విజయ్, ప్రశాంత్, విక్రమ్, రాజేష్, రాజు, సదానందం, సునిల్, తదితరులు పాల్గొన్నారు. -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. సోమవారం భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి, శ్యామ్నగర్, కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామాల్లో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ప్రతీ గ్రామం నుంచి 100 మందికి తక్కువ కాకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు కళ్లెపు రఘుపతిరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం చిట్యాల: హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దూద్పల్లి, లక్ష్మీపూర్తండా, ఒడితల, పాశిగడ్డతండా, గోపాలపూర్ గ్రామాల్లో ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హాజరై మాట్లాడారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జగ్గి శ్యామల. 2020లో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తుండగా, శ్యామల వ్యవసాయ కూలీ పనికి వెళ్తుంది. కులాంతర వివాహం ద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు సాయం అందకపోగా దరఖాస్తు పరిస్థితి ఏంటనేది కూడా అధికారులు తెలపడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందించింది.న్యూస్రీల్ -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణలు ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల, మోడల్స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాస్టర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్ధూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్ధూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులోనుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉపాధ్యాయులు నిర్ధేశించిన దరఖాస్తుల ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి సోమవారం కోరారు. ఇతర సమచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్ఫర్ట్స్తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందుకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ నేటినుంచి ఈనెల 24వరకు గడువు ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు -
‘భూ భారతి’తో భూములకు హక్కులు
భూపాలపల్లి: నూతన భూ భారతి చట్టంతో భూముల హక్కులకు భద్రతతో పాటు భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో జరిగిన భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భూ భారతి చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ధరణి పేరుతో ప్రజల భూములను దోపిడీ చేశారని, అనేక అక్రమాలు చేసి వాళ్ల కడుపులు నింపుకున్నారని ఆరోపించారు. కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామంలో సుమారు 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పాస్బుక్లు రాకపోవడంతో రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నూతన చట్టం ప్రకారం వారందరికీ హక్కులు కల్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. భూ భారతితో అన్ని రికార్డులు పకడ్బందీగా నమోదు చేయబడతాయన్నారు. సాగులో ఉంటే విచారణ నిర్వహించి పట్టా ఇచ్చే అవకాశం ఉందన్నారు. భూ భారతి చట్టంలో లబ్ధిదారులకు మేలు చేసే విధంగా రూపొందించారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇక పకడ్బందీగా భూ రికార్డులు కలెక్టర్ రాహుల్ శర్మ -
అవే సమస్యలు..
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువభూపాలపల్లి: ప్రజావాణికి భూ సమస్య, పింఛన్ల మంజూరుకు సంబంధించిన వినతులే వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పరిష్కారం అయ్యే స మస్యలు కూడా కలెక్టరేట్కే వస్తున్నాయి. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్ సెల్లో మొత్తం 52 దరఖాస్తులు వచ్చాయి. వాటిని అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్తో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కల్పించాలి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఇది ఎక్కడా అమలు కావడంలేదు. రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రజావాణిల్లో దరఖాస్తులు ఇస్తున్నా. కనీసం ఒక్క జిల్లాలో అమలు చేసి పదిమందికి అవకాశం ఇచ్చినా నా ఉద్యమానికి ఫలితం దక్కుతుంది. – కట్ట ప్రసాద్, జాతీయ దివ్యాంగుల హక్కుల న్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షుడుడ్రిప్ సామగ్రి సరిగా ఇవ్వలేదు నాకున్న ఎనిమిది ఎకరాల్లో 2022–2023 సంవత్సరంలో పామాయిల్ తోట సాగు చేసిన. సబ్సిడీపై డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. డ్రిప్ కంపెనీ వారు ఓ రోజు రాత్రి నా వ్యవసాయ భూమి దగ్గర సామగ్రి దించిపోయారు. తెల్లవారుజామున చూస్తే అందులో మొత్తం సామగ్రి లేదు. దీంతో అధికారులు, డ్రిప్ కంపెనీ వారిని అడిగితే ఎవరూ స్పందించలేదు. నా సొంత డబ్బులతో పనులు చేయించుకున్న. హార్టికల్చర్ అధికారులపై చర్య తీసుకోవాలి. – సామల వెంకటేశ్వర్లు, చల్లగరిగె, చిట్యాల భూమి, పింఛన్ సమస్యలే ఎక్కువ గ్రీవెన్స్లో 52 వినతులు దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దు: కలెక్టర్ రాహుల్ శర్మ -
గణితంతోనే అన్ని విభాగాల్లో పరిశోధనలు
కాజీపేట అర్బన్ : గణితశాస్త్రం అన్ని విభాగాలతో ముడిపడి ఉంటుందని, వివిధ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు గణితంతోనే సాధ్యమని నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్వీ.ఉమామహేశ్ తెలిపారు. నిట్ వరంగల్ సెమినార్హాల్ కాంప్లెక్స్లోని హామిబాబా హాల్లో సోమవారం మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్, ఐఐటీ బాంబే నేషనల్ సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ముంబయి సౌజన్యంతో వారం రోజుల టీచర్స్ ఎన్రీచ్మెంట్ వర్క్షాప్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020కి అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఇందుకు ఈ వారం రోజుల వర్క్షాప్ వేదికగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నిట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ సెల్వరాజ్, ప్రొఫెసర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఉమామహేశ్ -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్కుమార్, ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు పూజలు నిర్వహించారు. -
సభకు భారీగా తరలిరావాలి
భూపాలపల్లి రూరల్: ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగసభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పిలుపునిచ్చారు. భూపాలపల్లి మండలం నేరేడుపల్లి, వజినపల్లి, గొర్లవీడు, గుడాడ్పల్లి, కొంపెల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కళ్లెపు రఘుపతిరావు, సాగర్రెడ్డి, పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు నీలంబరం, గుడాడ్పల్లి మాజీ సర్పంచ్ ఐలయ్య, మందల రవీందర్రెడ్డి, పింగిలి రవీందర్రెడ్డి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
వక్ఫ్ భూములపై కుట్ర
భూపాలపల్లి రూరల్: వక్ఫ్ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందని, కేంద్రం ఈ చట్ట సవరణను పునఃపరిశీలించి, వెంటనే వెనక్కి తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆదివారం జిల్లాకేంద్రంలో జామా మసీదు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీకి మద్దతుగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముస్లిముల ఆస్తులను హరించే కుట్ర అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, కురిమిల్ల శ్రీనివాస్, రాజేందర్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
శివాలయ నిర్మాణానికి విరాళం
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి గ్రామానికి చెందిన కాల్వ రాజారెడ్డి రూ.1,11,116 కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్రెడ్డికి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిళ్ల సత్యనారాయణరెడ్డి, మోత్కూరి నరేష్, కాల్వ సమ్మిరెడ్డి, మోత్కూరి రాజు, చెక్క నర్సయ్య, కొక్కుల సారంగం, పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి కాటారం: కాటారం మండలంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని భారత ఐక్య యువజన సమాఖ్య(యూవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను యూవైఎఫ్ఐ నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కల బాపు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా కాటారంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాయకుల, అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకునే వారు లేరన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా నాయకులు దెయ్యం పోచయ్య, ఎంసీపీఐ నాయకులు రాజమణి, రమ్య, తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ పరీక్షలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు ఆదివారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇంటర్ పరీక్షకు 369 మంది విద్యార్థులకు గాను 346 మంది, టెన్త్ పరీక్షకు 197మంది విద్యార్థులకు గాను 172మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి 163వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఇసుక లారీలు ఒకదాని వెనుకాల ఒకటి నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
లీకేజీలు.. పట్టవా..!
భూపాలపల్లి మున్సిపల్ పరిధి రెడ్డికాలనీ, పోలీస్ హెడ్క్వార్టర్స్ ప్రాంతం, బీఆర్ఎస్ కార్యాలయ ప్రాంతం, హనుమాన్నగర్, కృష్ణకాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు, గేట్ వాల్స్ నుంచి నీరు లీకేజీ అవుతుంది. ఈ పరిస్థితి జిల్లాకేంద్రంలో నెలల తరబడి నుంచి కొనసాగుతోంది. లీకేజీలతో సమస్య తీవ్రంగా ఉందని వాటర్ సప్లై సిబ్బందికి తెలిసినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదు. మరమ్మతులు చేయాలని కాలనీవాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదు. అధికారులు సైతం నామమాత్రంగా పర్యటించి చేతులు దులుపుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య తలెత్తకముందే లీకేజీలను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. – భూపాలపల్లి అర్బన్ -
గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి
చిట్యాల: గర్భిణులు, బాలింతలు సంవృద్ధిగా పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం పోషణ్ పక్వాడ కార్యక్రమం సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ గర్భం దాల్చిన నుంచి వేయి రోజుల వరకు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తూ ఆరు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ జయశ్రీ , ఒడితల వైద్యురాలు మౌనిక, ఎస్సై ఈశ్వరయ్య, ఎంఈఓ రఘుపతి మాట్లాడారు. అనంతరం ముగ్గురు గర్భిణులకు సీమంతం, ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన, ఐదుగురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మంజుల, సూపర్వైజర్ మాధవి, అంగన్వాడీ టీచర్లు, ఆశలు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025క్రీడల్లో శిక్షణ.. ‘దేశం బలిష్టం కావాలంటే యువత మైదానాల్లో చెమట చిందించాలి’ అని ఓ కవి చెప్పినట్లు.. విద్యార్థులు మైదానాల బాట పట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మరక్షణ కోసం కరాటే, కుస్తీ పట్టడం నేర్చుకోవచ్చు. జిల్లా క్రీడల, యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుంచి 31 వరకు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ ఓసిటీ క్రీడా మైదానంలో, హనుమకొండలోని జేఎన్ఎస్లో పలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని అధికారులు, నిర్వాహకులు కోరుతున్నారు. పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూడాలి● ఇష్టమైన కళలు, ఆటల్లో శిక్షణ ఇప్పించాలి.. ● సెల్ఫోన్ను దూరం పెట్టాలి.. పుస్తకాలను చేరువ చేయాలి ● ఆ బాధ్యత తల్లిదండ్రులదే..సజీవ కళ చిత్రలేఖనం.. సజీవంగా నిలిచిపోయే కళ చిత్రలేఖనం. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉచితంగా చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నారు. కొంత మంది నిర్ణీత రుసుముతో బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. మరికొంత మంది ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులను బొమ్మలు గీయడంలో నేర్పరులుగా మారుస్తున్నారు. కాగా.. కొన్ని వరంగల్ కాపువాడకు చెందిన చిత్రకళలో డాక్టరేట్ సాధించిన యాకయ్య విద్యార్థులకు చిత్రలేఖనంలో మెలకువలు నేర్పుతున్నారు.నృత్య, సంగీతంలో.. నృత్య, సంగీత శిక్షణతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వరంగల్కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ గురువు రంజిత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పేరిణి నాట్య కళాపరిచయం పేరిట 45 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రాయోగిక, ప్రాథమిక స్థాయి శిక్షణతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారు. అంతేకాకుండా హనుమకొండకు చెందిన శ్రీశివానంద నృత్యమాల నాట్యాచార్యులు బొంపల్లి సుధీర్రావు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పుస్తక పఠనం.. ఉమ్మడి జిల్లాలోని లైబ్రరీలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, కథలు, కవితలు, అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా మేథను పెంచుకునేందుకు ఇవి చక్కటి సోపానాలు. ఉన్నత స్థానంలో ఉన్న వారంతా పుస్తకాల పురుగులే. నగరవాసులు అయితే వరంగల్, హనుమకొండలోని సెంట్రల్ లైబ్రరీలకు పిల్లలను ఎంచక్కా పంపొచ్చు. పర్యాటక ప్రాంతాల సందర్శన ఓరుగల్లు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. వేసవిలో ఆహ్లాదం, ఆనందం కోసం తల్లిదండ్రులు పిల్లలను ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా హనుమకొండ హంటర్రోడ్డులోని జూపార్క్, సైన్స్సెంటర్, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు ఖిలా వరంగల్కోట తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. భగవద్గీత శ్లోక శిక్షణ.. సామాజిక సేవ జిల్లా వికాసతరంగణి ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులకు వ్యాసరచన, భగవద్గీత శ్లోకం, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాలపై శిక్షణ ఇస్తోంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో వలంటీర్గా సేవలందించవచ్చు. ఆర్ఎస్ఎస్, ఎన్ఎస్ఎస్లో విద్యార్థులు శిక్షణ తీసుకుని ఉమ్మడి జిల్లా విద్యార్థులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.. ప్రస్తుతం టెక్నాలజీ వెంట పరిగెట్టాల్సిందే. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. ఇస్రో ప్రతీ యేటా వర్క్షాప్ నిర్వహిస్తోంది. ఇందుకు విద్యార్థులను ఎంపిక చేస్తోంది. స్థానికంగా ఉన్న కంప్యూటర్ శిక్షణలో చేరి కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోవాలి. పుస్తకాలతో కుస్తీ పడిన చిన్నారులకు రిలీఫ్ దొరికినట్లయ్యింది. ఇన్నాళ్లు బండెడు బుక్స్ను మోసిన ఆ చిన్ని భుజాలకు కాస్తంత విశ్రాంతి దొరికినట్లయ్యింది. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు వేసవి సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఈ నెల 24నుంచి సెలవులు ప్రకటించాయి. స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు, హోంవర్క్లు, బైహాట్లు ఇప్పుడివేమీ లేవు. అలాగని ఈ సెలవుల్లో వాళ్లేం ఖాళీగా ఉండరు. ఫోన్ చూడడమో, లేక టీవీకి అతుక్కుపోవడమో చేస్తుంటారు. ఈ సెలవుల్ని వినియోగించుకుంటే భవితకు పునాది వేసుకోవచ్చు. వారికి ఇష్టమైన క్రీడలు, నాట్యం, ఆత్మరక్షణ విద్య, స్విమ్మింగ్, ఇతర రంగాలను తెలుసుకుని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వారిలో మానసికోల్లాసంతోపాటు శారీరక దృఢత్వం అలవడుతుంది. సెలవుల్ని ఎలా వినియోగించుకోవాలనేదే ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేకం. – హన్మకొండ కల్చరల్ -
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేగొండ: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్, దామరంచపల్లి, చిన్నకొడెపాక, విజ్ఙయ్యపల్లి, రాజక్కపల్లి, బాలయ్యపల్లి, జగ్గయ్యపేట, చెంచుపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి గులాబీ జెండాతో రజతోత్సవ సభకు తరలిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హమీద్, నాయకులు జూపాక నీలాంబరం, కానుగంటి శ్రీనివాస్, ఐలయ్య, మహేందర్, యుగందర్ పాల్గొన్నారు. పెయింటర్ను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద కల్వర్టు సైడ్ వాల్పై బీఆర్ఎస్ వాల్పెయింట్ను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పేరుతో వేయడాన్ని గమనించిన మాజీ ఎమ్మెల్యే పెయింటర్ను అడ్డుకున్నారు. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
కాటారం: భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం భూ భారతి, నూతన ఆర్ఓఆర్ చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. రైతులు అడిగిన ప్రశ్నలను కలెక్టర్, అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందన్నారు. భూ సమస్యలపై రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని.. నిర్దేశ సమయంలో పరిష్కారం లభిస్తుందన్నారు. భూ భారతి చట్టంలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, కలెక్టర్ అక్కడి నుంచి ల్యాండ్ ట్రిబ్యునల్కు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు భూ చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదాబైనామాకు సంబంధించి ఇతరులతో చర్చించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఆధార్కార్డు లాగే భూదార్కార్డు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ అధికారులు భూ భారతిపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, తహసీల్దార్ నాగరాజు, నయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ బాబు, ఆర్ఐ వెంకన్న, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ పాల్గొన్నారు. కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనాథ్, డీఎం రాములు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మపనుల్లో నాణ్యత పాటించాలి కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణాలపై వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం పరిశీలించి, నిర్దేశిత సమయానికి సరస్వతి పుష్కరాల పనులను పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున తాత్కాలిక, శాశ్వత ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఈ సూర్యప్రకాశ్, ఎస్సై తమాషారెడ్డి, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రటి ఎండలో కాలినడకన.. కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్కలెక్టర్ మయాంక్సింగ్లతో పాటు ఇతర అధికారులు 41 డిగ్రీల ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం సుమారు 600మీటర్లు కాలినడక వీఐపీఘాటు వద్దకు వెళ్లారు. పనుల పరిశీలన అనంతరం తిరిగి అదేదారిలో నడుచుకుంటూ వచ్చారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మంగపేట: రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని ఆలయాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలనే ఆకాంక్షతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీకత్క పనిచేస్తున్నారన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగుల సమస్యలపై త్వరలో సదస్సు నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారని, ఆ సదస్సులో అర్చక ఉద్యోగుల దూపదీప నైవేద్యం, అర్చకుల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయన్నారు. ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలను ప్రయాగ్రాజ్లో నిర్వహించిన తరహాలో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ ప్రత్యేక చొరవతో కోట్లాది మంది హిందువులు పుణ్య స్నానాలు చేయాలనే సంకల్పంతో ఏర్పా ట్లు చేస్తున్నారన్నారు. భక్తులు తరలివచ్చి పవిత్రమైన పుణ్య స్నానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక జేఏసీ గౌరవ అధ్యక్షుడు ముక్కామల రాజశేఖర్ శర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ -
కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలి
జాతీయ గీతాలాపనలో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, న్యాయమూర్తులు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ కుటుంబ సమస్యలను కులపెద్దలే పరిష్కరించాలన్నారు. – వరంగల్ లీగల్– వివరాలు IIలోuu -
317జీఓ బాధితులకు న్యాయం చేయాలి
భూపాలపల్లి అర్బన్: 317 జీఓ బాధితులకు వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించి న్యాయం చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ కోరారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగ హామీలను నెరవేర్చాలని కోరారు. ఆర్థిక నష్టం లేనటువంటి 317 జీఓ బాధితులకు న్యాయం చేసి వారి సొంత జిల్లాలకు బదిలీలు చేయాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాచర్ల శ్రీనివాస్, నాయకులు చంద్రయ్య, వెంకటేష్, రమేష్, పున్నంచందర్, సాగర్, తాడిచర్ల రవి పాల్గొన్నారు. -
వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాకు కేటాయించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డెరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ తెలిపారు. భూపాలపల్లి ఏరియాను శుక్రవారం సందర్శించి జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి అన్ని గనుల అధికారులతో ఉత్పత్తి ఉత్పాదకతలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. రక్షణ సూత్రాలను పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పక సాధించాలని ఆదేశించారు. రవాణాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి బొగ్గు రవాణ లక్ష్యం కూడా తప్పక సాధించాలని అధికారులను కోరారు. ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన భూ సేకరణ, మట్టి వెలికితీయడంలో ఎదురయ్యే ఇబ్బందులు తక్షణమే పరిష్కరించుకొ ని ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు. కార్మికులకు వైద్య సదుపాయం, ఇతర సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఓసీ–2 పీఓ వెంకటరామరెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, ఓసీ–3 పీఓ భిక్షమయ్య పాల్గొన్నారు.సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ -
ప్లీనరీ వాల్పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఈ 21న హైదరాబాద్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్లీనరీని విజయవంతం చేయాలని కోరుతూ.. మహిళా విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు సాంబ లక్ష్మి మాట్లాడుతూ.. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్లోని సీతాఫల్ మండిలో ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు గుర్తించి కార్డులు, నెలకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకారులు సునితారెడ్డి, ప్రసన్న శారద, రాజేశ్వరి, రమాదేవి, లక్ష్మి, లత, పుష్ప పాల్గొన్నారు. -
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు
వెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్ మండలంగా ఎంపిక చేసిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. రైతుల వద్దకే వెళ్లి అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు. రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ : మంత్రి కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు. భూమికి రైతుకు ఉన్న బంధమే తల్లీబిడ్డ సంబంధం: మంత్రి ధనసరి సీతక్క తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఈకార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్.నాగరాజు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్ పాల్గొన్నారు. సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ భారతి పైలట్ మండలం వెంకటాపురం (ఎం)లో రెవెన్యూ సదస్సు హాజరైన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ -
మోక్షం ఎప్పుడో..!
సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్● 2020 సంవత్సరంలో స్వీకరణ.. ● ఇప్పటివరకు పట్టా పాస్బుక్లు లేవు ● కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ ● జిల్లావ్యాప్తంగా 51,347 దరఖాస్తులు ● భూభారతిపైనే ఆశలు..భూమి మార్పిడి సాదాబైనామాల కోసం దరఖాస్తుకు ప్రభుత్వం మొదట 2020 అక్టోబర్ 31వ వరకు గడువు విధించగా మరోమారు నవంబర్ 10వరకు పెంచింది. ధరణి పోర్టల్ 2020 అక్టోబర్ 29 నుంచి అమలులోకి వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం కొత్త చట్టం అమలు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల కంటే ముందు అక్టోబర్ 28వరకు జిల్లాలో 1,896 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అనంతరం 51,347 మంది సాదాబైనామాల కోసం దరకాస్తు చేసుకున్నవారు అయోమయంలో పడ్డారు. కోర్టు ఆదేశాలతో ఇప్పటి వరకు దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. కొత్త చట్టం ప్రకారం మార్గదర్శకాలు వస్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పట్టాపాసుపుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.భూపాలపల్లి అర్బన్: సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించి ఐదేళ్లు కావస్తుంది. వాటికి ఇప్పటివరకు మోక్షం కలుగడం లేదు. ధరణి సమస్యల పరిష్కారానికి నోచుకున్నప్పటికీ సాదాబైనామా గురించి గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. తెల్ల కాగితాలపై రాసుకున్న క్రయవిక్రయాల భూముల క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్లో రైతుల నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో తెల్ల కాగితాలపై రాసుకుని విక్రయాలు జరిపిన కాగితాలపై తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వారంతా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 51,347 దరఖాస్తులు అందాయి. నాటినుంచి దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించి కొత్త పట్టాలు మంజూరు చేయాలని రైతులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ‘భూమాత’ను ప్రారంభించింది. ఇప్పటివరకు క్రమబద్ధీకరణ, పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు పనిష్కారం అవుతాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు 2014 జూన్ 2కు ముందు ఐదెకరాల్లోపు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు తెల్ల కాగితాలపై రాసుకున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్కు గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. 2020 అక్టోబర్ 31వరకు వివిధ మండలాల నుంచి వచ్చాయి. మొదట వ్యవసాయ భూములు, గ్రామీణ ప్రాంతాల్లోని వాటికి మాత్రమే అవకాశం కల్పించింది. అనంతరం నవంబర్ 1నుంచి 10వరకు గడువు పొడిగించింది. దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల వారికి సాదాబైనామాలకు అవకాశం కల్పిస్తూ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వారికి కూడా అవకాశం కలిసి వచ్చింది. పది రోజుల వ్యవధిలోనే 51,347 వరకు దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించి క్రయవిక్రయదారుల ఆమోదంతో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన, రిజిస్ట్రేషన్లు ఉంటాయని దరఖాస్తుదారులు భావిస్తున్న సమయంలో కోర్టు ఆదేశాలతో అయోమయంలో పడ్డారు. పాత రెవెన్యూ చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరించడంతో అప్పుడే ప్రవేశపెట్టిన ధరణి చట్టంతో సాదాబైనామాలు నిలిచిపోయాయి. గత చట్టంతో తిరకాసు.. -
ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి
భూపాలపల్లి అర్బన్: ఏసుప్రభు బోధనలు ప్రపంచ మానవాళికి దిక్సూచి అని సీఎస్ఐ ఫాస్ట్రేట్ కమిటీ చైర్మన్ రెవరెండ్ ఎం.కనకరత్నం తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చితో పాటు జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకరత్నం మాట్లాడుతూ.. మానవులంతా క్షమాగుణం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో సీఎస్ఐ చర్చి సంఘ సెక్రటరీ దుప్పటి మొగిలి, ట్రెజరర్ రవికుమార్, స్టీవార్డు ఇమ్మానియేల్ అమ్మగారు సంకీర్తన, సీ్త్రల మైత్రి, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే15 నుంచి 26 వరకు జరుగు సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన రూ.కోటితో చేపట్టిన ఎన్పీడీసీఎల్ విద్యుత్ లైన్ల ప్రగతిని ఆ శాఖ సీఈ రాజుచౌహాన్ పరిశీలించారు. శుక్రవారం ఆయన కాళేశ్వరంలో జరుగుతున్న విద్యుత్ పనులను పరిశీలించారు. సలహాలు, సూచనలు అందజేశారు. పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎస్ఈ మల్చూర్ నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు. మట్టి తరలిస్తున్న లారీల అడ్డగింత కాటారం: శంకరాంపల్లి నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను శుక్రవారం గ్రామస్తులు, యువకులు అడ్డుకున్నారు. మట్టి తరలింపు నిలిపేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంట్రాక్టర్లు, పలువురు దళారులు గ్రామ సమీపంలోని చేల నుంచి అనుమతులు లేకుండా నిత్యం మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. చేలలో సుమారు 20 ఫీట్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టడంతో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి మున్ముందు రోజుల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో మట్టి లారీలు గ్రామం మధ్య నుంచి తిరుగుతుండటంతో దుమ్ము అధికంగా లేవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగజాల అశోక్, బోనగిరి శ్రీకాంత్ పాల్గొన్నారు. కేసీఆర్ను కలిసిన జక్కు శ్రీహర్షిణి కాటారం: మాజీ జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్ను తన నివాసంలో కలిశారు. శ్రీహర్షిణి జన్మదినం సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ముందునడవాలని, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కేసీఆర్ సూచించినట్లు శ్రీహర్షిణి తెలిపారు. కష్టపడి పని చేస్తే రానున్న రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ మాట ఇచ్చినట్లు శ్రీహర్షిణి పేర్కొన్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్ ఉన్నారు. వేముల శంకర్కు డాక్టరేట్ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఐటీ మాస్టర్ స్కిల్ హబ్ డైరెక్టర్, వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపకుడు వేముల శంకర్కు స్ఫూర్తి సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ (యూఎస్ఏ) వారు అంతర్జాతీయ డాక్టరేట్ అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో అవార్డును అందజేశారు. -
రైతుల పాలిట ‘భూ భారతి’ వరం
గణపురం: భూ భారతి చట్టం రైతుల పాలిట వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ భారతి చట్టం భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో మే నెలలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోనున్నట్లు చెప్పారు. ధరణి ద్వారా గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. గణపురం మండలంలో జెన్కో, సింగరేణి సంస్థలలో భూములు కోల్పోయిన నిర్వాసిత ప్రజలు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో 10,900 ఎకరాలకు పట్టాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ చట్టం ద్వారా వారి సమస్య తీరుతుందని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో 70నుంచి 80శాతం సమస్యలు భూములకు సంబంధించినవే వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీడీఓ భాస్కర్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఎనిమిదేళ్లుగా నిరుపయోగం...
ప్రయాణికుల సౌకర్యార్థం చిట్యాల మండల కేంద్రంలో ఎనిమిదేళ్ల క్రితం బస్టాండ్ను నిర్మించారు. ఇప్పటివరకు ఆ బస్టాండ్ను ప్రారంభించలేదు. దీంతో అక్కడికి బస్సుల రాకపోకలు సాగడం లేదు. చిట్యాల మండల కేంద్రం మీదుగా రైతులు క్రిమి సంహారక మందులు, విత్తనాల కోసం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు నిత్యం వందలాది మంది పరకాల, హనుమకొండ, భూపాలపల్లి పట్టణ ప్రాంతాలకు వెళ్తుంటారు. బస్టాండ్ ప్రారంభించకపోవడం, బస్సులు చిట్యాల సెంటర్ నుంచే తిరిగి వెళ్తుండటంతో ప్రయాణికులు అక్కడే ఉన్న షాపుల ఎదుట వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
డీజీపీఎస్ పరికరంతో సర్వే వేగిరం
భూపాలపల్లి: సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు డీజీపీఎస్ పరికరం సహకరిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రూ.16.78 లక్షల విలువ గల డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) పరికరాన్ని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కుసుమకుమారికి కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికత వినియోగంతో సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయవచ్చన్నారు. జిల్లాలో పరిశ్రమలు, రహదారుల నిర్మాణం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయడానికి డీజీపీఎస్ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు. సిబ్బందికి ఇది మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుందని, ప్రాధాన్యతను గుర్తించి సర్వేలో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. పంట నష్టం నివేదిక అందజేయాలి.. అకాల వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ, వాణిజ్య పంటల నివేదిక అందజేయాలని కలెక్టర్ రాహుల్శర్మ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నివేదిక రూపకల్పనపై ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పంట నష్టం అంచనాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రైతులకు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఏఓ వీరునాయక్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి సునీల్కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
కారు కిరాయి.. ఇంధనం పరాయి
సాక్షిప్రతినిధి, వరంగల్: పరకాలలోని హుజూరాబాద్ రోడ్డులో గల ఓ పెట్రోల్బంకు. గత నెల 25న స్కై బ్లూ రంగు గల కియా కారులో బంకులోకి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు క్యాన్లలో రూ.7,500 (78.67 లీటర్ల) డీజిల్ పోయించుకున్నారు. డబ్బులు ఇమ్మని అడగ్గా ఫోన్ పే చేస్తామని స్కాన్ చేశారు. డబ్బులు రాలేదని చెప్పగా.. వస్తాయని చెప్పి కారులో ఉడాయించగా పెట్రోల్ బంక్ మేనేజర్ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయపర్తిలో హెచ్పీ పెట్రోల్ బంకులోకి గత నెల 31న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో బ్లూ కలర్ బెలోనో కారు వెళ్లింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మూడు క్యాన్లతో డీజిల్ కొట్టించుకున్నారు. రూ.10,508 విలువైన 110.22 లీటర్ల డీజిల్ కొట్టించుకున్న సదరు వ్యక్తులు స్కానర్ ద్వారా పేమెంట్ చేసినట్లు చెప్పారు. డబ్బులు జమ కాలేదని చెప్పినా వినకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్లారు. దీంతో ఆ బంకు క్యాషియర్ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ... ఇలా సుమారు 25 రోజుల్లో సుమారు 25 బంకుల్లో డీజిల్, పెట్రోల్ దొంగిలించిన ఆకతా యిల వ్యవహారం వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సవాల్గా మారింది. గత కొద్ది రోజులుగా ఆకతాయిలు కొందరు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అద్దెకు తీసుకుని కారుతోపాటు క్యాన్లలో ఇంధనం తీసుకెళ్లి అమ్ముకుంటూ.. ఆ డబ్బుతో జల్సా చేయడం పరిపాటిగా మారింది. అత్యధికంగా పరకాల, దామెర, నడికూడ, రాయపర్తి, జఫర్గడ్, రేగొండ, నల్లబెల్లి మండలాల్లోని బంకుల్లో ఈ తరహా దందాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పరకాల, రాయపర్తి పోలీసులు నిందితుల కోసం ఆరా తీయగా.. ఇంధనం దొంగల గుట్టురట్టయ్యింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 మంది వరకు పనీపాట లేని యువకులు మూడు టీములుగా ఏర్పడి ‘సెల్ఫ్ డ్రైవింగ్’ వాహనాలకు అద్దెకు తీసుకుని ఆ వాహనాల నంబర్ ప్లేట్లు తీసి పెట్రోల్ బంకుల్లో వెళ్లి ఇంధనం దొంగిలిస్తూ జల్సాలు చేస్తుండగా పోలీసులు వారి ఆటకట్టించినట్లు సమాచారం. మూడు టీములకు చెందిన సభ్యులను అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు అదుపులో ఉన్నవారినుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా నేడో, రేపో నిందితులను అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కాన్ చేసినట్లు యాక్షన్.. ఇంధనం క్యాన్లతో పరార్ పెట్రోల్ బంకులకు బురిడీ కొట్టించి జల్సాలు మూడు బృందాలుగా ఆగడాలు.. పోలీసుల అదుపులో ఆకతాయిలు -
పుష్కరాల పనులు పూర్తిచేయాలి
కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈఓ కార్యాలయంలో గురువారం దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, ఇరిగేషన్, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 15నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. పుష్కరాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలని సంఽబందితశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం వీఐపీ ఘాటు, ప్రధానఘాటుల వద్ద శాశ్వత నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ మహేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఈఈ, డీఈ, ఏఈఈలు పాల్గొన్నారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ -
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
మొగుళ్లపల్లి: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు లేని వారికి అన్యాయం జరుగవద్దన్నారు. లబ్ధిదారుడికి లక్ష రూపాయలు జమ అయినట్లు ఆమె తెలిపారు. ఆమెవెంట హౌజింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి సుమత ఉన్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి చిట్యాల: మండలంలోని ముచినిపర్తి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లు, ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మిస్తున్న మోడల్ ఇంటి నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ ఎన్.విజయలక్ష్మి గురువారం పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవాలని సూచించారు. బేస్మెంట్ వరకు పూర్తిచేసిన వారికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమఅవుతున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, డీఈ శ్రీకాంత్, ఏఈ రామలింగం, ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు. కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ మృతి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం మాజీ సర్పంచ్, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గంట రామ్నారాయణగౌడ్ (70) అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంతో పాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనకు భార్య లత, కుమార్తె సుజాత ఉన్నారు. భవన నిర్మాణానికి కృషి చేస్తా.. భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించే ది కాకతీయ లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లారీలు కొన్న ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులుగా భావించుకొని అసోసియేషన్లో చేర్పించుకోవాలని అన్నారు. లారీ యాజమానులే ట్రాన్స్ఫోర్ట్ ఏర్పాటు చేసుకొని బొగ్గు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల చంద్రయ్య, గౌరవ అధ్యక్షుడు చెరుకుతోట శ్రీరాములు, ఉపాధ్యక్షుడు కౌటం సురేందర్, ప్రధాన కార్యదర్శి ఎండీ అన్వర్ పాషా, సహాయ కార్యదర్శి ఎనగంటి రమేష్, కోశాధికారి తాళ్లపల్లి తిరుపతిరావు, టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట రవి యాదవ్, లారీ ఓనర్లు పాల్గొన్నారు. సమష్టిగా ఉంటేనే సమస్యల పరిష్కారం భూపాలపల్లి అర్బన్: మైనింగ్ స్టాప్ అందరూ కలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. ఏరియాలోని కేటీకే ఓసీ–3 లో ఏఐటీయూసీ ఏడీసీ ఆధ్వర్యంలో గురువారం కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా ఉంటేనే అనేక సమస్యలు పరిష్కరించబడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజేందర్, ఆసీఫ్ పాషా, శ్రీని వాస్, సుధాకర్ రెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా కమిటీని గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా కేతిరి సారయ్య, జిల్లా అధ్యక్షుడిగా కేతిరి రాజు, ప్రధాన కార్యదర్శిగా రెవెల్లి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేతిరి రవీందర్, ఉపాధ్యక్షులుగా పలువురు ఎన్నికయ్యారు. -
చిన్న షెడ్డు అయినా ఏర్పాటు చేయాలి..
బస్సుల కోసం రోడ్డు మీద, షాపుల ఎదుట వేచి చూస్తూ.. ఎండాకాలంలో ఎండకు, వానాకాలంలో వానకు చాలా ఇబ్బంది పడుతున్నాం. బస్టాండ్ను నిర్మించి కూడా ప్రారంభించలేదు. తొందరగా బస్టాండ్ను ప్రారంభించి బస్సులు అక్కడికే వచ్చేటట్టు చేస్తే మాకు ఇబ్బంది ఉండది. మేము కూడా బస్టాండ్లోనే కూర్చొని ఉంటాం కదా. – కంచు చంద్రమ్మ, తిరుమలాపూర్, చిట్యాల, ప్రయాణికురాలు బస్టాండ్ను ప్రారంభించాలి.. బస్టాండ్ లేక బాగా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం, వానాకాలంలో షాపుల ఎదుట నిలబడాల్సిన పరిస్థితి ఉంది. బస్టాండ్ను ప్రారంభించి అక్కడి నుంచే బస్సుల రాకపోకలు సాగిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. – మౌనిక, మొగుళ్లపల్లి, ప్రయాణికురాలు● -
జాతీయ రహదారిపై దుర్శెన చెట్టే దిక్కు..
పక్క ఫొటోలో కనిపిస్తున్నది రేగొండ మండల కేంద్రం. చిట్యాల, టేకుమట్ల, గోరికొత్తపల్లి మండలాలకు చెందిన వారు వివిధ పనుల నిమిత్తం ఈ సెంటర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. జాతీయ రహదారిలో రేగొండ మండల కేంద్రం ఉంటుంది. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ఇక్కడ బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న దుర్శెన చెట్టు కింద నిలబడి తమ రాకపోకలను సాగిస్తున్నారు. సమీపంలోనే చెరువు శిఖం భూమి, ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు తలుచుకుంటే బస్టాండ్ నిర్మాణం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం లేదు. -
‘భూ భారతి’ సదస్సులకు ఏర్పాట్లు చేయండి
భూపాలపల్లి: నూతన రెవెన్యూ చట్టం భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండలస్థాయిలో సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ.. తహసీల్దార్లను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశపు హాల్లో బుధవారం తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లతో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టం భూ భారతిపై రూపొందించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల నిర్వహణకు ప్రచారం చేయాలని సూచించారు. అవగాహన సదస్సులకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేలా గ్రామాల్లో టామ్ టామ్ వేయించాలన్నా రు. రెవెన్యూ శాఖలో పని చేసే ప్రతీ ఉద్యోగికి ఈ నూతన చట్టంపై సమగ్రమైన, స్పష్టమైన అవగాహ న ఉండాలని తెలిపారు. ‘భూ భారతి చట్టం – రైతు ల చుట్టం’ అనే నాలుగు పేజీలతో కూడిన పుస్తకా న్ని తహసీల్దార్లకు అందజేశారు. అంతకుముందు భూ భారతి చట్టం విధి విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కా టారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకటించిన కలెక్టర్.. జిల్లాలో నిర్వహించనున్న భూ భారతి అవగాహన సదస్సుల షెడ్యూల్ను కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటించారు. ఈ నెల 17వ తేదీన గణపురం మండల కేంద్రంలోని రైతు వేదిక, 19న కాటారం రైతు వేదిక, 21న భూపాలపల్లి పట్టణంలోని ఏఎస్ఆర్ గార్డెన్, 22న చిట్యాల రైతు వేదిక, 23న ఉదయం 10 గంటలకు మొగుళ్లపల్లి రైతు వేదిక, మధ్యాహ్నం 2 గంటలకు టేకుమట్ల ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్, 24న మహాముత్తారం మండలం బోర్లగూడెం రైతు వేదిక, 25న ఉదయం రేగొండ రైతు వేదిక, మధ్యాహ్నం గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాక రైతు వేదిక, 26న మల్హర్రావు మండలం కొయ్యూరు రైతు వేదిక, 28న ఉదయం మహదేవపూర్ రైతు వేదిక, మధ్యాహ్నం పలిమెల ప్రాథమిక పాఠశాల ఆవరణలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మధ్యాహ్నం జరిగే సదస్సుకు హాజరయ్యే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీడ, మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల మంజూరుకు విచారణ ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు విచారణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పొరపాట్లుకు తావులేకుండా నిరుపేద లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని 145 గ్రామ పంచాయతీల పరిధిలో 33,089 దరఖాస్తులు, మంథని నియోజకవర్గ పరిధిలోని 84 గ్రామ పంచాయతీల్లో 18,634, మొత్తంగా 51,723 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని.. జాబితాను తిరిగి గెజిటెడ్ అధికారి ద్వారా సూపర్ చెక్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ నరేష్, గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ షెడ్యూల్ విడుదల -
ఎలుగుబంటి మృతి కేసులో ఒకరి అరెస్ట్
కాటారం: మహాముత్తారం మండలం యత్నారం అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి మృతి చెంది కళేబరం లభ్యమైన కేసులో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పెగడపల్లి రేంజర్ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. యత్నారం కొండెంగలవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 14న పలువురు గ్రామస్తులు ఎలుగుబంటి కళేబరం గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి పక్కనే విద్యుత్ తీగ ఉచ్చు ఉండటంతోపాటు మాంసం, గోర్లు తీసుకెళ్లిన దుండగులు కేవలం కళేబరం మిగిల్చారు. పంచనామా, పోస్టుమార్టం చేయించిన అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు కోణాల్లో విచారణ ప్రారంభించిన అధికారులు ఎలుగుబంటి మృతికి సంబంధం ఉందని యత్నారం గ్రామానికి చెందిన మంగూనాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. బుధవారం కాటారంలోని పెగడపల్లి రేంజ్ కార్యాలయంలో మంగునాయక్ అరెస్ట్ చూపించి రిమాండ్కు తరలించారు. పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నామని సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని రేంజ్ అధికారి తెలిపారు. కాగా, మంగూనాయక్ అరెస్ట్ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు రేంజర్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మంగూనాయక్పై అక్రమంగా అధికారులు కేసు పెట్టారని కుటుంబ సభ్యులు ప్రమీల, జగత్సింగ్, సురేందర్ అన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తడి ఎక్కువగా ఉందని, నీవు ఒప్పుకొని కేసు నీపై వేసుకుంటే బెయిల్కు అయ్యే ఖర్చులు సగం తాము భరిస్తామని అటవీశాఖ అధికారులు తనను ఇబ్బంది పెట్టారని అరెస్ట్ అయిన మంగూనాయక్ విలేకర్ల ఎదుట ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వేడుకున్నాడు.అక్రమంగా కేసు పెట్టారని కుటుంబ సభ్యుల ఆరోపణ -
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
కాటారం: మహాముత్తారం మండలం స్తంభంపల్లి, రేగులగూడెం, బోర్లగూడెం గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై బుధవారం డీటీఎఫ్ సీఐ రాజసమ్మయ్య, ఎకై ్సజ్ ఎస్సై కిష్టయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నాటుసారా నిర్మూలన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గుడుంబా స్థావరాలపై దాడి చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై పేర్కొన్నారు. 20 లీటర్ల గుడుంబా, 35 కిలోల చక్కెర స్వాధీనపర్చుకొని 1,100 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
రేషన్కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి: కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పులకు మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఐడీఓసీలోని తన చాంబర్లో రేషన్ కార్డు దరఖాస్తుల విచారణ, ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పాలన, గ్రామసభల్లో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే విచారణ చేసి అర్హత మేరకు మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని సామాజిక మాద్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. అవి ప్లాస్టిక్ బియ్యం కాదని, పోర్టిఫైడ్ బియ్యమని వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసు కేసులు నమోదు చేయించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ఆర్చి నిర్మాణ పనుల ప్రారంభం
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన ఆర్చి నిర్మాణ పనులు ఎన్హెచ్ 353(సీ) ప్రధాన రహదారిపైన బుధవారం ప్రారంభమయ్యాయి. 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భారీ యంత్రాలు, పరికరాలు, మోటార్లు ఆర్చి కింద నుంచి వెళ్లేందుకు వీలుగా లేకపోవడంతో మేఘా ఇన్ఫ్రా సంస్థ కూల్చివేసింది. ఆ సమయంలో సదరు నిర్మాణ సంస్థ రూ.25 లక్షలు దేవస్థానానికి పరిహారంగా చెల్లించింది. అప్పటి నుంచి ఆర్చి నిర్మాణంపై దేవాదా యశాఖ దృష్టిసారించలేదు. ఈక్రమంలో మే 15 వ తేదీ నుంచి 26 వరకు జరిగే సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్చి పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి శ్రీధర్బాబు, దేవదాయశాఖ ప్రి న్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించడంతో ఈఓ మహేష్ పనులు ప్రారంభించారు. పిల్లర్లకో సం జేసీబీతో తవ్వకాల చేపట్టారు. కాగా, రూ.32 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు.2018లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తొలగింపు -
మహాముత్తారం అడవిలో పులి కలకలం
కాటారం: మహాముత్తారం మండలంలో పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. పులి అటవీ ప్రాంతంలోకి వచ్చిందనే పుకార్లతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా స్తంభంపల్లి(పీకే), మద్దిమడుగు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో పులి అడుగులను అటువైపు వెళ్లిన పలువురు గుర్తించారు. సమాచారం అందుకున్న దూదేకులపల్లి రేంజర్ రాంమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలు (ప్లగ్ మార్క్స్)ను నిర్ధారించారు. కానీ, అవి తాజా పాదముద్రలు కావని.. నాలుగు రోజుల క్రితం పులి ఇటువైపుగా వెళ్లినట్లుగా ఉన్నాయని రేంజర్ తెలిపారు.అగ్నిప్రమాదాలపై ఆస్పత్రుల్లో అవగాహనభూపాలపల్లి అర్బన్: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం మూడో రోజు జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై మాక్డ్రిల్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది నరేందర్, సురేష్, కల్యాణ్, నవీన్కుమార్, వెంకటయ్య పాల్గొన్నారు.రజతోత్సవ సభను విజయవంతం చేయాలిభూపాలపల్లి అర్బన్: ఈ నెల 27న హనుమకొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మున్సిపాలిటీ పరిధీలోని జంగేడు, వేశాలపల్లి, పెద్దకుంటపల్లి, కాశీంపల్లి, సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి ఆకుదారివాడల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని వెంకటరమణా రెడ్డి మాట్లాడారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వెంకటరాణిసిద్దు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, నాయకులు జనార్ధన్, రాజులు పాల్గొన్నారు.చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రభూపాలపల్లి అర్బన్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజిరెడ్డి, మంద నరసింహరావు డిమాండ్ చేశారు. ఏరియాలోని సింగరేణి గెస్ట్హౌజ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీజేపీ, బీఎంఎస్లు మినహా ఇతర పార్టీలు, సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 51 శాతం మంది కార్మికులు సమ్మెను అంగీకరిస్తేనే సమ్మె చేయాలని, సీఎంపీఎఫ్ కాంట్రీబ్యూషన్ 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం. 12 గంటలకు పని వేళలను పెంచడం, లేబర్ ఇన్స్పెక్టర్ను ఫెసిలిటేటర్గా మార్చడం వంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. అప్రెంటీస్ విధానం ద్వారా కార్మికులను నియమించుకుంటూ వారితో ఏళ్ల తరబడి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. సంస్థకు రావాల్సిన బాకాయిలను చెల్లించడం లేదని, సింగరేణికి ప్రైవేట్ గనులను అప్పగించాలని ఎటువంటి పోరాటం చేయడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడం లేదని తెలిపారు. ఐదేళ్ల తర్వా త జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో సీఎండీ పాల్గొనకపోవడం హాస్యస్పాదమన్నారు. గు ర్తింపు సంఘం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పరిష్కరించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కంపేటి రాజయ్య, రమేష్, శివరాంరెడ్డి, ప్రవీణ్కుమార్, రవి, దినేష్ పాల్గొన్నారు. -
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
భూపాలపల్లి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. హైదరాబాద్లో డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే ఈమేరకు వినతి పత్రం అందించారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గంలో నష్టపోయిన పంటల గురించి వివరించారు. మంగళవారం కురిసిన అకాల వర్షంతో వరి, మిర్చి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని, అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించి, బాధిత రైతులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.డిప్యూటీ సీఎంను కోరిన ఎమ్మెల్యే గండ్ర -
మ్యాన్ రైడింగ్ పొడిగించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే–5వ గనిలో మ్యాన్ రైడింగ్ను పొడిగించాలని కోరుతూ.. సీఐటీయూ నాయకులు మంగళవారం ఏరియా ఇన్చార్జ్ జీఎం వెంకటరామరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహరావు మాట్లాడుతూ.. భూగర్భ గనిలో సరిపడా మ్యాన్ రైడింగ్ లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 21వ లెవల్ నుంచి 31వరకు కాలినడకన వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. అనేక సంవత్సరాలు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. పని ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని, మలినాలు తాగే నీటిలో కలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంపేటి రాజయ్య పాల్గొన్నారు. -
గారెపల్లి రిజర్వాయర్ పనుల అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా కాటారం మండలం గారెపల్లిలో చేపడుతున్న రిజర్వాయర్ 2 బండు పనులను మంగళవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదని నిర్వాసిత రైతులు ప్రాజెక్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. భూమి కోల్పోయి, పంట నష్టపరిహారం అందక తమ కుటుంబాలు రోడ్డునపడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించేంత వరకు పనులు సాగనివ్వబోమని రైతులు తెల్చిచెప్పారు. ప్రాజెక్ట్ డీఈఈ ఉపేందర్ రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులతో సమావేశం ఏర్పాటు చేసేలా చూస్తామని డీఈఈ రైతులకు వివరించారు. పరిహారం అందేవరకు పనులు చేపట్టవద్దని రైతులు తెగేసి చెప్పడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రమేశ్బాబు
వరంగల్ లీగల్/భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. హనుమకొండ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సీహెచ్.రమేశ్బాబు భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు రానున్నారు. భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.నారాయణబాబు వరంగల్ జిల్లా కోఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా బదిలీ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎండీ అబ్దుల్ రఫీ, జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 23 వరకు నూతన స్థానంలో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నారాయణబాబు బదిలీ -
ఎప్పుడో..!
కలగానే భూపాలపల్లి ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్లుఠాణాల ఏర్పాటు ● తొమ్మిదేళ్ల క్రితం సర్కారుకు ప్రతిపాదనలు ● ముందుకు కదలని ఫైలు ● ఇబ్బందుల్లో వాహనదారులు, మహిళలు మహిళా స్టేషన్ ఏది..? 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో పురుషులు 2,07,998 మంది ఉండగా.. మహిళలు 2,08,765 మంది ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అయి ఉంటుంది. జిల్లాలో మహిళా పోలీస్స్టేషన్ లేకపోవడంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబపరమైన, వేధింపులకు సంబంధించి సమస్యలను నేరుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు తెలిపేందుకు ఇబ్బందిపడాల్సి వస్తుంది. మహిళా స్టేషన్ను ఏర్పాటు చేస్తే కుటుంబ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.భూపాలపల్లి: జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు కలగానే మారింది. జిల్లా ఏర్పాటైన సమయంలో ఇక్కడి పోలీసు అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపగా స్టేషన్ల ఏర్పాటు నేటికీ కాగితాలకే పరిమితమైంది. ఫలితంగా జిల్లావాసులు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. -
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuతాత్కాలిక ట్రాఫిక్ స్టేషన్తో కొంత ఉపశమనం.. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్ 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడింది. అప్పటినుంచి భూపాలపల్లి పట్టణం దినదినం అభివృద్ధి చెందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు, కేటీపీపీ, సింగరేణి పరిశ్రమలతో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతుంది. బొగ్గు, ఇసుక లారీలతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటమే కాక పలువురు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పలువురు యువకులు ట్రిబుల్ రైడింగ్తో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను గుర్తించిన ఎస్పీ కిరణ్ ఖరే గతేడాది ఫిబ్రవరిలో తాత్కాలిక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లో పనిచేసే పలువురు సిబ్బంది, ఒక ఎస్సైని కేటాయించారు. వారి విధి నిర్వహణ మూలంగా కొంతమేరకు సమస్య పరిష్కారం అయినప్పటికీ పూర్తిస్థాయి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.ప్రతిపాదనలకే పరిమితం.. జిల్లా ఏర్పాటు సమయంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్.భాస్కరన్ జిల్లాకేంద్రంలో ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్ అవసరాన్ని గుర్తించి స్టేషన్ల ఏర్పాటుకోసం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఇటీవల ప్రస్తుత జిల్లా ఎస్పీ కిరణ్ఖరే సైతం మరోమారు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్లను ఏర్పాటుచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పరిశీలనలో ఉంది.. జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్, మహిళా స్టేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఆ ఫైలు పరిశీలనలో ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. – కిరణ్ ఖరే, ఎస్పీ ●న్యూస్రీల్ -
ఉద్యోగ ఉత్తర్వుల అందజేత
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నూతనంగా సింగరేణి కారుణ్య నియమాక ఉద్యోగాలు పొందిన వారికి మంగళవారం ఉద్యోగ ఉత్తర్వులు అందజేసినట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి తెలిపారు. జీఎం కార్యాలయంలో ఇన్చార్జ్ జీఎం వెంకటరామరెడ్డి ఉత్తర్వులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, అధికారులు రవి, అరుణ్ప్రసాద్, రాజు, యూనియన్ నాయకులు రమేష్, మధుకర్రెడ్డి పాల్గొన్నారు. డీటీఎఫ్ జిల్లా కమిటీ ఎన్నిక భూపాలపల్లి అర్బన్: డెమెక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) జిల్లా కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించినట్లు ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, ఉపాధ్యక్షుడు చాప బాబుదొర తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా చిలువేరు అశోక్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి, దేవేంద్ర, తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి, కార్యదర్శులుగా వీరేశం, బొజ్జనాయక్, వీరన్న, ప్రభాకర్, రాష్ట్ర కౌన్సిలర్స్గా సుదర్శనం, జయ, రమణరెడ్డి, లక్ష్మణ్నాయక్, ప్రభాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, సుదర్శన్, వెంకటేశ్వరచారి, అడిట్ కమిటీ కన్వీ నర్గా దేవేందర్రెడ్డి, సభ్యులుగా మొండయ్య, జయప్రకాశ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముగిసిన ‘టెన్త్ స్పాట్’ విద్యారణ్యపురి: కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో ఈ నెల 7వ తేదీనుంచి ప్రారంభమైన టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మంగళవారం సాయంత్రం ముగిసింది. అన్ని సబ్జెక్టులు, ఒకేషనల్ కోర్సుల పరీక్షల జవాబుపత్రాలు కలిపి 2,27,403 జవాబుపత్రాలు వచ్చాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలనుంచి ఎస్ఏలు, ఎస్జీటీలను స్పాట్ విధులకు కేటాయించారు. సీఈలుగా 113మంది, ఏఈలుగా 676మంది ఎస్ఏలు, 224మంది ఎస్జీటీలు స్పెషల్ అసిస్టెంట్లుగా విధుల్లో పాల్గొన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి క్యాంపు ఆఫీసర్గా, 8మంది పీజీహెచ్ఎంలు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరించారు. ఈ నెల 30న లేదా మే మొదటివారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐక్యతతోనే సమస్యల పరిష్కారం భూపాలపల్లి అర్బన్: కార్మికుల ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కరించబడుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గని లో రమేశ్ మంగళవారం కార్మికులను కలిసి వా రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనింగ్ స్టాప్ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా కమిటీ ఉండాలని, మైన్స్, ఏరియా వారీగా ఏర్పాటు చేసి మైనింగ్ స్టాప్ను బలోపేతం చే యాలన్నారు. ఈ నెల 20న ఏరియాలోని కొమురయ్య భవన్లో మైనింగ్ స్టాప్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపా రు. ఈ సమావేశాన్ని నాయకులందరూ సకా లంలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు తిరుపతి, ఆసిఫ్పాషా, సుధాకర్రెడ్డి, రామచందర్, నారాయణమూర్తి, అఖిల్, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. ప్రయాణికురాలికి తీవ్రగాయాలు కాటారం: ఆర్టీసీ బస్సు దిగబోయి కిందపడిపోయి మహిళ తీవ్రగాయాలపాలైన ఘటన కాటారం మండలం మేడిపల్లి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పులి స్వరూప బస్వాపూర్ సమీపంలోని నాయకపల్లి వద్ద తన కూతురుని చూడటానికి భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వచ్చింది. బస్వాపూర్ స్టేజ్ దాటిన తర్వాత స్వరూప బస్సు ఆపాలని డ్రైవర్, కండక్టర్ను కోరింది. డ్రైవర్ బస్సు నిలుపననడంతో సదరు మహిళ బతిమిలాడింది. మేడిపల్లి టోల్గేట్ సమీపానికి బస్సు చేరుకోగా కండక్టర్ స్వరూపను దిగమని చెప్పాడు. ఆమె దిగుతుండగా డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో స్వరూప బస్సు మెట్లపై నుంచి కిందపడింది. కాలు మడిమపై నుంచి బస్సు టైరు వెళ్లింది. తీవ్రగాయమై రక్తస్రావం అవగా స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగానే స్వరూప గాయాలపాలైనట్లు ఆమె బంధువులు ఆరోపించారు. -
భూ భారతిపై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి: భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు అన్ని మండలాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు షెడ్యూల్ తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మంగళవారం అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతీ మండలంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాల చేపట్టాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో భూ భారతి చట్టం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి చట్టంపై ప్రజలకు సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పేద కుటుంబాలను ఎంపిక చేయాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ఘనంగా హోమం, జలాదివాసం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రతిష్ఠాపనలో భాగంగా మంగళవారం ఉదయం ఆవాహిత దేవతా మండల మూల మంత్ర హోమములు, విగ్రహ స్నపనము, జలాధివాసం కార్యక్రమాన్ని భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకులు రామకృష్ణ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శయ్యాధివాసము, ధాన్యాధివాసము ఫల పుష్ప ఆదివాసములను విగ్రహాలకు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చిన దాతలు ప్రత్యేక హోమాలను నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక హోమశాలను ఏర్పాటు చేసి వేదమంత్రాల మధ్య దంపతులతో హోమాలు చేపట్టారు. నేడు అయ్యప్పస్వామి ఆలయ ప్రతిష్ఠాపన మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్ప పంచలోహవిగ్రహంతో పాటు ఇతర విగ్రహాలను బుధవారం ఉదయం 11గంటలకు ప్రతిష్ఠించనున్నట్లు బ్రహ్మశ్రీ మల్లావజ్జల రామకృష్ణశర్మ తెలిపారు. గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అలాగే ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనతో పాటు శివలింగం, మాలికపురత్తమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నాగేంద్రస్వామి, గణపతి, నందీశ్వరులకు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. -
రోడ్డుకు అడ్డంగా గుంతతీసి నిరసన
రేగొండ: రోడ్డుకు అడ్డంగా గుంత తీసి ఓ జేసీబీ యాజమాని నిరసన తెలిపిన ఘటన కొత్తపల్లిగోరి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. గత ప్రభుత్వంలో కొత్తపల్లిగోరి మండలంలోని జమ్షేడ్బేగ్పేట వద్ద దాదాపు రూ.3 కోట్ల రూపాయలతో బ్రిడ్ఙి నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ బీటీ రోడ్డు మినహా బ్రిడ్ఙి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. సదరు కాంట్రాక్టర్ బ్రిడ్ఙి నిర్మాణం కోసం ఉపయోగించిన జేసీబీ యాజమానికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో మంగళవారం తాత్కాలిక రోడ్డు, బ్రిడ్ఙి రోడ్డుకు అడ్డంగా గుంత తీసి తన నిరసనను తెలిపాడు. దీంతో ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు గుంతలను పూడ్చడంతో యఽథావిధిగా వాహనాల రాకపోకలు సాగాయి. -
ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు పాటించాలి
భూపాలపల్లి: ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులు వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బందికి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ చలువ కళ్లద్దాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వేసవిలో అతినీల లోహిత కిరణాల వలన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, ప్రతీ ఒక్కరు కళ్లద్దాలు, టోపీలు తప్పకుండా వాడాలన్నారు. విధుల్లో ఉన్నప్పుడు ప్రతీ అర్ధగంటకు ఒకసారి మంచినీరు తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఎ.సంపత్రావు, సీఐ డి.నరేష్కుమార్, ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
మే 14న రామప్పకు మిస్వరల్డ్ టీం
ములుగు: మే 14న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పను విజిట్ చేయడానికి మిస్ వరల్డ్ టీం రానున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్జీ, సంపత్రావుతో కలిసి రామప్పలో చేపట్టనున్న ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రపంచ సుందరీ పోటీలలో పాల్గొననున్న పలు దేశాలకు చెందిన మహిళలు రామప్ప సందర్శనకు వస్తున్న తరుణంలో ములుగు జిల్లా ప్రవేశ మార్గమైన మహ్మద్గౌస్పల్లి నుంచి జంగాలపల్లి వరకు, జంగాలపల్లి నుంచి రామప్ప వరకు, రామప్ప నుంచి హరిత హోటల్ వరకు పంచాయతీరోడ్డు ఇంజనీరింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి ఏమైనా మరమ్మతులు ఉంటే ఈ నెల 30వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పర్యటన వివరాలను తెలుసుకొని ఏర్పాట్ల విషయంలో ఎప్పటికప్పుడు ఫొటోలు వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేయాలని సూచించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా ముందుకుసాగి ప్రపంచ మిస్ వరల్డ్ టీం పర్యటనను విజయవంతంగా ముగించాలని సూచించారు. ఈ సమావేశంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, డీఎస్పీ రవీందర్, పురావస్తు శాఖ అధికారులు, వెంకటాపురం(ఎం) మండల అధికారులు పాల్గొన్నారు. సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలి కలెక్టర్ టీఎస్ దివాకర -
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuఅవగాహన కార్యక్రమాలు ● అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ● ఈనెల 14న జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాలను సందర్శించి సిబ్బంది కుటుంబ సభ్యులతో సమీక్షలు నిర్వహించారు. ● 15న ప్రధాన కూడలి ప్రాంతాలైన బస్స్టేషన్, షాపింగ్ ఏరియాలు, మార్కెట్, సినిమా థియేటర్ అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ● 16న హాస్పిటల్స్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన సదస్సులు ● 17న అపార్ట్మెంట్లు, గ్యాస్ కంపెనీలు, విద్యుత్ శాఖ కార్యాలయాలు సందర్శించి ఫైర్ సేఫ్టీ పరికరాల పనితీరును పరిశీలించి వారికి అవగాహన కల్పిస్తారు. ● 18న పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్స్ నిర్వాహకులకు.. ● 19న దుకాణ సముదాయాలు, ఫంక్షన్హాళ్లు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లలో అవగాహన నిర్వహిస్తారు. ● 20న అగ్నిప్రమాదాలపై సమావేశం నిర్వహించి ప్రమాదాలు సంభవిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన, విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుతులు అందజేయనున్నారు.వారోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఫైర్ సిబ్బంది భూపాలపల్లి అర్బన్: సూరీడు నేలకొచ్చినట్టు ఎండలు మంట రేపుతున్నాయి. జనానికి సెగలు పుట్టిస్తున్నాయి. సామాన్య ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ సమయంలోనే చిన్నపాటి అజాగ్రత్తతో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంది. తద్వారా సర్వం బుగ్గి అవుతోంది. తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. ఎండా కాలం, మండించే కాలం కాబట్టి అప్రమత్తత అవసరమని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క అగ్నిమాపక కేంద్రం భూపాలపల్లిలో ఉంది. గతేడాది రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల మేర నష్టం జిల్లాలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 41 అగ్నిప్రమాదాలు జరగగా వాటిల్లో సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4కోట్ల మేర నష్టం జరిగింది. అగ్నిప్రమాదాల్లో రూ.5 కోట్ల ఆస్తిని సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో ఏ చిన్నపాటి ప్రమాదం వాటిల్లినా తీవ్రంగా నష్ట పోవాల్సి రావడంతో అగ్నిప్రమాదాలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖాధికారులు విశేష కృషి చేస్తున్నారు.న్యూస్రీల్సమయస్ఫూర్తి అవసరం ప్రస్తుతం ఎండలు అధికమయ్యాయి. ఈ సమయంలో అగ్నిప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో అధికశాతం తీరప్రాంత గ్రామాలు, మారుమూల ప్రాంతాలు కావడంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా అంతా బుగ్గి అవుతుంది. గతంలో తీరప్రాంత గ్రామాల్లో అగ్నిప్రమాదాలు జరిగి భారీ నష్టం జరిగింది. ప్రమాదాలు జరిగిన సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తే నష్టాన్ని నివారించవచ్చు.అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర నష్టం జిల్లాలో అగ్నిప్రమాద వారోత్సవాలు ఆరంభం 14నుంచి 20వరకు అవగాహన సదస్సులు -
అగ్నిమాపకశాఖ సూచనలు
● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గి పుల్లలను ఆర్పివేసిన తర్వాత పారేయాలి. చెత్త, గడ్డి, ఎండిన చెట్లు, పూరిపాకల వద్ద వీటిని వేయరాదు. ● ఎక్కువ రోజులు ఇంట్లో లేని సమయంలో విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి. ● వంట గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ● గృహాలకు గడ్డి వాములు 60 అడుగుల దూరంలో వేసుకోవాలి. ● పూరింట్లో నివసించే వారు వంట పూర్తయిన వెంటనే పొయ్యిలో నిప్పును ఆర్పేయాలి. ● వేసవిలో ఉదయం 8గంటల లోపు, సాయంత్రం 6గంటల తరువాత కట్టెల పొయ్యిలను ఉపయోగించాలి. ● గ్యాస్ సిలెండరుకు దగ్గరలో పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటి మండే వస్తువులను ఉంచరాదు. ● వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆపివేయాలి. ● అపార్ట్మెంట్లు, కర్మాగారాల గోదాములు, గిడ్డంగులలో అగ్నిమాపక శాఖ సూచనలు విధిగా పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు. -
అకాల వర్షం.. పంట నష్టం
ఈ ఫొటోలో ఉన్న రైతు దంపతులు కొండగొర్ల చిన్న దుర్గయ్య, దుర్గ. ఇద్దరు కలిసి రామన్నగూడెం శివారులో 5ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. పంట కోతదశకు చేరుకుంది. ఈ క్రమంలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం రాలిపోయింది. పంట సాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏటూరునాగారం: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పొట్ట దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోగా పంటంతా నేలవాలింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోయింది. ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, రొయ్యూర్, శంకరాజుపల్లి, ముళ్లకట్ట, చెల్పాక, చిన్నబోయినపల్లి, గోగులపల్లి, శివాపురం ప్రాంతాల్లో వరిపంట నేలవాలడంతో పాటు ధాన్యం నేలరాలింది. పంట చేతికొచ్చే తరుణంలోనే మాయదారి వర్షం నట్టేట ముంచిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదిలా ఉండగా మిర్చి కాయలను కోతకోసి కల్లాల వద్ద ఆరబెట్టగా తడిసిపోయింది. దీంతో మిరపకాయలు మచ్చలు రావడం, తొడిమె ఊడిపోవడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఉండబోదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడితోటల్లోని కాయలు సైతం గాలివానకు రాలిపోయాయి. పంటల పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటల పరిశీలన మండల పరిధిలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి సుమారువెయ్యి ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నేటినుంచి సర్వే మొదలవుతుందని ఏఓ వేణుగోపాల్ తెలిపారు. రైతులు అధైర్య పడకుండా పంటను కాపాడుకునే సూచనలను వివరించినట్లు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంటలను పరిశీలించి నష్టాన్ని సర్వేచేసి నివేదిక అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రాజు, రవి, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. వరి పంట సాగు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి. అకాల వర్షం రైతులను కోలుకోలేకుండా దెబ్బతీసింది. వందలాది ఎకరాలల్లోని వరిపంట నేలబారింది. పొట్టదశలో ఉన్న వరిపంట వర్షం దాటికి కంకులు రాలి నీటిలో మునిగి పోయాయి. పంటను కోసే పరిస్థితి లేకుండా పోయింది. వరిపొలాలను చూస్తే దుఖం ఆగడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. – సునారికాని శ్రీనివాస్, రైతు, ఏటూరునాగారం వందలాది ఎకరాల్లో నేలవాలిన వరిపైరు కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటకు దెబ్బ ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు -
‘బిల్ట్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి’
ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని కమలాపురంలో గల మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బాధావత్ రాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పొద్దునూరు యాదగిరి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట మానవహక్కుల వేదిక నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. 2014లో మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఐటీడీఏ నుంచి కమలాపూర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కార్మికులతో పాదయాత్రను నిర్వహించారు. 1977 లో ఏపీ రేయాన్స్గా మొదలైన ఫ్యాక్టరీ బిల్ట్గా రూపాంతరం చెంది అనేక లాభాలను గడించిందని తెలిపారు. అనంతరం నష్టాలు వస్తున్నాయనే సాకుతో 2014లో బిల్ట్ను మూసివేశారని తెలిపారు. దీంతో దాదాపు 2వేల మంది రోడ్డున పడ్డారని వివరించారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమాన్ ప్రసాద్, పద్మజ, పాలకుర్తి శ్రీనివాస్, లవ కుమార్, సమ్మయ్య, యుగేందర్, శంకర్, కరీంనగర్ జిల్లా బాధ్యులు మధు, అచ్యుత్, సదానందం, ఖమ్మం జిల్లా బాధ్యులు ఆదినారాయణ, బిల్ట్ కార్మికులు పాల్గొన్నారు. -
యువత మత్తుకు బానిస కావొద్దు
● ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం: డ్రగ్స్ని తరిమికొడదామని.. యువత మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని రామన్నగూడెంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో డ్రగ్స్, ఫొక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. శిక్షణ పొందిన నార్కోటిక్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందాలు గ్రామంలో సోమవారం తనిఖీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్కు బానిసలుగా మారితే విలువైన జీవితాలు ఆగం అవుతాయని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోకి అపరిచితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత చెడుమార్గంలో పయణించకుండా మంచి మార్గంవైపు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టర్ల సమావేశంలో రాహుల్శర్మ
భూపాలపల్లి: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమావేశంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు.చెక్కు అందజేత భూపాలపల్లి అర్బన్ : రెండేళ్ల క్రితం మోరంచపల్లి గ్రామానికి చెందిన గడ్డం మహాలక్ష్మి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుఫున మంజూరైన చెక్కును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం అందజేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో రూ.5లక్షల చెక్కును గడ్డం శ్రీనివాస్కు అందజేశారు. జార్జిరెడ్డి స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి కాటారం: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి విప్లవ స్ఫూర్తిని అందిపుచ్చుకొని యువత ఉద్యమాల్లోకి రావాలని యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపుయాదవ్ అన్నారు. జార్జిరెడ్డి వర్ధంతిని కాటారం మండలకేంద్రంలో సోమవారం యూవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కల బాపు మాట్లాడుతూ దేశంలో యువత మారక ద్రవ్యాలకు అలవాటుపడి తమ విలువైన జీవితాలను కోల్పోతుందని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగి యువత మత, ప్రాంతీయ పార్టీ ఉద్యమాలకు ఆకర్షితులై నిజమైన విప్లవ ప్రజా పోరాటాలను నీరుగార్చుతున్నారని పేర్కొన్నారు. జార్జిరెడ్డి చూపిన విప్లవ ఆలోచనతో భగత్సింగ్, చేగువేరా, అల్లూరి సీతారామరాజు, కొమురంభీం, గోపాల్రెడ్డి విప్లవ స్ఫూర్తితో భారత ఐక్య యువజన సమాఖ్య, యూవైఎఫ్ఐ యువతి యువకులను సంఘటితం చేస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంతెన రాజశేఖర్, కాల్వల సమ్మయ్య, కళ్లెం రమేశ్, రవీందర్ పాల్గొన్నారు. రామప్పలో మెక్సికో దేశస్తుడు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మెక్సికోకు చెందిన ప్రొఫెసర్ డేనియల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరుడిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్లు తాడబోయిన వెంకటేశ్, సాయినాథ్ వివరించగా రామప్ప టెంపుల్ బాగుందని కొనియాడారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు వాజేడు: మండల పరిధిలోని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో సోమవారం వాల్పోస్టర్లు వెలిశాయి. మండల పరిధిలోని కొప్పునూరు కాలనీ, ఘణపురం గ్రామాల మధ్యన ఉన్న వంతెనకు అంటించారు. ‘మమ్మల్ని బతక నివ్వండి, నిత్యం ఆదివాసీ ప్రజలపై ఆధారపడి బతికే మీరు అడవుల్లో విచ్చల విడిగా బాంబులు పెట్టడం సరికాదు.. ఇదేనా మీ సిద్ధాంతం’ అంటూ ఆదివాసీ యువజన సంఘం పేరుతో పలు రకాల హెచ్చరికలతో వాల్పోస్టర్లలో రాసి ఉంది. -
అంబేడ్కర్ జయంతి వేడుకలు
భూపాలపల్లి అర్బన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134 జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పంచశీల పతాకావిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ. అంబేడ్కర్ కారణంగానే అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు. వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి అంబేడ్కర్, జ్యోతిరావుపూలే కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, అదనపు ఎస్పీ బోనాల కిషన్, డీఎస్పీ సంపత్రావు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునిత, దళిత సంఘాల నాయకులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మంగళవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11కేవీ విద్యుత్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని.. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కృషి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావురేగొండ: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదంతో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, జిల్లా, మండల నాయకులు సంపత్రావు, మేకల భిక్షపతి, పట్టెం శంకర్, బొజ్ఙం రవి, గండ్ర రమణారెడ్డి, షాబీర్, భలేరావు మనోహర్రావు, వీరబ్రహ్మం, కోగిల క్రాంతి, ఎడ్ల మల్లారెడ్డి, ముద్దమల్ల రవి పాల్గొన్నారు. పరామర్శ.. రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో బండి అశోక్కు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు ఆదివారం దగ్ధమైంది. దీంతో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించి, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్రావు, నడిపల్లి శ్రీనివాసరావు, శ్రీధర్, రజినీకాంత్ ఉన్నారు. -
అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలి
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు 14వ తేదీ చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. 14వ తేదీ సెలవు అయినప్పటికీ రాజీవ్ యువ వికాసం పథకానికి చివరి తేదీ కావడంతో దరఖాస్తులు చేయడానికి పెద్దసంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున దరఖాస్తుల కొరత రాకుండా తగినన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆఫ్లైన్లో వచ్చే దరఖాస్తుదారులకు దరఖాస్తు ముట్టినట్లు రశీదులు ఇవ్వాలని, వచ్చిన ప్రతీ దరఖాస్తు ఆన్లైన్ చేయడంతో పాటు జాగ్రత్తగా భద్రపరచాలని కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
మెట్లమార్గంలో రక్షణేది!
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం రాజగోపురం ఎదుట ఎండ తీవ్రతతో గ్రైనేట్ వేడెక్కి కాళ్లకు రక్షణ లేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ తీవ్రతతో ఆదివారం మెట్ల మార్గం గుండా కాలినడకన వచ్చి భక్తులు ఆలయంలో దర్శనం చేసుకొని తిరిగి బయటకు వచ్చేటప్పుడు కాళ్లు కాలిపోతుంటే భక్తులు పరుగులు తీశారు. దేవస్థానం అధికారులు కనీసం మ్యాట్లు, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో మెట్ల మార్గం గుండా విద్యుత్ వెలుగులు లేకపోవడంతో భక్తులు మెట్లు ఎక్కుతూ జారిపడుతున్నారు. రాజగోపురం చుట్టుపక్కల కూడా లైట్లు ఉన్నా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ వెలుగులు, ఎండ తీవ్రత తట్టుకుని నడిచి వెళ్లేలా మ్యాట్లు ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టిసారించాలని కోరుతున్నారు. -
శాంతి చర్చలు జరపాలి
భూపాలపల్లి రూరల్: మావోయిస్టులతో శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుపతయ్య విజ్ఞపి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు వేదిక, జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, దుర్గా ప్రసాద్, కర్ణాటకపు సమ్మయ్య, మోటపలుకుల రమేష్, మారెపల్లి మల్లేష్, చంద్రగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ కలలు సాకారం భూపాలపల్లి రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలను, కలలను బీజేపీ ప్రభుత్వం సాకారం చేస్తుందని ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయరామారావు అన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రాజు ఆధ్వర్యంలో బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విజయరామారావు మాట్లాడుతూ అంబేడ్కర్ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి, నాయకులు వెన్నంపల్లి పాపన్న, కన్నం యుగదీశ్వర్, లింగంపల్లి ప్రసాదరావు, బట్టు రవి, దుప్పటి భద్రయ్య, సయ్యద్ గాలిప్, దొంగల రాజేందర్, సామల మధుసూదన్ రెడ్డి, రఘునాథ్రెడ్డి పాల్గొన్నారు. శ్రీపాదరావు గొప్ప నాయకుడు భూపాలపల్లి రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీపాదరావు రాష్ట్రానికే గాక మంథిని నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసిన గొప్ప నాయకుడు శ్రీపాదరావు అని టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు అన్నారు. శ్రీపాదరావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి పేరును నిలబెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముంజాల రవీందర్, మధుకర్రెడ్డి, తిరుపతి గౌడ్, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాల పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేష్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ (సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు. -
సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం
రమ్మీ యాప్ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్ క్రైమ్పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం ‘డిజిటల్ బాధితుల కమిటీ’ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్లను ప్రమోట్ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి. – డాక్టర్ బి.కేశవులు, ఎండీ సైకియాట్రిస్ట్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడటం, వాటిని నిర్వహించడం చట్టరీత్యా నేరం. చర్యలు ఉంటాయి. యువత ఇటీవల ఆన్లైన్ గేమ్స్పై ఆసక్తి చూపుతోంది. ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలాడుతున్నారో గమనించాలి. ఆన్లైన్ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. – కొత్త దేవేందర్ రెడ్డి, ఏసీపీ, హనుమకొండ● -
ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
కాటారం: ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఆదివారం పర్యటించిన మంత్రి శ్రీధర్బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షలతో నిర్మించిన కాటారం గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి గ్రామాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రోడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు. అనంతరం కాటారం సబ్ డివిజన్లోని పలు మండలాలకు సంబంధించిన వైకుంఠరథాలను మంత్రి ప్రారంభించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.3,12,64,235 చెక్కును సభ్యులకు అందజేశారు. 243 మంది లబ్ధిదారులకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ధన్వాడలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన అదనపు ఉప విద్యుత్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధన్వాడ ప్రభుత్వ పాఠశాలకు వంద డెస్క్ బెంచీలను మంత్రి అందజేశారు. సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకం.. నిరుపేద ప్రజలు సైతం సన్న బియ్యం అన్నం తినాలని సంకల్పించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సన్న బియ్యం పంపిణీ నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఆదివారం మండల పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్బాబు మండలంలోని కొత్తపల్లి తండాకు చెందిన వాంకుతోడు సమ్మక్క అనే లబ్ధిదారురాలు ఇంట్లో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి మంత్రి భోజనం చేశారు. మంత్రి, అధికారులు తండావాసులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవారు సంతోషంగా ఉండాలనే భావనతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు వెంట డీపీఓ నారాయణ, డీఆర్డీఓ నరేశ్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, తదితరులు ఉన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
రక్కసి
‘రమ్మీ’ గేమింగ్ ముసుగులో ఆన్లైన్ జూదం సాక్షిప్రతినిధి, వరంగల్: ● ‘నా ఫ్రెండ్ రూ.500 పెట్టి రూ.1,500 గెలిచాడు. నేనూ ట్రై చేశా. 5 రోజుల్లో రూ.8,000 పోయాయి. చివరికి సెల్ఫోన్ అమ్మేశా.’ – ఇంజనీరింగ్ విద్యార్థి, వరంగల్ ● ‘నాకు డబ్బు రావడం ప్రారంభమైన తర్వాత ఆడి రెఫరల్ గ్రూపులు క్రియేట్ చేశా. నా అకౌంట్లో డబ్బులు జమవుతాయని మెసేజ్ వచ్చింది. ఆఖరికి నా ఖాతా ఫ్రీజ్ అయ్యింది.’ – డిగ్రీ విద్యార్థి, నర్సంపేట .. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రమ్మీ గేమింగ్ యాప్ల సంస్కృతి పెరుగుతోంది. రమ్మీ యాప్లు యువత జీవితాలపై బలమైన దాడి చేస్తున్నాయి. ‘గేమింగ్’ ముసుగులో జూదపు బానిసత్వం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకుని అప్పులు మూటగట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాప్ల వ్యాప్తి.. ఉమ్మడి వరంగల్లో 2022 తర్వాత రమ్మీ యాప్ విష సంస్కృతి విచ్చలవిడి అయ్యింది. ప్రధానంగా నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతోపాటు మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్సంపేట తదితర పట్టణాల్లో ఈయాప్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ‘రమ్మీ కల్చర్’, ‘ఎ 23 రమ్మీ’, వెల్త్ రమ్మీ’, ‘జంగిల్ రమ్మీ’.. వంటి యాప్లు టాప్–డౌన్లోడెడ్గా ఉన్నాయి. టెలిగ్రామ్ చానల్స్ ద్వారా ‘100 శాతం గెలుపు ట్రిక్స్’, ‘మీకు మద్దతు అందించే రమ్మీ టీచర్స్’.. తదితర పేర్లతో ఇన్ఫ్లుయెన్సర్లు మోసం చేస్తూనే ఉన్నారు. అందరూ టార్గెటే.. యూత్ నుంచి గృహిణుల దాకా.. అన్ని వర్గాలను ఈ రమ్మీ యాప్లు టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్నాయి. బీటెక్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు.. ఇలా అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీ పరిధి విద్యాసంస్థల్లో చదివేవారు, ప్రైవేట్ టీచర్లు, క్లర్కులు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వర్గాలు, గృహిణులు ‘టైమ్ పాస్’గా మొదలుపెట్టి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో భారీగా డబ్బులు కోల్పోయిన సుమారు 20 మందికి పైగా వివిధ ప్రాంతాల్లో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. గేమ్ మాఫియా.. ‘బ్రోకర్’ వ్యవస్థ ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాల్లో రమ్మీ గేమ్ యాప్ల వినియోగం విచ్చలవిడిగా సాగుతున్నదని, వాటి పట్ల ఆకర్షితులు కావొద్దని సైబర్ క్రైమ్ పోలీస్లు ఇప్పటికి చాలా సార్లు హెచ్చరించారు. ప్రధానంగా వరంగల్ ట్రై సిటీలో మూడు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా రెండు లక్షల రూపాయల వరకు రోజువారీ బెట్టింగ్ జరుగుతున్నట్లు సైబర్ పోలీసుల అనుమానం. ఈగ్రూపులకి ‘మాస్టర్ బ్రోకర్లు’ నిధులు సమకూరుస్తూ యువతకు ‘విజయం’ చూపించి మాయ చేస్తున్నట్లు సమాచారం. హెల్ప్ డెస్క్ ప్రారంభించినప్పటికీ.. తెలంగాణ వ్యాప్తంగా సైబర్ సెల్ 2024లో ‘గేమింగ్ యాప్ మోసాల’పై స్పెషల్ హెల్ప్లైన్ ప్రారంభించింది. డిజిటల్ డిటాక్స్ క్యాంపెయిన్ ద్వారా పదుల సంఖ్యలో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే యాప్లు విదేశీ సంస్థల ఆధీనంలో ఉండడం వల్ల వాటిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టంగా మారుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తద్వారా వారించే వారికన్నా గేమ్ యాప్లు వినియోగించే వారే ఎక్కువవుతున్నారని ఓ పోలీస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. కేరాఫ్గా మారిన ఉమ్మడి వరంగల్ ‘టైమ్ పాస్’తో మొదలు.. అప్పుల ఊభిలోకి ప్రాణాలు తీసుకుంటున్న యువత అవగాహన కల్పిస్తున్నా మారని తీరు -
రాజ్యాంగంపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరువు
కాటారం/కాళేశ్వరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగంపై చిత్తశుద్ధి లేదని, రాజ్యాంగాన్ని ప్ర జల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఏ మాత్రం చేయ డం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో బహుజన సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రా జ్యాంగ స్థూపాన్ని మహదేవపూర్ మండలం సూరా రంలో మాజీ సర్పంచ్ నాగుల సుజాత–లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్పర్సన్ శ్రీహర్షిణిరాకేశ్తో కలిసి ఈ శ్వర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ.. బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం, కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ప్రజల్లో చైతన్యం, హక్కులపై అవగాహన లేకుంటే ధైర్యంగా ముందుకెళ్లలేరని తెలిపారు. ఇన్నేళ్లుగా పరిపాలన చేసిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమయ్యారని అన్నారు. రాజ్యాంగం ప్రజలకు తెలిస్తే తమని ప్రశ్నిస్తారనే కుట్ర పాలకుల్లో దాగిఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అబద్దాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. అంబేడ్కర్ను ఒక సామాజికవర్గానికే అంటగట్టడం సమంజసం కాదన్నారు. రా జ్యాంగంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా రచించారని, కేవలం ఎస్సీలకు మాత్రమే మేలు చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎలా సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రా ష్ట్రం సాధించుకున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలన్నారు. పుట్ట మధు మాట్లాడుతూ మంథనిలో 40 ఏళ్లుగా పాలించిన ఒకే కుటుంబం ప్రజ లకు ఏం చేసిందో చెప్పాలన్నారు. సొంత ఖర్చులతో ప్రధాన కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన లక్ష్మారెడ్డిని అభినందించారు. రాకేశ్ , శ్రీనివాస్, కిరణ్, తిరుపతి, శ్రావణ్, గీతాబాయి, శ్రీలక్ష్మిచౌదరి, శ్రీనివాసరావు, గీత, లక్ష్మణ్ పాల్గొన్నారు.మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ -
గోదావరికి పౌర్ణమి హారతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరికి పౌర్ణమి సందర్భంగా హారతి కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, ఉప ప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు, సిబ్బంది మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలతో కాలినడకన గోదావరికి తరలివచ్చారు. అక్కడ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరికి పాలు, పసుపు, కుంకుమ, పూలతోపాటు సారె సమర్పించారు. అనంతరం అర్చకులు మూడు హారతులతో హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ డి.శ్రీనివాస్, స్వచ్ఛంద సేవాసమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశాఖలో అలసత్వం వహించొద్దు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో వైద్యారోగ్యశాఖ కార్యక్రమాల్లో అలసత్వం వహించొద్దని రాష్ట్ర వైద్యారోగశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాధినిరోధక టీకాలు, ఎన్సీడీ, లెప్రసీ, టీబీ ఇతర కార్యక్రమాల నిర్వహణలో అలసత్యం వహించొద్దని సూచించారు. ప్రాణహిత పుష్కరాల మెడికల్ క్యాంపు యాక్షన్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీప్యూటీ డీఎంహెచ్ఓ, పోగ్రాం అధికారులు కొమురయ్య, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ సందీప్, సపోర్టింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. మెరుగైన సేవలందించాలి రేగొండ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులకు క్రమంతప్పకుండా పరీక్షలు చేయించాలని, ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు జరిగే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. కుష్టు, టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికి త్స అందించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలను శిశువులందరికీ సకాలంలో వేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని ఫార్మసీ, ల్యాబ్, డెలివరీ, ఓపీ రిజిష్టర్ను తనిఖీ చేశారు. డీఎంహెచ్ఓ మధుసూదన్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీదేవి, డాక్టర్ హిమబిందు, హెల్త్ సూపర్వైజర్లు సుధ, వినోద లక్ష్మీ, రాజేందర్, రాము, ఫార్మసిస్ట్ సులక్షణ, సిబ్బంది పాల్గొన్నారు.రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ -
ఆరోగ్యం పదిలమేనా..?
చిన్నారుల హెల్త్పై ప్రత్యేక దృష్టికాటారం: అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తున్న చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా నేషనల్ హెల్త్ మిషన్, ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఆరేళ్లలోపు చిన్నారుల్లో కంటి, మానసిక సమస్యలను ముందస్తుగా గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వరల్డ్ హెల్త్ డే సందర్భంగా జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి వైద్య సిబ్బంది శ్రీకారం చుట్టారు. మూడు నెలల కాలంలో జిల్లాలోని అంగన్వాడీల్లోని మొత్తం చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 10,364 మంది చిన్నారులు జిల్లాలోని 643 అంగన్వాడీ కేంద్రాల్లో 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గల 10,364 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ కంటి, మానసిక సమస్యల గుర్తింపు పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు రెండు విడతల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో విడతగా అంగన్వాడీ చిన్నారులకు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల చిన్నారులే ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. సరైన పర్యావేక్షణ లేకపోవడంతో వీరిలో కంటి, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వీటిని చిన్న వయసులోనే గుర్తించి చికిత్స అందించాలని ప్రభుత్వం ఓ యోచనకు వచ్చింది. ప్రతీ చిన్నారికి వైద్య పరీక్షలు.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఆరేళ్ల లోపు చిన్నారులు ప్రతీ ఒక్కరి కంటి, మానసిక వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. నాలుగు బృందాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది రోజుకు 80 నుంచి 100 మంది చిన్నారులను పరీక్షిస్తున్నారు. సమస్య గుర్తించిన వారికి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటాం. ఈ వైద్య పరీక్షలు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. – డాక్టర్ ప్రమోద్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారిజిల్లా వివరాలు.. అంగన్వాడీల్లో ఆరోగ్య పరీక్షలు జిల్లాలో నాలుగు బృందాల ద్వారా వైద్య పరీక్షలు మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికరోజుకు 80 నుంచి 100 మందికి.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల్లో అనారోగ్య, పౌష్టికాహార సమస్యలను నివారించేందుకు బాలామృతం, కోడిగుడ్లు లాంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అయినప్పటికీ చిన్నారుల్లో నేత్ర సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో వైద్యపరీక్షలు కీలకం అని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు వైద్య బృందాలు ప్రతి రోజు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి 80 నుండి 100 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించి వారి మానసిక, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వైద్యబృందం గుర్తించిన అంశాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,500 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. -
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: రేపు(సోమవారం) జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే నిర్వహించన్ను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేడుకలకు జిల్లాలోని అధికారులు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల నాయకులు, కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవతం చేయాలని అధికారి సునీత పిలుపునిచ్చారు. గుండెపోటుతో ఎంపీడీఓ మృతి మొగుళ్లపల్లి: స్థానికంగా ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మహబూబ్ హుస్సేన్(61) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వస్థలం హనుమకొండ జిల్లా పరకాల అయినప్పటికీ కుటుంబ అవసరాల రీత్యా హనుమకొండ పట్టణంలో నివాసముంటూ విధులకు హాజరయ్యేవారు. విధి నిర్వహణలో బాధ్యతయుతంగా ఉంటూ.. ప్రజలందరికీ అందుబాటులో ఉండేవారని పేరుంది. వచ్చే నెలలో పదవి విరమణ చేయనుండగా.. ఇంతలోనే గుండెపోటుతో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ఆయన మృతిపై కార్యాలయ సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. టర్పెంట్ ఆయిల్ తాగి బాలుడి మృతి కాటారం: టర్పెంట్ ఆయిల్ తాగి 21 నెలల బాలుడు మృతి చెందిన ఘటన కాటారం మండలం ధన్వాడలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మాజీ ఎంపీటీసీ బోడ మమత నరేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు బోడ సుహాన్ (21 నెలలు) తల్లి మమతతోపాటు ఇంటి పక్కన వారింటికి వెళ్లాడు. మమత గుమ్మాలకు ముగ్గులు వేసే పనిలో నిమగ్నమవగా సుహాన్ ఆడుకుంటూ పెయింట్లో కలిపే టర్పెంట్ ఆయిల్ తాగాడు. కొంత సమయానికి సుహాన్ కిందపడిపోగా గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పేకాట స్థావరాలపై దాడి మల్హర్: మండలంలోని నాచారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈమేరకు 17 మంది వద్ద నుంచి రూ.1.50 లక్షలు, 5 బైకులు, 17 సెల్ ఫోన్లు, 52 ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేష్ శనివారం తెలిపారు. 17 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘కక్ష సాధింపు కోసమే వక్ఫ్ బిల్లు’ భూపాలపల్లి అర్బన్: ముస్లిం మైనార్టీలపై కక్ష సాధింపు కోసమే బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్కుమార్ ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శని వారం సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాజ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడు తూ.. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలపై కక్ష సాధింపు కోసమే వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టా న్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ చట్టాన్ని చా లా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతి రేకిస్తున్నప్పటికీ టీడీపీ, జేడీయూ పార్టీల సహకారంతో ఓటింగ్ ద్వారా చట్టాన్ని ఆమోదం చేసుకున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డుకు ఇతర మతస్తులు సాయం చేయకుండా ఈ చట్టం తీసుకురావడం సరికాదన్నారు. హిందువులు, ఇతర మతస్తులు.. బోర్డుకు ఆర్ధికంగా సహా యం చేయాలంటే వారు కూడా మతం మారా లని చట్టం తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నూకల చంద్రమౌళి, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, యాకూబ్ పాషా, కృష్ణ, శేఖర్, రజియా, శ్రీలత, స్వరూప, తదితరులు పాల్గొన్నారు. -
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫ రా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీత క్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖలపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాల ని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలుపెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చేయాలన్నారు. టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చెప్పారు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్వై నిఽధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారుల ను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయక్.. మంత్రి, ఈఎన్సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మహబూ బాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని, రాజకీయాలు బయట చూసుకుందామన్నారు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి ఏళ్లుగా పెండింగ్లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనంబాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహి ళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు. అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామన్నారు. -
దళితబంధు నిధులు విడుదల చేయాలి
● రోడ్డుపై బైఠాయించిన లబ్ధిదారులు కాటారం: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళతబంధు పథకంలో భాగంగా ఎంపికై న లబ్ధిదారులకు మంజూరైన నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం కాటారంలో దళితబంధు ధర్మయుద్ధం మహాధర్నా నిర్వహించా రు. చింతకాని క్రాస్ నుంచి మండల కేంద్రం వరకు ర్యాలీ చేపట్టిన లబ్ధిదారులు ప్రధానకూడలి లో జా తీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టా రు. ఈ సందర్భంగా సాధన సమితి జిల్లా అధ్యక్షు డు నమూండ్ల సంపత్ మహారాజ్ మాట్లాడుతూ దళితబంధు లేదా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేర కు అంబేడ్కర్ అభయహస్తం అమలు చేయాలన్నా రు. పెండింగ్లో ఉన్న నిధులను ఎంపికై న లబ్ధిదా రుల ఖాతాల్లో జమ చేయాలని పేర్కొన్నారు. చదువుకున్న దళిత మహిళలకు పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూడాలని, దివ్యాంగులకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. దళితబంధు నిధుల విడుదలకు కలెక్టర్ హామీ ఇవ్వాలని భీష్మించారు. సుమా రు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగడంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సైలు నరేశ్, మహేందర్.. ఆందోళన విరమింపజేశారు. ఆందోళనలో జక్కయ్య, వెంకయ్య, మధుకర్, శ్రీనివాస్, చందు, నగేశ్, రాజు, రామన్న, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత విద్య అవకాశాన్ని వినియోగించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: పిపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్లో అందిస్తున్న ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను జిల్లాలోని విద్యార్థులు వినియోగించుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించే లక్ష్యంతో ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4, 5 ,6 తరగతి విద్యార్థులు అర్హత పరీక్ష రాసి 5, 6, 7 తరగతుల్లో ప్రవేశం పొందాలని సూచించారు. 80 మార్కులతో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలుగు, గణితం, ఆంగ్లం పరిసరాల విజ్ఞానం నుంచి ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత పొందిన విద్యార్థులకు వారు ప్రవేశం పొందిన తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతోపాటు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తారని తెలిపారు. గ్రామీణ నిరుపేదలు, తల్లిదండ్రులు లేని విద్యార్థులు అర్హులని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వెబ్సైట్ http:// forms. gle/ uhxD4 Dj8 oyxMUdPM7లో గూగుల్ ఫామ్ నింపి పేరు నమోదు చేసుకోవాలని, వివరాలకు 99124 62762, 95534 05934, 99491 74837 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు సల్ల సంపత్, సుకుమార్, సరిత పాల్గొన్నారు. -
భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలి
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ప్రధాన కాల్వల నిర్మాణం కోసం చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియలో వేగంపెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూ సేకరణ విభాగం అధికారులకు సూచించారు. కాటారం మండలం గుమ్మాళ్లపల్లి, గూడూరు గ్రామాల్లో కొనసాగుతున్న భూ సేకరణ సర్వేను అదనపు కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భూ నిర్వాసిత రైతులతో మాట్లాడారు. పలువురు నిర్వాసిత రైతులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. భూ సేకరణకు అధికారులకు రైతులు సహకరిస్తే కాల్వల నిర్మాణ పనులు త్వరగా పూర్తవుతాయని.. తద్వారా సాగు నీరందుతుందని తెలిపారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భూ సేకరణ సర్వేలో అడ్డంకులు అధిగమించి సేకరణ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణలో పాటించాల్సిన నిబంధనలు, విధానం గురించి భూ సేకరణ అధికారులకు వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ వెంకన్న, భూ సేకరణ అధికారులు, ఇరిగేషన్ ఏఈఈలు, సిబ్బంది ఉన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
పూర్తిస్థాయి మందులు నిల్వ ఉండాలి
ములుగు/ములుగు రూరల్ : ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మందుల నిల్వలు ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు పేర్కొన్నారు. శుక్రవారం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాకారం, ములుగు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని మందుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణులకు, బాలింతలకు, వృద్ధులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. ఓఆర్ఎస్, జింక్ కార్నర్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మందుల నిల్వల రిపోర్టులను రోజు వారిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రాల మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ జితేందర్, నవ్య, సూపర్వైజర్ దేవమ్మ, ఆరోగ్య కార్యకర్తలు తిరుమల, నర్సమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు గోదావరికి హారతి కాళేశ్వరం: పౌర్ణమి సందర్భంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరికి శనివారం(నేడు) సాయంత్రం 5.30గంటలకు హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు హారతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాసచారి
భూపాలపల్లి అర్బన్: జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వలబోజు శ్రీనివాసచారి ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో 71 ఓట్లు ఉండగా 70మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ నిర్వహించి 6గంటల వరకు కౌంటింగ్ నిర్వహించారు. కూనురు సురేష్కుమార్పై వలబోజు శ్రీనివాసచారి 20ఓట్ల మోజారిటీతో అధ్యక్షుడిగా గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా ఆనందరావుపై విలా శ్రావణ్రావు 17ఓట్ల మోజారిటీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా సంగెం రవీందర్, కోశాధికారిగా రాజ్కుమార్, ఈసీ మెంబర్లుగా రమేష్నాయక్, రాకేష్, ప్రశాంత్, రవీందర్, మహిళా సభ్యురాలిగా సుధారాణి ఎన్నికయ్యారు. కోర్టు ఏర్పాటుకు కృషి చేశా.. జిల్లా కోర్టు, సివిల్ కోర్టుల ఏర్పాటుకు మొదటి నుంచి కృషి చేశాను. అధికారులు, ప్రజాప్రతినిధులను పలుమార్లు కలిసి కోర్టు ఏర్పాటు చేయాలని కోరాను. కోర్టు ఏర్పాటుకు ముందు పరకాల, హనుమకొండ, ములుగు, మంథని కోర్టులకు వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నాటి సేవలను గుర్తించి న్యాయవాదులు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. న్యాయవాదులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – శ్రీనివాసచారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు -
పరీక్షల పేరుతో వసూళ్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రక్త పరీక్షల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆస్పత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లను డాక్టర్లు పరీక్షించి వివిధ రకాల రక్త పరీక్షలు రాస్తున్నారు. అందులో భాగంగా కొంతమందికి ‘ఎలక్ట్రోలైట్స్’ రక్త పరీక్షను కూడా రాస్తున్నారు. రక్త పరీక్షకు సంబంధించి పరికరాలు అందుబాటులో లేకపోవడంతో బయట చేసుకోవాల్సి ఉంటుందని ల్యాబ్ టెక్నీషియన్లు రోగులకు చెబుతున్నారు. ఈ పరీక్ష ప్రైవేట్ ల్యాబ్లో చేయాలంటే రూ.800 ఉంటుందని వసూళ్లు చేస్తున్నట్లు పలువురు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్లో రూ.300నుంచి రూ.500వరకు ఖర్చు అవుతుండగా అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేయకుండానే హైదరాబాద్, వరంగల్కు చెందిన ల్యాబ్ ప్యాడ్స్పై సొంతంగానే ప్రింట్ తీసి పేషెంట్లకు అందజేస్తూ మోసం చేస్తున్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు నర్సింగ్ అధికారులు ఈ దందాకు తెరలేపినట్లు ఆస్పత్రిలో చర్చించుకుంటున్నారు. చర్యలు తీసుకుంటాం.. ఆస్పత్రిలో టెస్టు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్కు పంపకతప్పడం లేదు. త్వరలో నేరుగా ప్రైవేట్ ల్యాబ్ వారితో మాట్లాడి వారి వచ్చి నమూనాలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఇందుకు అయ్యే ఖర్చు ఆస్పత్రి నుంచి చెల్లిస్తాం. అక్రమ దందాను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీనిపై విచారణ చేస్తున్నాం. – డాక్టర్ నవీన్కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
రంగంలోకి దిగిన దళారులు
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 10లోuగతంలో వందలాది మంది బాధితులు జిల్లాకేంద్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టిస్తామని, డబుల్బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని ప్రత్యక్ష్యంగా గత ప్రజాప్రతినిధులే రంగంలోకి దిగి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. డబ్బులు ఇచ్చిన వారిలో కొంత మందికి లబ్ధిచెందగా ఇంకా కొంత మంది బాధితులు సంబంధిత వ్యక్తుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికై నా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వర్తించేలా చేస్తామని దళారులు మోసం చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులపై గతంలో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిన ఘటనలు ఉన్నాయి. ● రూ.లక్షల్లో వసూళ్లకు ప్రణాళిక.. ● గతంతోనూ మోసపోయిన బాధితులు2023 సంవత్సరంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాలు పెట్టిస్తామని పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్పీ స్పందించి కేసు నమోదు చేయించారు. 24మంది నుంచి సుమారు రూ.50లక్షలకుపైగా వసూలు చేశారు. 2024 జూలై 18న ఏజెన్సీ నిర్వాహకుడు శ్రీనివాసరావు, పట్టణానికి ఇద్దరు మధ్యవర్తులను అదుపులోకి తీసుకొని జైలుకు పంపించారు. ఇదే మాదిరిగా జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో బాధితులు ఫిర్యాదులు చేశారు. భూపాలపల్లి అర్బన్: అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే.. ప్రభుత్వం కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టిందంటే చాలు.. కొందరి పంట పండినట్లే. దరఖాస్తుల స్వీకరణ మొదలునుంచే ఆశావహులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు. అమాయక ప్రజలు వారి మాటలకు ఆకర్షితులై ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందాలని లక్షలు సమర్పించి మోసపోతున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రులు దళారులను ఆశ్రయించవద్దని సూచించినా.. మోసపోతూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్బెడ్రూం ఇళ్లు, దళితబందు, కార్పొరేషన్ లోన్లు, ఇతరత్రా పథకాల కోసం చోటా, మోటా, బడా నాయకులు లబ్ధిదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేసిన తర్వాత పథకాల లబ్ధి దరిచేరకపోవడంతో బాధితులు గొడవలకు దిగారు. పరువుపోవడంతో పాటు రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో కొంతమంది వెంటనే బాధితులకు వారినుంచి వసూలు చేసిన డబ్బులను గుట్టుచప్పుడు కాకుండా ముట్టజెప్పిన ఘటనలు జిల్లాలో కోకొల్లలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంటింటి సర్వే ఇప్పటికే పూర్తయింది. అధికారులు అర్హుల ఎంపికలో తలమునకలై ఉండగా, దళారులు వసూళ్లకు తెరలేపారు. ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వ లబ్ధిపొందాలనే వారిని గుర్తించి వారి ఆశలను వీరంతా సొమ్ము చేసుకుంటున్నారు. ఏ పథకం దరిచేరాలన్నా రేషన్కార్డు ప్రామాణికంగా ఉండటంతో జిల్లాలో రేషన్కార్డుల కోసం చాలామంది అర్హులు, అనర్హులు(ఉద్యోగస్తులు) దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది ఆర్థికంగా ఉన్నవారికి సైతం రేషన్కార్డులు ఇప్పిస్తామని రూ.10వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో దృష్టిసారిస్తే అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతం నుంచీ ఇదే పరిస్థితి.. న్యూస్రీల్ -
ఓపెన్కాస్టు తవ్వకాలను అడ్డుకుంటాం
భూపాలపల్లి అర్బన్: గడ్డిగానిపల్లి గ్రామంలో అధికారులు కూల్చేసిన రేకులషెడ్లు, పెంకుటిళ్లకు నష్టపరిహారం చెల్లించకుంటే కేటీకే–2 ఓపెన్ కాస్ట్ గని తవ్వకాలను అడ్డుకుంటామని బాధితులు తెలిపారు. కూల్చేసిన ఇళ్ల వద్ద శుక్రవారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం భూనిర్వాసితులకు నష్టపరిహారం సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేయటంలో తీవ్రంగా నష్టపోయినట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు చల్లూరి సమ్మయ్య, సెగ్గం సిద్ధూ ఆరోపించారు. 2008లో ఓసీపీ–2 కోసం గడ్డిగానిపల్లి గ్రామంలో భూములను పూర్తిగా సింగరేణి స్వాధీనం చేసుకుని, గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తామని అధికారులు చెప్పి ఏళ్లు గడుస్తున్నాయన్నారు. ఇంతవరకు వేరే ఏరియాకు తరలించకపోవడం వల్ల ఓపెన్కాస్ట్ నుంచి ఏర్పడుతున్న దుమ్ము ధూళితో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు కొందరు వారి పట్టా భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే రాత్రి పూట సింగరేణి, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు వచ్చి కూల్చేయడం సరైంది కాదన్నారు. ఈ మేరకు అడ్డుకున్న కొంతమంది మహిళలను అధికారులు బెదిరించడంతో పాటు సెల్ఫోన్లు బలవంతంగా తీసుకుని, మొత్తం 65 ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా కూల్చేసిన ఇళ్లకు పరిహారం చెల్లించకుంటే ఓసీపీ–2 పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు రత్నాకర్, సదానందం, కుమార్, ప్రభుదాస్, మధుకర్, దేవేందర్, సంతోష్, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ఏటూరునాగారం : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డివిజినల్ అధికారి సత్తయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్డ్రిల్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. మంటలకు మరింత తోడునందించే పదార్థాలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని దూరంగా పడేయాలని అన్నారు. విద్యుత్ సరఫరా సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే కర్ర సాయంతో తొలగించాలన్నారు. కరెంట్ సరఫరా ఉన్న వస్తువులపై వెంటనే నీరు పోయొద్దని తెలిపారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే 101, 87126 85772 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి శుక్రవారం మండలంలోని జన సమూహాలు ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సత్తయ్య వివరించారు.ఈ కార్యక్రమంలో లీడ్ ఫైరింగ్ ఆస్పత్రి రవికుమార్ పాల్గొన్నారు.డివిజినల్ అధికారి సత్తయ్య -
మీసేవలో సర్వర్ డౌన్
వెంకటాపురం (కె) : రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు రాగా మీసేవ కేంద్రంలో శుక్రవారం సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. దీంతో దరఖాస్తు దారులు ఇబ్బందులు పడ్డారు. శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సోమవారం ఒక్కరోజే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మీసేవ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో దరఖాస్తులు చేస్తుడడంతో కేంద్రం నిర్వాహకులు రాత్రి 9గంటల వరకు సర్వర్ పని చేస్తే ఆన్లైన్లో నమోదు చేస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక పూర్తి చేసిన అన్ని పత్రాలను ఇచ్చి వెళ్లాలని మీసేవ సిబ్బంది తెలుపుతున్నారు. దరఖాస్తుకు రెండ్రోజుల గడువు ఉండడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నల్లబ్యాడ్జీలతో నిరసన
మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్కు 500మీటర్ల పరిధిలోని పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ నిర్వాసితులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాడిచర్ల, కాపురం జెన్కో భూ నిర్వాసితుల సాధన కమిటీ అధ్యక్షుడు కేసారపు రవి మాట్లాడుతూ.. డేంజర్ జోన్ భూముల సేకరణపై స్పష్టత లేకుండానే ఓపెన్కాస్ట్ ఏఎమ్మాఆర్ కంపెనీ అధికారులు 100 మీటర్ల పరిధిలో మట్టిని డంపింగ్ చేయడానికి ప్రయత్నించడంతో అడ్డుకొని వెనక్కి పంపించినట్లు తెలిపారు. నిరసనగా తాడిచర్ల చింతలకుంట వద్ద ఉపాధి పనులు చేస్తున్న డేంజర్ జోన్కు సంబంధించిన ఉపాధి కూలీలతో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు. నల్లబ్యాడ్జీలు ధరించి పనిచేయడం ఐక్యతను నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం స్పందించి డేంజర్ జోన్ ఇళ్లను సేకరించి, నష్టపరిహారం, పునరావాస కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆదాయ మార్గాలను పెంచుకోవాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీకి వచ్చే అన్ని ఆదాయ మార్గాలను పెంచుకుంటూ సక్రమంగా సద్వినియోగం చేసుకొని పట్టణ అభివృద్ద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ కౌన్సిల్హాల్లో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే పట్టణ అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టణంలోని 30 వార్డుల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నూరు శాతం పన్ను వసూలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పట్టణాన్ని సుందరంగా, ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసుకోవాలన్నారు. అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్, గణేష్ చౌక్, మంజూర్ నగర్ సర్కిళ్ల విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలని కోరారు. వేసవి దృష్ట్యా మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతి లేదని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. పకడ్బందీగా జాబ్మేళా ఏర్పాట్లు భూపాలపల్లి రూరల్: ఈనెల 26న జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగే మెగా జాబ్ మేళా నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. జాబ్మేళా ఏర్పాట్లను గురువారం సింగరేణి, పోలీస్, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. జాబ్ మేళా కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు పది వేల నుంచి పదిహేను వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. జాబ్మేళాకు వచ్చే యువతీ, యువకులు ఇంటర్వ్యూలో పాల్గొనేలా సరిగా గైడ్ చేసేలా వాలంటీర్లను నియమించాలని సింగరేణి జీఎంను కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు రవాణా సదుపాయం, ఎండను దృష్టిలో పెట్టుకొని తాగునీరు, మజ్జిగ పాకెట్లు, భోజన వసతి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయం చేసుకుని జాబ్ మేళాను విజయవంతం చేయాలని సూచించారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
జాగ్రత్తలు పాటించాలి..
వేసవి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఎండ తీవ్రతతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలోనే శరీరంలోని ఉప్పుశాతం తగ్గిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పలుచని దుస్తులు ధరించాలి. పిల్లలకు అరగంటకు ఒకసారి ఓఆర్ఎస్, కొబ్బరి నీరు తాగించాలి. నూనె పదార్థాలు తినొద్దు. పండ్ల రసం ఎక్కువ తీసుకోవాలి. వేసవిలో విహారయాత్రలు, సుదీర్ఘ ప్రయాణాలు శ్రేయస్కరం కాదు. తప్పని పరిస్థితుల్లో వెళ్లాలనుకుంటే పండ్ల రసాలు, కొబ్బరి నీరు, నీరు ఎక్కువ తీసుకోవాలి. లేదంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. – గంట చంద్రశేఖర్, సూపరింటెండెంట్, మహదేవపూర్ సీహెచ్సీ ● -
వాతావరణం
కవి కష్టజీవి పక్షానే ఉండాలి కవి ఎప్పుడూ కష్టజీవి పక్షానే ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్యనవీన్ అన్నారు. జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండ, వేడిగాలులు ఉంటాయి. రాత్రి చలిగా ఉంటుంది.– 8లోuత్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన వరంగల్ రూరల్, వరంగల్ఫోర్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 61 దస్తావేజులకు రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేశాం. వారం పదిరోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది. భూక్రయవిక్రయదారులు స్లాట్ బుకింగ్పై ఆసక్తి కనబరిచారు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆనందం వ్యక్తం చేశారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuకాజీపేట అర్బన్ : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నా.. దస్తావేజులు చేతికందడానికి రెండు మూడు రోజులు పట్టేది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా ఎంపిక చేయగా అందులో ఉమ్మడి వరంగల్లోని వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గురువారం స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ ప్రారంభించి మ్యుటేషన్, దస్తావేజులను యజమానులకు అందజేశారు. స్లాట్ బుకింగ్ షెడ్యూల్ ఇలా..ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు 24 స్లాట్స్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 స్లాట్స్ మెరుగైన సేవలు అందిస్తున్నాం.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. తొలి రోజు 48 స్లాట్స్ అందుబాటులో ఉండగా.. 26 మంది భూమి రిజిస్ట్రేషన్కు స్లాట్స్ బుకింగ్ చేసుకున్నారు. వారు ఎంచుకున్న సమాయానికి కార్యాలయానికి రాగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్లైన్లో ప్రింట్ తీసి దస్తావేజులు అందజేశాం.వృద్ధులు, దివ్యాంగులు, పేషంట్ల కోసం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్స్ 15 నిమిషాల్లో దస్తావేజులు.. స్లాట్ బుకింగ్ సదుపాయంతో భూక్రయవిక్రయదారులు తాము కోరుకున్న రోజు.. కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 55 స్లాట్ బుకింగ్స్ కల్పించారు. 15 నిమిషాల కాలవ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మరో 15 నిమిషాల్లో మ్యుటేషన్ కాపీతో పాటు దస్తావేజులు అందజేశారు. ● వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 36 ● వరంగల్ ఫోర్ట్ కార్యాలయంలో 25 దస్తావేజులకు తొలిరోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రక్రియను ప్రారంభించిన జిల్లా రిజిస్ట్రార్ప్రతిరోజు రెండు కార్యాలయాల్లో 106–జి.నరేందర్ సబ్ రిజిస్టార్ ఫోర్ట్ వరంగల్ -
సహకార సంఘాల పునర్విభజన చేపట్టాలి
భూపాలపల్లి: సహకార సంఘ మార్గదర్శకాల ప్రామాణికంగా సహకార సంఘాల పునర్విభజన చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సహకార సంఘాల పునర్విభజనపై గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, సహకార, వ్యవసాయ, ఉద్యాన, మత్య్స, పశు సంవర్ధక, వరంగల్, కరీంనగర్ డీసీసీబీ డీజీఎం, ఏజీఎంలతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహకార సంఘం మార్గదర్శకాల మేరకు 10 అంశాలను పరిగణనలోకి తీసుకుని 10 నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. సహకార సంఘాల ఏర్పాటు ద్వారా అన్ని గ్రామాల రైతులకు ప్రయోజనం కలగాలన్నారు. ప్రస్తుతం ఉన్న సంఘాలు సుదూరం ఉన్నందున ప్రజలకు సేవలు అందించడానికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని నూతన సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నూతన సంఘాల ఏర్పాటులో మూడు సంవత్సరాల పాటు జరిగిన వ్యాపార లావాదేవీలు, ఆడిట్ నివేదికతో పాటు 9 అంశాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సహకార శాఖ అధికారి వాల్యనాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కుమారస్వామి, అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
చిట్యాల: వినియోగదారుల ఫిర్యాదులను విద్యుత్ సిబ్బంది త్వరితగతిన పరిష్కరించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ ఎన్.వేణుగోపాలచారి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన వినియోగదారులకు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేణుగోపాలచారి హాజరై మాట్లాడారు. ఈ లోకల్ కోర్టులో లూస్లైన్లు, మిడిల్ ఫోల్స్, అగ్రికల్చర్ సర్వీస్లు, తదితర వాటికి సంబంధించిన సమస్యలపై వినియోగదారుల నుంచి 14 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. రెండు ఫిర్యాదులు అక్కడికక్కడే పరిష్కరించినట్లు తెలిపారు. మిగితా 14 ఫిర్యాదులు కేసులు రిజిస్టర్ చేసి 45 రోజులలో పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫైనాన్స్ మెంబర్ ఆర్.చరణ్దాస్, ఇండిపెండెంట్ మెంబర్ ఎం.రామారావు. టెక్నికల్ మెంబర్ కె.రమేష్, ఎస్ఈ మల్చూర్, ఏఓ రాజ్కుమార్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ సందీప్ పాటిల్, ఏఈలు చంద్రశేఖర్, మణిదీప్, సంజయ్, సబ్ ఇంజనీర్లు సుమంత్, వెంకటేష్, శ్రీనివాస్, విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ వేణుగోపాలచారి -
సన్నబియ్యం పంపిణీ సక్రమంగా చేయాలి
కాటారం: ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ రేషన్దుకాణాల ద్వారా సక్రమంగా జరగాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కాటారం మండలం కొత్తపల్లి చౌకధరల దుకాణాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఎన్ని కిలోల సన్న బియ్యం ఇస్తున్నారు.. ఎలా పంపిణీ జరుగుతుందని లబ్ధిదారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల సన్న బియ్యం అందజేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు సన్న బియ్యం స్టాక్ చేరిందని లబ్ధిదారులు తమ కోటా బియ్యం తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 77శాతం మేర సన్న బియ్యం పంపిణీ జరిగిందని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సన్న బియ్యం పంపిణీపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా బియ్యం పంపిణీ వ్యవస్థ పకడ్బందీగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టంచేశారు. సన్నబియ్యం పంపిణీ విషయంలో రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం సక్రమంగా అందించాలి మల్హర్: రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు సక్రమంగా అందించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ డీలర్లను ఆదేశించారు. మండలంలోని పెద్ద తాడిచర్ల గ్రామంలోని రేషన్షాపును గురువారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపు రికార్డులు, లబ్ధిదారుల వేలిముద్రలను పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా సన్నబియ్యం పంపిణీ చేయాలని తెలిపారు. కార్డుదారుల కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వాలని డీలర్కు సూచించారు. అనంతరం మల్లారం దుబ్బగట్టు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ రా రైస్ మిల్ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ 14 వరకు దరఖాస్తుల స్వీకరణ.. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు గడువు పెంచిందని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాటారం మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను కలెక్టర్ పరిశీలించారు. పథకం యూనిట్ల వివరాల ఫ్లెక్సీ ఏర్పాటుతో పాటు హెల్ప్డెస్క్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. దరఖాస్తుదారుల వివరాలు రిజిస్టర్లో నమోదు చేసుకొని రశీదు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అశోక్కుమార్, పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, ఎంపీడీఓ బాబు, నయాబ్ తహశీల్దార్ రామ్మోహన్, అధికారులు ఉన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
భూపాలపల్లి అర్బన్: నేడు(శుక్రవారం) డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ఇందు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు మధ్యాహ్నం 12గంటల నుంచి 1 గంట వరకు 99592 26707 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఆర్టీసీ సమస్యలు సూచనలు, సలహాలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ముక్తివనం పార్కులో మంటలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ముక్తివనం పార్కులో గురువారం మంటలు చెలరేగాయి. కాళేశ్వరం దర్శనానికి వచ్చిన భక్తులు పార్కు వెనుకాల వంటలు చేసుకొని నిప్పును వదిలేశారు. దీంతో భారీగా పొగతో పాటు మంటలు ఎగిసిపడ్డాయి. అటవీశాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ఫైర్ బ్లోయర్స్తో మంటలను బీట్ అధికారి శ్రీలత, వాచర్స్ ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని గడ్డగానిపల్లి గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లను అధికారులు గురువారం తెల్లవారు జామున కూల్చేశారు. ఓపెన్కాస్ట్–2 ప్రభావిత గ్రామమైన గడ్డిగానిపల్లిలో నష్ట పరిహారం పొందేందుకు గ్రామస్తులు అనుమతి లేకుండా సుమారు 48 నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ, మున్సిపల్, సింగరేణి, పోలీసులు జేసీబీలతో కూల్చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలి భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో గురువారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం భూపాలపల్లి బ్రాంచ్ కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అనేక హామీలు ఇచ్చినప్పటికీ నెరవేర్చడం లేదన్నారు. కోలిండియా వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఏరియా నూతన బ్రాంచ్ కమిటీ అధ్యక్షుడిగా మడికొండ స్వామి, కార్యదర్శిగా సుధాకర్లను నియమించినట్లు తెలిపారు. ఎదిర పీహెచ్సీ పరిశీలన వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఎదిర వైద్యశాలతో పాటు చొక్కాల, వెంకటాపురం సబ్ సెంటర్లను గురువారం జిల్లా క్వాలిటీ మేనేజర్ శరత్, క్వాలిటీ మోనిటర్ సాయిచంద్లు పరిశీలించారు. వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందికి జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలపై ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్నేహారెడ్డి, పవన్, సిబ్బంది యాకలక్ష్మి, రామలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రయాణంలో ఆహారం ముఖ్యం..
బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో విటమిన్ ’బి’ లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కాయగూరలు, ధాన్యాలు, క్యారెట్ ఎక్కువ తీసుకోవాలి. తరచూ నీరు తాగాలి. తద్వారా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. ప్రయాణంలో వాహనం ఆపిన సమయంలో కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిది. వదులు దుస్తులు ధరించాలి. తద్వారా శరీరానికి గాలి బాగా తగులుతుంది. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణంలో తాగునీరు, పండ్ల రసాలు వెంట తీసుకెళ్లాలి. ఓఆర్ఎస్ వెంట తీసుకెళ్లడం మరవద్దు. పిల్లలకు పలుచని దుస్తులు వేయాలి. ముఖానికి లోషన్స్ తప్పనిసరిగా రాసుకోవాలి. -
ఏటేటా పెరుగుతున్న ధరలు
భూపాలపల్లి రూరల్: పత్తి విత్తనాల ధర ఏటేటా ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఒక విత్తనపు సంచికి రూ.36 పెరిగింది. ఈ లెక్కన జిల్లా మొత్తంలో సుమారుగా రూ.90 లక్షలకు పైగా రైతులపై భారం పడనుంది. జిల్లాలో సాగయ్యే పంటల్లో పత్తి ప్రధాన పంట కాగా, వచ్చే వానాకాలం సీజన్కు సంబంధించిన పత్తి విత్తనాల ధరను ప్రభుత్వం ఖరారు చేసింది. వాతావారణం అనుకూలించక దిగుబడి తగ్గడం మద్దతు ధర రాకపోవడం, ఎరువులు, కలుపు తీత, కూలీల ఖర్చులు అమాంతం పెరిగి రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ తరుణంలో పత్తి విత్తనాల ధరల పెరుగుదల రైతులను మరింత కుంగదీస్తోంది. పత్తికే ప్రాధాన్యం.. జిల్లాలో రైతులు ఎక్కువ శాతం పత్తి సాగుకు మొగ్గు చూపుతుంటారు. పత్తి ధర మార్కెట్లో నిలకడగా రూ.వేయి, రూ.రెండు వేలు ఎక్కువ తక్కువతో ఉంటుంది. దీంతో కరువు కాటకాలు వచ్చినా.. దిగుబడి తగ్గినా.. పెట్టుబడి నష్టపోవడం ఉండదనే భావన రైతుల్లో ఉంది. దీంతో రైతులు వరితోపాటు పత్తి పంటకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పెరుగుతున్న ఖర్చులు.. ఏటేటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికి తోడు విత్తనాలు పురుగు మందులు, కూలీల వేతనాలు కలిపి రూ.వేలల్లో పెట్టుబడి అవుతుంది. కూలీల రవాణా ఖర్చులు తడిచి మోపెడవుతున్నా యి. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.12 వేల వ రకు కలుపు తీత కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ధరలు అదుపులో ఉంచాలి ప్రభుత్వం ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల ధరలను అదుపులో ఉంచాలి. పత్తి విత్తనాల ధరలు ప్రతి ఏడాదీ పెంచుతున్నారు. దీంతో రైతులపై భారం పడుతోంది. ధరలను పెంచకుండా అందుబాటుతో ఉంచాలి. ప్రభుత్వం పత్తితోపాటు, మిర్చి, వరి విత్తనాలను సబ్సిడీపై అందిస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. – కాపరబోయిన రాకేష్, రైతు, కొత్తపల్లి (ఎస్ఎం) భూపాలపల్లి ●విత్తన ధరలు ఇలా.. జిల్లాకు 2.50లక్షల విత్తన సంచులు అవసరం సబ్సిడీపై అందించాలని రైతుల వేడుకోలు -
కేసీఆర్ సభను విజయవంతం చేయాలి
మొగుళ్లపల్లి: ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. బుధవారం మండలంలోని ఆకినపల్లి, ఇప్పలపల్లి, పోతుగల్, కొరికిశాల, గణేష్పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, పిడిసిల్ల గ్రామాల్లో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులది అన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పని తీరుపై ప్రజల్లో అసహనం మొదలైందని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అమలు అయిన పథకాలనే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనుభవం లేని, అసమర్థపాలన, చేతగాని వ్యవహారం వలన ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్లే వారి బాధలు చెప్పుకుంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో జీవితాలు అద్భుతంగా ఉన్నాయని, అప్పుడే అభివృద్ధి జరిగిందని.. ప్రజలు ఆలోచనలో పడ్డారని అన్నారు. ఈ నెల 27న జరగబోయే సభాతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. పోతుగల్లు గ్రామ ప్రజలు చెరువు సమస్య గురించి రమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత ఏఈకి ఫోన్ చేసి చెరువు మరమ్మతులు గురించి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. రైతాంగానికి నీరువ్వకుండా చెక్డ్యామ్ కులగొట్టిన ఘనత ప్రస్తుత ఎమ్మెల్యేకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఆకినపల్లి మాజీ సర్పంచ్ దూడపాక భద్ర య్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడపాక సమ్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడి రమణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ రమేష్, నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాములు, రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
26న భూపాలపల్లిలో మెగా జాబ్మేళా
భూపాలపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ నెల 26వ తేదీన జిల్లా కేంద్రంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వివిధ శాఖల అధికారులు, జాబ్ మేళా నిర్వహించే టాస్క్ కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ఖరేతో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో టాస్క్ కంపెనీ నిర్వహిస్తున్న జాబ్మేళాలో ప్రము ఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్లో నిర్వహించే జాబ్మేళాకు 700 కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఈ జాబ్ మేళా కార్యక్రమంపై గ్రామ గ్రామాన విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జాబ్ మేళాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరవుతారని తెలిపారు. క్యూ ఆర్ కోడ్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. క్యూ ఆర్ కోడ్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు 26వ తేదీన నిర్వహించే జాబ్ మేళా స్టాళ్లలో నమోదు చేసుకోవాలని సూచించారు. 10 వతరగతి నుంచి డిగ్రీ, పీజీ.. ఇతర పై చదువులు చదువుకున్న నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశమన్నారు. వేసవి నేపథ్యంలో అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జాబ్మేళాపై గ్రామస్థాయిలో అధికారులు నిరుద్యోగ యువతను గుర్తించి వారి పూర్తి బయో డేటా నివేదిక తయారు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కేటీపీపీ సీఈ శ్రీప్రకాశ్, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు, టాస్క్ ప్రతినిధి ప్రదీప్రెడ్డి, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ఉచిత శిక్షణ
భూపాలపల్లి రూరల్: రాష్ట్రంలోని నిరుద్యోగ దివ్యాంగ యువతీ, యువకులకు సమర్థనం దివ్యాంగుల సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఐటీఈఎస్ (కంప్యూటర్, బీపీఓ, సాఫ్ట్స్కిల్స్) కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్ నల్లపు శ్రవణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయం ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పదో తరగతి ఆపైన విద్యార్హతలు కలిగినవారు ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 63648 67804, 63648 63218 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు. ప్రైవేట్ అభ్యర్థులకు ఐటీఐ పరీక్షలకు అర్హత భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు వివిధ ట్రెడ్లలో ప్రైవేట్ అభ్యర్థిగా పరీక్షలు రాసేందుకు అర్హత కల్పిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జూమ్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ట్రెడ్లో అభ్యర్థులు 3 సంవత్సరాలపైబడి సర్వీస్, నైపుణ్యత కలిగి ఉండాలని తెలిపారు. వారు పనిచేస్తున్న సంస్థ ధ్రువీకరణపత్రం, సంస్థ ఐడీ కార్డుతో వరంగల్ ప్రాంతీయ ఉపసంచాలకుల కార్యాలయంలో రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి భూపాలపల్లి రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేవిధంగా.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరే విధంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని ప్రతి గ్రామానికి విస్తరింపజేయాలని, రేషన్ బియ్యానికి నిధులు కేంద్ర ప్రభుత్వానివే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిధులని చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం వాటా ఉందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బట్టు రవి, దొంగల రాజేందర్, సయ్యద్ గాలిఫ్, మందల రఘునాథరెడ్డి, మాచన వేణి రవీందర్, సామల మధుసూదన్ రెడ్డి, తుమ్మేటి రామిరెడ్డి, సేనాపతి, ఊరటి మునేందర్, విప్లవ కుమార్ రెడ్డి జంజర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ మోసం రేగొండ: సైబర్ మోసానికి ఓ బాధితుడు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.54 వేలు పోగొట్టుకున్న ఘటన మండలంలోని రంగయ్యపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగయ్యపల్లికి చెందిన బండి హృషికీర్తన్ అనే వ్యక్తికి +8801340–462002 అనే నంబరు నుంచి టెలిగ్రామ్ ద్వారా ఓ సందేశం వచ్చింది. ఆన్లైన్లో పనులను పూర్తి చేసి డబ్బు సంపాదించమని అందుకు ముందుగా కొంత డిపాజిట్ చేయాలని ఆ మెసేజ్ సారాంశం. దీంతో బాధితుడు సైబర్ నేరగాళ్లకు వేర్వేరు యూపీఐ ఐడీలకు రూ.54,098 డిపాజిట్ చేశాడు. కానీ, తిరిగి డబ్బును సంపాదించలేకపోయాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించి 1930కు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నలుగురిపై వైల్డ్లైఫ్ యాక్ట్ కేసులుఏటూరునాగారం: నిబంధనలకు విరుద్ధంగా అడవిలో నిప్పు, వంట, ఆల్కాహాల్ సేవించడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించినందుకు నలుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (వైల్డ్లైఫ్ యాక్ట్) 1972 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి డిప్యూటీ రేంజ్ అఫీసర్లు పి.ప్రహ్లాద్, పి.నరేందర్ బుధవారం తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చిన్నబోయినపల్లి సమీపంలోని అడవికి వెళ్లగా దుమ్మని శ్రీకాంత్, అడ్డూరి సుమంత్రెడ్డి, వినీత్రెడ్డి, ఖలీల్పాషాలు మద్యం సేవించడంతో పాటు వంట వండి అగ్గిపెట్టలను ఉపయోగించి అలాగే వదిలేయడంతో పాటు వంట వండి మంటలు ఆర్పక పోవడంతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం రేంజ్ కార్యలయం సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రేడ్స్మెన్లను నియమించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని ఓపెన్ కాస్ట్లో ట్రెడ్స్మెన్లను నియమించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్– 2లోని గని మేనేజర్ కృష్ణప్రసాద్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఓసీ 3కి ఎవరిని డిప్యూటేషన్పై బదిలీ చేయొద్దని, హెల్పర్లను ఇవ్వాలని, కాలం చెల్లిన యంత్రాలను తొలగించాలని కోరారు. రిటైర్మెంట్ అయిన టెక్నీషియన్ల స్థానాలను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. ట్రేడ్స్మెన్లపై అధికారులు అగౌరవంగా, అవమానకరంగా వ్యవహరించొద్దని అన్నారు. కార్యక్రమంలో ట్రేడ్స్మెన్లు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్ నాయకులు మధుకర్రెడ్డి, రాజేందర్, ఏబూసి ఆగయ్య, సుజేందర్, రఘుపతి, సమ్మిరెడ్డి, శ్రీనివాస్, చేరాలు, నారాయణ, కృష్ణ రవీందర్, పర్వతాలు పాల్గొన్నారు. -
నేలవాలిన అరటితోటల పరిశీలన
చిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామశివారులో సోమవారం వీచిన గాలిదుమారానికి అరటి పంటలు పూర్తిగా నేలవాలాయి. స్పందించిన ఉద్యాన శాఖ డివిజనల్ అధికారి సునీల్ బుధవారం ఆకుల సతీష్, గంపల మధుకర్, సూర సుధాకర్, క్యాతం భద్రయ్య, క్యాతం రాజయ్యలకు చెందిన అరటి పంటలను పరిశీలించారు. రెండు రోజులుగా వీస్తున్న గాలుల ప్రభావంతో అరటి తోటల్లో నష్టం వాటిల్లిందన్నారు. నష్టతీవ్రతపై ప్రాథమికంగా అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. -
లక్ష ఎకరాల సాగు అంచనా..
జిల్లా వ్యాప్తంగా గతేడాది 85,691 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. వచ్చే సీజన్లో లక్ష ఎకరాలకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఈ లెక్కన 2.50 లక్షల విత్తనాల సంచులు అవసరమవుతాయి. మార్కెట్లో బీటీ–1, బీటీ–2 పలు పత్తి విత్తన రకాలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ శాతం రైతులు బీటీ–2 రకానికి సంబంధించిన విత్తనాలకే ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం 450 గ్రాముల బీటీ–2 పత్తి విత్తనాల సంచి ధర రూ.864 ఉంది. వచ్చే సీజన్ నుంచి ఇది రూ.900 చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బీటీ రకాల్లో వందలాది కంపెనీలు ఉండటంలో డిమాండ్ ఉన్న రెండు, మూడు కంపెనీల విత్తనాలు మినహా ఇతర కంపెనీలు ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఇస్తారు. డిమాండ్ ఉన్న విత్తనాలను ఎక్కువ ధరతో విక్రయిస్తారు. లేదంటే రైతుకు ఒకటి లేదా రెండు సంచులకు పరిమితం చేస్తారు. వివిధ కంపెనీలు పలు రకాల విత్తనాలను అందుబాటులో ఉంచినా.. రైతులు మాత్రం కొన్నింటికే మొగ్గుచూపడంతో ఏటా విత్తనాలకు రైతులు బారులుదీరి నిల్చోవాల్సి ఉంటుంది. -
‘టెన్త్’ మూల్యాంకనంలో నిర్లక్ష్యం..
విద్యారణ్యపురి: హనుమకొండలోని కాజీపేట ఫాతిమా హైస్కూల్లో శ్రీటెన్త్శ్రీ మూల్యాంకనం కొనసాగుతోంది. ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు అసిస్టెంట్ ఎగ్జామినర్లు( ఏఈ)గా మూల్యాంకనంలో భాగంగా మార్కులు పోస్టింగ్ చేయడంలో పొరపాట్లు చేస్తున్నారు. స్క్రూటినీలో ఆయా పొరపాట్లు గుర్తించి సక్రమంగా మూల్యాంకనం చేయాలని చీఫ్ ఎగ్జామినర్, ఇతర సిబ్బంది సూచించినా అలాగే నిర్లక్ష్యం చేస్తుండడంతో వారిని విధుల నుంచి టెన్త్ స్పాట్ క్యాంపు ఆఫీసర్, డీఈఓ వాసంతి రిలీవ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మ్యాథ్స్కూల్ అసిస్టెంట్కు మూల్యాంకనం విధులు అప్పగించగా మంగళవారం నిర్లక్ష్యం వహించారు. విద్యార్థుల జవాబుపత్రాల్లో మార్కుల పోస్టింగ్లో పొరపాట్లు చేస్తున్నట్లు స్క్రూటినీలో గుర్తించారు. సక్రమంగా చేయాలని సూచించినా బుధవారం కూడా అదేమాదిరి చేయడంతో అతడు చేసిన జవాబుపత్రాలను క్యాంప్ ఆఫీసర్కు వాసంతికి చూపించారు. దీంతో అతడిని వెంటనే రిలీవ్ చేశారు. అలాగే, జయశంకర్ భూపాలపల్లిజిల్లాలో బయోసైన్స్స్కూల్ అసిస్టెంట్ కూడా సోమవారం ఏఈగా మూల్యాంకనం విధుల్లో చేరారు. సరిగా చేయకపోవడంతో గుర్తించి సంబంధిత సీఈ, ఇతర సిబ్బంది చెప్పినా మార్కుల పోస్టింగ్లలో పొరపాట్లుచేస్తుండగా రెండురోజులు అలాగే తప్పులు చేస్తుండడంతో పరిశీలించి మంగళవారం రిలీవ్ చేశారు. ఆయా ఇద్దరు స్కూల్అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని డీఈఓ వాసంతి గురువారం జయశంకర్ భూపాలపల్లి డీఈఓకు లిఖితపూర్వక సమాచారం పంపనున్నారు. వీలైతే సస్పెండ్ చేయాలనేది ఆదేశించనున్నారనేది చర్చ జరగుతుంది. ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ల రిలీవ్ చెప్పకుండా క్యాంప్ నుంచి వెళ్లిన మరో టీచర్ చర్యలు తీసుకోవాలని డీఈఓలకు సమాచారంచెప్పకుండా విధుల నుంచి వెళ్లిన టీచర్ మహబూబాబాద్ జిల్లాలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ మంగళవారం ఫాతిమా హైస్కూల్ స్పాట్ క్యాంపు వద్దకు వచ్చారు. తనకు విధులు అప్పగిస్తే అసిస్టెంట్ ఎగ్జామినర్గా మూల్యాంకనం చేస్తానని చెప్పగా అక్కడ సంబంధిత అధికారులు అతడికి విదులు అప్పగించారు. పది జవాబుపత్రాలు మూల్యాంకనం చేశాక మంగళవారం మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా క్యాంపు నుంచి వెళ్లిపోయాడు. దీంతో సంబంధిత సిబ్బంది అతడికి ఫోన్చేస్తే స్విచాఫ్ వచ్చింది. బుధవారం కూడా క్యాంప్నకు రాలేదు. ఫోన్లో సంప్రదించే యత్నం చేసినా అందుబాటులోకి రావడం లేదు. ఈ విషయం డీఈఓ వాసంతికి తెలియజేయగా మహబూబాబాద్ డీఈఓకు కూడా సంబంధిత టీచర్పై సమాచారం ఇచ్చారు. అలాగే, అతడిపై చర్యలు తీసుకోవాలని గురువారం లిఖితపూర్వకంగా మహబూబాబాద్ డీఈఓకు పంపనున్నారు. అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
డ్రోన్ల వినియోగంతో మెరుగైన సేవలు
భూపాలపల్లి: మారుమూల ప్రాంతాల్లోని ప్రజల వివిధ అవసరాలకు డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఈసీఐఎల్ కంపెనీ సీఎస్ఆర్ నిధులు నుంచి 20 ఎలక్టాన్రిక్ స్కూటీలు, 12 డ్రోన్లను కలెక్టర్ రాహుల్ శర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ సూపర్ వైజర్లు మారుమూల గ్రామాల్లో సేవలు అందించడానికి, వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం, వైద్య సేవలు సిటీ స్కాన్, ఇతర పరికరాలు ఈసీఐఎల్ సీఎస్ఆర్ నిధులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. మారుమూలు ప్రాంతాలకు అంగన్వాడీ సూపర్ వైజర్లు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేవని గ్రామాలకు ఎలక్టాన్రిక్ స్కూటీలు సులువుగా వెళ్లడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ రోజుల్లో వ్యవసాయ పనులకు కూలీలు కొరత ఉందని, ఈ ఆధునిక సాంకేతికత డ్రోన్ల విని యోగం రైతులకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రసాయన మందుల పిచికారీ సమయంలో ప్రజలు ప్రాణాలకు అపాయం ఏర్పడుతుందని, డ్రోన్ల వినియోగం ద్వారా ప్రాణాలకు ఎలాంటి అపాయం ఏర్పడదని తెలిపారు. సమయం కూడా ఆదా అవుతుందని అన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి లో మెరుగైన వైద్య సేవలకు సిటీ స్కాన్ ఇతర పరికరాలు ఇవ్వనున్నారని తెలిపారు. రానున్న నెల రోజుల్లో వైద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ.. ఎలక్టాన్రిక్ స్కూటీలు, డ్రోన్లు, వైద్య పరికరాలు మొత్తం రూ.4 కోట్ల సీఎస్ఆర్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సీపీఓ బాబు రావు, సంక్షేమ అధికారి మల్లీశ్వరీ, వ్యవసాయ అధికారి వీరునాయక్, ఆస్పత్రి పర్యవేక్షకులు నవీన్ కుమార్, ఈసీఐఎల్ హెచ్ఆర్ ఈడీ మురళీధర్, సీఎంఓ వేణుబాబు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● టీజీ జేఏసీ జిల్లా కన్వీనర్ రవి భూపాలపల్లి అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీజీ జేఏసీ జిల్లా కన్వీనర్ బూరుగు రవి కోరారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగుల పెండింగ్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించేలా ముఖ్యమంత్రితో మాట్లాడాలని కోరినట్లు తెలిపా రు. ఉద్యోగులు సమస్యతో సతమత మవుతున్నా రని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయడంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లతో సదస్సు నిర్వహిస్తా మన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో మహాధర్నా చేపేట్టేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ బాధ్యులు పాల్గొన్నారు. కమిటీ ఎన్నికఅంతకుముందు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా జేఏసీ నూతన చైర్మన్గా బూరుగు రవి, ప్రధాన కార్యదర్శిగా శైలజ, అడిషనల్ సెక్రెటరీ జనరల్గా రేగురి సుభాకర్రెడ్డి, దశరథ్, సందాని, భార్గవ్, ప్రవీణ్, కోకన్వీనర్లుగా శంకరయ్య, సేవానాయక్, రఘువీర్, కిరణ్, వివిధ విభాగాలకు కన్వీనర్లను నియమించారు. -
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన
భూపాలపల్లి రూరల్: బాపూజీ గాంధీ, అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 29 వార్డులు రాఏనగర్, సుభాష్ కాలనీల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జై భీమ్, జై బాపూ, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా బాపూజీ, అంబేడ్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేశారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. గాంధీ అంబేడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో కూడా అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. పాదయాత్ర సాగుతున్న క్రమంలో పలువురు కాలనీ వాసులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమాల్లో మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, వార్డుల ఇన్చార్జ్లు బీతి పృథ్వీ, పుల్లా మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
భూపాలపల్లి రూరల్: యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో రెవెన్యూ, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, సహకార, వ్యవసాయ, డీఆర్డీఏ, తూనికలు కొలతలు, కార్మిక శాఖల అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఏసీఎస్, ఐకేపీకి కేటాయించిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్కు రూ.2,320, బీ గ్రేడ్ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 50శాతం కొనుగోలు కేంద్రాలు మహిళా సమాఖ్యలకు కేటాయించాలన్నారు. ఎంపిక చేసిన గ్రామ సమాఖ్యలకు ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయాల్లో పాటించాల్సిన నియమ, నిబంధనల బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులకు నగదు చెల్లింపు కోసం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్లలో నమోదు చేయాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో నీడ కోసం షామియానా, తాగునీరు, ప్యాడీక్లీనర్, మాయిశ్చర్స్, తూకపు యంత్రాలు, టార్పాలిన్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు. సన్నరకం, దొడ్డు రకం విడివిడిగా కొనుగోలు చేయాలని, గుర్తించడానికి వీలుగా మార్కింగ్ చేయాలని సూచించారు. సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లింపు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాములు, డీఆర్డీఓ నరేష్, వ్యవసాయ అధికారి వీరునాయక్, జిల్లా సహకార అధికారి వాలియా నాయక్, మార్కెటింగ్ ఏడీ కనకశేఖర్, తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీలత, సహాయ కార్మిక శాఖ అధికారి వినోద పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
సన్నబియ్యంతో పేదలకు మేలు
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్మార్స్ కాలనీలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన బానోతు మౌనిక కిషన్ నాయక్ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనాన్ని మంగళవారం కుటుంబసభ్యులు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భోజనం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ఆహార భద్రత కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో పేదల కళ్లలో ఆనందాన్ని స్వయంగా చూశానని ఎమ్మెల్యే అన్నారు. భోజనం అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మౌనిక. కిషన్ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాకు చేరినట్లు తెలి పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పౌరసరఫరాల అధికారి రాములు, సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాథ్, తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, శిరుప అనిల్, ముంజాల రవీందర్, జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, అంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్తో కలిసి సహపంక్తి భోజనం -
దరఖాస్తు గడువు పొడిగింపు
భూపాలపల్లి రూరల్: రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా అల్పా సంఖ్యాక వర్గాల అధికారిణి టి.శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం మల్హర్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను 100 శాతం పరిష్కరించడానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడి హామీనిచ్చారు. రుద్రారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు లక్షణ్బాబు, ఉపాధ్యాయ బృందం ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాత పెన్షన్ వర్తింపు, పెండింగ్ బకాయిలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు విజయపాల్రెడ్డి పాల్గొన్నారు. సూరారం పాఠశాల సమీపంలో క్షుద్రపూజలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం సూరారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై క్షుద్రపూజలు చేశారు. మంగళవారం ఉదయం రోడ్డుపై ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ, కుంకుమ, నిమ్మకాయలు దర్శనమివ్వడంతో గ్రామస్తులతో పాటు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కోనంపేట సమీపంలో పులి ప్రచారం కాటారం: మహాముత్తారం మండలం కోనంపేట అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు మంగళవారం ప్రచారం జరిగింది. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పలువురు పులి అడుగులను పోలిన గుర్తులను గమనించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో పులి అడవిలో ఉందనే వార్త గ్రామం మొత్తం చుట్టేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతానికి చేరుకొని పాదముద్రలను పరిశీలించారు. అవి పులి అడుగులు కావని పులిని పోలిన హైనా వంటి అటవీ జంతువు పాదముద్రలు అని రేంజ్ అధికారిణి ఉష తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలిభూపాలపల్లి అర్బన్: పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వంట సిలిండర్ గ్యాస్ ధర రూ.50 పెంచడం దారుణమన్నారు. పేద ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయని మండిపడ్డారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, రోజువారి కూలీ వేతనం పెరగక అనేక అవస్థలు పడుతుంటే బీజేపీ ప్రభుత్వం నిత్యవసర ధరలను పెంచుకుంటూ పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. పెంచిన ధరలను తగ్గించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన పోరాటాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, అస్లాం, వైకుంఠం, హరీశ్, శివకృష్ణ, శేఖర్, లావణ్య, వనిత, సరూప పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య
కాటారం: ప్రభుత్వ పాఠశాలల ద్వారా కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు విద్య అందుతుందని.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కాటారం మండలకేంద్రంలో చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి డీఈఓ రాజేందర్తో కలిసి ప్రారంభించారు. డీఈఓ, ఉపాధ్యాయులతో పాటు ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తుందన్నారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందన్నారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారి రాజగోపాల్, సీఎంఓ రమేశ్, జీసీడీఓ శైలజ, కిషన్రెడ్డి, ఎంఈఓ శ్రీదేవి, హెచ్ఎం ఉమారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చిన్న కాళేశ్వరం సర్వే అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా మండలంలోని గూడూరు పరిధిలో కొనసాగుతున్న కాల్వ నిర్మాణ సర్వే పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. కాల్వ నిర్మాణంతో తాము భూములు కోల్పోయి నష్టపోవాల్సి వస్తుందని, కాల్వ అలైన్మెంట్ మార్చాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పొలాల మధ్య నుంచి కాల్వ నిర్మాణం జరిగితే తమ పంటలకు నష్టం జరుగుతుందని నిర్వాసిత రైతులు అధికారులకు విన్నవించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. చిన్న కాళేశ్వరం డీఈఈ ఉపేందర్ రైతులకు నచ్చజెప్పారు. డీఈఈ వెంట ఏఈ వెంకన్న, ఎస్సై శ్రీనివాస్, సర్వే ఇన్స్పెక్టర్ రాములు ఉన్నారు. -
చెట్టును ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు
కాటారం: గాలివానకు ప్రధాన రహదారిపై నేలకు ఒరిగిన చెట్టును గమనించక ఢీ కొట్టిన ద్విచక్రవాహనదారుడు తీవ్ర గాయాలపాలైన ఘటన మంగళవారం రాత్రి కాటారం మండలంలో చోటుచేసుకుంది. బొప్పారం గ్రామానికి చెందిన మంతెన పూర్ణచందర్ తన ద్విచక్ర వాహనంపై బొప్పారం నుంచి మండల కేంద్రానికి వస్తున్నాడు. గాలివానకు ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయి ఉంది. పూర్ణచందర్ చీకట్లో చెట్టును గమనించక బైక్తో చెట్టును బలంగా ఢీ కొట్టాడు. పూర్ణచందర్ తలతో పాటు తీవ్రగాయాలయ్యాయి. అటు వైపుగా వెళ్లిన వారు 108కి సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఆరు ఎకరాల మామిడితోట దగ్ధం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామక్రిష్ణాపూర్ పరిధిలో గల మోకిరాల తిరుపతిరావుకు చెందిన మామిడి తోటకు సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు రెండు వేల చెట్లు కాలిపోయాయి. చెల్పూరుకు చెందిన తిరుపతిరావు రామక్రిష్ణాపూర్ పరిధిలో ఆరు ఎకరాల్లో హిమయిత్, దశరి రకంకు చెందిన 8 ఏళ్ల వయస్సు గల రెండు వేల మామిడి చెట్లను సాగు చేస్తున్నాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్లుగా క్రాప్ వస్తుందని తిరుపతిరావు పేర్కొన్నారు. మామిడితోట వద్ద వర్కర్లు కాపలా ఉంటున్నారు. సోమవారం ఉదయం కొంతమంది వ్యక్తులు మామిడితోట వైపునకు వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే తోటలో మంటలు చేలరేగడంతో వర్కర్లు నాలుగు మోటార్ల సహాయంతో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అయినా అదుపులోకి రాలేదు. పంట చేతికి వచ్చేదశలో మామిడిచెట్లు కాలిపోవడంతో పాటు డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తిరుపతిరావు తెలిపారు. రెండు వేల చెట్లు అగ్నికి ఆహుతి రూ.20 లక్షల నష్టం -
హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
కాటారం: రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వ హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని స్టేట్ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాటారం మండలకేంద్రంలో సోమవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాఘవరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు గారెపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలోని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన శాంతి, అహింసా సిద్ధాంతాలను బీజేపీ విస్మరిస్తోందన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు చీటూరి మహేశ్గౌడ్, మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, నాయకులు పాల్గొన్నారు. ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి -
పుష్కరాల పనులు పూర్తిచేయాలి
కాళేశ్వరం: మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి నిర్మాణ పనులను మే 4వరకు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. ముందుగా జ్ఞానసరస్వతి (వీఐపీ)ఘాటు వద్ద నిర్మాణంలో ఉన్న పుష్కరఘాటును పరిశీలించి ఈఈ తిరుపతిరావుతో మాట్లాడారు. సరస్వతీ మాత విగ్రహ ఏర్పాటుకు జరుగుతున్న నిర్మాణ పనులను, శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. ప్రధాన ఘాట్ వద్ద జరుగుతున్న మరుగుదొడ్ల పనులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, స్వాగత తోరణం పనులు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, నిర్మాణ పనులను ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నిర్మిస్తున్న తాగునీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల శాశ్వత ప్రాతిపదికన పనుల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మరుగుదొడ్లు, తాగునీరు, పుష్కరఘాట్లలో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్తో పాటు ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీఐ రామచందర్రావు, స్థానికులు శ్రీనివాసరెడ్డి, అశోక్ ఉన్నారు. చెట్లను తొలగించాలా.. వద్దా.. కాళేశ్వరంలోని ఆర్చీగేటు నుంచి వీఐపీ ఘాటు వరకు రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఎడమ వైపున భారీ వృక్షాలు ఐదారు వరకు ఉన్నాయి. సోమవారం కలెక్టర్ రాహుల్శర్మ పనులకు పరిశీలనకు రాగా కాంట్రాక్టర్లు వృక్షాలు తొలగిస్తామని చెప్పారు. ఆయన స్పందించి వృక్షాలను తొలగించవద్దని చెప్పారు. తమ భూమిలో స్తంభాలు వేయొద్దు.. ప్రధాన గోదావరిఘాటు వద్ద స్థానిక భూ యజమానులు తమభూమిలో అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలు ఎలా వేస్తారని కలెక్టర్తో మొరపెట్టుకున్నారు. పట్టా పరిశీలించాలని డీటీ కృష్ణకు ఆదేశించారు. కలెక్టర్ రాహుల్శర్మ దేవస్థాన కార్యాలయంలో సమీక్ష -
పెయింటింగ్ డబ్బులు ఇవ్వలేదు..
గతేడాది ఆగస్ట్ మాసంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం రేపాక, చిట్యాల మండలం జూకల్లు గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లను మోడల్ అంగన్వాడీలుగా మార్చే క్రమంలో పెయింటింగ్ వేశాం. రూ.1.10లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు సంబంధిత శాఖ అధికారులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అప్పులు చేసి పెయింటింగ్ డబ్బాలు, ఇతర మెటీరియల్ తీసుకువచ్చి వేశాం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చిట్యాల మండలం ముచినీపర్తి, ఏలేటిరామయ్యపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించే పెయింటింగ్స్ వేశాం. దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. – సుదమల్ల రమేశ్, ఆర్టిస్ట్, రేపాక, రేగొండ -
శివాలయానికి రూ.1.16లక్షల విరాళం
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి గోపాలపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణాచార్యులు(మూకయ్య) చిన్న కుమారుడు రంగాచార్యులు రూ.లక్ష పదహారు వేలు విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్రెడ్డి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రఘునందన్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముగిసిన వసంత నవరాత్రి ఉత్సవాలు రేగొండ: కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని నవదుర్గ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. చివరి రోజు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. దుర్గమాతను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు సూదనబోయిన విష్ణు యాదవ్, పెండ్యాల రాజు, రాంబాబు, వేణు, నరేష్, అనిల్, బాబురావు, వీరేశం, రాజు, విమల పాల్గొన్నారు. ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని సింగరేణి పాఠశాలల్లో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిసెట్ రాసే విద్యార్థుల కోసం ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను ఈ నెల 10వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సింగరేణి కార్మికుల పిల్లలతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలిటెక్నిక్ ద్వారా అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ భూపాలపల్లి అర్బన్: రాజీవ్ యువ వికాసం స్కీం దరఖాస్తులను ఆన్లైన్లో నమోదుచేసేందుకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ను ఏర్పాటుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ధృవీకరణ పత్రాలను కార్యాలయంలోని రూమ్ నంబర్ 12లో అందజేయాలని సూచించారు. ఆరోగ్యంగా జీవించడం మానవుడి హక్కు భూపాలపల్లి అర్బన్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని.. ఆరోగ్యంగా జీవించడం మానవుడి హక్కు అని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ హాలులో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యూట్రిషన్ ఆహారం తీసుకుంటూ, వ్యాయామం, యోగ లాంటి అలవాట్లను కలిగి ఉంటే రోగాలు దరిచేరవన్నారు. వేసవిలో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు విరివిగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. కారు పల్టీ.. ముగ్గురికి గాయాలు గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా గుండ్లవాగు కార్నర్ సమీపంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఓ కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సత్తేంద్ర వరంగల్ వైపునకు కారులో వస్తుండగా వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు కింద పడిపోయింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సిబ్బంది గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం
భూపాలపల్లి: జిల్లాలో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ హౌసింగ్ అధికారులకు సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికై న లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి గడువులోపు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకిలాల్, డీఈ శ్రీకాంత్, ఏఈ రాజలింగం తదితరులు పాల్గొన్నారు. కంటి వైద్య శిబిరంతో ప్రతి ఒక్కరికీ మేలు కాటారం: కంటి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉచిత కంటి వైద్య శిబిరంతో ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని పురస్కరించుకొని పుష్పగిరి కంటి ఆస్పతి ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీపాద ట్రస్టు చైర్మన్ శ్రీనుబాబుతో కలిసి కలెక్టర్ రాహుల్శర్మ ప్రారంభించారు. అంతకుముందు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేని వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుందన్నారు. కంటి చూపు లోపం ఉన్న ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శ్రీనుబాబు మాట్లాడుతూ పుష్పగిరి ఆస్పత్రి ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా చేయించడంతో పాటు కంటి అద్దాలు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు చీటూరి మహేశ్గౌడ్, మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మండల వైద్యాధికారిణి మౌనిక, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
కాటారం: అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఆరేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతున్న కార్యక్రమాన్ని సోమవారం డీఎంహెచ్ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ చిన్నతనంలోనే ఆరోగ్య, మానసిక సమస్యలను గుర్తించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆరేళ్ల లోపు చిన్నారుల్లో ఎక్కువ శాతం నేత్ర సమస్యలు, మానసిక సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్, ఆర్బీఎస్కే డాక్టర్ బండి శ్రీనివాస్, డాక్టర్ సుజాత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మధుసూదన్ -
పరిష్కారమెప్పుడో..?
భూపాలపల్లి అర్బన్: ప్రజావాణిలో సమస్యలకు పరిష్కారం లభించడంలేదని ప్రజలు వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్లో జిల్లా నుంచి మొత్తం 48 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్ ఆశోక్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి కలిసి ఆర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు నిర్ధిష్ట సమయంలో స్పందించాలని సూచించారు. ప్రజలు అధికారులను నేరుగా కలిసే వేదిక ప్రజావాణి అని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పింఛన్ను పునరుద్ధరించడం లేదు.. ఆరు సంవత్సరాలుగా బోదకాలుతో బాధపడుతుండగా పింఛన్ అమలు చేశారు. ఎనిమిది నెలల క్రితం పింఛన్ ఆగిపోయింది. నాటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పింఛన్ రావడం లేదు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరిగిన సదరం క్యాంపునకు వెళ్లగా పైలేరియా అని గుర్తించారు. పింఛన్ కోసం తిరిగితిరిగి అలసిపోతున్నాం. కలెక్టర్ స్పందించి పింఛన్ ఇప్పించాలి. – కామారపు నాగబూషణం, ఇస్సిపేట ఆధార్ సెంటర్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలి.. దివ్యాంగుడినైనా నాకు జీవనోపాధి కోసం కలెక్టర్ స్పందించి ఆధార్ సెంటర్, మీసేవా కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించాలి. 2019 సంవత్సరం నుంచి జీవనోపాధి కోసం ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం గ్రామంలోనే సీఎస్సీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ ట్రైనింగ్ పూర్తిచేశాను. గ్రామాల్లో ఆధార్ సెంటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాకు ఆధార్ సెంటర్ కేటాయించినట్లయితే గ్రామాల్లో ప్రజలకు సేవలందిస్తాను. – సంగీ శంకర్, దుబ్యాల, టేకుమట్లఉపాధి కల్పిస్తామని పట్టించుకోవడం లేదు.. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ స్థలంలో 141 సర్వే నంబర్లో మా తండ్రి పేరున ఉన్నటువంటి ఐదున్నర గుంటల భూ మిని కోల్పోయాం. అప్పటి కలెక్టర్ భవేష్మిశ్రా నష్టపోయిన భూమికి బదులుగా ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలి. – కామారపు రవికుమార్, ఇస్సిపేట ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ వివిధ సమస్యలపై 48 ఆర్జీలు.. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ రాహుల్శర్మ -
‘ఎల్సీ’కి సాంకేతికత జోడింపు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈక్రమంలో లైన్ క్లియరెన్స్(ఎల్సీ) తీసుకునేందుకు మరింత బాధ్యతాయుతంగా, సులభంగా ఉండేలా ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఇప్పటి వరకు ఫోన్ కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎల్సీ(ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ) కోసం ప్రత్యేక యాప్ను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకున్న ఉద్యోగికి, సబ్స్టేషన్ ఆపరేటర్కు మాత్రమే తెలిసేది. ఈయాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే వీలు కలగడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుంది. ఫీడర్ల ఎంపికలోనూ కచ్చితత్వం ఉంటుంది. పొరపాట్లకు తావులేకుండా.. ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకోవాలనుకున్న లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించుంటే అతను పరిశీలించి ఆ ఫీడర్లో ఎల్సీ ఇవ్వొచ్చా లేదా? అత్యవసరాలు ఏమైనా ఉన్నాయా.. అప్పటికే షెడ్యూల్ చేయబడిన పనులు ఉన్నాయా.. మరే ఇతర షెడ్యూల్ చేసిన పనులు ఉన్నాయా? అని పరిశీలిస్తారు. ఏఈ నిర్ణయం మేరకు ఎల్సీ అనుమతి ఆధారపడి ఉంటుంది. ఎల్సీకి అనుమతిస్తే లైన్మెన్, సబ్స్టేషన్ ఆపరేటర్కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా సబ్ స్టేషన్ యాప్లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీని ద్వారా పొరపాటు జరుగుకుండా ఉంటుంది. సూచనలిస్తూ.. పొరపాట్లను నివారించేందుకు తగు సూచనల్ని యాప్ ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్లు వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా? లేదా అనే జాగ్రత్తలను యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా? ఈ ఫీడర్కు వేరే ఫీడర్తో అనుసంధానం ఉందా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా జాగ్రత్త పడుతూ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకువచ్చా? అని బేరీజు వేసుకుని పనులు చక్కదిద్దుతారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పనులు పూర్తి కాగానే యాప్లో ఆ సమాచారాన్ని లైన్మెన్ పొందుపర్చి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్స్టేషన్ ఆపరేటర్కు సమాచారం చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. భద్రతా ప్రమాణాలు పెంచడానికి యాప్.. విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా భద్రతా ప్రమాణాలను పెంచడానికి ప్రత్యేకంగా ఎల్సీ యాప్ను టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఎల్సీ యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను అరికట్టవచ్చు. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. – పి.మధుసూదన్రావు, ఎస్ఈ, హనుమకొండఆన్లైన్లో సులభంగా విద్యుత్ లైన్ క్లియరెన్స్ నూతన యాప్ రూపొందించిన టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు, ఉద్యోగులకు శిక్షణ -
రణదివే ఆశయాలను కొనసాగించాలి
ములుగు రూరల్ : కార్మిక ఉద్యమనాయకుడు, సీఐటీయూ అఖిల భారత వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదివే ఆశయాలను కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో రణదివే 35వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం 1970లో ఐక్యత, పోరాటం అనే నినాదంతో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సీఐటీయూ) ఏర్పడిందని అన్నారు. కులం, మతం, లింగ బేధం తేడాలతో విడిపోవడం వల్ల కార్మికులు నష్టపోతారని ఐక్యతగా ఉద్యమం నిర్మించాలని పిలుపునిచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నీలాదేవి, సద్దాం హుస్సేన్, నారాయణ, ప్రవీణ్, రవీందర్, రాజు, రజిత, రమ, జ్యోత్న్స తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలి
ములుగు రూరల్: దండకారణ్యంలో మావోయిస్టులపై సాగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు బొమ్మెడ సాంబయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రజాధర్నా వాల్పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన హక్కుల రక్షణకు రాజ్యాంగంలో పొందుపరిచిన షెడ్యూల్లోని చట్టాలను ప్రధాని మోదీ, అమిత్షా కాలరాస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు అటవీ సంపదను దోచిపెట్టేందుకే అమాయకపు గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న హత్యాకాండను నిలిపివేయాలని కోరారు. రేపు(8వ తేదీ)హైదరాబాద్లోని ఇందిరాపార్కు చౌక్ వద్ద చేపడుతున్న ప్రజాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్ పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ నాయకులు సాంబయ్య -
షెడ్యూల్లో చేరిస్తేనే రిజర్వేషన్లు సాధ్యం
మొగుళ్లపల్లి: తమిళనాడు తరహాలో తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేరిస్తేనే సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు జీఓల ద్వారా నిలువవన్నారు. 1962 నుంచి ఇప్పటివరకు రిజర్వేషన్ల పెంపుపై ఎన్ని జీఓలు, చట్టాలు వచ్చినా అమలు కాలేదన్నారు. బదిలీలు నిలిపేయాలని మంత్రికి వినతి కాటారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కొనసాగుతున్న నేపథ్యంలో కాటారం సబ్ డివిజన్లో బదిలీల ప్రక్రియ నిలిపేయాలని కోరుతూ ఆదివారం మంత్రి శ్రీధర్బాబుకు పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాటారం సబ్డివిజన్ పరిధిలో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో మంథని నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు సొంత డబ్బు పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేశారన్నారు. రెండేళ్లుగా నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కొరత ఉందని వారు మంత్రికి విన్నవించారు. బదిలీల కారణంగా కార్యదర్శులకు అందాల్సిన బకాయిలపై పలు అంశాలు ప్రభావితం చేస్తాయని తమ సమస్యలను అర్థం చేసుకొని బదిలీలు నిలిపివేయాలని మంత్రిని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సబ్ డివిజన్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. బీజేపీ ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లి రూరల్: పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ విజన్తో రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రానున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా నాయకులు బట్టు రవి, పార్లమెంట్ కో– కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు, నాయకులు దొంగల రాజేందర్, దాసరి తిరుపతిరెడ్డి, పెండ్యాల రాజు, వేణు, రఘునాథరెడ్డి, మునీందర్, కుమార్, విప్లవ రెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు. రూ.లక్ష విరాళం చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి అదే గ్రామానికి చెందిన కాల్వ రఘోత్తంరెడ్డి కుమారుడు కాల్వ రాంరెడ్డి రూ.లక్ష వెయ్యి నూట పదహారు ఆలయ కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్రెడ్డికి అదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మందల రాఘవారెడ్డి, మోతుకూరి నరేష్, చెక్క నర్సయ్య, బిళ్ల సత్యనారాయణరెడ్డి, బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, కాల్వ సమ్మిరెడ్డి, సర్వ శరత్, తీగల నాగరాజు, ప్రధాన అర్చకులు రఘునందన్ పాల్గొన్నారు. లీకేజీలను గుర్తించిన ఇంజనీర్లు ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయింది. దీనితో పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి నీటిని డీ వాటరింగ్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం పైపు నుంచి టన్నెల్లోకి దిగిన మెగా ఇంజనీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కుని మరమ్మతులు ఎలా చేయాలో పరిశీలించారు. -
అటకెక్కిన డేంజర్ జోన్
మల్హర్: తమ ప్రాంతంలో అపార బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు అవసరం అయిన ఇళ్ల స్థలాలను సైతం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నిర్వాసితులను జెన్కో మాత్రం తన తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. తాడిచర్లలో బొగ్గు తవ్వకాల కోసం అన్వేషణ ప్రారంభించినప్పటి నుంచి తమకు దక్కాల్సిన వాటికోసం ఈ ప్రాంతవాసులు ఎన్నోమార్లు రాజీలేని పోరాటాలు చేపట్టారు. ప్రతీ సందర్భంలోనూ కంపెనీ తనకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తూనే నిర్వాసితుల సమస్యలను మాత్రం పెడచెవిన పెడుతూనే ఉంది. బొగ్గు వెలికితీత ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ ఈ ప్రాంతవాసులకు డేంజర్ జోన్ ఇళ్ల సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. బ్లాస్టింగ్లతో భయాందోళన బొగ్గు వెలికితీత కోసం పెడుతున్న బాంబులు ఇళ్లలో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ బాంబులతో గిన్నెలు, బోళ్లు కూడా కింద పడుతున్నాయి. అసలు ఇంట్లో ఉండాలంటేనే భయం.. భయంగా బతికే పరిస్థితి నెలకొంది. ఇది మండల పరిధిలోని పెద్దతాడిచర్ల ఉపరితల బొగ్గు గనికి కూతవేటు దూరంలో నివసించే కాలనీ వాసుల ఆవేదన. తాడిచర్ల ఓపెన్కాస్ట్లో జరుగుతున్న బ్లాస్టింగ్లతో రోజురోజుకూ ప్రజల్లో భయాందోళన పెరుగుతుంది. ఓసీపీ ప్రాజెక్టు 500 మీటర్ల పరిధిలో ఇళ్లు ఉండడంతో పాటు స్థాయికి మించి బ్లాస్టింగ్ చేయడం ద్వారా తమ ఇళ్ల కప్పులు పగులుతున్నాయని, గోడలు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో ఉండాలంటేనే జంకుతున్నామని చెప్పారు. పనులతో వచ్చే దుమ్ము, ధూ ళి ఇళ్లపై చేరడంతో పాటు, తినే ఆహార పదార్థాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోగాల బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు. సీఎండీ రాకతో.. మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ మైన్లో జెన్కో సీఎండీ సందీప్కుమార్ సుల్తానీయ ఈనెల 1వ తేదీన పర్యటించారు. ఈ నేపథ్యంలో మండలంలోని పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ ఇళ్ల సమస్యను పరిష్కస్తామని నిర్వాసితులు ఆందోళన చెందవద్దని హమీఇచ్చారు. సీఎండీ ప్రకటనతో నిర్వాసితుల్లో డేంజర్ జోన్పై ఆశలు చిగురించాయి. డేంజర్ జోన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొంతమంది ఇప్పటికే హైకోర్టు మెట్లు ఎక్కినట్లు తెలిసింది. సేకరణ పనులు ప్రారంభించాలి మండలంలో పెద్ద తాడిచర్ల ఇళ్ల సేకరణ పనులు ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి. ఓపెన్కాస్ట్ బ్లాసింగ్లతో తాము ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి నాయ్యం చేయాలి. – మంతెన సమ్మయ్య, పెద్ద తాడిచర్ల, మల్హర్జెన్కో తీరుతో భూ నిర్వాసితులకు ఇబ్బందులు బ్లాస్టింగ్లతో భయాందోళన సీఎండీ రాకతో చిగురించిన ఆశలుపీఎన్ ప్రకటనకే పరిమితం డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్ల సేకరణకు 2022 డిసెంబర్ 14న 359.23 ఎకరాలకు 2600 చిలుకు ఇళ్లకు పీఎన్ (ప్రాథమిక నోటిఫికేషన్)ను ప్రతికల్లో ప్రచురించారు. కానీ డిక్లరేషన్ ప్రకటించకపోవడంతో 2024 డిసెంబర్లో సదరు నోటిఫికేషన్ రద్దయింది. దీంతో డేంజర్ జోన్ సమస్య మొదటికి వ చ్చింది. నోటిఫికేషన్ వేసి ఇళ్లు సేకరించి తమకు న్యాయం చేయాలని మండలానికి వచ్చిన జిల్లా అ ధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. -
రాజ్యాంగంపై అవగాహన పెంచడమే లక్ష్యం
భూపాలపల్లి రూరల్/ రేగొండ: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రం, కొత్తపల్లిగోరి మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం పలువురు మేధావుల ఆలోచనలతో ఏర్పడిన పవిత్ర గ్రంథామన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు సూదనబోయిన ఓంప్రకాశ్, దుగ్యాల రాజేశ్వరరావు, చిగురుమామిడి కుమార్, వెంకటేష, వీరబ్రహ్మం, శ్రీనివాస్, ప్రభాకర్, సంతోష్ రాజయ్య, పాల్గొన్నారు. నాపాక ఆలయం సందర్శన చిట్యాల: నైన్పాక నాపాక శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించారు. అనంతరం ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలలో పాల్గొని పూజలు చేశారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని కళాకారులకు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
కల్యాణాన్ని వీక్షించిన మంత్రి
కాటారం: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్వగ్రామం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవం కనుల విందుగా సాగింది. కల్యాణాన్ని మంత్రి శ్రీధర్బాబు వీక్షించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, తల్లి జయమ్మ, సోదరుడు శ్రీనుబాబు దంపతులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అంతకముందు శ్రీనుబాబు దంపతులు శ్రీసీతారాముల సహిత లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను. పట్టు వస్త్రాలను మంత్రి ఇంటి నుంచి ఆలయం వరకు తీసుకొచ్చారు. కాటారం మండల కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంతో పాటు, గారెపల్లి ఆంజనేయస్వామి ఆలయం, ధన్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో కల్యాణం ఘనంగా నిర్వహించారు. -
రామప్ప శిల్పాలతో కీ చైన్ల ఆవిష్కరణ
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని నిర్మించి 812సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం రామప్ప గార్డెన్లో రామప్ప శిల్పాలతో కూడిన కీ చైన్లను రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు పాండురంగారావు, ఉమ్మడి జిల్లా టూరిజం అధికారి శివాజీ, సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయుల కళావైభవాన్ని భవిష్యత్ తరా లకు అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. 812 ఏళ్ల క్రితం నిర్మించినా రామప్ప ఆలయం చెక్కు చెదరకుండా ఉందని, యునెస్కో గుర్తింపుతో ప్రపంచ పటంలో రామప్ప ఆలయానికి గుర్తింపు లభించిందన్నారు. -
భవిత.. భరోసా
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuభవిత కేంద్రాలు12● దివ్యాంగ విద్యార్థులకు ఎనిమిది నెలల భత్యం విడుదల ● 329 మందికి రూ.8.92 లక్షల నిధులు ● నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ ● హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులువిద్యార్థుల సంఖ్య 329 కాటారం: దివ్యాంగ విద్యార్థులకు విద్యాపరంగా, ఇతర అంశాలపై భవితా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కల్పించడంతోపాటు కేంద్రాల వద్దకు రాలేని వారికి ఇంటి వద్దనే తర్పీదు ఇచ్చి వారిలో క్రమంగా మార్పులు తీసుకురావడం కోసం గతంలో ప్రభుత్వాలు విలీన విద్యకు శ్రీకారం చుట్టాయి. మానసిక, శారీరక వైకల్యం కల్గిన బాల బాలికలకు వివిధ పద్ధతుల్లో విద్య అందించడానికి ప్రభుత్వం గతంలో విలీన విద్యా వనరుల కేంద్రాలు(ఐఈఆర్సీ) ఏర్పాటు చేసింది. వీటినే భవిత కేంద్రాలుగా పిలుస్తుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడి, దివ్యాంగులైన తమ చిన్నారులను శిక్షణకు తీసుకురాలేని కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలనెలా రవాణా, ఎస్కార్ట్, స్టైఫండ్, రీడింగ్ అలవెన్స్ రూపంలో భత్యం అందజేస్తూ ప్రోత్సాహిస్తున్నాయి. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర శిక్షా తెలంగాణ, పీఎంశ్రీ ఆధ్వర్యంలో సమకూరుస్తున్నాయి. 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎనిమిది నెలల భత్యం రూ.8.92 లక్షలు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. జిల్లాలో 12 భవిత కేంద్రాలు.. జిల్లాలో మొత్తం 12 భవిత కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కాటారం, భూపాలపల్లి, చిట్యాల కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా మిగిలిన 9 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోని ఒక గదిలో భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఐఈఆర్పీ (ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్) లు సమ్మేళన విద్యావిధానంతో ఈ చిన్నారులకు శిక్షణ ఇచ్చి సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దుతుంటారు. భవిత కేంద్రాలకు రాలేని మానసిక వైకల్యంగల వారికి ఇంటి వద్దకే వెళ్లి నైపుణ్యాలు నేర్పిస్తుంటారు. జిల్లాలో 329 మంది దివ్యాంగులైన బాలబాలికలు భవితా కేంద్రాల్లో శిక్షణ పొందుతుండగా 19 మంది ఐఈఆర్పీలు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో సుమారు 65 మంది ఇంటి వద్ద నేర్చుకునే విద్యార్థులకు ప్రతి శనివారం ఒక్కో ఐఈఆర్పీలు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి బోధిస్తుంటారు. వివిధ కేటగిరీల కింద.. ● భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాంగ పిల్లలకు నెలకు రూ.500 చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పది నెలల రవాణా భత్యం అందిస్తున్నాయి. 1 నుంచి 12 తరగతి వరకు అభ్యసించే వారికి ఏటా రూ.5వేల చొప్పున చెల్లిస్తాయి. ● అంధత్వం, అంగవైకల్యం కలిగి పాఠశాలలకు వచ్చి చదివే వారికి నెలకు రూ.550 చొప్పున పది నెలలకు రూ.5,500 అందజేస్తారు. ఈ విద్యార్థులను కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకొని వస్తుండటంతో ఎస్కార్ట్ భత్యంగా కాస్త ఎక్కువ అందిస్తారు. ● పాఠశాలలు, భవిత కేంద్రాలు, ఇంటి వద్ద విద్య పొందే బాలికలకు స్టైఫండ్ కింద నెలకు రూ.200 చొప్పున పది నెలలకు రూ.2వేలు అదనంగా చెల్లిస్తారు. ● అంధులు, అల్పదృష్టి కల్గిన పిల్లలకు రీడింగ్ అలవెన్స్ పేరుతో నెలకు రూ.60 చొప్పున పది నెలలకు రూ.600 అదనంగా చెల్లిస్తుంటారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా.. పాఠశాలలు, భవిత కేంద్రాలు, ఇంటి వద్ద శిక్షణ పొందుతున్న మానసిక, శారీరక వైకల్యం కల్గిన పిల్లలకు ప్రభుత్వం ప్రతి ఏడాదీ రవాణా, ఎస్కార్ట్, స్టైఫండ్, రీడింగ్ అలవెన్స్లను అందిస్తుంది. ప్రస్తుతం జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులైన విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా డబ్బులు జమ చేస్తుంది. ఇప్పటికే జిల్లాలో అందరి ఖాతాల్లో జమ అయ్యాయి. – రమేశ్, విలీన విద్య జిల్లా కోఆర్డినేటర్ పీఎంశ్రీ నిధులు49,800 సమగ్ర శిక్షా నిధులు 8,42,380 ● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు న్యూస్రీల్ -
జగ్జీవన్రామ్ ఆశయాలు కొనసాగించాలి
భూపాలపల్లి అర్బన్: డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని కొనసాగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిట్ట చివరి పేద కుటుంబం వరకు సంక్షేమ పథకాలు చేరేవిధంగా అధికారులు పని చేసినప్పుడే మహనీయుల ఆశయాలను సాధించిన వారమవుతామని తెలిపారు. విద్యనభ్యసించడం వల్ల ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు వస్తుందనడానికి జగ్జీవన్ రామ్ జీవితం నిదర్శనమని అన్నారు. అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవతో మన్ననలు పొందారని కొనియాడారు. నేటితరం యువతకు ఆయనను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. ఆయన ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిదన్నారు. ఆయన సేవలు ప్రతి ఒక్క భారతీయుడికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, డీఆర్డీఓ నరేష్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఇన్చార్జ్ డీఈఓ రాజేందర్, డీఎస్పీ సంపత్ రావు, వివిధ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో.. భూపాలపల్లి రూరల్: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడా రు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
టేకుమట్ల: రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండలంలోని రాఘవరెడ్డిపేటలో జైబాపు, జై భీం, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి, మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రజలందరికీ తెలిసేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు. సామాజికవర్గం కోసం కాదని, దేశ ప్రజలందరి కోసం రాజ్యాం రూపొందించినట్లు తెలిపారు. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే కుట్ర పన్నుతుందన్నారు. రాజ్యాంగాన్ని విమర్శించే బీజేపీ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని కుందనపల్లిలో బాబు జగ్జీవన్రావు జయంతి వేడుకల్లో పాల్గొని, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. మండలంలోని ఆరెపల్లి, కుందనపల్లి, గుమ్మడవెల్లి, దుబ్యాల, ఎంపేడు, వెంకట్రావుపల్లిలోని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మండల ఇన్చార్జ్ కామిడి శ్రీనివాస్రెడ్డి, నాయకుల శ్రీనివాస్, వీరన్న, కిరణ్, వీరేశం, రవీందర్, కుమారస్వామి, ప్రభాకర్, సంపత్, స్వామిరావు, మహిపాల్రెడ్డి, సాంబయ్య పాల్గొన్నారు. -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరుగనున్నా యి. పుష్కరాల అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు, మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక దృష్టిసారించడంతో పనుల్లో వేగం పెరిగింది. కాగా, రూ.21కోట్ల వ్యయంతో దేవాదాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ, ఎన్పీడీసీఎల్లు పనులు ప్రా రంభించాయి. అధునాతనంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో ‘జ్ఞానతీర్థం’ నమూనా ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పా టు చేస్తున్నారు. ఫైబర్ విగ్రహం తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం ఉద్ధేశం.. పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారాంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాల ద్వారా తెలిసింది. పుష్కర ఘాట్కు రెయిలింగ్ సుమారు 86 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఘాట్ తీరంలో రూ.కోటితో సరస్వతీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం చుట్టూర వేదమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తమిళనాడులోని మహాబలిపురంలో రూపుదిద్దుకుంటున్న విగ్రహం ఏప్రిల్ రెండో వారంలో కాళేశ్వరం చేరనుంది. విగ్రహం మెట్ల కింది భాగం, కుడి, ఎడమ వైపు మూడు భాగాల్లో రాతితో చెక్కిన నిర్మాణాలు చేపట్టనున్నారు. మూడు వైపులా రెయిలింగ్ను రాతితో కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. దీంతో పుష్కరఘాట్కు సరికొత్త శోభ సంతరించుకుంటుంది. విస్తృత ప్రచారం.. మే 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు జరుగే సరస్వతి పుష్కరాలకు రూ.20 లక్షలతో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. ఈనేపథ్యంలో హైదరాబాద్తోపాటు ముఖ్యపట్టణా ల్లో హోర్డింగ్స్, వాల్పోస్టర్లు, మీడియా ద్వారా ప్రచారం చేపట్టనున్నారు. ఈప్రచార భాద్యతలు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వనున్నారని తెలిసింది. రూ.30 లక్షలతో పుష్కరాల 12 రోజుల కాశీ పండితులచే హారతిని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవికాకుండా టూరిజంశాఖ ద్వారా ఆరు ఎకరాల స్థలంలో 50–60కిపైగా టెన్సీటీ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే స్థలాన్ని ఏర్పాటు చేశారు. టెన్సీటీ తాత్కాలిక నిర్మాణాలు 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల వరకు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. టూరిజం శాఖ నిర్వహణ ఉంటుంది. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. రూ.కోటితో సరస్వతీమాత విగ్రహం, సుందరీకరణ రూ.20లక్షలతో ఆహ్వానం పలికే ఫైబర్ విగ్రహం నిర్మాణం 12 రోజులపాటు కాశీ పండితులచే హారతి -
పన్నుల రాయితీపై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపాలిటీలోని కాన్ఫరెన్స్ హాల్లో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంటి పన్నుల ముందుస్తు చెల్లింపుపై ఐదు శాతం రాయితీ, ఎల్ఆర్ఎస్ 25శాతం రాయితీపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. నిరంతరం పర్యవేక్షణ చేయాలని అసిస్టెంట్ ఇంజనీర్, పంపు ఆపరేటర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు, సిబ్బంది మానస, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. రెండో రోజు పాదయాత్ర భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారా యణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో 12, 13 వార్డుల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పేరిట రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దేవన్ మాట్లాడారు. బీజేపీ నాయకులు మహాత్మా గాంధీని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్పై అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అప్పం కిషన్, పిప్పాల రాజేందర్, స్వామి, రవీందర్, అశోక్, పాల్గొన్నారు. కామేశ్వరాలయ పునాది మట్టి తొలగింపు వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం పక్కన ఉన్న కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆలయ ప్రదేశంలో ఉన్న మట్టిని జేసీబీ, ట్రాక్టర్లతో తొలగిస్తున్నారు. సాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రకారం ఆలయం అడుగుభాగాన పోసే ఇసుక కొట్టుకుపోకుండా ఆలయం చుట్టూ రెండు మీటర్ల లోతు నుంచి రాయితో గోడను నిర్మించారు. ఆలయం అడుగుభాగంలో ఉన్న లూజ్ మట్టిని తొలగించి లెవలింగ్ పనులు చేస్తున్నారు. మట్టి తొలగించిన అనంతరం ఆలయ అడుగుభాగంలో పెద్దరాళ్లను పేర్చి ఇసుకతో నింపనున్నారు. సాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారానే కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించేందుకు పురావస్తుశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పపువ్వు సేకరణపై అవగాహనవెంకటాపురం(ఎం): ఇప్పపువ్వు సేకరణపై మండలంలోని బండ్లపహాడ్, ఊట్ల గొత్తికోయ గ్రామాల్లో గిరిజనులకు అటవీశాఖ అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పపూవ్వు సేకరణ సమయంలో ఇప్పచెట్ల కింద క్లీనింగ్ కోసం నిప్పు పెట్టవద్దని, గ్రీన్ షాడో నెట్లను ఉపయోగించాలన్నారు. ఇప్పచెట్ల కింద ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఇతర చెట్లు కాలిపోయే ప్రమాదముంటుందన్నారు. ఇప్పచెట్ల కింద చెత్తను తొలగించి గ్రీన్నెట్లను వాడుతున్నవారికి అటవీశాఖ తరఫున బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ యాకూబ్ జానీ, ఎఫ్ఎస్ఓ రాజేశ్వరి, ఎఫ్బీఓలు రజిత, స్వర్ణలత, రూప్కుమార్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధి హామీ కూలీలను పెంచాలి
భూపాలపల్లి అర్బన్: ఉపాధి హామీ పనులకు కూలీలను పెంచాలని కలెక్టర్ రాహుల్శర్మ ఎంపీడీఓలను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు, సెర్ప్ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై శుక్రవారం రెవెన్యూ, పంచాయతీరాజ్, డీఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ మండల ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్దఎత్తున చేపట్టేందుకు కూలీలను మొబలైజ్ చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. మూడు నెలలు అత్యంత కీలకమని.. మూడు నెలల్లో 80 రోజుల పని దినాలు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూలి రేటు రూ.300 నుంచి రూ.307లకు పెంచినట్లు తెలిపారు. డిమాండ్కు తగినట్లు పనులు జరిగేలా కార్యాచరణ తయారు చేయాలన్నారు. మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల మండలాల్లో 5వేల మంది రైతుల భూముల్లో వెదురు పెంపకం చేపట్టేందుకు ఈ నెల 15వ తేదీ వరకు రైతులను ఎంపిక చేయాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 50 శాతం మహిళా సంఘాలకు కేటాయించాలని, మహిళా సంఘాల జాబితా తయారు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఎంపిక చేసిన సంఘాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. చేయూత (వృద్ధాప్య పింఛను) పొందుతున్న వ్యక్తి భర్త లేదా భార్య మరణిస్తే వారిలో జీవించి ఉన్న ఒకరికి పింఛను మంజూరు చేసేందుకు మున్సిపల్, మండల స్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలన్నారు. భూపాలపల్లి, కాటారం డివిజన్లో మహిళా స్వయం సహాయ సంఘాలకు పెట్రోల్ బంకులు ఏర్పాటుకు భూమి కేటాయింపు చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో 559 పనులు పెండింగ్లో ఉన్నాయని, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించేందుకు ఈ నెల 11వ తేదీ వరకు అన్ని బిల్లులు అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాటారం డివిజన్లో మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నివేదిక అందజేయాలన్నారు. మంజూరైన ఇండ్ల పనులు చేపట్టేందుకు తక్షణమే మార్కింగ్ చేయాలని ఆదేశించారు. ఇండ్లు ప్రగతి వివరాలను ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డీఆర్డీఓ నరేష్, పరిశ్రమల శాఖ అధికారి సిద్ధార్థ, జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, ఆర్డీఓ రవి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ హెల్ప్ డెస్క్ల ఏర్పాటుమున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణపై కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకానికి 4,479 దరఖాస్తులు వచ్చాయని, ప్రజలకు తెలిసేలా గ్రామ, గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. -
జిమ్ చేయలేక.. ఆటలు ఆడుకోక..
విరిగి నిరుపయోగంగా మారిన పరికరాలుబస్టాండ్ సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ను సింగరేణి యాజమాన్యం 2017 సంవత్సరంలో నిర్మించి మున్సిపల్ శాఖకు అప్పగించింది. దీంతో గార్డెనింగ్, పచ్చదనం బాధ్యత సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్నప్పటికీ జిమ్, చిన్న పిల్లల కోసం ఏర్పాటుచేసిన వివిధ రకాల పరికరాల నిర్వహణ భారం మున్సిపల్ శాఖ చూసుకోవాల్సి ఉంది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిమ్, ఆటల పరికరాలు పూర్తిగా చెడిపోయాయి. జారుడు బళ్లలు, ఊయ్యాలలు, ఇతర వస్తువులు పూర్తిగా పగిలిపోయి కొన్ని, విరిగిపోయి నిరుపయోగంగా మారాయి. దీంతో సరైన జిమ్, ఆటల పరికరాలు లేకపోవడంతో ఇటు పెద్దలు, అటు చిన్నారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నారు. విష పురుగులు తిరుగుతున్నాయి. -
ఆహ్లాదం కరువు..
జిల్లా కేంద్రంలో అధ్వానంగా పార్కులుజిల్లాకేంద్రంలోని పార్కులు అధ్వానంగా మారాయి. బస్టాండ్ సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్, పట్టణ శివారు ప్రధాన రహదారిపై అటవీశాఖ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్క్లో సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. పార్కులో ఆట పరికరాలు, ఓపెన్ జిమ్ పరికరాలు విరిగి, పలిగిపోయి మూల పడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శించి మరమ్మతులు చేయాలని ఆదేశించినా అధికారుల్లో చలన కలగడం లేదు. దీంతో పిల్లలకు పార్కుల్లో ఆటవిడుపు లభించడం లేదు. – భూపాలపల్లి అర్బన్● ప్రొఫెసర్ జయశంకర్, ఎకో పార్కులో సౌకర్యాలు కరువు ● పాడైన ఆటల పరికరాలు ● ఏళ్లుగా మరమ్మతుకు నోచుకోని వైనం ● ఎమ్మెల్యే, కలెక్టర్ చెప్పినా పట్టించుకోని అధికారులు -
ఎప్పుడూ తాళమే..
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuభూపాలపల్లి–పరకాల జాతీయ రహదారికి ఆనుకొని పట్టణ శివారులో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్కును ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పూర్తిగా అడవినే పార్కుగా మార్చి రోడ్లు వేసి ఓపెన్ జిమ్, ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. జిమ్తో పాటు ఆట పరికరాలు కూడా చెడిపోయి నిరుపయోగంగా మారాయి. కానీ ఈ పార్కు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల మాత్రమే తెరిచి ఉంటుంది. ఇంట్లో నుంచి పిల్లలను ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కోసం పార్కుకు వెళ్దామన్నా పోలేని పరిస్థితి దాపురించింది. పార్కును అభివృద్ధి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు చెప్పినా ఇప్పటి వరకు ఆచరణలోకి రావడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా పార్కు తెరిచి ఉండే విధంగా చూడాలని పలువురు పట్టణ ప్రజలు కోరుతున్నారు. న్యూస్రీల్ -
ఆర్థిక సంక్షోభం ఉన్నా పథకాల అమలు
కాటారం: బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో శుక్రవారం సన్న బియ్యం ఉచిత పంపిణీ పథకాన్ని మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కడుపునింపడం కోసం ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం ప్రాధాన్యత తక్కువ ఉన్న దొడ్డు బియ్యం పంపిణీ చేసిందని తెలిపారు. దీని ఫలితంగా రీసైక్లింగ్ జరిగి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. సన్నబియ్యం వినియోగం పెంచి దొడ్డు బియ్యం రీసైక్లింగ్ను అరికట్టడానికి రేషన్దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వంలో రేషన్ డీలర్లు భాగస్వాములని ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు. పైరవీలకు తావులేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్ఓ శ్రీనాథ్, డీఎం రాములు, డీఆర్డీఓ నరేశ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు
కాటారం: గ్రామాల్లో లోవోల్టేజ్ విద్యుత్ సమస్యను అధిగమించేందుకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ మల్చూర్ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని గారెపల్లిలో లో వోల్టేజ్ సమస్య నివారణలో భాగంగా నాలుగు చోట్ల నూతనంగా ఏర్పాటు చేసిన 100కేవీ ట్రాన్స్ఫార్మర్లను గురువారం ఎస్ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ గారెపల్లిలోని అయ్యప్ప టెంపుల్ రోడ్, హనుమాన్నగర్, మాంటిస్సోరి స్కూల్ కాలనీ, హమాలీ వాడలో కొంత కాలంగా లో వోల్టేజ్ సమస్య ఉన్నట్లు వినియోగదారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో సుమారు రూ.16 లక్షల వ్యయంతో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సిబ్బంది కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఇన్చార్జ్ ఏఈ ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు.ట్రాన్స్కో ఎస్ఈ మల్చూర్ -
సన్నబియ్యం.. నేతలు రాక ఆలస్యం
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి ప్రొటోకాల్ సమస్య తప్పలేదు. వాస్తవానికి ఉగాది కానుకగా ప్రకటించిన ఈ పథకాన్ని ఈ నెల 1న అన్ని గ్రామాల్లో ప్రారంభించాల్సి ఉంది. వివిధ కారణాలు, ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులు కొన్నిచోట్ల హాజరు కాలేదు. దీంతో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు, అధికారులు కూడా ప్రారంభించే సాహసం చేయలేదు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారికంగా ప్రారంభించాకే పంపిణీ చేయాలనుకుంటున్నట్లు అధికారులు పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వరంగల్ తూర్పు, స్టేషన్ఘన్పూర్, జనగామ, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఒకటి, రెండు రోజుల ఆలస్యంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు కాగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట బారులుదీరి తీసుకెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2,315 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 20,958 మెట్రిక్ టన్నుల బియ్యం పేద ప్రజలకు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉగాది నుంచి రేషన్కార్డులపై సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం పట్ల లబ్దిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రేషన్షాపుల ఎదుట సందడే సందడి.. గ్రేటర్ వరంగల్లోని 66 డివిజన్లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం కోసం లబ్దిదారులు ఉదయం నుంచే రేషన్షాపులకు చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి గురువారం రేషన్దుకాణాల్లో అధికారికంగా పంపిణీ ప్రారంభం కాగా.. ఉదయం 8 గంటల నుంచే రేషన్షాపుల వద్ద భారీ సంఖ్యలో లబ్ధిదారులు క్యూలలో నిల్చుంటున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద ఈ తరహాలో సందడి చూసి చాలా రోజులైందన్న ఆశ్చర్యాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు లేదా సన్నబియ్యం స్టాక్ ఉన్నంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని డీలర్లు చెప్తున్నారు. సంతోషంగా ఉంది ప్రభుత్వం మాలాంటి నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు స న్నబియ్యం ఇస్తుండటం సంతో షంగా ఉంది. రేషన్ షాప్ల ద్వా రా అందిస్తున్న సన్న బియ్యం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. దొడ్డు బియ్యం తినాలంటే ఇబ్బంది పడేవాళ్లం. చాలాఏళ్ల నుంచి ఇస్తామని చెబుతున్నా ఇప్పటికి అమల్లోకి రావడం సంతోషం. – నామని కనక లక్ష్మి, శాయంపేట జిల్లాల వారీగా రేషన్ దుకాణాలు, కార్డులు, బియ్యం సరఫరా పంపిణీ ఇలా.. రెండు రోజులపాటు కొనసాగిన ప్రారంభ వేడుకలు లబ్ధిదారుల బారులు.. రేషన్ దుకాణాల వద్ద సందడి ఉమ్మడి వరంగల్లో 32.61లక్షల మంది కార్డుదారులు 2,315 దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ.. కలెక్టర్లు, ఉన్నతాధికారుల పర్యవేక్షణజిల్లా దుకాణాలు కార్డులు లబ్ధిదారులు బియ్యం పంపిణీ (మె.టన్నుల్లో) హనుమకొండ 414 2,28,143 6,75,246 4,051.476 వరంగల్ 509 2,66,429 7,94,087 5,014.541 జనగామ 335 1,61,472 4,85,164 3,094.690 మహబూబాబాద్ 558 2,41,012 7,03,550 4,511.000 జేఎస్భూపాలపల్లి 277 1,23,508 3,50,527 2,276.520 ములుగు 222 91,737 2,52,348 1,650.000 -
నేడు మంత్రి శ్రీధర్బాబు పర్యటన
కాటారం: కాటారం మండలంలో నేడు(శుక్రవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటించనున్నారు. మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలకు సంబంధించి పంపిణీ చేపట్టనున్నారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు భూపాలపల్లి అర్బన్: ఎల్ఆర్ఎస్–2020 క్రమబద్ధీకరణకు ఫీజు రాయితీతో కూడిన చెల్లింపు గడువును ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీ నివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. 25శాతం రాయితీతో ఫీజు చెల్లింపునకు అ వకాశం ఉందని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలన్నారు. స్విమ్మింగ్ కోచ్కు సన్మానం భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి స్విమ్మింగ్ పూల్ కోచ్గా విధులు నిర్వహించి బెల్లంపల్లి ఏరియాకు బదిలీపై వెళ్తున్న భీముని తిరుపతిని ఏరియా పర్సనల్ విభాగం అధికారులు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా అధికార ప్రతినిధి మారుతి మాట్లాడారు. అధికారుల సుచనలు, సలహాలు పాటిస్తూ తిరుపతి తన విధులు బాధ్యతగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ విభాగం అధికారులు, సిబ్బంది గుండు రాజు, శ్రావణ్కుమార్, రవి, చంద్రయ్య, శివ, ప్రణయ్, ప్రతిభ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ముగిసిన టెన్త్ ఒకేషనల్ పరీక్షలుభూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా గురువారం ఏడు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి ఒకేషనల్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకేషనల్ పరీక్షకు 395మంది విద్యార్థులకు గాను 392మంది హాజరైనట్లు తెలిపారు. దీంతో పరీక్షలు ముగిశాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు, ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం లాంటి వైఫల్యాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపురి రాజమౌళి గౌడ్తో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. రైతు వ్యవసాయ కూలీలు, మహిళలు, నిరుద్యోగ, యువత ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసి ఒత్తిడి తీసుకువచ్చేలా ఆయా అంశాలపై ఆందోళనలకు సిద్ధం కావాలని తీర్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చదువు రామచంద్రారెడ్డి, కన్నం యుగదీశ్వర్, నాయకులు మొగిలి, మోరే రవీందర్ రెడ్డి, దొంగల రాజేందర్, వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. షెడ్ల నిర్మాణ పనులకు మార్కింగ్ ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని వనదేవతల సన్నిధిలో గల క్యూలైన్లపై జీఐ షీట్ల షెడ్ల నిర్మాణం పనులకు గురువారం మార్కింగ్ చేశారు. జీఐ షీట్ల షెడ్ల నిర్మాణానికి రూ.3కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
ఉపాధి లక్ష్యంగా..
కాటారం ఐటీఐకి అనుసంధానంగా ఏటీసీపెరుగుతున్న ఆదరణ.. ప్రస్తుతం ఐటీఐ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. భూపాలపల్లి, కాటారం ఐటీఐ కళాశాలల్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కోపా, డ్రాఫ్ట్మెన్ సివిల్ విభాగాలు కొనసాగుతున్నాయి. ఆయా విభాగాల్లో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ విభాగాాల్లో 20 చొప్పున సీట్లు, కోపా, సివిల్ డ్రాఫ్ట్మెన్లో 24 చొప్పున సీట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు.● అధునాతన, సాంకేతికతపై శిక్షణ ● పూర్తికావస్తున్న ఏటీసీ శిక్షణ భవనాలు ● వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు ● ఆరు కోర్సుల్లో 172 సీట్లుకాటారం: యువతకు అధునాతన, సాంకేతిక విద్యను అందించి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థ(ఐటీఐ)లను నవీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలు(ఏటీసీ)గా తీర్చిదిద్దుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కాటారం సబ్ డివిజన్ కేంద్రంలోని ఐటీఐ కళాశాలకు అనుసంధానంగా ఏటీసీ ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అధునాతన, సాంకేతికతపై శిక్షణకు ఆయా ఏటీసీ కేంద్రాల్లో వచ్చే విద్యాసంవత్సరం(జూన్ 2025) నుంచి పూర్తి స్థాయిలో తరగతుల ప్రారంభానికి చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ఏటీసీలో ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కాగా ల్యాబ్ భవనం పూర్తికాక థియరీ క్లాస్లు మాత్రమే సాగుతున్నాయి. కాటారం ఏటీసీ కేంద్రంలో ల్యాబ్ భవనం పూర్తికావస్తుండటంతో ఈ ఏడాది నుంచి థియరీ, ప్రాక్టికల్ తరగతులు జరగనున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం, శిక్షణ పూర్తయిన వారికి స్వయం ఉపాధి కల్పించేలా పనిచేస్తాయి. భూపాలపల్లి, కాటారంలో రూ.4.76 కోట్లతో ఏటీసీ భవన నిర్మాణాలు చేపట్టగా చివరి దశలో ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా టాటా టెక్నాలజీ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఆరు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది, రెండేళ్ల కోర్సులకు సంబంధించి 172 సీట్లు భర్తీ చేస్తారు. ఇప్పటికే ఏటీసీలకు 70 శాతం ప్రయోగ పరికరాలు(యంత్రాలు) చేరగా బిగించారు. కోర్సులకు సంబంధించి ఏటీసీ భవనంలో డెల్వర్క్ స్టేషన్, ఐవోటీ కిట్, సర్వర్ రాక్, త్రీడీ ప్రింటర్, కార్ లిఫ్ట్, సిల్, ఫెయింట్ బాత్, ఇండస్ట్రీయల్ రోబోటెక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్(సీఎన్సీ), వీఎంసీ, ప్లంబింగ్ పరికరాలు బిగించారు. మరికొన్ని పరికరాలు రావాల్సి ఉంది.కొత్త కోర్సులు ఇవే.. కోర్సులు సీట్లు కాలవ్యవధి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ అటోమేషిన్ 40 ఏడాది ఇండ్రస్టియల్ అండ్ అటోమేషిన్ 40 ఏడాది ఇండస్ట్రియల్ రోబోటెక్స్, డిజిట్ మ్యానుఫ్యాక్చరింగ్ 20 ఏడాది ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ 24 రెండేళ్లు బేసిక్డిజైనర్, వర్చువల్ వెరిఫయిర్ 24 రెండేళ్లు మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ 24 రెండేళ్లుయువతకు స్వయం ఉపాధి పెంపొందించే దిశగా ఏటీసీలు దోహదపడుతాయి. భూపాలపల్లి ఏటీసీలో ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్నాయి. కాటారంలో ఏటీసీ భవన నిర్మాణం పూర్తికావచ్చింది. త్వరలోనే యంత్రాల బిగింపు ప్రక్రియ మొదలవుతుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తాం. ఏటీసీ కోర్సుల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తాం. – భిక్షపతి, ప్రిన్సిపాల్, ఐటీఐ, కాటారం -
7, 8 తేదీల్లో ఉచిత కంటి వైద్యశిబిరం
కాటారం: శ్రీపాద ట్రస్టు, పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. వైద్యులు, సిబ్బందితో గురువారం మండలకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో డీఎంహెచ్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిబిరంలో ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తారన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారు హైదరాబాద్లోని పుష్పగిరి ఆస్పత్రికి వెళ్లడానికి, తిరిగి రావడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైద్యాధికారిణి మౌనిక, వైద్యులు సందీప్, సుష్మిత, కల్యాణి, వినయ్, మహేంద్రనాధ్యాదవ్, ఆప్తమిక్ ఆఫీసర్స్ బూరుగు రవి, సత్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
భూ సేకరణకు రైతులు సహకరించాలి
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించనున్న ప్రధాన కెనాల్స్ కోసం అవసరమయ్యే భూ సేకరణకు రైతులు సహకరించాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ తెలిపారు. కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో గురువారం భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. గుమ్మాళ్లపల్లి, ఆదివారంపేట, ఒడిపిలవంచ, వీరాపూర్, రఘుపల్లి, జాదారావుపేట గ్రామాలకు సంబంధించిన భూ నిర్వాసితుల వివరాలను అధికారులు చదివి వినిపించారు. ఆదివారంపేట చెరువు నుంచి ఆయా గ్రామాలకు కాల్వల ద్వారా నీరు చేరవేయడం కోసం కాల్వల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికోసం 45.39 ఎకరాల మేర భూమి సేకరించినట్లు చెప్పారు. ఎక్కువ భూమి కోల్పోతున్నప్పటికీ సర్వే అధికారులు రికార్డుల్లో తక్కువ భూమి నమోదు చేశారని, నష్టపరిహారం పెంచాలని, కెనాల్ అలైన్మెంట్ మార్చాలని పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కోల్పోయిన భూములకు పరిహారం పూర్తిస్థాయిలో అందలేదని ఆయనకు విన్నవించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ రైతులకు నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, భూ సేకవరణ విభాగం, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
దొడ్డి కొమురయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి
భూపాలపల్లి: దొడ్డి కొమురయ్యను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆదర్శ ప్రాయుడని చెప్పారు. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో విశిష్టమైన పాత్ర పోషించారని చెప్పారు. రైతుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆయన సేవలను కొనియాడారు. దోపిడీ వ్యవస్థ, వెట్టి చాకిరి విధానాలకు వ్యతిరేకంగా యువతను కూడగట్టుకుని దొరలు, భూస్వాములపై పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి శైలజ, యాదవ, ఇతర కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మందుల కొరత లేకుండా చూడాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. ఆస్పత్రిని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆస్పత్రిలోని టీ హబ్, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్, ఎన్సీడీ సెంటర్, డైస్ బిల్డింగ్లను పరిశీలించి వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయబోయే స్కాన్ మిషన్ కోసం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్కుమార్తో కలిసి పరిశీలించి టీ హబ్లో ఒక గదిలో ఎన్సీడీ సెంటర్ ఏర్పాటు చేసిన గదులను గుర్తించారు. రోగుల పట్టికను పరిశీలించి, పరీక్షల గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ స్టోర్లో నిల్వ ఉన్న మందుల వివరాలు అడిగి రిజిస్టర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ నవీన్కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ఎంపీడీఓ చాంబర్లో కునుకు తీసిన కుక్క
అధికారులు విధులు నిర్వర్తించేందుకు.. ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయానికి వస్తుంటారు. కానీ, ఈ శునకం మాత్రం సేదదీరేందుకే ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చినట్టుంది. ఏకంగా ఎంపీడీఓ చాంబర్లోనే కునుకు తీసింది. బుధవారం కొత్తపల్లి గోరి ఎంపీడీఓ.. విధుల్లో భాగంగా జిల్లా కేంద్రానికి వెళ్లడం.. కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో ఓ కుక్క దర్జాగా బాస్ గదిలోనే నిద్రించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. – రేగొండ(కొత్తపల్లి గోరి) -
టార్గెట్.. 2.50 లక్షల మంది
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : వరంగల్ వేదికగా ఈ నెల 27న బీఆర్ఎస్ మరోసారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించేందుకు బుధవారం అంకురార్పణ జరిగింది. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, నరేందర్, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు తదితరులు భూమి పూజ చేశారు. అంతకుముందు మంగళవారం ఎర్రవెల్లిలో ఉమ్మడి వరంగల్కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత కేసీఆర్.. సభావేదిక, జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. 10 లక్షల మందికితో బహిరంగసభ నిర్వహించాలని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2.50 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టారు. జనసమీకరణకు ఇన్చార్జ్ల నియామకం.. కేసీఆర్ ఆదేశాలతో 2.50 లక్షల మంది జనసమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధినేత.. సభ ఏ ర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ముఖ్యనేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలకుర్తి, వర్ధన్నపేటకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్గా వ్యవహరించనుండగా.. వరంగల్ పశ్చిమను మాజీ చీఫ్విప్ వినయ్భాస్కర్కు అప్పగించారు. వరంగల్ తూర్పును నన్నపునేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి, భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు పెద్ది సుదర్శన్రెడ్డిని ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జనగామ, స్టేషన్ఘన్పూర్ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చూడనుండగా, పరకాలను చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ను సత్యవతి రాథోడ్, శంకర్నాయక్, డోర్నకల్ను రెడ్యానాయక్, మాలోత్ కవితకు అప్పగించారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర బాధ్యతలు నిర్వహించే హైదరాబాద్కు చెందిన పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు వరంగల్ నగరంలోనే మకాం వేయనున్నారు. నేటి నుంచి మరింత వేగంగా పనులు.. సభకు మరో 24 రోజులే గడువు ఉండటంతో గురువారం నుంచి సభా కోసం చేపట్టే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు బహిరంగసభకు సిద్ధం చేసిన 1,213 ఎకరాల స్థలంలో.. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు, మరో మూడు, నాలుగు వందల ఎకరాలు కూడా సేకరించనున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణ జన సమీకరణకు ఇన్చార్జులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే కేసీఆర్తో భేటీ అయిన ముఖ్య నేతలు -
బహుజన వీరుడు సర్వాయి పాపన్నగౌడ్
భూపాలపల్లి రూరల్: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అన్నారు. బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అ యిత ప్రకాశ్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల అధికారి శైలజ, తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
ఇదీ.. మా బ్రాండ్.!
తిమ్మంపేట చపాట మిర్చికి జీఐ ట్యాగ్ సర్టిఫికెట్ జారీ సాక్షి, వరంగల్/దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో 80 సంవత్సరాల నుంచి రైతులే విత్తనాలు తయారు చేసుకుని పండిస్తున్న వరంగల్ చపాట మిరప ఇక అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందనుంది. 2024 నవంబర్లోనే ఈ మిరపకు అంతర్జాతీయస్థాయి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించినా.. తాజాగా ఉగాది పండుగ వేళ తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘానికి పేటెంట్ కల్పిస్తూ కేంద్ర భౌగోళిక గుర్తింపు సంస్థ ఉత్తర్వులిచ్చింది. చైన్నెలోని ఇండియన్ పేటెంట్ సంస్థ జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ సర్టిఫికెట్ జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లా మల్యాల ఉద్యాన పరిశోధనస్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ సహకారంతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈ చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ఇండియన్ పేటెంట్ ఆఫీస్ చైన్నె సంస్థకు 2022లో దరఖాస్తు చేస్తే మూడేళ్లకు అధికారికంగా పేటెంట్ లభించింది. చపాట మిరపలో రంగు ఎక్కువగా, కారం తక్కువగా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడంతో అంతర్జాతీయస్థాయిలో 18వ ఉత్పత్తిగా జీఐ ట్యాగ్ లభించింది. ఈ పంట ఉత్పత్తిపై ముద్రించిన జీఐ ట్యాగ్ను స్కాన్ చేయడం వల్ల వినియోగదారులకు ఈ చపాట మిర్చి ప్రత్యేకత తెలుస్తుంది. ఒకప్పుడు నడికూడ నుంచే.. ఒకప్పడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో ఉన్న నడికూడ మండలంలోనుంచే ఈ చపాట మిరప సాగు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత దాదాపు 80 ఏళ్ల క్రితం నుంచే నడికూడ ప్రాంతవాసులు ఇతర ప్రాంతాల రైతులకు విత్తనాలు ఇచ్చా రు. ఇలా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారంలోనూ అప్పటినుంచే సాగు చేస్తున్నారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. సొంతంగా విత్తనాలు తయారు చేసుకుని పంట పండించే వరంగల్ చపాట అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంతో రైతులు సంబురపడుతున్నారు. ప్రస్తుతం వరంగల్ చపాట, టమాట మిరప, సింగిల్ పట్టి, డబుల్ పట్టి పేర్లతో దొడ్డు మిరపను దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో విరివిగా పండిస్తున్నారు. మార్కెట్లో ధర బాగా పలకడం, వరంగల్ జిల్లా వాతావరణం అనుకూలంగా ఉండటంతో సాగు చేస్తున్నారు. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలి గింది. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో చపాట మిచ్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా 10,951 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్ ద్వారా లబ్ధి పొందనున్నారు. సొంత లోగో, బ్రాండ్తో అమ్ముకునే వీలు అధిక ధర వచ్చే అవకాశముందని రైతుల్లో ఆనందంఫలించిన తిమ్మంపేట రైతుల కృషి.. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో చపాట మిర్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతి సంవత్సరం 10,951 మెట్రిక్ టన్ను లు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్ ద్వారా లబ్ధి పొందనున్నారు.జీఐ ట్యాగ్తో అధిక ధరకు అవకాశం.. వరంగల్ చపాట మిరపకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురాగలిగినందుకు సంతోషంగా ఉంది. దీనివల్ల రైతులు నేరుగా వివిధ రాష్ట్రాలు, దేశాలకు పంట ఉత్పత్తిని ఎగుమతి చేసుకునే అవకాశం కలిగింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ. 300 ఉన్నది. జీఐ ట్యాగ్ వల్ల అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా కిలోకు రూ.450 నుంచి 500 వరకు ధర లభించనుంది. అధిక ధర పలికితే రైతుకు లాభం వస్తుంది. తిమ్మంపేట గ్రామం జాతీయస్థాయిలో ఉనికిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. – నరహరి రాజ్కుమార్రెడ్డి, తిమ్మంపేట ఎఫ్పీఓ అధ్యక్షుడు -
యాంత్రీకరణ.. పునరుద్ధరణ
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025రాయితీపై సాగు యంత్రాల పంపిణీభూపాలపల్లి రూరల్: సాంకేతిక అభివృద్ధితో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. దీంతో సాగులో యంత్ర పరికరాల వినియోగం పెరిగింది. ఇందులో భాగంగా 2006లో అప్పటి ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీలో అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2018 వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ హయాంలో ఆగిపోయింది. ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించి.. మహిళా రైతులకు వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే 18 రకాల యాంత్రీకరణ పరికరాలు( ట్రాక్టర్, రోటోవేటర్, స్ప్రెయర్, డ్రిప్, డ్రోన్, తదితరాలు) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు రూ.38.51 లక్షలు నిధులను కేటాయించింది. రానున్న రోజుల్లో 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. వీటన్నింటిని 50 శాతం రాయితీలో మహిళా రైతులకు మాత్రమే అందించాలనే నిబంధన విధించింది. దీంతో అధికారులు గత నెల చివరి వరకు లబ్ధిదారులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా పరికరాలు, నిధులను కలెక్టర్ రాహుల్ శర్మ కేటాయించారు. మండలాల వారీగా మహిళా రైతులను ఎంపిక చేయనున్నారు. -
ముగిసిన టెన్త్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన టెన్త్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. చివరి రోజు మొత్తం 3,449 మంది విద్యార్థులకు 3,442 మంది విద్యార్థులు హాజరుకాగా ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్, మాస్కాపింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా గడపాలి భూపాలపల్లి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి, విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్సై పోరిక లాల్ సింగ్ను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ సత్కరించి, కానుక అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి రిమార్కులు లేకుండా సర్వీసును పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయం అన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ప్రజలకు సేవలు అందించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1987వ సంవత్సరంలో లాల్ సింగ్ పోలీసు కానిస్టేబుల్గా పోలీసుశాఖలోకి అడుగుపెట్టి దాదాపు 38 సంవత్సరాలపాటు సేవలు అందించారని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తనవంతు పాత్రను పోషించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, రత్నం, పోలీస్ అధికారుల సంఘం నేత యాదిరెడ్డి, ఎస్సై లాల్ సింగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
● రజతోత్సవ మహాసభపై సమీక్ష
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు లక్ష్మణ్రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి పాల్గొన్నారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త మంచు కురుస్తుంది.క్షేత్రస్థాయి పరిస్థితులపై విశ్లేషణాత్మకంగా..– 8లోu1994లో తాను ఎదుర్కొన్న సంఘర్షణను బట్టి ‘మహిళలపై హింస–మండుటెండు గాయాలు’ రచన చేసింది. పత్రికల్లో బీడీ దమయంతి పేరిట సల్వాజుడుం విధ్వంసం తీరుపై ‘పచ్చని బతుకుల్లో కురుస్తున్న నిప్పులు’, ఆదివాసీ భూపోరాటాల విజయపథంలో ‘విముక్తి బాటలో నారాయణఖేడ్’, భూఆక్రమణలు చేపడుతూ వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ఆదివాసీ, దళితుల మధ్య పాలకుల చిచ్చు అంశాలపై మీడియా రూపంలో క్షేత్ర స్థాయిలో విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో పర్యటన చేసింది. సింగన్ మడుగు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట అడవిలో ఆరు ఊర్లను తగులబెట్టిన నేపథ్యంపై ఆమె చేసిన రచనలు తుపాకీ తూటాల కంటే రెట్టింపులో పేలి ప్రజాచైతన్యానికి ఊపిరిలూదినట్లు చెబుతుంటారు. యుక్త వయసులో ఓ ఇంటి ఆవిడగా సంఘర్షణ పడి సమ సమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన ఉద్యమ కెరటం రేణుక ప్రస్థానం దంతెవాడ ఎన్కౌంటర్తో ముగిసినా మెట్లమీద మిడ్కో(మిణుగురు పువ్వు) పేరిట ఆమె రచనలు, సాహిత్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని సాహిత్యాభిమానులు అంటున్నారు.