Jayashankar District News
-
1052 కేసులు పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1052 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణబాబు మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలకు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవడం వలన కేసుల్లో ఇరుక్కొని నష్టాల పాలవుతారని అన్నారు. ప్రజలు ద్వేష భావాలను తగ్గించుకొని రాజీమార్గాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజా మార్గం అని మనసులో నాటుకోవాలన్నారు. దాంతో విలువైన సమయం, డబ్బు దుర్వినియోగం కాదని తెలి పారు. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకొని పంతాలకు పోయి కేసుల్లో ఇరికితే పొలీస్ స్టేషన్లు, కోర్టులకు ఎక్కితే నష్టమన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జిలు జయరాంరెడ్డి, రామచంద్రరావు, అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్కుమార్, ఉపాధ్యక్షుడు విడ్ణువర్దన్రావు, ప్రధాన కార్యదర్శి బల్ల మహేందర్, న్యాయవాదులు పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూం కాలనీని పరిశీలించిన కమిషనర్ భూపాలపల్లి అర్బన్: వేశాలపల్లి సమీపంలోని డబుల్బెడ్రూం కాలనీని శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ప్రతి రోజు శానిటేషన్ పనులు చేయిస్తానని, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తిచేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ మానస, సానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. మహదేవపూర్కు ఫైర్స్టేషన్ మంజూరు కాళేశ్వరం: జిల్లాలో మరో ఫైర్స్టేషన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాటారం సబ్ డివిజన్ పరిధిలో మరో ఫైర్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చొరవతో మహదేవపూర్ మండలకేంద్రంలో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఫైర్స్టేషన్ ఏర్పాటుతో 18మంది సిబ్బందిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఫైర్స్టేషన్ ప్రారంభం ఎప్పుడు జరుగుతుందో అని వేచిచూడాలి. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు ఈ నెల 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి రూ.25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020 సంవత్సరంలో ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారు ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దీంతో భవన నిర్మాణ అనుమతులు సులభంగా వస్తాయన్నారు. సూచనలు, సలహాల కోసం 94935 52349 ఫోన్నంబర్ను సంప్రదించాలని సూచించారు. స్థల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాలు, 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా టూరిజంశాఖ ఆధ్వర్యంలో టెంట్సిటీ నిర్మాణం కోసం తాత్కాలికంగా ఆరు ఎకరాల గుడిమాన్యం స్థలాన్ని అధికారులు శనివారం పరిశీలించారు. ఆ స్థలంలో మిర్చిపంట ఉండడంతో వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం అంచనా వేశారు. టెంట్సిటీకి స్థలాన్ని కేటాయించగా.. త్వరలో టెంట్సిటీ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో 30కిపైగా ఏసీ, నాన్ఏసీ గదుల మాదిరి టెంట్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. వారివెంట ఈఓ మహేష్, సూపరింటెంటెండ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, అశోక్, నాగరాజు ఉన్నారు. -
పట్టుదలతో ఏదైనా సాధ్యమే
● అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల భూపాలపల్లి అర్బన్: మహిళలు ఇంట్లో అందరికీ అన్ని పనులు చేస్తున్నారని.. తన కోసం పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యమేనని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో శనివారం ఏరియాలోని ఇల్లంద్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూర్కోకుండా ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రయత్న లోపం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే అదే వారిని వారి లక్ష్యం వైపు నడిపిస్తుందని తెలిపారు. సాధించిన విజయంలో తల్లిదండ్రులు లేదా భర్త ప్రోత్సాహం ఉంటుందన్నారు. సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో అండర్ గ్రౌండ్లో పనిచేయాలని మహిళా ఉద్యోగులు సంస్థలో చేరుతున్నారని వారిని అభినందించారు. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు మరింత ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్రెడ్డి, ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, సీఎంఓఏఐ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్, శేషరత్నం, అధికారులు మారుతి, క్రాంతికుమార్, శ్రావణ్కుమార్, శ్రీనివాస్, సేవా సభ్యులు పాల్గొన్నారు. -
కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..
ప్రమాద సమయంలో భార్యతో ప్రవీణ్కుమార్ ఆఖరి మాటలు.. హనుమకొండ, రాంనగర్వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. – పర్వతగిరి/సంగెం/నెల్లికుదురు● ఎస్సారెస్పీ కెనాల్లో పడిన కారు.. తండ్రి, ఇద్దరు పిల్లల మృతి ● స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడిన తల్లి ● వరుసగా సెలవులు రావడంతో స్వగ్రామానికి కారులో వెళ్తున్న కుటుంబం ● గుండెనొప్పి రావడంతో కారు స్టీరింగ్ తిప్పలేని పరిస్థితి.. ● నేరుగా కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం ● మేచరాజుపల్లిలో విషాదఛాయలు11.40 గంటలకు : వరుసగా సెలవులు రావడంతో హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్న సోమారపు ప్రవీణ్(28), భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కుమారుడు ఆర్యవర్ధన్(2)తో కలిసి హుందయ్ ఐక్రాస్ కారులో సొంత గ్రామమైన నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి బయలుదేరారు.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటపల్లికి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు. 4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు. వరంగల్ టు నెక్కొండ రోడ్డు ఎస్సారెస్పీ కాల్వపర్వతగిరి రోడ్డు12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది. ప్రమాదం జరిగిందిలా.. (ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు) -
నేడు నీటి సరఫరా నిలిపివేత
భూపాలపల్లి అర్బన్: మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతుల నేపథ్యంలో నేడు(శనివారం) మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పైపులైన్ మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వీఐపీ ఘాటు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్ల యజమానులు ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణాపై మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, పంచాయతీరాజ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాళేశ్వరం గోదావరి నుంచి రెండు ట్రాక్టర్లతో ఇసుకను రవాణా చేసిన ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం విదితమే. ఇసుక అక్రమ రవాణా విషయమై డిప్యూటీ తహసీల్దార్ కృష్ణను ఫోన్లో సంప్రదించగా అనుమతులు లేవని సీజ్ చేసి కేసు పెడుతామని హెచ్చరించారు. అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ఖాళీగా ఉన్న ఐదు అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసినట్లు ఈఓ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇదే ఐదు అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, వయోపరిమితి విషయమై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సదరు నోటిఫికేషన్ రద్దు చేస్తూ తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఓ తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 5గంటల లోపు కాళేశ్వరం దేవస్థానం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవగాహన కల్పించాలి భూపాలపల్లి అర్బన్: జనరిక్ మందులు వాడటం వలన ప్రజలకు నష్టం ఉండదని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జన ఔషధ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని తన కార్యాలయంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. 50నుంచి 60శాతం తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు జనరిక్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని ఉమాదేవి, ఫార్మసిస్టులు, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత చిట్యాల/రేగొండ: చిట్యాల, రేగొండ మండలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కన్నం కుమారస్వామి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నట్లు సెకండ్ ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు. కుమారస్వామిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రేగొండ మండలంలో.. రేగొండ మండలంలో అక్రమంగా 60 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ షాఖాన్ తెలిపారు. శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన పుట్ట జలంధర్, కొత్తపల్లిగోరి మండలం చిన్నకోడేపాక గ్రామానికి చెందిన కక్కెర్ల సదానందం, చిట్యాల మండలం జూకల్ గ్రామానికి మొలూగురి గణేష్ రెండు వాహనాలలో 65 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వేగవంతంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ
భూపాలపల్లి: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేసే అంశంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో మున్సిపల్, పంచాయతీ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత ఇంటి స్థలాలు, లే అవుట్లు క్రమబద్ధీకరణకు జిల్లావ్యాప్తంగా 8,312 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుదారుడికి క్రమబద్ధీకరణ సమాచారం ఇవ్వాలని, సోమవారం మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో దరఖాస్తుదారులతో సమావేశం నిర్వహించి క్రమబద్ధీకరణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరులోగా ఫీజు చెల్లింపులో 25శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి.. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్లో మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుట, వేసవిలో మొక్కల సంరక్షణ చర్యలు తదితర అంశాలపై మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి వ్యర్ధాల సేకరణ జరగాలని ఆదేశించారు. వ్యర్ధాలు ఆరుబయట వేస్తే జరిమానాలు విధించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చికెన్, చేపలు, మాంసం విక్రయించే వ్యాపారులు, నిత్యావసర సరుకులు విక్రయించే వ్యాపారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు చేయొద్దని నోటీసులు జారీ చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133Aమహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 2) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను 73170C623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్లతో.. బి) బస్టాప్లో సి) కాలేజీ లేదా ఆఫీస్లో1) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేను2001107837B4) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్ను పరిశీలించి పేజీ లేఔట్పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
సవాళ్లను అధిగమిస్తేనే సాధికారత
భూపాలపల్లి: ఆధునిక సమాజంలో మహిళలు సాధికారత సాధించాలంటే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీసులు, భరోసా, సఖి సిబ్బందిని ఎస్పీ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని, వారు ఏదైనా సాధించగలరని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని, మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పని చేయాలన్నారు. పోలీస్స్టేషన్లో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్, రైటర్ వంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, డీపీఓ ఫర్హాన తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే -
పెద్దపులికి అపాయం..
ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తుర్పల్లికి వచ్చిన పెద్దపులి ఆవాసం కోసం మహదేవపూర్, పలిమెల మండలాల్లో కలియతిరుగుతుంది. రోజుకో చోట సంచరిస్తుంది. ఆవాసం కోసం వస్తే మాత్రం ఉచ్చులకు పడితే పులి మరణించే అవకాశం ఉందని పలువురు జంతుప్రేమికులు పేర్కొంటున్నారు. రక్షించే బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉంది. ఈ అడవుల్లో పులులను వేటాడే వేటగాళ్లు ఏమైనా ఉచ్చులు పెడితే పులికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తగ్గిన నిఘా.. ఎన్ని కౌన్సెలింగ్లు చేసినా వేటగాళ్లు వేటాడటం, తినడం మారడం లేదు. వేసవి కావడంతో అడవులు పలచపడి నీటికోసం కుంటలు, వాగుల వద్దకు అడవి జంతువులు వస్తుండడంతో ఉచ్చులు పెడుతున్నట్లు తెలిసింది. కాపలా ఉండే అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ ప్రత్యేక నిఘా విభాగాలు రాత్రి వేళల్లో గస్తీలు నిర్వహించడం లేదు. పెట్రోలింగ్ టీంలు, ప్లయింగ్స్క్వాగ్ విభాగాల సోదాలు కూడా తగ్గాయని తెలుస్తోంది. వేటాడితే జైలుకే.. ఉచ్చులు పెట్టినా, వేటాడిన జైలుకు పంపుతాం. అనుమాసం ఉన్న ప్రాంతంలో మా బృందాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్ను తీవ్రం చేశాం. ఉచ్చులు బిగించకుండా అడవి మార్గంలో విద్యుత్ లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పులి తిరిగే ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాం. ప్రమాదం లేదు. – నవీన్రెడ్డి, డీఎఫ్ఓ● -
భక్తులకు మెరుగైన వైద్యసేవలు
రేగొండ: కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన వైద్యం అందేలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. ఈనెల 9నుంచి ప్రారంభమయ్యే కోటంచ జాతర సందర్భంగా గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతర సమయంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అత్యవసర వైద్యం కోసం జాతరలో రెండు ఆంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాస్కులు సరిపడా అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందులు ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. జాతీయ సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి చికిత్స అందించి, ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి హిమబిందు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్
భూపాలపల్లి: ఈ నెల 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో 25శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ తన కార్యాలయంలో గురువారం మున్సిపల్, పట్టణ ప్రణాళిక, పంచాయతీ అధికారులతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో మున్సిపల్ అధికారులు, పంచాయతీల పరిధిలో పంచాయతీ అధికారులు సమన్వయంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 31వ లోపు ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు చెల్లించే మార్కెటింగ్ ఫీజు చెల్లిస్తే దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక అధికారి సునీల్, పంచాయతీ కార్యాలయ ఏఓ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం తనిఖీ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గురువారం కలెక్టర్ రాహుల్శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని జూనియర్ కళాశాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. విద్యార్థుల హాజరు శాతంపై చీఫ్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలన్నారు. లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. నిశిత పరిశీలనతో విద్యార్థులను అనుమతించాలని స్పష్టంచేశారు. వైద్య సేవల కేంద్రాన్ని పరిశీలించి మందులను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తనిఖీచేసిన డీఈసీ కాళేశ్వరం: మహదేవపూర్ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షాకేంద్రాన్ని డీఈసీ భూక్యా వెంకన్న తనిఖీ చేశారు. పరీక్షలకు జనరల్ విభాగంలో 108, ఒకేషనల్లో 34మందికి గాను ముగ్గురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని పరీక్షల అధికారి ప్రసాద్ తెలిపారు. -
హైకోర్టును ఆశ్రయించిన హరిబాబు..?
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కోర్టుకు వెళ్లిన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న రాత్రి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన ఏ9గా ఉన్న పుల్ల నరేష్ను సైతం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించారు. ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మెన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, ఏ10గా ఉన్న పుల్ల సురేష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న హరిబాబు ఇటీవల హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నట్లు సమాచారం. బెయిల్ పిటిషన్పై ఈ నెల 10న వాదనలు జరుగనున్నట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా కేసు నమోదు -
పులికాదు.. అడవి పిల్లి
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని శివార్లలోని పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు వదంతులు వచ్చాయని, అది అడవి పిల్లి (వైల్డ్ క్యాట్) అని చెల్పూర్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేష్ తెలిపారు. కొత్తపల్లిగోరి శివారు పంచరాయిలో ఉన్న పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో అటవీ అధికారులు గురువారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. పంట పొలాలు, బొక్కి చెరువు సమీపంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో లభించిన పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఆ పాదముద్రలు అడవి పిల్లివని నిర్ధారించారు. వన్యప్రాణులు కనబడితే తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్, ఎఫ్ఎస్ఓ గౌతమి పాల్గొన్నారు. -
విద్యార్థినికి అభినందనలు
భూపాలపల్లి అర్బన్: ఇన్స్పైర్ అవార్డు సాధించిన జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థిని మాచర్ల ఆశ్రితను పాఠశాల యాజమాన్యం గురువారం అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మారుతి మాట్లాడుతూ.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, సైన్స్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డులో పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఆశ్రితకు పూలగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాన్సీరాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రవాణాలో జాగ్రత్తలు పాటించాలి భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ఈ మేరకు జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూళ్ల స్పెషల్ అధికారులు, ప్రిన్సిపాళ్లతో గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు రవాణా చేసే సందర్భాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయురాలు లేదా ఉపాధ్యాయుడిని ఎస్కార్ట్గా విద్యార్థులతో పంపాలని, దూర ప్రాంతం ఉన్న పాఠశాలలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఆహార విషయాలలో శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులందరూ పరీక్షకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఆర్టీసీ, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఫైలింగ్పై అవగాహన అవసరం భూపాలపల్లి అర్బన్: కేసుల ఆన్లైన్ ఫైలింగ్ నమోదుపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తెలిపారు. జిల్లా కోర్టులో గురువారం న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యమన్నారు. కేసుల ఈ ఫైలింగ్ విధానం తెలిసినప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడైన కేసులు వేసుకునే వీలుంటుందని తెలిపారు. విలువైన సమయం, డబ్బులు పొదుపు అవుతాయని, ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు. రిసోర్స్ పర్సన్లు అఖిల్రెడ్డి, రవీందర్రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి, ఏఓ అనితావని, న్యాయవాదులు పాల్గొన్నారు. మహదేవపూర్లో గంజాయి స్వాధీనం కాళేశ్వరం: మండలకేంద్రంలోని ఒకరి వద్ద పోలీసులు నిషేఽధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మండలకేంద్రంలో సోదాలు చేయగా ఒకరి నుంచి 350–400 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఐ రాంచందర్రావును ఫోన్లో సంప్రదించగా పూర్తి వివరాలు త్వరలో తెలుపుతామని పేర్కొన్నారు. -
ఇసుక తరలింపు నిలిపివేత
ఏటూరునాగారం: మండల కేంద్రానికి సమీపాన గల సంఘంపాయ, గోదావరి శివారులో కొనసాగుతున్న ఇసుక క్వారీ ప్రారంభమైన నాలుగు రోజులకే నిలిచిపోయింది. క్వారీ నిర్వాహకులు ఇసుకను తరలించడానికి నెల రోజుల నుంచి రోడ్లను వేశారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తరలింపునకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రెవెన్యూ అటవీ మైనింగ్ శాఖలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వేబిల్లులలో ఉన్న క్వాంటిటీ కంటే ఎక్కువ ఇసుకను తరలిస్తున్న లారీలను సీజ్ చేయాలని ఆదేశాలలో పేర్కొంది. క్వారీ నుంచి వచ్చిన ఓవర్ లోడ్ లారీలను గమనించి సీజ్ చేయాలని లేదా ఎంత ఎక్కువ ఇసుక లారీలో ఉందో దానికి తగ్గ ఫైన్ ట్రెజరీకి చెల్లించే విధంగా విధానాన్ని రూపకల్పన చేసింది. నూతన విధానం అమలయ్యాక ఆయా క్వారీల నుంచి వస్తున్న లారీలను పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు ఓవర్ లోడ్ లారీలను నిలిపివేస్తూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 1న ఏటూరునాగారం ఇసుక క్వారీ ప్రారంభమైంది. రెండు రోజులు క్వారీ ఆన్లైన్ డీడీలు తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు రోజుల నుంచి క్వారీకి సంబంధించిన వేబిల్లుల నిర్వహణ ఆన్లైన్ నుంచి తొలగిపోయింది. అయితే ఈ మూడు రోజులుగా వారి యాజమాన్యం పాత వేబిల్లుల ప్రకారం కొనసాగించింది. రెండు రోజుల క్రితం ఏటూరునాగారం క్వారీ నుంచి వెళ్తున్న లారీలను రెవెన్యూ పోలీస్శాఖ అధికారులు గమనించి అధిక లోడ్తో వెళ్తున్నాయని ఒక లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. అటవీశాఖ అధికారులు జోక్యం చేసుకొని క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ ఇసుక తరలింపు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి క్వారీలో ఇసుక తరలింపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇసుక క్వారీ ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ అటవీశాఖ ఆదేశాలు -
సమర్థంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
భూపాలపల్లి రూరల్: అధికారులు సమన్వయంతో పనిచేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో యాసంగి (రబీ) 2024–25 కాలానికి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు.ఽ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పంట కోత, గున్నీలు, పరికరాల లభ్యత టార్పాలిన్లు, కేలిబర్స్, పాడీ క్లీనర్లు సిద్ధంచేయాలని సూచించారు. రవాణా సౌకర్యాల వంటి కీలక అంశాలపై చర్చించారు. రైతులకు గిట్టుబాటు ధర అందించే విధానాలు, పంట కోత అనంతరం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే చర్యలపై సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఎం రాములు, డీఆర్డీఓ నరేష్, డీసీఓ వాలియా నాయక్, తూనికలు కొలతల అధికారి శ్రీలత వ్యవసాయ, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ -
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuకాళేశ్వరం: జిల్లా అడవుల్లో ఉచ్చులతో వేటగాళ్ల అడవి జంతువుల వేట మళ్లీ ప్రారంభమైంది. భూపాలపల్లి, మహదేవపూర్, పలిమెల, టేకుమట్ల, మహాముత్తారం, మల్హర్ అటవీప్రాంతాల్లో ఎక్కువగా వేట జరుగుతుందని సమాచారం. దీనికి తోడు కొన్ని రోజులుగా కాటారం సబ్డివిజన్ పరిధి మహదేవపూర్, కాటారం, పలిమెల మండలాల్లో పెద్దపులి సంచారం పెరిగింది. దీంతో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులకు పెద్దపులి చిక్కితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జిల్లా అడవిలో ఉచ్చులు ● నిర్వీర్యం చేయని అధికారులు ● కాటారం సబ్డిజన్లో పాగా వేసిన పెద్దపులి ● పట్టించుకోని అటవీశాఖ అధికారులుమాంసానికి డిమాండ్ కాటారం సబ్డివిజన్ అడవుల్లో వేటాడిన దుప్పులు, కుందేలు, అడవి పందులు, ఏదు, కొండగొర్లు, అడవిపక్షులను ఉచ్చులు, కత్తులతో హతమార్చి మాంసాన్ని పట్టణాలకు, తమ బంధువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్లో అడవి మాంసం విలువ కిలోకు రూ.600లకు పైగా పలుకుతుండడంతో కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు ఇష్టపడుతున్నారు. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు నిత్యం ఆర్టీసీతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాల్లో తరలిపోతున్నట్లు సమాచారం. ఉచ్చులతో బలి.. అడవుల్లో వేట షరా మామూలుగానే జరుగుతుంది. నిత్యం వేటగాళ్లు వేట కోసం విద్యుత్ తీగలకు ఉచ్చులు తయారు చేసి వేస్తున్నారు. దానికి మూగజీవాలతో పాటు జిల్లాలో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. గతేడాది 2023 నవంబర్లో కాటారం–మహదేవపూర్ అటవీప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న యువ పోలీసు కానిస్టేబుల్ విద్యుత్ ఉచ్చుకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరిలో మల్హర్ మండలం శాత్రాజ్పల్లి వద్ద వేటగాళ్ల ఉచ్చులు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వారంలో కుదురుపల్లి వాగు, మహదేవపూర్ అయ్యప్ప ఆలయం సమీపంలో ఉచ్చులను స్థానికులు గుర్తించారు. నిత్యం అడవి జీవరాశుల కోసం వేటగాళ్లు రాత్రులంతా గస్తీ నిర్వహిస్తూ యథేచ్ఛగా వేటాడుతున్నారు. మండల కేంద్రాలకు కూతవేటు దూరంలో ఉచ్చులు అమర్చి వన్యప్రాణుల ప్రాణాలు తీస్తున్నారు. అధికారులు ఉచ్చులను నిర్వీర్యం చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.న్యూస్రీల్ -
విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకోవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు మేధాశక్తి పెంపొందించుకోవాలని హనుమకొండ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో రెండు రోజులు జాతీయస్థాయిలో వర్క్షాప్ నిర్వహించారు. రెండోరోజు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ సెమినార్కి ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ‘ఆన్ ఇంటరాక్షన్ విత్ కెరియర్ గైడెన్స్ సెల్’, ‘కోఆర్డినేషన్ కాంపౌండ్స్’ అనే అంశాల మీద విద్యార్థినులకు అవగాహన కల్పించారు. చదువుతో పాటు సమాజంపై విజ్ఞానం పెంచుకోవాలన్నారు. అనంతరం జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్ నాట్కి గెస్ట్గా సంగారెడ్డి డిగ్రీ కళాశాల డాక్టర్ సుప్రభాపాండ మాట్లాడారు. ‘ఇన్బార్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం’ అనే అంశం పైన చర్చించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజు పాల్గొన్నారు. -
సింగరేణి బకాయిలను చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడారు. 2024 డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి ఆర్థికంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.25వేల కోట్ల బకాయిలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు కొనుగోలు చేసిన డబ్బులను కూడా ఇవ్వడం లేదన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని మోసపూరిత హామీలతో కార్మికులను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ నెల 8వ తేదీన ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో సింగరేణి స్థితిగతులపై జనరల్బాడీ సమావేశం నిర్వహించి భవిష్యత్ పోరాటాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచీ నాయకులు సుజేందర్, మల్లేష్, రాజు, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్, సీ సెంటర్ క స్టోడియన్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరీక్షలకు హాజర య్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని సూచించా రు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు జిల్లాలో 20 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని 3,449 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్రెడ్డి, జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి చిట్యాల: విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. భోజనం రుచిగా ఉంటుందా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు చదువులో రాణించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
పులి కదలికలపై డీఎఫ్ఓ ఆరా
కాటారం: కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి కదలికలపై బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి ఆరా తీశారు. కాటారం మండలం గుండ్రాత్పల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోని వాగులు, అడవి దారుల వెంట పులి పాదముద్రలను డీఎఫ్ఓ పరిశీలించారు. పులి గుండ్రాత్పల్లి మీదుగా అన్నారం, పల్గుల అటవీ ప్రాంతం నుంచి గోదావరి దాటి చెన్నూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పూర్తి స్థాయి నిర్ధారణకు డీఎఫ్ఓ అటవీ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చినట్లు సమాచారం. డీఎఫ్ఓ వెంట కాటారం రేంజర్ స్వాతి, సెక్షన్, బీట్ అధికారులు ఉన్నారు. కొత్తపల్లిగోరిలో పులి సంచారం? రేగొండ: కొత్తపల్లిగోరి మండలకేంద్రంలో పులి సంచారం కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం పల్లెబోయిన రమేశ్ అనే రైతుకు చెందిన పొలం గట్టు మీదుగా బొక్కి చెరువు వైపు వెళ్తుండగా ఓ మహిళ వీడియో తీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఘటనపై చెల్పూర్ ఇన్చార్జ్ రేంజ్ ఆఫీసర్ నరేష్ను వివరణ కోరగా.. కొత్తపల్లిగోరిలో పులి సంచరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. నిజానిర్ధారణ కోసం నేడు పాదముద్రలు సేకరిస్తామన్నారు. -
ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
కుదురుపల్లి వద్ద లారీలు, ఆర్టీసీ బస్సులుకాళేశ్వరం: ఇసుక లారీలు రోడ్డుపై రెండు వరుసల్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మహదేవపూర్ మండలం కుదురుపల్లి టు మహదేవపూర్ మార్గమధ్యలో లారీలతో ట్రాఫిక్జామ్ ఏర్పడింది. కాటారం టు కాళేశ్వరం, కాళేశ్వరం టు వరంగల్ వైపు వెళ్లే వాహనాలు, ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారి 353 (సీ)పై లారీలు ట్రాఫిక్లో ఇరుక్కుని రెండు గంటల పాటు ప్రయాణికులు తంటాలు పడ్డారు. కుదురుపల్లి నుంచి మహదేవపూర్ సమీపంలోని సర్సరీ వరకు లారీలు జామ్ కావడంతో ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడంతో వారికివారే ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నారు. ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు లారీలు నిలిపేందుకు పార్కింగ్ స్థఽలాలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుపైనే యథేచ్ఛగా నిలిపివేస్తున్నారు. దీంతో నిత్యం ఇసుక లోడు, ఖాళీ లారీలు రోడ్డుకు రెండు వరుసలతో వెళుతుండడంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, వాహనచోదకుల ఇబ్బందులు -
11శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి
భూపాలపల్లి రూరల్: ఎస్సీ వర్గీకరణలో మాదిగ ఉపకులాలకు 11 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం డప్పుచప్పుళ్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో 11 శాతం రిజర్వేషన్లు ఆమోదింప చేయాలని, మాదిగ, మాదిగ ఉపకులాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. లేదనంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా, మండలాల నాయకులు దోర్నాల రాజేందర్ మాదిగ, అంతడుపుల సురేష్, దోర్నాల సారయ్య, నేర్పాటి అశోక్, మంద తిరుపతి, మడిపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు. దొంగనోట్ల కలకలం! రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో దొంగనోట్ల కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మహిళా సంఘంలోని ఓ గ్రూపునకు చెందిన మహిళ నెలవారి కీస్తీలు డిపాజిట్ చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో నగదును క్యాషియర్ లెక్కిస్తుండగా అందులో ఓ 500 రూపాయల నోటు దొంగ నోటుగా గుర్తించారు. దీంతో సంఘ సభ్యులు ఎవరు ఇచ్చారనేది స్పష్టత రాకపోవడంతో మండలంలో దొంగ నోట్ల హవాసాగుతుందని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించినట్లు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాండ్ల తిరుపతి, యాంసాని సంతోష్లు తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇతర జిల్లాలకు సీఎంఆర్ రైస్ను పంపలేమని, బీజీ 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఇవ్వలేమన్నారు. స్పందించిన మంత్రి సీతక్క, సివిల్ సప్లయీస్ కమిషనర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం భూపాలపల్లి రూరల్: నేడు (గురువారం) 11 కేవీ జంగేడు టౌన్లోని ఫీడర్పై చెట్ల కొమ్మలు తీయుట, మరమ్మతు పనుల దృష్యా జంగేడు, ఫకీర్గడ్డ, వేశాలపల్లి, భాస్కర్గడ్డ, డబుల్ బెడ్ రూం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని భూపాలపల్లి పట్టణ ఏఈ విశ్వాస్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. మహిళలకు క్రీడాపోటీలుభూపాలపల్లి అర్బన్: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో బుధవారం లేడీస్ క్లబ్ మహిళలకు క్రీడాపోటీలను నిర్వహించా రు. ఇల్లంద్ క్లబ్లో త్రో బాల్, బాంబ్ ఇన్ సి టీ, బాల్ పాసింగ్ నిర్వహించారు. క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సేవా అధ్యక్షురా లు సునీతరాజేశ్వర్రెడ్డి, క్లబ్ కార్యదర్శి రమణివెంకటరామిరెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంవరంగల్: హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)లో మూడు సంవత్సరాల చేనేత, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు రాఘవరావు ఒక ప్రకటనలో కోరారు. 60 సీట్లు ఉన్న కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులై, జూలై 1 నాటికి బీసీ, ఓసీలు 23, ఎస్సీ, ఎస్టీలు 25 ఏళ్లు ఉండాలన్నారు. వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు ఓఎస్డీ హిమజాకుమార్ 90300 79242 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. మానేరులో తాత్కాలిక రోడ్డు తొలగింపు● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు టేకుమట్ల: మండలంలోని కలికోట శివారు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ శివారు మానేరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. గతంలో మానేరులో నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డుకు కొంత సేవా రుసుం వసూలు చేస్తూ రవాణా సౌకర్యాన్ని కల్పించారు. కొంతమంది స్వలాభం కోసం టోల్ నిర్వాహకులను నగదును డిమాండ్ చేయడం, టోల్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ ప్రచారం చేసి అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ నెల 1న పోలీసుల సమక్షంలో టోల్ ఎత్తివేశారు. అప్పటి నుంచి రాకపోకలు ఉచితంగా వినియోగించుకున్నారు. తాజాగా రోడ్డును తొలగించడంతో పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, భూపాలపల్లి నుంచి పెద్దపల్లి, మంచిర్యాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానేరులో తాత్కాలిక రోడ్డు ప్రతీఒక్కరికి అవసరమని, రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు. -
భక్తులకు అసౌకర్యం కలగొద్దు
రేగొండ: కోటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కోటంచ బ్రహ్మోత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను అధికా రులతో కలిసి పరిశీలించారు. జాతరలో భద్రత ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు, పార్కింగ్, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అధికారులు, నిర్వాహకులు కలిసి సమన్వయంతో పని చేసి భక్తులకు ఉత్తమ సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కా ర్యక్రమంలో ఈఓ మహేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఏఎస్పీ బోనాల కిషన్, జి ల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్డబ్ల్యూస్ ఈఈ నిర్మల, విద్యుత్ డీఈ పాపిరెడ్డి, తహసీల్దార్ శ్వేత, మండల ప్రత్యేకాధికారి సునీల్ కుమార్, ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ధర్మకర్త శ్రీధర్, ఆ లయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
కాటారం: కాటారం మండలం చల్లపల్లి సమీపంలోని రుద్ర జిన్నింగ్ మిల్లులో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తి జిన్నింగ్ ప్రక్రియలో భాగంగా మిషన్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మెరుగులు రాలి పక్కనే ఉన్న డస్ట్లో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి మిషన్లోని బెల్టులతో పాటు సమీపంలోని పత్తి బేల్స్, పత్తికి మంటలు అంటుకున్నాయి. గమనించిన సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా.. అదుపులోకి రాలేదు. భూపాలపల్లి, మంథని నుంచి ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో వంద క్వింటాళ్ల పత్తి, మూడు పత్తి బేల్స్, యంత్రాలు దగ్ధమయ్యాయని, సుమారు రూ.15లక్షల మేర నష్టం వాటిల్లినట్లు నివ్వాహకులు పేర్కొన్నారు.రూ.15లక్షల మేర నష్టం -
సైన్స్పై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: సైన్స్పై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కాకతీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ రమారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సైన్స్ వర్క్షాపును బుధవారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం విద్యార్థులకు అవసరం అన్నారు. కంప్యూటర్, సైన్స్పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు అధ్యాపకులు బోధించిన ప్రతీ విషయాన్ని ఏకాగ్రతతో ఒంట పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన విద్యాసంస్థల సమన్వకర్త శ్రీనివాస్రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, అధ్యాపకులు నవీన్, వెంకటయ్య, జ్యోతి, జీవవేణి, గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణిలతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
లెప్రసీ మళ్లొస్తున్నది
భూపాలపల్లి అర్బన్: అనారోగ్య సమస్యలతో పాటు.. అంగవైకల్యానికి ప్రధానంగా కుష్ఠు వ్యాధి కారణమవుతోంది. పూర్వీకులు ఈ వ్యాధి పూర్వజన్మ పాప ఫలితమని, వంశపారపర్యంగా వస్తుందని, నయం కాదని అనుకునేవారు. కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో వ్యాధి తీవ్రత తగ్గి వ్యాధిగ్రస్తులు తగ్గుతూ వస్తున్నారు. అంతరించి పోతుందనుకుంటున్న తరుణంలో మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత నెలలో వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి సర్వేలో మళ్లీ ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 62 మంది ఉండగా ఉమ్మడి జిల్లాలో 243 మంది బాధితులు ఉన్నారు. తీవ్రత పెరగకముందే అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించేలా వ్యాధి నియంత్రణలో ప్రత్యేక దృష్టి సారిస్తేనే వ్యాధి నియంత్రణ ఉండే అవకాశం ఉంది. వ్యాధి సోకేదిలా.. కుష్ఠు వ్యాధి మైక్రో బాక్టీరియం లెప్రే అనే బాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుంది. ఇది సాధారణంగా ఒకరకమైన అంటు వ్యాధి కారకం. కుష్టు వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా దగ్గరలో ఉన్న వారికి సోకే అవకాశం ఉంది. శరీరంలోని ఏ భాగంలోనైనా ఒకటి లేదా ఎక్కువ చిన్నవి లేదా పెద్ద మచ్చలు పాలిపోయిన రాగి లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఆ మచ్చలపై స్పర్శ, జ్ఞానం లేనప్పుడు, నొప్పి తెలియనప్పుడు మచ్చలపై చెమట పట్టదు. శరీరంపైన ఉన్న వెంట్రుకలు కూడా రాలి పోతాయి, చర్మంపై అక్కడక్కడా బుడిపెలు ఏర్పడతాయి. చెవి తమ్మెలు, ముఖం, చేతులు కాళ్లపై బుడిపెలు ఏర్పడతాయి. కాళ్లు, చేతులు, పాదాల్లో నిస్సత్తువ ఏర్పడి అంగవైకల్యానికి దారితీస్తాయి. పాదాల్లో గాయాలు ఏర్పడుతాయి. వ్యాధి సోకిన వారు కనురెప్ప పూర్తిగా మూయలేరు. రెండు రకాలుగా చికిత్స కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉంటే వారిని పాసీ బ్యాసిల్లరీ (పీబీ)గా గుర్తిస్తారు. వారికి ఆరు నెలలు వరకు ఖచ్చితంగా చికిత్స ఉంటుంది. కనీసం 9 నెలల్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐదు కంటే ఎక్కువ మచ్చలు. ఉంటే వారిని మల్టీ బ్యాసిల్లరీ (ఎంబీ)గా గుర్తిస్తారు. అలాంటి వారికి 12 నెలలు చికిత్స ఉంటుంది. కనీసం 15 నెలల్లో కోర్సును పూర్తి చేయాలి. బహుళ ఔషధ చికిత్సతో కుష్ఠు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. దాదాపు రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఖర్చయ్యే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తారు. 6 నెలలు నుంచి 12 నెలల వరకు చికిత్స తీసుకుంటే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సకాలంలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తే అంగవైకల్యం సంభవించకుండా చూడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులకు రెండు జతల మైక్రో సెల్యులార్ రబ్బర్ పాదరక్షకులు ఉచితంగా అందిస్తున్నారు. కొందరికీ ఆసరా పింఛన్ పథకంలో కూడా అవకాశం కల్పించారు.రోజురోజుకూ పెరుగుతున్న కేసులు జిల్లాలో 62 మంది వ్యాధిగ్రస్తులు ఆందోళన అవసరం లేదు: డీఎంహెచ్ఓ మధుసూదన్అందుబాటులో వైద్యం, మందులు.. వ్యక్తిలో తెల్లని, గోధుమ రంగులో ఎలాంటి స్పర్శలేని మచ్చలు ఉంటే కుష్ఠుగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనుమానితులు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వెళ్తే అక్కడ స్క్రీనింగ్ చేసి అవసరమైన వైద్యం అందిస్తారు. వ్యాధిని బట్టి 6 నుంచి 12 నెలల చికిత్స ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
ఇంటర్ పరీక్షలు షురూ..
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. బుధవారం మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,901 మంది విద్యార్థులకు గాను 1,802 మంది విద్యార్థులు హాజరు కాగా 99 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని గాంఽధీ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి వెంకన్న తనిఖీ చేశారు. అలాగే కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి పరిశీలించారు. -
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
రేగొండ: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడెపాక గ్రామంలో ప్రతిష్ఠించిన రేణుకా ఎల్లమ్మ తల్లి, కంఠమహేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల కొంగుబంగారంగా రేణుక ఎల్లమ్మ నిలిచిందన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, నాయకులు పున్నం రవి, సూదనబోయిన ఓంప్రకాశ్, సురేందర్రెడ్డి, ఓమాజీ, మెండయ్య, తిరుపతి పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: నేటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో సమస్యలకు తావులేకుండా చూడాలన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు సౌకర్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, నోడల్ అధికారి వెంకన్న పాల్గొన్నారు.పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ -
యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్ ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాడని యూనియన్ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య తెలిపారు. మంగళవారం ఏరియాలోని వర్క్షాపులలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు సొంతింటి పథకం వెంటనే అమలు చేయాలని, మారు పేర్లను సవరించాలని, క్యాడర్లకు సంబంధించిన క్యాడర్ స్కీం అమలు చేయాలని, ప్లేడేలను గతంలో మాదిరిగా అమలు చేసి ఎన్–1 రద్దు చేయాలని సీఎండీని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్, రాజిరెడ్డి, బాబు మియా, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీ స్థల పరిశీలన భూపాలపల్లి అర్బన్: గడ్డిగానిపల్లి, కొండంపల్లి గ్రామాల ఆర్అండ్ఆర్ కాలనీ భూ సేకరణ పనులను మంగళవారం ఆర్డీఓ రవి సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. గడ్డిగానిపల్లి, కొండంపల్లి భూసేకరణ పనులను త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేయాలని సింగరేణి అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి, ఓసీ–2 ప్రాజెక్ట్ అధికారి వెంకటరామిరెడ్డి, సివిల్ డీజీఎం రవికుమార్, అధికారులు అరుణ్ప్రసాద్, కార్తీక్ పాల్గొన్నారు. వైద్య సిబ్బంది పాత్ర గొప్పది కాటారం: వైద్యసేవలు ప్రజలకు చేరవేయడంలో వైద్యసిబ్బంది పాత్ర చాలా గొప్పదని వైద్యశాఖ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఉమాదేవి అన్నారు. జన్ఔషధి వారోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉత్తమ విధులు నిర్వర్తిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ స్టాఫ్ నర్స్ అభినయను సన్మానించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ ఏఎన్ఎం, వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మౌనిక, డాక్టర్ హారిక, డాక్టర్ వందన, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ గీతా, డాక్టర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. టెక్నాలజీపై అవగాహన మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ అత్యాధునిక పరికరాల టెక్నాలజీపై ఉమ్మడి జిల్లా 108 ప్రోగాం మేనేజర్ పాటి శివకుమార్ అవగాహన కల్పించారు. తాడిచర్ల ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, సిబ్బందితో మంగళవారం వైద్యాధికారి వినయ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. 108, 102 సర్వీస్లు, నియో నటల్ సేవలు ఎఫ్హెచ్ఎస్ (పార్థివ వాహనం) సర్వీస్ ఉపయోగించుకోవాలని అవేర్నెస్ డెమో ప్రోగ్రాం ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్, పీహెచ్సీ తాడిచర్ల హెల్త్ అసిస్టెంట్ నాగరాజు, ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు, 108 సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహేష్, పైలట్ సంపత్ పాల్గొన్నారు. -
దళారులను ఏకం చేసి రేగొండలో సమావేశం..
కొన్నేళ్లుగా జిల్లాలోని రేషన్ బియ్యాన్ని పలువురు దళారులు మహారాష్ట్రలోని సిరొంచలోని ఓ రైస్మిల్లుకు అక్రమంగా తరలించేవారు. అక్కడి రైస్మిల్ యజమాని రెండు నెలలుగా ఈ దందాను మానుకున్నాడు. దీంతో జిల్లాకు చెందిన ఓ రైస్మిల్ యజమాని తెరపైకి వచ్చి రేషన్ బియ్యాన్ని పలు రైస్మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గతంలో పని చేసిన దళారులను ఏకం చేశాడు. దందా మానేయాల్సిన అవసరం లేదని, తానే బియ్యాన్ని కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో మండలాల వారీగా ఉన్న దళారులంతా ఏకమై 20రోజుల క్రితం రేగొండలో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అందరం కలిసి సదరు రైస్మిల్ యజమాని చెప్పిన మిల్లులకే బియ్యాన్ని సరఫరా చేయాలని, ఒక మండలం వారు మరో మండలంలోకి వచ్చి కొనుగోలు చేయరాదని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారంతా రేషన్కార్డుదారులు, రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్మిల్ యజమాని చెప్పిన రైస్మిల్కు అర్ధరాత్రి వేళల్లో వివిధ వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం. -
పరిహారం అందేనా?
గోవిందరావుపేట: చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 5వ బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 10 ఏండ్లు గడిచినా నేటికీ పరిహారం అందలేదు. తెలంగాణ ప్రభుత్వం బెటాలియన్ నిర్మాణానికి 105 ఎకరాలు లాక్కొని పరిహారం కూడా చెల్లించకుండా సుమారు 60 మంది కుటుంబాలను రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు సుమారు ఐదు సంవత్సరాలపాటు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేశారు. బెటాలియన్ గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు సైతం కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా పోరాటం చేసిన పలువురు రైతులపై పోలీసు కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లారు. నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆత్మహత్యాయత్నం.. బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రభుత్వం, నాయకులను కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. చివరకు చల్వాయి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మహిళా రైతులు సైతం ఉండడం గమనార్హం. దీంతో అప్పటి అధికారులు, పోలీసులు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. లబ్ధికోసమే రాజకీయ నాయకుల మద్దతు ? భూ నిర్వాసితులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్ధతు ప్రకటించినా.. అది కేవలం వారి రాజకీయ లబ్ధికోసమేనని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు నిజంగా తమ కోసం పోరాడితే ఎప్పుడో న్యాయం జరిగేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలోని నాయకులు సీతక్క, ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వంటి వారు.. రైతులకు పరిహారం వచ్చేవరకు అండగా ఉంటామని చెప్పి మాయమాటలతో పబ్బం గడిపారని, కేసుల పాలై కోర్టు చుట్టూ తిరుగుతున్నా.. ప్రస్తుతం పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన చిలుకమ్మ వారసత్వంగా వచ్చిన భూమిని నమ్ముకుని 60 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ నలుగురు పిల్లలకి పెళ్లి చేసి వారి పిల్లలతో గడిపే సమయంలో భూమిని ప్రభుత్వం తీసుకుందని తెలిసి గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.హామీ ఇచ్చి మోసం చేశారు.. మా తాతల నాటినుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఉన్న పలంగా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ బెటాలియన్ నిర్మాణం చేపడుతున్నాం.. అని భూమిని లాక్కొని, మా మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు. ఉద్యోగం కల్పిస్తాం.. భూమికి బదులు భూమిస్తాం.. అని మోసం చేశారు. ఇప్పటికై నా భూములు కోల్పోయిన రైతులకు హామీ మేరకు పరిహారం ఇవ్వాలి. రైతులపై ఉన్న కేసులను ఎత్తేయాలి. – జంపాల అనిల్, భూ నిర్వాసితుడు కేసు కోర్టులో ఉంది చల్వాయి బెటాలియన్ కింద భూములు కోల్పోయిన రైతుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు మేము ముందుకు వెళ్తాం. – సృజన్ కుమార్, తహసీల్దార్, గోవిందరావుపేట ●ఆందోళనలో టీజీఎస్పీ 5వ బెటాలియన్ భూనిర్వాసితులు చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ పదేళ్లు గడిచినా తప్పని ఎదురుచూపు -
కొడవటంచ జాతరకు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: కొడవటంచ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి, ఆర్అండ్బీ, సమాచార, దేవాదాయ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక విధుల నిర్వహణకు గ్రామ సిబ్బందిని డిప్యూట్ చేసి, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పనులు చేపట్టాలని ఆదేశించారు. దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయడంతో పాటు పూలతో అందంగా ముస్తాబు చేయాలన్నారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల సౌకర్యార్ధం గ్రామంలోని అన్ని రహదారుల్లో వీధి లైట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు వైపు, పార్కింగ్ స్థలాలు, భక్తులు ఉండే జాతర స్థలాలలో తాత్కాలిక లైట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే కొడవటంచ బైపాస్, రేపాక, కొడవటంచ రోడ్, గుడెపల్లి–కొడవటంచదారులలో అడ్డంగా ఉన్న ముళ్లపొదలు తొలగించి, మొరం పోసి గుంతలు పూడ్చే పనులు పూర్తి చేయాలన్నారు. జాతర రోజులలో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయాలని, నీళ్ల ట్యాంకుల దగ్గర ఇంకుడుగుంతలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళల సౌకర్యార్ధం స్నాన ఘట్టాలు వద్ద బట్టలు మార్చుకొనే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని అనుసరించి తగు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్ధం 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని, భూపాలపల్లి డిపోతో పాటు ఇతర జిల్లాల నుంచి నిరంతరం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్డీఓ రవి, డీఎస్పీ సంపత్ రావు, ఈఓ మహేష్, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో సమీక్ష -
అధికారులను చూసుకుంటున్నా..
పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న సదరు డాన్ మండలాల వారీగా ఉన్న దళారులతో ప్రతీరోజు మాట్లాడుతూ.. ‘అధికారులందరినీ చూసుకుంటున్నా.. మీకేం ఇబ్బంది లేదు. లోకల్ పోలీసులు, నిఘా విభాగం, సివిల్ సప్లయీస్, రెవెన్యూ అధికారులందరికీ నెలవారి మామూళ్లు ఇస్తున్నా..’ అని బాహాటంగానే చెప్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను చెప్పిన చోటకే బియ్యాన్ని పంపాలని, ఇంకెక్కడ అమ్మకూడదని హుకుం జారీ చేసినట్లు సమాచారం. దళారుల వద్ద కేజీ బియ్యం రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్న సదరు డాన్ సుమారు రూ.30 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. -
నాలుగేళ్లు సాగుచేస్తే రూ.40వేల ఆదాయం
ఏటూరునాగారం: కంకవనాలను సాగు చేసి నాలుగేళ్లపాటు సంరక్షిస్తే రైతులకు సంవత్సరానికి రూ.40వేలు ఆదాయం వస్తుందని సెర్ప్ సీసీ నర్సింహారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శివాపురం గ్రామంలో జగదాంబ గ్రామైక్య సంఘానికి ఆయన కంకవనాల పంట సాగుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆమోదితమైన ఓ కంపెనీ ద్వారా 15 గుంటలు పట్టా భూమి ఉన్న మహిళా రైతుకు 60 కంక మొక్కలను ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రతిరోజూ మొక్కకు నీరుపట్టి సంరక్షించినందుకు రూ.15 నాలుగేళ్లపాటు అందిస్తారని చెప్పారు. నాలుగు ఏళ్ల వరకు పంటను కాపాడితే మొక్కలు ఇచ్చిన కంపెనీ వారు కర్రను తీసుకెళ్లి రూ.40వేలు ఇస్తారని తెలిపారు. ఇలా పంట దిగుబడి వచ్చినన్ని రోజులు కొనుగోలు చేస్తారని వివరించారు. రైతుకు ఉపాధి హామీ కార్డు ఉంటే మొక్కల సంరక్షణ, నాటడం, మట్టి పనులు చేసినందుకు కూలి డబ్బులు కూడా వస్తాయని తెలిపారు. గ్రామంలోని మహిళలు, రైతులు కంకవనం(వెదురు) పంటపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో వీఓఏ ప్రశాంతి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ఎట్టి రమ, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సెర్ప్ సీసీ నర్సింహారావు కంకవనం సాగుపై అవగాహన -
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuమండలాల దళారులతో ములాఖత్ ● వివిధ శాఖల అధికారులతో సెటిల్మెంట్ ● రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి గోడౌన్కు తరలింపు ● అంతా ఆయన కనుసన్నల్లోనే జరగాలని హుకుం రీసైక్లింగ్ చేసి గోడౌన్కు తరలింపు.. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లర్లకు అప్పగిస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్(ఎస్డబ్ల్యూసీ) గోడౌన్లకు పంపించాల్సి ఉంటుంది. జిల్లాకు చెందిన పలువురు రైస్మిల్లర్లు గోల్మాల్ చేసి రైతుల ధాన్యానికి బదులుగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి హనుమకొండలోని గోడౌన్కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కలర్ టెస్ట్లో పీడీఎస్ బియ్యాన్ని గుర్తు పట్టే అవకాశం ఉంటుంది. దీంతో అక్కడి అధికారులకు డబ్బులు ఎరగా చూపి 290 క్వింటాళ్లకు (ఏసీకే) రూ.15వేలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారు గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఇప్పటివరకు వచ్చిన బియ్యం మొత్తాన్ని ఎంఎల్ఎస్ గోడౌన్ పాయింట్లకు పంపినట్లు సమాచారం.జిల్లాకు చెందిన ఓ రైస్మిల్ యజమాని రెండు నెలలుగా పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేపిస్తూ డాన్గా ఎదిగాడు. పుష్ప సినిమాలో మాదిరిగా మండలాల వారీగా ఉన్న దళారులతో ములాఖత్ అయి అధికారులతో సెటిల్మెంట్లు చేసుకొని పేదల బియ్యాన్ని యథేచ్ఛగా రైస్మిల్లులకు సరఫరా చేయిస్తున్నాడు. – భూపాలపల్లిన్యూస్రీల్ -
సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
వెంకటాపురం(ఎం): విద్యుత్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్–2 సీఈ రాజ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని వెల్తుర్లపల్లి విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించి సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని శాలువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ చౌహాన్ మాట్లాడుతూ.. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను వినియోగదారులకు అందించాలన్నారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించాలని చెప్పారు. సమ్మర్ యాక్షన్లో భాగంగా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బందికి పలు సూచనలు అందించారు. అనంతరం వెల్తుర్లపల్లి సబ్స్టేషన్లో ఫెయిల్ అయిన పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను అమర్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఈ సదానందం, ములుగు ఏడీఈ ఆపరేషన్ వేణుగోపాల్, ఏడీఈ కన్స్ట్రక్షన్స్ సందీప్ పటేల్, ఏఈలు రమేశ్, బెనర్జీ, సబ్ ఇంజనీర్ సాంబరాజు పాల్గొన్నారు.రాజ్ చౌహాన్ -
విద్యార్థులతో పనులపై కలెక్టర్ సీరియస్
● ఇద్దరిపై చర్యలు కాటారం: మండలంలోని గంగారం మోడల్ స్కూల్లో విద్యార్థులతో పనులు చేయించిన ఘటనపై కలెక్టర్ రాహుల్ శర్మ సీరియస్ అయ్యారు. ఫిబ్రవరి 28న మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని పదో తరగతి విద్యార్థులు ఎత్తడం వివాదాస్పదంగా మారింది. మార్చి 1న పలు పత్రికల్లో ప్రచురితం కావడంతో కలెక్టర్ దృష్టికి వెళ్లింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ నాగరాజు విచారణ జరిపి నివేదిక అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మనోహర్ను సస్పెండ్ చేయడంతో పాటు ఔట్సోర్సింగ్ విధానంలో పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ కేక్యానాయక్ను విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ రాజేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్చరీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కాటారం: మండలకేంద్రానికి చెందిన రామిళ్ల రాజశేఖర్ కుమార్తె రామిళ్ల అనయ ఆర్చరీ విభాగంలో రాణిస్తుంది. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని కొల్లూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అనయ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 17న గుంటూరులో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో అనయ పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రామారావు, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పవన్ కళ్యాణ్ పాల్గొని మెడల్ అందజేశారు. జాతీయ స్థాయికి ఎంపికై న అనయను కోచ్ శ్రీనివాస్, అభిషేక్ అభినందించారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి భూపాలపల్లి అర్బన్: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్శర్మ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజా సేవకు అంకితమై ప్రజాస్వామ్య పరిపరక్షణకు విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రఘు, డీఎల్పీఓ వీరభద్రయ్య, గృహ నిర్మాణ శాఖ అధికారి రాయలింగు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాటారం: కాటారం–మంథని ప్రధాన రహదారిపై కాటారం శివారులో జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రమేశ్ కాటారం వచ్చి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కాటారం శివారు పెట్రోల్ పంప్ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనాన్ని మళ్లించే క్రమంలో ఎదురుగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొని కిందపడి తల, చేతులకు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. రమేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
నస్తూర్పల్లి అడవిలోకి పులి
కాటారం: మండలంలోని ప్రతాపగిరి పులివాగు సమీపంలో పాదముద్రల ఆధారంగా నస్తూర్పల్లి అడవి ప్రాంతంలోకి పులి తిరిగి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లి నుంచి ప్రతాపగిరి గొంతెమ్మగుట్ట సమీపంలోకి పులి వచ్చిందనే సమాచారంతో కాటారం డిప్యూటీ రేంజర్ సురేందర్నాయక్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పులివాగు వద్ద పులి పాదముద్రలు(ప్లగ్మార్క్స్) గుర్తించి నిర్ధారించారు. ఆదివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది మళ్లీ గాలింపు చర్యలు మొదలుపెట్టగా.. మర్రివాగు వైపుగా పులి వచ్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో పూర్తిగా ఆకురాలి ఉండటంతో పులి అడుగులు గుర్తించలేకపోయామని పులి నస్తూర్పల్లి అడవిలోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పులి జాడ తెలియక అటవీశాఖ అధికారులు అయోమయానికి గురవుతుండగా.. ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. పులి గాలింపు చర్యల్లో కాటారం డిప్యూటీ రేంజర్తో పాటు యామన్పల్లి డిప్యూటీ రేంజర్ శ్రీనివాస్, ఎఫ్బీఓలు మోయినోద్దిన్, మోనకౌసర్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడికి సాయం
కాళేశ్వరం: తమ ఉపాధ్యాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు రూ.లక్షన్నర ఆర్థికసాయం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 2003–2009 వరకు శ్రీసరస్వతి హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసిన కాళేశ్వరం గ్రామానికి చెందిన మానెం శ్రీనివాస్ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని అప్పటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రూ.లక్షన్నర ఆర్థికసాయం కాళేశ్వరం వచ్చి ఆదివారం అందజేశారు. ఉపాధ్యాయులు అయ్యంగార్ తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, విద్యార్థులు శ్రీధర్, కళావతి, మల్లేశ్వరి, సంతోష్, విజయ్, నరేందర్, శ్రీకాంత్ ఉన్నారు. -
రైస్ మిల్లులకే..!
భూపాలపల్లి: పేదల బియ్యం పక్కదారి పడుతుంది. రాష్ట్రంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కొందరు దళారులు రెండు నెలల క్రితం వరకు మహారాష్ట్రకు అక్రమంగా తరలించగా.. ఇప్పుడు ఏకంగా జిల్లాలోని రైస్మిల్లులకే పంపిస్తున్నారు. మిల్లర్లు అవే బియ్యాన్ని బస్తాలు మార్చి సీఎంఆర్ కింద సివిల్ సప్లై గోదాంలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దళారులకు ఒకరిద్దరు సివిల్ సప్లయీస్ అధికారులు అండగా నిలుస్తుండటంతో ఈ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. కేజీకి రూ.10నుంచి రూ.12కు కొనుగోలు.. జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 1,23,659 తెల్ల రేషన్కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీ నెల ఒక్కో వ్యక్తికి ఆరు కేజీల చొప్పున రేషన్ డీలర్ల ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తుంది. కొందరు దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మండలానికో దళారి ఉండగా, వారు బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ.10 నుంచి రూ.12 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారికి విక్రయిస్తున్నారు. అంతేకాక దళారులు నేరుగా రేషన్ డీలర్లతో డీల్ కుదుర్చుకొని కేజీకి రూ.10 చొప్పున భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం వరకు ఈ దళారులు రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రలోని ఓ రైస్మిల్లుకు తరలించగా, అక్కడ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో ఇప్పుడు జిల్లాలోని రైస్మిల్లులకే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మిల్లులో భారీగా పట్టివేత... రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు జనవరి 6న రేగొండ మండలం బాగిర్ధిపేట గ్రామంలోని దుర్గా భవాని రైస్మిల్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 453 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నప్పటికీ దందా మాత్రం ఆగడం లేదు. పలువురు రైస్ మిల్లర్లు అదే పనిగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ రీ సైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు జిల్లావ్యాప్తంగా వినిపిస్తున్నాయి. సమాచారం లేదు.. పీడీఎస్ బియ్యం మిల్లులకు తరలిస్తున్నట్లు ఇప్పటి వరకు ఫిర్యాదులు ఏమీ రాలేదు. మాకు సమాచారం కూడా లేదు. జిల్లాలోని రైస్ మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తాం. – శ్రీనాథ్, డీసీఎస్ఓఅర్ధరాత్రి మిల్లులకు రవాణా.. కూలీలు సేకరించిన, రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు కేజీకి రూ. 26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏసీ ట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి తిరిగి సివిల్ సప్లై గోడౌన్లకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లై శాఖలోని ఒకరిద్దరు అధికారులే ఈ దందాను ముందుండి నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ దందా రెండు నెలల క్రితం వరకు మహారాష్ట్రకు.. బస్తాలు మార్చి సివిల్ సప్లయీస్ గోదాంలకు తరలింపు సహకరిస్తున్న సివిల్ సప్లయీస్ అధికారులు..? -
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం. – 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్న మాటలివి..దేవాదుల మూడో దశకు భూసేకరణే అసలు సమస్య●● ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ప్రాజెక్టు ● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల పర్యటన ● హామీలు, ఆదేశాలు.. అయినా పూర్తికాని భూసేకరణ ● రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500కోట్లు.. ● పెరిగిన అంచనా వ్యయం -
రామప్పను దర్శించిన కేరళీయులు
వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప ఆలయాన్ని కేరళకు చెందిన 27 మంది శనివారం సందర్శించారు. అంతర్రాష్ట్ర యువజన సమ్మేళన కార్యక్రమంలో భాగంగా కేరళకు చెందిన యువకులు రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ విజయ్కుమార్ వివరించారు. గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును సందర్శించి వేలాడే వంతెన, ప్రకృతి అందాలను తిలకించినట్లు నెహ్రూ యువకేంద్రం సూపరింటెండెంట్ బానోత్ దేవీలాల్ తెలిపారు. కార్యక్రమంలో భాను, సురేశ్, భిక్షపతి పాల్గొన్నారు. రామప్పను సందర్శించిన విదేశీయుడు.. రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన మార్క్ మెక్ లహ్ సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. నందీశ్వరుడి అందాలను సెల్ఫోన్లో బంధించుకున్నారు. రామప్పను సందర్శించిన పర్యాటకులు అమెరికన్తో ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. -
ఇబ్బందులు లేకుండా ‘రంజాన్’ ఏర్పాట్లు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. నేటి(ఆదివారం) నుంచి ప్రారంభమైన రంజాన్ మాసం ఏర్పాట్లుపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలన్నారు. ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ మండలాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా రంజాన్ పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శైలజ, డీఎస్పీ సంపత్రావు, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్నాయక్, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. యూడీఐడీపై అవగాహన కల్పించాలి.. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంపై అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సూచించారు. శనివారం యూడీఐడీ, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు మహిళా సంఘాలు డీపీఆర్ అందజేసే అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్శర్మ జిల్లా అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులు యూడీఐడీ పోర్టల్ ద్వారా స్లాట్బుక్ చేసుకునేందుకు మీసేవా కేంద్రాల నిర్వాహకులు, డీఆర్డీఏ, సంక్షేమ శాఖల సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్ క్యాంప్లో దివ్యాంగులకు సర్టిఫికెట్ జారీ చేయుటకు కావాల్సిన సామగ్రి, టెక్నీషియన్స్, వైద్యుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఆర్డీఓ నరేష్ పాల్గొన్నారు. -
ట్రెజరీలో పైసా వసూల్..?
● ప్రైవేట్ వ్యక్తి ఫోన్కు డిజిటల్ చెల్లింపు కాళేశ్వరం: భూపాలపల్లి, కాటారం సబ్డివిజన్లో ప్రభుత్వ ఉద్యోగులు డీడీఓల ద్వారా ప్రతి నెల ట్రెజరీకి వేతన బిల్లులు సమర్పిస్తున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఐటీ రిటర్న్లు, పన్ను మినహాయింపు బిల్లులు వేతన బిల్లులతో జత చేయాల్సి ఉంది. దీంతో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం అక్రమమార్గంలో బిల్లులు చెల్లించడంతో వాటిని అదునుగా తీసుకున్న ట్రెజరీశాఖ ఉద్యోగులు పైసా వసూల్కు తెరలేపారని సమాచారం. కాటారం, భూపాలపల్లిలో ట్రెజరీ ఉద్యోగులు అందినకాడికి తప్పులు ఎత్తిచూపి డబ్బులు లాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం 28 ప్రభుత్వ పాఠశాలల్లోని స్కూల్కాంప్లెక్సులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు నాలుగువేల మంది వరకు ఉన్నారు. ఇందులో ప్రతీ స్కూల్ కాంప్లెక్సుకు రూ.20వేల నుంచి 30వేల వరకు ఐటీ రిటర్న్లు, పన్ను మినహాయింపుల కోసం డబ్బులు చేతులు మారాయని తెలిసింది. వీరిపైన ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో భూపాలపల్లి, కాటారం డివిజన్లలో పైసావసూల్ అంతా నగదు రూపంలో కాకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా యథేచ్ఛగా సాగినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల తప్పులు కూడా ఉండడంతో ట్రెజరీ ఉద్యోగులపై ఫిర్యాదు చేయడానికి జంకుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహరంతో ట్రెజరీ శాఖ ఉద్యోగులు పదిరోజుల్లో రూ.లక్షల్లో అక్రమమార్గంలో సంపాదించారని కోడై కూస్తుంది. డిజిటల్ చెల్లింపులకు ఓ ప్రైవేట్ వ్యక్తిని కూడా ఏర్పాటు చేసుకొని వారి ఫోన్కు డబ్బులు పంపితేనే ఫైల్ కదులుతుందని ఓ ప్రభుత్వ ఉద్యోగి వాపోయారు. వీరిపై అధికారులు అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. -
85శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో ఫిబ్రవరి మాసంలో 85శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాకు గడిచిన మాసంలో 4.55లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 3.90లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 85శాతంలో నిలిచినట్లు తెలిపారు. వెలికితీసి బొగ్గులో 3.27లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు చెప్పారు. మార్చి మాసానికి 6.39లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించి ఉత్పత్తి పెంచే విధంగా కార్మికులు కృషి చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంజూర్నగర్లోని ఇల్లంద క్లబ్హౌజ్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఉదయాన్నే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలలో హేమాచల క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంతంలోని చింతామని జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. సంతాన ప్రాప్తికి వచ్చిన దంపతులకు ఆలయ పూజారులు నాభిచందన ప్రసాదం అందజేశారు. -
ప్రజల వద్దకే తపాలా సేవలు
రేగొండ: ప్రజల వద్దకు పోస్టాఫీస్ సేవల కార్యక్రమంలో భాగంగా పరకాల ఏఎస్పీ అనంత్రామ్ నాయక్ శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి, చిన్నకోడేపాక, చెన్నాపూర్ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసరా పెన్షన్, ఉపాధిహామీ నగదును లబ్ధిదారులకు అందజేశారు. నిస్సహాయక పెన్షన్దారులు కొండెటి సూరమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టాఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ.755లకు రూ.15 లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని ప్రజలు ఉపఝెగించుకోవాలని అన్నారు. తపాలాశాఖ మినీ ఏటీఎం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట తపాలా సిబ్బంది సంతోష్, కృష్ణ ఉన్నారు. -
ఆన్లైన్ మోసాలపై అవగాహన
భూపాలపల్లి అర్బన్: ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల నివారణపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి బ్యాంక్ అధికారులు జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణబాబు ప్రారంభించారు. బ్యాంక్ అధికారులు, రిస్సోర్స్ పర్సన్స్ సాయిచరణ్,, రాకేష్, అనిల్, శ్రీకాంత్ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై వివరించారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్లో కేసులను ఎలా ఫైల్ చేయాలి, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల పట్ల తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జిలు జయరాంరెడ్డి, రామచంద్రరావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
డిజిటల్ క్రాప్ సర్వే
పకడ్బందీగా పంటల లెక్క..జిల్లా వివరాలు..సర్వే ఇలా.. సర్వే నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించింది. ఏఈఓలు పంటల సాగు విస్తీర్ణం, పంట రకం అంశాలను అందులో నమోదు చేస్తున్నారు. సర్వే నంబర్ ఎంట్రీ చేయగానే ఆ పరిధిలో ఉన్న రైతుల వివరాలు కనిపిస్తాయి. కావాల్సిన రైతు పేరు ఎంచుకోగానే వారి పేరిట ఉన్న భూమి వివరాలు దర్శనమిస్తాయి. అందులో రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడో నమోదు చేయాలి. సాగు ఫొటోను అప్లోడ్ చేయాలి. ఒక వేళ సాగులో లేని భూమి ఉంటే వాటిని నాన్క్రాప్ కింద నమోదు చేయాల్సి ఉంటుంది. ● క్షేత్రస్థాయిలో వివరాలు నమోదుచేస్తున్న ఏఈఓలు ● పంటకాలం వరకు గడువు ● నివేదిక ఆధారంగా పంట దిగుబడి కొనుగోళ్లుమండలాలు 12డిజిటల్ క్రాప్ సర్వే చేయాల్సిన భూమి 88,000ఎకరాలువ్యవసాయ శాఖ సబ్ డివిజన్లు – 2 (భూపాలపల్లి, మహదేవపూర్)కాటారం: డిజిటల్ క్రాప్ సర్వేతో పంటల లెక్క ఇక పక్కాగా ఉండనుంది. ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది, ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా పంటల సాగు వివరాలు పక్కాగా తేలనున్నాయి. వీటి ఆధారంగా రైతుల పంట దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పంటకాలం పూర్తయ్యే వరకు సర్వే ముగించాల్సి ఉంటుంది.సర్వే పూర్తయింది 33,000ఎకరాలు వ్యవసాయశాఖ క్లస్టర్లు 45రైతులు 1,33,412ఏఈఓలు 45 మందిజిల్లాలో సాగు భూమి 2,43,112ఎకరాలుప్రతి సర్వే నంబర్కు వెళ్లాల్సిందే.. వ్యవసాయ శాఖ సమకూర్చిన ట్యాబ్స్తో ఏఈఓలు సర్వే చేస్తున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లలో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ యాప్లోనే క్లస్టర్ పరిధిలోని ఏయే సర్వే నంబర్లలో సర్వే చేయాలనే వివరాలు ఉన్నాయి. ప్రతీ సర్వే నంబర్తో పాటు సబ్ సర్వే నంబర్ వద్దకు ఏఈఓలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ సర్వే నంబర్లో 25 మీటర్లకు మించి దూరం ఉంటే వివరాలు చూపించడం లేదు. దీంతో ఏ ఒక్క సర్వే నంబర్ సమాచారం లేకున్నా అప్లోడ్ కాదు. ప్రతీ సర్వే నంబర్ వద్దకు ఏఈఓలు వెళ్తున్నారు. పలుచోట్ల ఇబ్బందులు.. సర్వేలో భాగంగా ఏఈఓలు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఓ పక్క పెరుగుతున్నా ఎండలు ముప్పుతిప్పలు పెడుతుంటే కొన్ని చోట్ల ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, యాప్ ఓపెన్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల సర్వర్ నెమ్మదించడం, మరికొన్ని చోట్ల రైతుల చేలల్లో లొకేషన్ తప్పుగా చూపించడం, సర్వేనంబర్లు కనిపించకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఏఈఓలు చెబుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏఈఓలు క్రాప్ సర్వేను నిర్వహిస్తున్నారు. పంటల నమోదు ఆధారంగా కొనుగోళ్లు.. సర్వేతో రైతులు సాగుచేసే పంటల వివరాలు పక్కాగా తేలనున్నాయి. తదనుగుణంగా వచ్చే దిగుబడిని రైతులు మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థకు మద్దతు ధరతో విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్ క్రాప్ సర్వే రైతులకు ఎంతో మేలు చేకూర్చనుంది. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు బీమా పొందడానికి, పంట నష్టం అంచనా వేయడానికి దోహదపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్కు తీసుకువెళ్లి మద్దతు ధర పొందడానికి ఉపయోగపడుతుంది. వానాకాలంలో డిజిటల్ క్రాప్ సర్వే చేయించుకోకపోవడంతో పత్తి అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.రైతులు సహకరించాలి జిల్లావ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏఈఓలు రైతుల చేలు, పంట పొలాల వద్దకు వెళ్లి సాగు వివరాలు అక్కడే నమోదు చేస్తున్నారు. క్రాప్ సర్వే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి, పంటల బీమా, పరిహారం పొందడానికి సహాయపడుతుంది. రైతులు సర్వేకు వచ్చే ఏఈఓలకు సహకరించాలి. – విజయభాస్కర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి● -
18 రోజులుగా ఇక్కడే తిష్ట
కాటారం: పులి నివసించడానికి అనువైన ప్రదేశం కాదు..దట్టమైన అటవీ ప్రాంతం అసలే కాదు.. కానీ ఎక్కడి నుంచో వచ్చిన పెద్దపులి ఇక్కడే 18 రోజులుగా తిష్టవేసింది. ఎటు వెళ్లాలో దారి దొరకకనో లేక స్థిర ఆవాసం కోసం ప్రయత్నిస్తుందో ఏమో కానీ పులి కాటారం, మహదేవపూర్ అడవి ప్రాంతంలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సంచరిస్తుంది. రెండు రోజులకు ఒక చోట ఆనవాళ్లు వదులుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఫిబ్రవరి 10న మహదేవపూర్ రేంజ్ పరిధిలోని కాటారం మండలం నస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో ఓ రైతుకు పులి కనిపించడంతో పులి సంచారం ప్రచారంలోకి వచ్చింది. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు (ప్లగ్మార్క్స్) గుర్తించి సంచారంపై ఆరా తీశారు. మరుసటి రోజు కాటారం రేంజ్ పరిధిలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో పులి తిరిగినట్లు అధికారులకు ఆనవాళ్లు లభించాయి. అనంతరం మహదేవపూర్ మండలం కుదురుపల్లి, పల్గుల, బీరాసాగర్, గుండ్రాత్పల్లి అటవీ ప్రాంతంలో పులి కనిపించినట్లు పలువురు తెలపడంతో అధికారులు పాదముద్రలు గుర్తించి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటుచేసి పులి కదలికలపై నిఘా పెట్టారు. కానీ ఎక్కడ కూడా పులి కెమెరాలకు చిక్కిన దాఖలాలు లేవు. మధ్యలో రెండు, మూడు రోజులు జాడా లేకుండా పోయిన పులి రెండు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లిలో దర్శనమిచ్చింది. అక్కడి నుంచి ప్రతాపగిరి అడవుల్లోకి పులి చేరినట్లు శుక్రవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు శనివారం ప్రతాపగిరి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఓ వాగు వద్ద నీరు తాగినట్లు పాదముద్రల ఆనవాళ్లు సేకరించారు. నస్తూర్పల్లి అడవి వైపుగా వచ్చినట్లు కొంత దూరం పాదముద్రలు ఉన్నాయని కానీ ఎటు వెళ్లిందనేది మాత్రం స్పష్టత లేదని అటవీశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక్కడిక్కడే.. గతంలో రెండు మార్లు పులి కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతంలో సంచరించినప్పటికీ ఎప్పుడు కూడా మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉన్న దాఖలాలు లేవు. కానీ 18 రోజులుగా పులి ఇక్కడిక్కడే తచ్చాడుతుండటంతో దారి దొరకక ఎటు వెళ్లలేక ఉండిపోతుందో లేక ఈ అటవీ ప్రాంతంలో శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువైన స్థలం కోసం చూస్తుందో అంతుచిక్కకుండా పోయింది. ఒకటి రెండుమార్లు పులి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గోదావరి నదిని దాటి చెన్నూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికి ప్రయత్నించినట్లు కొన్ని రోజుల క్రితం అటవీశాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. కాటా రం మండలం గుండ్రాత్పల్లి సమీపంలోని గోదావరి నది దాటడానికి వచ్చిన పులి కుక్కలు వెంటపడటంతో తిరిగి మహదేవపూర్ అడవిలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అటు నుంచి మళ్లిన పులి కాటారం, మహదేవపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో కలియ తిరుగుతుంది. పులి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఏ వైపుగా వస్తుందో తెలియక అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులికి సంబంధించిన కదలికలను పూర్తి స్థాయిలో కనుక్కోవడం అటవీశాఖ అధికారులకు క్లిష్టతరంగా మారింది. కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం దారి దొరకకనా..ఆవాసం కోసమా.. -
ప్రశ్నించినందుకే హత్య చేశారు..
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, న్యాయం కోసం ప్రశ్నిస్తూ, కోర్టులో కేసులు వేయడం వలనే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్య చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నారాయణ తెలిపారు. పౌర హక్కుల సంఘం నాయకులు శుక్రవారం రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా భూ అక్రమాలు, మాఫియాలపై కేసులు వేస్తే 80మంది వరకు హత్యగావించబడ్డారన్నారు. ఈ హత్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయి ప్రజలు తిరగబడుతారని తెలిపారు.పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు -
ఫోన్పేతో బురిడీ..
కాటారం: డిజిటల్ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక్కచోట కొందరు ప్రజలను, వ్యాపారులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా శుక్రవారం ఓ దుకాణం యజమానిని మోసంచేసి చివరకు దుండగుడు దొరికిపోయారు. బాధిత దుకాణం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలకేంద్రంలోని గారెపల్లిలో ముస్కమల్ల సత్యం ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఓ యువకుడు దుకాణానికి వచ్చి పలు రకాల సామగ్రి కొనుగోలు చేశాడు. అనుమానం రాకుండా సామగ్రికి సంబంధించిన ధరపై దుకాణం యజమానితో బేరాలు సైతం చేశాడు. సదరు వ్యక్తి కొనుగోలు చేసిన సామగ్రికి సంబంధించి రూ.4వేలు అయింది. ఫోన్ పే చేస్తానని చెప్పడంతో దుకాణం యజమాని సత్యం స్కానర్ చూపించాడు. ఫేక్ ఫోన్ పే ద్వారా రూ.4వేలు చెల్లించిన దుండగుడు పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించి వెళ్లిపోయాడు. కొంత సమయం వరకు కూడా డబ్బులు జమకాకపోవడంతో అనుమానం వచ్చిన దుకాణం యజమాని అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బుల చెల్లింపు జరగలేదు. అప్రమత్తమైన యజమాని దుండగుడిని వెంబడించాడు. చివరకు భూపాలపల్లిలో పట్టుకొని ప్రశ్నించగా ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లింపు చేసినట్లు ఒప్పుకున్నాడు. దుండగుడిది గొల్లబుద్ధారం సమీపం నర్సింగపురం అని తెలిసింది. మోసానికి పాల్పడిన యువకుడిని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు దుకాణం యజమాని సత్యం తెలిపారు. -
పంచాయతీలే ముందంజ
పల్లెల్లో 74.62శాతం ఆస్తిపన్ను వసూలుభూపాలపల్లి: ఆస్తి పన్నుల వసూలులో గ్రామ పంచాయతీలే ముందున్నాయి. జిల్లాలోని ఏకై క భూపాలపల్లి మున్సిపాలిటీ లక్ష్యం చేరుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 30 రోజులు మాత్రమే గడువు ఉండగా పల్లెలు వందశాతానికి చేరువ కానుండగా మున్సిపాలిటీలో మాత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. పల్లెలే బెస్ట్.. జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి నుంచి రూ. 4కోట్ల 4లక్షల 52వేల 378 ఆస్తి పన్ను రావాల్సి ఉండగా నిన్నటి(శుక్రవారం) వరకు 74.62 శాతం వసూలు అయ్యాయి. మిగిలిన బకాయిలను ఈ నెల చివరిలోపు వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా కాటారం మండలంలో 91.36 శాతం, మొగుళ్లపల్లిలో 81.64 శాతం వసూలు అయ్యాయి. టేకుమట్ల 64.98 శాతం వసూలు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఈ నెల చివరిలోపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 90 శాతానికి పైగా పన్ను వసూలు జరిగే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీ లక్ష్యం చేరేనా..? భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో నివాస, వ్యాపార, నివాస, వ్యాపార భవనాలు 12,223 ఉన్నాయి. వాటి నుంచి రూ. 5.75 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా.. నిన్నటి వరకు 60.84 శాతం రూ.3.50 కోట్లు వసూలు అయ్యాయి. రూ.2.25 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. బకాయిల వసూలు కోసం మున్సిపాలిటీ అధికారులు నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఐదుగురు అధి కారులను నియమించారు. వీరు భారీ మొత్తంలో పన్ను బకాయి ఉన్న వారి భవనాల వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. అ యినప్పటికీ పన్నులు చెల్లించని పక్షంలో ఆస్తులను సైతం జప్తు చేస్తున్నారు. అయినప్పటికీ వసూలు అంతంత మాత్రంగానే అవుతోంది. మున్సిపాలిటీలో 60.84 శాతమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంతే మిగిలింది 30 రోజులే -
ఉద్యోగ విరమణ తప్పనిసరి
భూపాలపల్లి రూరల్: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన గుండు నాగభూషణం–పద్మ దంపతులను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. గృహోపకరణాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. పోలీసులంటేనే ఎన్నో రకాల త్యాగాలతో పాటు, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తారన్నారు. సుమారు 40 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాగభూషణం అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చె ప్పారు. ఏదేని సమస్యలు ఉంటే రిటైర్డ్ ఉద్యోగులు తనను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవా లని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఎస్సైలు నగేష్, కిరణ్, శ్రీకాంత్, రత్నం, పోలీసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ఖరే -
గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల వివరాలు(రూ.లక్షల్లో)
మండలం డిమాండ్ వసూలు బకాయి భూపాలపల్లి రూ.30,45,525 రూ. 21,31,502 రూ.9,14,023 చిట్యాల రూ.34,68,947 రూ.25,02,159 రూ.9,66,788 గణపురం రూ.83,25,662 రూ.64,00,652 రూ.19,25,010 కాటారం రూ.36,97,673 రూ.33,78,344 రూ.3,19,329 మహదేవపూర్ రూ.48,12,178 రూ. 35,43,923 రూ. 12,68,255 మహాముత్తారం రూ.17,89,060 రూ.12,25,319 రూ.5,63,741 మల్హర్ రూ.28,98,421 రూ.20,11,448 రూ.8,86,973 మొగుళ్లపల్లి రూ.26,03,332 రూ.21,25,452 రూ.4,77,880 పలిమెల రూ.5,65,619 రూ.4,38,868 రూ.1,26,751 రేగొండ, కొత్తపల్లిగోరి రూ.62,47,790 రూ.44,78,331 రూ.17,69,459 టేకుమట్ల రూ.29,98,171 రూ.19,48,074 రూ.10,50,097 మొత్తం రూ. 4,04,52,378 రూ. 3,01,84,072 రూ. 1,02,68,306 -
పంచాయతీలే ముందంజ
పల్లెల్లో 74.62శాతం ఆస్తిపన్ను వసూలుభూపాలపల్లి: ఆస్తి పన్నుల వసూలులో గ్రామ పంచాయతీలే ముందున్నాయి. జిల్లాలోని ఏకై క భూపాలపల్లి మున్సిపాలిటీ లక్ష్యం చేరుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 30 రోజులు మాత్రమే గడువు ఉండగా పల్లెలు వందశాతానికి చేరువ కానుండగా మున్సిపాలిటీలో మాత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. పల్లెలే బెస్ట్.. జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి నుంచి రూ. 4కోట్ల 4లక్షల 52వేల 378 ఆస్తి పన్ను రావాల్సి ఉండగా నిన్నటి(శుక్రవారం) వరకు 74.62 శాతం వసూలు అయ్యాయి. మిగిలిన బకాయిలను ఈ నెల చివరిలోపు వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా కాటారం మండలంలో 91.36 శాతం, మొగుళ్లపల్లిలో 81.64 శాతం వసూలు అయ్యాయి. టేకుమట్ల 64.98 శాతం వసూలు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఈ నెల చివరిలోపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 90 శాతానికి పైగా పన్ను వసూలు జరిగే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీ లక్ష్యం చేరేనా..? భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో నివాస, వ్యాపార, నివాస, వ్యాపార భవనాలు 12,223 ఉన్నాయి. వాటి నుంచి రూ. 5.75 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా.. నిన్నటి వరకు 60.84 శాతం రూ.3.50 కోట్లు వసూలు అయ్యాయి. రూ.2.25 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. బకాయిల వసూలు కోసం మున్సిపాలిటీ అధికారులు నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఐదుగురు అధి కారులను నియమించారు. వీరు భారీ మొత్తంలో పన్ను బకాయి ఉన్న వారి భవనాల వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. అ యినప్పటికీ పన్నులు చెల్లించని పక్షంలో ఆస్తులను సైతం జప్తు చేస్తున్నారు. అయినప్పటికీ వసూలు అంతంత మాత్రంగానే అవుతోంది. మున్సిపాలిటీలో 60.84 శాతమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంతే మిగిలింది 30 రోజులే -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
భూపాలపల్లి: పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 3,449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. గతేడాది తక్కువ శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ ఏడాది ఖచ్చితంగా వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశం ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి రామానుజం చిత్ర పటానికి పూల మాలలు వేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీపీఆర్ఓ శ్రీనివాస్, పరీక్షల విభాగం ప్రత్యేక అధికారి రవీందర్రెడ్డి పాల్గొన్నారు. పుష్కర ఏర్పాట్లు వేగిరం చేయాలి.. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ, విద్యుత్శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ 4, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం 7, మిషన్ భగీరథ 15, దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం 28, విద్యుత్ 11 మొత్తం 65 పనులు పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. త్వరలో ఎన్నికల కోడ్ ముగియనున్నందున పనులు సత్వరమే చేపట్టేలా అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పీఎం శ్రీ పనులు పూర్తి చేయాలి.. పీఎం శ్రీ, సర్వ శిక్షా అభియాన్ పనులను మార్చి 20వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులతో నిధులు మంజూరు, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేసే అంశాలపై హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రెవెన్యూ, ఇంటర్మీడియట్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, ఆర్టీసీ, వైద్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 3,720 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పుష్కరాల పనులు వేగవంతం కలెక్టర్ రాహుల్ శర్మ -
ఫోన్పేతో బురిడీ..
కాటారం: డిజిటల్ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక్కచోట కొందరు ప్రజలను, వ్యాపారులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా శుక్రవారం ఓ దుకాణం యజమానిని మోసంచేసి చివరకు దుండగుడు దొరికిపోయారు. బాధిత దుకాణం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలకేంద్రంలోని గారెపల్లిలో ముస్కమల్ల సత్యం ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఓ యువకుడు దుకాణానికి వచ్చి పలు రకాల సామగ్రి కొనుగోలు చేశాడు. అనుమానం రాకుండా సామగ్రికి సంబంధించిన ధరపై దుకాణం యజమానితో బేరాలు సైతం చేశాడు. సదరు వ్యక్తి కొనుగోలు చేసిన సామగ్రికి సంబంధించి రూ.4వేలు అయింది. ఫోన్ పే చేస్తానని చెప్పడంతో దుకాణం యజమాని సత్యం స్కానర్ చూపించాడు. ఫేక్ ఫోన్ పే ద్వారా రూ.4వేలు చెల్లించిన దుండగుడు పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించి వెళ్లిపోయాడు. కొంత సమయం వరకు కూడా డబ్బులు జమకాకపోవడంతో అనుమానం వచ్చిన దుకాణం యజమాని అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బుల చెల్లింపు జరగలేదు. అప్రమత్తమైన యజమాని దుండగుడిని వెంబడించాడు. చివరకు భూపాలపల్లిలో పట్టుకొని ప్రశ్నించగా ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లింపు చేసినట్లు ఒప్పుకున్నాడు. దుండగుడిది గొల్లబుద్ధారం సమీపం నర్సింగపురం అని తెలిసింది. మోసానికి పాల్పడిన యువకుడిని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు దుకాణం యజమాని సత్యం తెలిపారు. -
విమానం ఎగురుడే..!
మామునూరు ఎయిర్పోర్ట్కు కేంద్రం పచ్చజెండా ● హెచ్ఐఎల్ ఇచ్చిన ఎన్ఓసీకి ఆమోదం ● రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరిస్తే ముందుకే.. ● 253 ఎకరాలు ఏఏఐకి అప్పగిస్తే పనులు షురూసాక్షి, వరంగల్: వరంగల్ నగరవాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న విమాన ప్రయాణం కొద్ది నెలల్లోనే సాకారం కానుంది. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో 2038 సంవత్సరం వరకు మరో వాణిజ్య విమానాశ్రయం ఉండద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (హెచ్ఐఎల్)కు ఒప్పందం ఉన్నా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరపడంతో నిరంభ్యంతరపత్రం (ఎన్ఓసీ) ఇచ్చింది. దీనికి కేంద్రం కూడా అంగీకారం తెలిపింది. ముఖ్యంగా మామునూరు విమానాశ్రయ నిర్మాణం కోసం 253 ఎకరాల అదనపు భూమిని సేకరించి ఇస్తే ఏఏఐ టెండర్లు పిలిచి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశముంది. ఇప్పటికే ఈ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ దిశగా వరంగల్ రెవెన్యూ అధికారులు కూడా భూసర్వే చేసి పూర్తి వివరాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు ఇచ్చారు. భూ నిర్వాసితులకు భూమికి బదులు భూమి, కాదనుకునేవారికి నష్టపరిహారం ఇవ్వనున్నారు. మరోమారు గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి , మామునూరు రైతులతో చర్చలు జరిపి సాధ్యమైనంత తొందరగా ఈ భూమి ఏఏఐకి అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణ తొలి దశను డిసెంబర్లోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు రేవంత్రెడ్డి సర్కారు కృతనిశ్చయంతో ఉండడంతో మామునూరులో విమానాలు ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది. భూసేకరణ పూర్తయితే 150 నుంచి 186 మంది ప్రయాణించేలా వీలున్న 37.6 మీటర్లు (123 ఫీట్ల) పొడవున్న ఏ 320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. 2022లో ‘ఉడాన్’కు ఎంపిక చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్ (ఉడో దేశ్ కీ ఆమ్ నాగరిక్) పథకం తీసుకొచ్చింది. దీని కింద మామునూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్లో ఎంపిక చేసింది. వరంగల్ శివారులోని మామూనూరులో నిజాం కాలంలో ఎయిర్స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. దశాబ్దాలుగా వినియోగం లేకపోవడంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత ఎయిర్స్ట్రిప్కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్ వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ జరగాలంటే ప్రజాప్రతినిధులతోపాటు రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలి. పర్యాటకం, ఐటీ, పరిశ్రమలకు బూస్ట్.. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ రంగాలు అభివృద్ధి చెందనున్నాయి. సమీపంలోని పర్యాటక ప్రాంతాలైన భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి మరింతగా సందర్శకులు పెరుగుతారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుంది. అలాగే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కై టెక్స్ మాదిరిగానే మరిన్ని అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకు వస్తే పెట్టుబడులు పెరిగి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశముంది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ తరహాలో.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధ్యయనం చేసి అక్కడి మాదిరిగా ఇక్కడ వసతులు కల్పించేలా చూడాలని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అక్కడి ప్రత్యేకత ఏమిటో అనే చర్చ వచ్చింది. ‘కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ (సీఐఏఎల్) పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో నెడుంబస్సెరీ ప్రాంతంలో 1213 ఎకరాల్లో నిర్మించారు. 1999 మే 25న అందుబాటులోకి వచ్చింది. ఏ ప్రాంతం నుంచైనా చేరుకునేలా 56 రేడియల్ రోడ్లను నిర్మించారు. సమీప పర్యాటక ప్రాంతాలైన పథనంతిట్ట, ఎర్నాకులం, కొట్టాయం, అలిప్పి నుంచి నేరుగా చేరుకులా ఎక్స్ప్రెస్ జాతీయ రహదారులను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్మించిన తొలి ఎయిర్పోర్ట్ ఇది. 32 దేశాలకు చెందిన 10 వేల మంది ఎన్ఆర్ఐలు ఈ విమానాశ్రయ నిర్మాణానికి నిధులు ఇచ్చారు. కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం 31 అంతర్జాతీయ, 22 దేశీయ గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పూర్తిగా సోలార్ విద్యుత్తో నడిచే విమానాశ్రయాల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది. తొలుత దేశీయ విమానాల రాకకు టెర్మినల్స్ను నిర్మించారు. అనంతరం దశల వారీగా విస్తరణ చేశారు. ప్రస్తుతం మూడు టెర్మినళ్లు ఉన్నాయి. ఒకటి దేశీయ, రెండోది అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సేవలు అందిస్తోంది. మరో దానిలో కార్గో సేవలను నిర్వహిస్తున్నారు. 2023–2024లో 1.08 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల రాకపోకల పరంగా దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది’ అని పౌర విమానాయన శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. -
ఉద్యోగ విరమణ తప్పనిసరి
భూపాలపల్లి రూరల్: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన గుండు నాగభూషణం–పద్మ దంపతులను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. గృహోపకరణాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. పోలీసులంటేనే ఎన్నో రకాల త్యాగాలతో పాటు, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తారన్నారు. సుమారు 40 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాగభూషణం అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చె ప్పారు. ఏదేని సమస్యలు ఉంటే రిటైర్డ్ ఉద్యోగులు తనను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవా లని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఎస్సైలు నగేష్, కిరణ్, శ్రీకాంత్, రత్నం, పోలీసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ఖరే -
కాలనీల్లో పర్యటించిన కమిషనర్
భూపాలపల్లి అర్బన్: పట్టణంలోని పలు కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం పర్యటించారు. రాజీవ్నగర్, కారల్మార్క్స్కాలనీల్లో ఇంటింటికీ తిరిగి తాగునీటి సరఫరాను పరిశీలించారు. ప్రతి రోజు నీటి సరఫరా సరిగా వస్తుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా నీటిని వృథా చేయవద్దన్నారు. అనంతరం పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాటర్ సప్లై, ఎలక్ట్రిషన్ స్టాక్ రిజిస్టర్లు, మెటీరియల్స్, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ను కొనసాగించాలని పట్టణంలో వీధి దీపాల అంతరాయం ఉండకుండా ఎప్పటికప్పుడు మరమ్మతు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ మానస, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రశ్నించినందుకే హత్య చేశారు..
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, న్యాయం కోసం ప్రశ్నిస్తూ, కోర్టులో కేసులు వేయడం వలనే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్య చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నారాయణ తెలిపారు. పౌర హక్కుల సంఘం నాయకులు శుక్రవారం రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా భూ అక్రమాలు, మాఫియాలపై కేసులు వేస్తే 80మంది వరకు హత్యగావించబడ్డారన్నారు. ఈ హత్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయి ప్రజలు తిరగబడుతారని తెలిపారు.పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు -
నా భర్త హత్యపై దర్యాప్తు జరిపించాలి
భూపాలపల్లి: ఈ నెల 19న దారుణ హత్యకు గురైన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి భార్య సరళ గురువారం సంచలన ఆరోపణలు చేస్తూ మీడియాకు ఒక వీడియోను విడుదల చేసింది. భూపాలపల్లి పోలీస్స్టేషన్ ఎదుట గల రెండు గుంటల భూ వివాదం కారణంగా తన భర్త హత్యకు గురి కాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కోర్టులో కేసు వేసినందుకే హత్యకు గురయ్యాడని పేర్కొంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మన్ కొత్త హరిబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించాలని ఆమె సీఎం రేవంత్రెడ్డిని వేడుకున్నారు. తనకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఇప్పటికై నా హరిబాబును పట్టుకుంటే తన భర్త ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఈ హత్యపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కొత్త హరిబాబులపై అనుమానం వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేస్తానని తెలపగా, వాళ్ల పేర్లు ఎందుకంటూ స్థానిక డీఎస్పీ సంపత్రావు.. తనను తప్పుదోవ పట్టించి ఫిర్యాదు రాయించుకున్నారని సరళ విడుదల చేసిన వీడియోలో ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టుకు వెళ్లినందుకే.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హత్యకు కుట్ర పన్నారు నాగవెల్లి రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపణ -
కేజీ కూడా ఎక్కువ లేదట..
తనిఖీలు ముమ్మరం.. కాంటా వద్ద మైనింగ్ ఆర్ఐలు పర్యవేక్షించి తూకంలో నిబంధన ప్రకారం ఎక్కువగా వస్తే వెంటనే తీసేస్తున్నారు. ఎలాంటి అదనపు ఫీజు వసూలు కాకుండా చూస్తున్నారు. తక్కువగా లోడింగ్ చేస్తే అక్కడే నింపుతున్నారు. రెవెన్యూ ఉద్యోగులు తూకంవేసిన లారీ నంబర్, వేబిల్లును పరిశీలిస్తున్నారు. పోలీసులు క్రమపద్ధతిలో లారీలను త్వరత్వరగా తరలిస్తున్నారు. కాంటా వద్ద ఒక ప్రొక్లైయిన్తో తీయడం, నింపడం చేస్తున్నారు. లారీల్లో ఇదివరకు రెండు నుంచి మూడు టన్నుల ఇసుకను నింపి అదనంగా డబ్బులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు లారీల్లో తమ లారీల రిజిస్ట్రేషన్ కార్డుపై ఎంత బరువు ఉంటే అంతే కలుపుకొని కేజీ ఇసుకను కూడా ఎక్కువగా నింపడం లేదని లారీడ్రైవర్లు, యజమానులు చెబుతున్నారు. లారీ కొనుగోలు తరువాత ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇతర పరికరాలతో బాడీమార్చారు. ప్రస్తుతం ఉన్న లారీబరువుల ప్రకారం లారీలో ఇసుకను నింపాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఇలా నింపకపోతే టన్ను, టన్నున్నర వరకు తక్కువగా వస్తుందని వాపోతున్నారు. దీంతో ధరలు పెంచుతున్నారు. ఇలా నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు కూడా అవుతున్నట్లు తెలుపుతున్నారు. ఈ విషయమై ప్రాజెక్టు అధికారి రంగారెడ్డిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
చెక్డ్యామ్కు గండి
చిట్యాల/మొగుళ్లపల్లి: చిట్యాల మండలం నవాబుపేట, మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామాల మధ్య చలివాగుపై నిర్మించిన చెక్డ్యామ్కు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గండికొట్టారు. యాసంగికి ముందు చెక్ డ్యామ్ ఎండిపోయి దర్శనమిచ్చింది. పలుమార్లు సాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలిసి హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ముచ్చర్ల నాగారం చెరువు నుంచి నీటిని విడుదల చేసి వరి పంటలను కాపాడాలని రైతులు విన్నవించారు. దీంతో ఎమ్మెల్యేలు ఇద్దరు స్పందించి వరి పంటల కోసం నీటిని విడుదల చేశారు. నీళ్లు కింది భాగానికి వెళ్లకపోవడంతో రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని ఉద్దేశంతో చెక్ డ్యాంకు గండి కొట్టినట్లు తెలుస్తుంది. చెక్డ్యాంను ఇరిగేషన్ డీఈ అమ్రపాలి. ఏఈలు వరుణ్ భాస్కర్ సందర్శించి గండిని పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.పరిశీలించిన ఐబీ అధికారులు -
ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు
జిల్లా ఓటర్లు పోలైన శాతం ఓట్లుజనగామ 1,002 945 94.31 హనుమకొండ 5,215 4,780 91.66 వరంగల్ 2,352 2,214 94.13 మహబూబాబాద్ 1,663 1,571 94.47 భూపాలపల్లి 329 308 93.62 ములుగు 628 583 92.83 ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95శాతం పోలింగ్ నమోదైంది. -
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ ఓటింగ్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిర్వహించిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం–వరంగల్–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 93 శాతం, కరీంనగర్–నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 92 శాతం, పట్టభద్రుల ఓటింగ్ 76 శాతం జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగినట్లు తెలిపారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో 329మంది ఓటర్లకుగాను 308 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 93.62శాతం, నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు 2,483 మందికి గాను 1,903మంది ఓటు హక్కు వినియోగించుకోగా 76శాతం నమోదైనట్లు తెలిపారు. నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 83మంది ఓటర్లు ఉండగా 77మంది ఓటు హక్కు వినియోగించుకొగా 92 శాతం నమోదైనట్లు తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య వరంగల్, కరీంనగర్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు పోలింగ్ సామగ్రి పంపనున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ భూపాలపల్లి, కాటారం మండలాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్లు శ్రీనివాసులు, నాగరాజు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.– మరిన్ని ఫొటోలు 9లోu -
మూడు రోజులపాటు వైభవోపేతంగా..
కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా ఉత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహించారు. గురువారం ఉదయం 8గంటలకు గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేకంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటలకు వేదపండితులు ప్రత్యేక పూజలతో యాగశాలలో పూర్ణాహుతి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి నాకబలి, నందివాహన పవళింపు సేవతో కార్యక్రమాలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీఆదిముక్తీశ్వర–శుభానందల కల్యాణం.. మహదేవపూర్ మండలం కాళేశ్వరం అనుబంధ దేవాలయమైన అడవిలో వెలసిన శ్రీఆదిముక్తీశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి మరుసటి రోజున ఆనావాయితీ ప్రకారం శ్రీఆదిముక్తీశ్వర–శుభానంద కల్యాణం శాస్త్రోక్తంగా వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆలయ వేదపండితుల ఆధ్వర్యంలో కల్యాణ తంతును నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు కామిడి రాంరెడ్డి, మెంగాని మాధవి, మాజీ దేవస్థానం డైరెక్టర్లు అశోక్, శ్యాంసుందర్ దేవుడా భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం ఆదాయం రూ.21లక్షలు మూడు రోజులకు గాను కాళేశ్వరం దేవస్థానానికి వివిధ పూజలు, లడ్డు ప్రసాదాలు, తైబజార్ విక్రయాల ద్వారా రూ.21లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ శనిగెల మహేష్ తెలిపారు. గత సంవత్సరం శివరాత్రి ఆదాయం రూ. 13.98లక్షల వరకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గతం కంటే ఈసారి అధికంగా లక్షన్నర మంది వరకు భక్తులు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తరలివచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఆదాయం పెరిగినట్లు చెప్పారు. పూర్ణాహుతితో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు దేవస్థానానికి రూ.21లక్షల ఆదాయం ఘనంగా ఆదిముక్తీశ్వర–శుభానందల కల్యాణం తరలివచ్చిన భక్తులు -
ఇసుక పిరం
టీజీఎండీసీ ఆన్లైన్లో టన్నుకు రూ.650వరకు కొనుగోలు చేస్తారు. 16 టైర్లు లారీలో 47.500 టన్నులు, 14 టైర్లు లారీలో 42టన్నులు, 12టైర్లు లారీలో 35 టన్నులను (లారీ బరువుతో కలిసి) తరలిస్తారు. వరంగల్ మార్కెట్లో సన్నరకం ఇసుక టన్నుకు రూ.1,600–1,800 వరకు, దొడ్డురకం టన్నుకు రూ.1,400–1,500వరకు, హైదరాబాద్ పట్టణాల్లో రూ.2వేల నుంచి 2,300 వరకు, దొడ్డు రకం టన్నుకు రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్కు ఇసుక లారీల్లో తరలిపోవాలంటే గతంలో రూ.35వేల నుంచి రూ.40వేల వరకు ఉండేది. ప్రస్తుతం ధరలు పెరగడంతో రూ.50వేల నుంచి 60వేల వరకు ధరలు పెరిగాయి. ఇదివరకు ఒక్కోలారీలో రెండు నుంచి మూడు టన్నులు అదనంగా తరలించేవారు. ఇదివరకు వరంగల్లో రూ.1,100–1,200, హైదరాబాద్లో రూ.1,500 వరకు ఇసుకను విక్రయించేవారు. నిబంధనలు కఠినమై ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగిందని సామాన్యులు ఆందోళన పడుతున్నారు.కాళేశ్వరం: వేసవి కావడంతో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో సన్న ఇసుకకు డిమాండ్ బాగా పెరిగింది. సర్కార్ ఇసుక లోడింగ్ నిబంధనలు కఠినం చేయడంతో ధరలు అమాంతం పెరిగి వినియోగదారుల్లో కలవరం మొదలైంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి నిబంధనల మేరకు విక్రయాలు జరగాలని సీరియస్గా హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. 25రోజులుగా అక్రమాలకు తావులేకుండా మైనింగ్, రెవెన్యూ, పోలీసుశాఖల పర్యవేక్షణలో టీజీఎండీసీ ఆధ్వర్యంలో లోడింగ్ జరుగుతుంది. నిబంధనల మేరకు లోడింగ్ వ్యవహారం జరుగుతుందా లేదా అనే విషయమై పలుమార్లు పోలీసు, విజిలెన్స్, ఇంటిలిజెన్స్, అదనపు కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు క్వారీల బాటపట్టి పరిస్థితిని సమీక్షించారు. 8 క్వారీల్లో లోడింగ్.. మహదేవపూర్ మండలంలో ఇసుక రీచులు 8వరకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మద్దులపల్లి(పలుగుల–7), అన్నారం, పలుగుల–6, పలుగుల–3, పూస్కుపల్లి–1, పూస్కుపల్లి పార్టు–2, బొమ్మాపూర్, ఎలికేశ్వరంలో క్వారీలు టీజీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిత్యం ఈ క్వారీలకు గతంలో 100కుపైగా లారీలు వచ్చేవి. ప్రస్తుతం లోడింగ్ కఠినం చేయడంతో కొన్ని క్వారీలకే లారీలు ఇసుకకు వస్తున్నారు.అమాంతం పెరిగిపోయిన ధరలు ● టీజీఎండీసీ ఆన్లైన్లో టన్ను ఇసుకకు రూ.650 వరకు.. ● నెల కిందట మార్కెట్లో టన్నుకు రూ.900–1,200 వరకు విక్రయం ● ప్రస్తుతం రూ.1,800–2,300 ● వినియోగదారుల ఆందోళనఎలికేశ్వరం క్వారీ వద్ద ఇసుక లోడింగ్ధరలకు రెక్కలు.. -
కోటగుళ్లలో లింగోద్భవ రుద్రాభిషేకం
గణపురం: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో గురువారం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ లింగోద్భవ రుద్రాభి షేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్నపూజ కార్యక్రమాన్ని అర్చకులు గంగాధర్, వినయ్, నాగరాజు, విజయ్కుమార్, శంకర్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్పై అవగాహన భూపాలపల్లి అర్బన్: మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్పై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని వారసంతలో మోబైల్ వ్యాన్తో అవగాహన కల్పించారు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది సూచించారు. క్షణికావేశాలకు పోయి, పగలు, పంతాలు పెంచుకొని కేసుల్లో ఇరికితే, పోలీస్ స్టేషన్లు కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. విలువైన సమయం, డబ్బు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. మహిళలకు క్రీడాపోటీలు భూపాలపల్లి అర్బన్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 1న అంబేడ్కర్ స్టేడియం, థౌసండ్ క్వార్టర్స్, మార్చి 3న ఇల్లంద క్లబ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వసంతోత్సవానికి వేళాయె.. ● నేటి నుంచి నిట్లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో ప్రతీ ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులపాటు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. నేటి నుంచి(శుక్రవారం)మార్చి 1, 2 తేదీల్లో నిర్వహించే కల్చరల్ ఫెస్ట్కు ఏర్పాట్లు చేశారు. నాటి ఆర్ఈసీ నేటి నిట్లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న నిట్లో వివిధ దేశాల సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకునేందుకు 1978లో ప్రారంభమైన వసంతోత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు. తొలిరోజు: తొలిరోజు శుక్రవారం సాయంత్రం అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో హాస్యనటుడు, గిన్నిస్ వరల్ రికార్డు గ్రహీత, పద్మశ్రీ బ్రహ్మానందం, విద్యార్థుల చిట్చాట్. రెండో రోజు: శనివారం ప్రోషోలో భాగంగా ఇండియన్ రాక్బ్యాండ్ వార్డెక్స్ ఫ్యూజన్ మ్యూజిక్తో అలరించనున్నారు. డైరెక్టర్ కట్స్లో సినీ డైరెక్టర్లతో చిట్చాట్. అల్యూర్లో భాగంగా ఫ్యాషన్ షో, నుక్కడ్ నాటక్ ప్రదర్శన మూడో రోజు: ముగింపులో భాగంగా ఆదివారం పాపులర్ సింగర్ అమిత్ త్రివేది హిందీ, ఇంగ్లిష్ సంగీత విభావరి. నిపుణులతో బైక్స్టంట్స్. ఈసారి థీం లేదు: స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో నిర్వహించేవారు. 2022లో సృష్టిగా, 2023లో కళాధ్వనిగా, 2024లో రాసంగేన్ థీం (ఇతివృత్తం) తో నిర్వహించారు. ఈసారి అదేపేరుతో స్ప్రింగ్ స్ప్రీ–25ను నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
యాజమాన్యమే పనులు చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని విరమించుకొని సింగరేణి యాజమాన్యమే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 8వ గని రెండో సీమ్ను ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కేటీకే 8వ గని ప్రైవేట్పరం చేయడం వల్ల సింగరేణికే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు. ిసింగరేణి ఆధ్వర్యంలోనే బొగ్గు వెలికితీయాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రైవేట్పరం చేయడం వల్ల డిపెండెంట్ ఉద్యోగాలు రాక కార్మిక పిల్లలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఓటు జీఎం కవీంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాతంగి రామచందర్, సుధాకర్రెడ్డి, విజేందర్, శ్రీనివాస్, ఆసిఫ్పాష, రవికుమార్, రామచందర్, నూకల చంద్రమౌళి, ఫిట్ సెక్రటరీలు సదయ్య పాల్గొన్నారు. -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
వాజేడు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నాలుగు మండలాల స్థాయి వాలీబాల్ పోటీల్లో విజేతగా పూసూరు టీం నిలిచింది. మండల కేంద్రంలో బుధవారం సాగిన ఫైనల్ పోటీల్లో వాజేడు, పూసూరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చెరొక సెట్టు గెలిచి సమంగా నిలిచినప్పటికీ నిర్ణయాత్మక ఫైనల్ సెట్లో పూసూరు జట్టు విజేతగా నిలించింది. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన పూసూరు జట్టుకు వాజేడు ఎస్సై రాజ్కుమార్ రూ. 15,016 నగదు, షీల్డ్, ద్వితీయ స్థానంలో నిలిచిన వాజేడు జట్టుకు నగదు రూ.10,016 నగదు, షీల్డ్ను అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన రాంపురం జట్టుకు రూ.5,016, షీల్డ్, నాల్గో స్థానంలో నిలిచిన దూలాపురం జట్టుకు రూ.3,016 నగదుతో పాటు షీల్డ్ అందించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకర్లపూడి విక్రాంత్, మాజీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, వత్సవాయి జగన్నాథరాజు, దాట్ల వాసు, తోలెం చందర్రావు తదితరులు పాల్గొన్నారు. విజేతగా నిలిచిన పూసూరు జట్టు రన్నరప్గా వాజేడు -
బెల్టుషాపుల్లో జోరుగా మద్యం అమ్మకాలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రెండు ప్రభుత్వ మద్యం షాపులను ఎకై ్సజ్ అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, శివరాత్రి జాతర నేపద్యంలో రెండు రోజులు బంద్ చేశారు. దీంతో బుధవారం జాతరలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. బెల్టు షాపు నిర్వాహకులకు ముందుగానే పెద్దమొత్తంలో మద్యం డంప్ చేసి అమ్మకాలు చేపట్టారు. బెల్టుషాపుల్లో ఒక మద్యం క్వార్టర్పై రూ.100లకు విక్రయించి భక్తుల జేబులకు చిల్లు వేశారు. ఇంత జరుగుతున్న ఎకై ్సజ్శాఖ అధికారులు గాలి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి వచ్చిన భక్తులు అధిక ధరలకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారని విమర్శలు నెలకొన్నాయి. -
నేడే పోలింగ్
భూపాలపల్లి అర్బన్: నేడు (గురువారం) జిల్లాలో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయగా బుధవారం ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కలెక్టరేట్లో రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోలింగ్ మెటీరియల్ను అందించారు. జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. నాలుగు రూట్లుగా విభజించి ప్రతీరూట్కు ఒక లైజన్ అధికారి, రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం స్థానానికి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ న్నికలకు భూపాలపల్లి, మొగుళ్లపల్లి చిట్యాల, గ ణపురం, టేకుమట్ల, రేగొండ, కొత్తపల్లిగోరి మండల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ ఎన్నికల్లో 215 మంది ఓటర్లు తమ ఓటు హ క్కును వినియోగించుకోనున్నారు. మెదక్–నిజా మాబాద్– ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలకు మంథని నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హ ర్, పలిమెల మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 83 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీకి 2,483 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది -
త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తిశ్వరస్వామి ఆలయానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలతో మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామివార్లకు గోదావరి జలాలతో అభిషేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో పుర వీధులన్ని భక్తజనంతో నిండిపోయాయి. బుధవారం రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అర్ధరాత్రి లింగోద్భవ పూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. భక్తులు జాగరణతో పాటు ఉపవాసదీక్షలను నియమ నిష్టలతో పాటించారు. ఆలయం ఆవరణలో రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేసవి దృష్టిలో పెట్టుకొని భక్తులకు దాతల సాయంతో మినరల్ వాటర్, మజ్జిగ, పండ్లు అందజేశారు. పోలీసుల బందోబస్తు ఎస్పీ కిరణ్ఖరే, కాటారం డీఎస్పీ రా మ్మోహన్రెడ్డిల ఆధ్వర్యంలో కాళేశ్వరంలో భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను నియంత్రించారు. ఫిషరీస్, వైద్యారోగ్యశాఖ, ఎన్పీడీసీఎల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో భక్తులకు సేవలందించారు. పలు రాష్ట్రాల నుంచి సుమారుగా లక్షన్నరకుపైగా మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖుల పూజలు జిల్లా జడ్జి అఖిల, కలెక్టర్ రాహుల్శర్మ దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, రామ్మోహన్రెడ్డి దంపతులు స్వామి వారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదం అందజేశారు. -
ప్రైవేటీకరణ నిలిపేవరకు పోరాటాలు
భూపాలపల్లి అర్బన్:ఏరియాలో సింగరేణి గనుల ప్రైవేటీకరణను నిలిపేవరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని యూనియన్ బ్రాంచీ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ తెలిపారు. కేటీకే ఓసీ–3 అండర్గ్రౌండ్ 2వ సీమ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనుల అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా రమేశ్ మాట్లాడుతూ.. గని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీంతో డిపెండెంట్ ఎంప్లాయీమెంట్ తగ్గిపోవడమే కాకుండా సంస్థ ఆర్థిక నష్టాల్లో కూరుకు పోతుందన్నారు. కొత్తగనుల ఏర్పాటు లేకపోవడంతో సింగరేణి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, టెక్నీషియన్లు, అధికారులు ఉండి 130 సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి నిర్వీర్యం చేస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సదయ్య, తిరుపతి, కరిముల్లా, శ్రీను, చంద్రమౌళి, జగత్రావు, కృష్ణారెడ్డి, హరీష్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అందని బోనస్
చెల్లింపుల్లో జాప్యం..ఆందోళనలో అన్నదాతలు ● యాసంగి పెట్టుబడులకు అప్పులు చేస్తున్న వైనం ● రైతులకు అందని రూ.24.45 కోట్లుఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు భూపాలపల్లి మండలం గుర్రంపేటకు చెందిన ముక్కెర రమేశ్. నెలరోజుల క్రితం 40 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. క్వింటాకు రూ.2,320 చొప్పున రూ.92,800 బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు ఇప్పటి వరకు జమ కాలేదు. ప్రభుత్వం నుంచి బోనస్ డబ్బులు త్వరగా వస్తాయని కొనుగోలు కేంద్రంలో అమ్మానని, పండించిన పంటకు చేసిన అప్పులు కట్టలేక, మళ్లీ యాసంగి సీజన్కు పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయాడు. ఇలా చాలా మంది రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. భూపాలపల్లి రూరల్: మద్దతు ధరతో కలిపి ఇస్తామని బోనస్ రూ.500 ధాన్యం విక్రయించి నెల రోజులు దాటినా ఇంకా కొంతమంది రైతుల ఖాతాల్లో జమకాలేదు. దీంతో యాసంగి పెట్టుబడి కోసం అప్పులు తేవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1.50 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సన్న రకాలకు రూ.2,320 మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. జిల్లాలో కొనుగోళ్లు పూర్తిగా 81,774 మెట్రిక్ టన్నులు ఽసన్నధాన్యాన్ని సేకరించారు. మొత్తానికి గాను బోనస్గా రూ.40.89 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.16.44 కోట్లు చెల్లించారు. రూ. 24.45 కోట్ల మేర రైతులకు చెల్లించాల్సి ఉంది. కొన్ని రోజులుగా అన్నదాతలు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ లేకపోవడమే కారణమా? సన్నరకాలు విక్రయించిన రైతుల వివరాలను ధా న్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రొక్యూర్మెంట్, మేనేజ్మెంట్ సిస్టంలో నమోదు చేసి, పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ అధికారి లాగిన్కు పంపిస్తున్నారు. అనంతరం వాటి ఆధారంగా రైతుల బ్యాంకు ఖాతాలకు సంబంధిత శాఖ బోనస్ జమచేస్తోంది. అయితే ధాన్యం విక్రయించిన వారం రోజుల వ్యవధిలో క్వింటాకు రూ.2,320 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. బోనస్ డబ్బుల జమలో జాప్యం జరుగుతోంది. ఇందుకు సివిల్ సప్లయీస్ శాఖకు లేటుగా రిపోర్టు అందడం.. బోనస్ చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖలో బడ్జెట్ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.ధాన్యం కొనుగోలు వివరాలు -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: వేసవిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా ఇన్పుట్, అవుట్పుట్, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, ఇతర సాంకేతిక పరంగా ఎదురయ్యే అంశాలలో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని తెలిపారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం, లోడ్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్నాయక్, అధికారులు పాల్గొన్నారు. ఎరువుల కొరత లేకుండా చూడాలి.. ఎరువుల కొరత రాకుండా రైతులకు సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని రాంసాయి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, జంగేడులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, రైతుల అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 1,950 టన్నుల యూరియా డీలర్ల దగ్గర, 650 టన్నులు మార్కెఫెడ్ వద్ద అందుబాటులో ఉందని తెలిపారు. రానున్న వారం రోజుల్లో అదనంగా రెండు వేల టన్నులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఓ విజయభాస్కర్, భూపాలపల్లి ఏఓ సతీష్ పాల్గొన్నారు. మహిళా ఆర్థిక సాధికారతతోనే దేశాభివృద్ధి.. మహిళా ఆర్థిక సాధికారత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవ మహిళా సాధికారత పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలో ఆర్థిక ప్రగతి కనబడాలంటే అందరూ తప్పనిసరిగా పొదుపును పాటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి తిరుపతి, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.