Jayashankar District News
-
No Headline
గ్రేటర్ వరంగల్ స్మార్ట్సిటీ పనులకు నిధుల సమస్య తీరడం లేదు. ఈ పథకం కింద రూ.981 కోట్లతో చేపట్టిన పనులు నిధుల లేమి కారణంగా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏటా బడ్జెట్లో దేశవ్యాప్తంగా స్మార్ట్సిటీలకు కేటాయింపులున్నా వరంగల్కు వచ్చే నిధుల విడుదలలో ప్రతీసారి చిన్నచూపే. ఫలితంగా ఓరుగల్లు స్మార్ట్సిటీ కల నెరవేరడం లేదు. ● ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 360 ఎకరాల స్థల సేకరణ చేశారు. కనీసం రూ.250 కోట్లయినా కేటాయిస్తే యూనివర్సిటీ నిర్మాణ పనులు సాగే అవకాశం ఉండేది. గత బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఈ రెండు గిరిజన యూనివర్సిటీలకు కలిపి రూ.67 కోట్లు మాత్రమే కేటాయించగా.. ఈ ఏడాది ములుగులో పాత భవనంలో ప్రారంభమైన క్లాసులకు పలుమార్లు నోటిఫికేషన్ ఇచ్చినా 14 మందే అడ్మిషన్లు తీసుకున్నారు. ● విలువ ఆధారిత పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చెబుతున్నా.. ఆ దిశగా ప్రయత్నం జరగడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 లక్షల మంది రైతులు 19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు మిర్చి, పసుపు సాగవుతున్నాయి. కేంద్రం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఏటా మద్దతు ధరను పెంచడంతోపాటు పంటలకు విలువ ఆధారిత పరిశ్రమల (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు) ఏర్పాటుకు ఈసారైనా నిధులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. పసుపు, పత్తి, మిర్చి, మామిడి, మొక్కజొన్నలో నాణ్యమైన విత్తనాలను రూపొందించడానికి పరిశోధన స్థానాల ఏర్పాటు డిమాండ్ పెండింగ్లో ఉంది. ● వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో స్పిన్నింగ్, కలర్డై యార్న్ మిల్లుల ఏర్పాటు ప్రతిపాదనకు మోక్షం కలగలేదు. ● ప్రతీజిల్లాకు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, హనుమకొండలో సైనిక్ పాఠశాలను ఏర్పాటు చేయాలనేది ప్రజలకు తీరని కోరికలుగానే ఉన్నాయి. ● వరంగల్ మామునూరులో నిజాం కాలంలో నిర్మించిన విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ఓరుగల్లు వాసులు ఎప్పటినుంచో కోరుతున్నా.. ఎప్పుడూ ఒక్కడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈసారి స్పష్టత వస్తుందన్న ఆశ ఉంది. ● ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన కాకతీయ కాలం నాటి దేవాలయాల అభివృద్ధి, టూరిజం సర్క్యూట్ల ఏర్పాటు భారీగా నిధులు ఇవ్వాలని కోరినట్లు ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్ ప్రకటించారు. -
హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు
భూపాలపల్లి: హెల్మెట్ ధరించడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం రవాణా మరియు పోలీసుశాఖల ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయం నుంచి గణేష్ చౌక్ మీదుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ వరకు బైక్లపై హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ప్రారంభించారు. ర్యాలీలో భాగంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు ఎస్పీ బోనాల కిషన్ హెల్మెట్లు ధరించి బైక్లు నడిపారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ... దేశంలో సగటున 70 శాతం రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం మూలంగానే ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడైందని, ఇది చాలా బాధాకరమన్నారు. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. యువత ఎక్కువగా బైక్లపై రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం పలువురు డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఓ మహ్మద్ సంధాని, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, డాక్టర్ కేఎస్ కిరణ్, ఇతర శాఖలు, సింగరేణి, కేటీపీపీ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3 నోటిఫికేషన్ రానుందని, మార్చి 8న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అందరూ పాటించాలని, ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే -
శిక్షకుల ఎంపికకు దరఖాస్తులు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే జూట్ బ్యాగ్ల తయారీ శిక్షకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సింగరేణి ఏరియా అధికార ప్రతినిధి మారుతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాలో ఇప్పటికే వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. తౌసండ్ క్యాటర్స్లలో జూట్ బ్యాగ్ల తయారీ కోర్సును నిర్వహించడానికి యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన శిక్షకులు ఈ నెల 10వ తేదీలోపు స్థానిక జీఎం కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు. -
సీతమ్మ కరుణించేనా..?
శనివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025● రైల్వేలైన్లు, స్టేషన్లకు విడుదల కాని నిధులు ● గత బడ్జెట్లో ప్రతిపాదించినా దక్కని ప్రాధాన్యం ● కోచ్ ఫ్యాక్టరీకి పెద్దపీట వేస్తేనే ఆగస్టు నాటికి పూర్తి ● స్మార్ట్సిటీ, ఫుడ్ప్రాసెసింగ్, ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశలు ● ఉమ్మడి వరంగల్కు పెద్దపీట వేయాలని ఎంపీల వినతి ● నేడు పార్లమెంట్లో నిర్మలమ్మ 2025–26 బడ్జెట్ -
కోటగుళ్ల శిల్పసంపద అద్భుతం
గణపురం: కోటగుళ్ల శిల్పసంపద అద్భుతంగా ఉందని కాగ్ సీనియర్ ఆడిట్ అధికారి శివకుమార్ అన్నారు. జిల్లాకు అధికార కార్యక్రమానికి హాజరైన ఆయన గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను శుక్రవారం సందర్శించి స్వామి వారి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగుళ్లు అద్భుత శిల్ప సంపదతో ఉన్నాయని.. ఇక్కడ స్వామి వారికి అభిషేకం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అసిస్టెంట్ ఆడిట్ అధికారి రవికుమార్, గణపురం ఎస్ఐ రేఖ అశోక్ ఉన్నారు.కాగ్ సీనియర్ ఆడిట్ అధికారి శివకుమార్ -
నిరంతరం ఆదాయం
భూపాలపల్లి రూరల్: బంజార భూములతో పాటు వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని నిరంతరం రైతులు ఆదాయం పొందవచ్చని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, రైతు సమూహాలు, నీటి వినియోగదారుల సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, పంచాయతీలు, గ్రామ సంస్థలు, మండల సమాఖ్యలు, డెవలపర్స్ సోలార్ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవడానికి 3.5నుంచి 4ఎకరాల భూమి అవసరం ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 63049 03933 లేదా 90005 50974 నంబర్లలో సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. -
ఉత్సాహంగా రాక్క్లైంబింగ్
రేగొండ: రేగొండ మండలంలోని చారిత్రక ప్రాంతమైన పాండవుల గుట్టలో ఎకో టూరిజం, అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎఫ్ఓ ఆదేశాల మేరకు నిర్వహించిన రాక్ క్లైంబింగ్, రాప్పెల్లింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాల్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పాండవుల గుట్టలోని ప్రత్యేకాకర్షణగా నిలిచిన తొండం గుండు వద్దకు చేరుకుని అక్కడి శిలాకృతులకు ముగ్ధులై తమ కెమెరాల్లో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ నరేష్, ఎఫ్ఎస్ఓ గౌతమి, ఎఫ్బీఓ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రతీ శని, ఆదివారాల్లో పాండవుల గుట్టలో పర్యాటకుల కోసం రాక్క్లైంబింగ్తో పాటు రాప్పెల్లింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. రాక్క్లైంబింగ్లో పాల్గొనే పర్యాటకులు 94415 55524 నంబర్లో సంప్రదించాలని సూచించారు. వారివెంట రాక్క్లైంబింగ్ ఇన్స్ట్రక్టర్లు అల్లె భాస్కర్, శ్రీకాంత్, రవిందర్, భరత్రాజ్, భాస్కర్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్తి పన్నుల వసూలులో నిర్లక్ష్యం చేయొద్దు
● మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ భూపాలపల్లి: ఆస్తి పన్నుల వసూలులో నిర్లక్ష్యం చేయవద్దని భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులను వందశాతం వసూలు చేయాలన్నారు. పన్నుల వసూలుకు సిబ్బందిని టీంలుగా విభజించి, వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ముందు.. మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
ఎన్నికల నియమావళిని అమలు చేయాలి
భూపాలపల్లి: జిల్లాలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ జిల్లాలో తక్షణమే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టిక్కర్లు తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. టూరిజం హబ్గా తీర్చిదిద్దాలి.. జిల్లాలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసి టూరిజం హబ్గా తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో అటవీ, దేవాదాయ, ఆర్కియాలజీ మ్యూజియం, విద్యా, ఇరిగేషన్, పర్యాటక శాఖ, పర్యాటక సంస్థ, సమాచార, యువజన సర్వీసులు, మైనార్టీ శాఖల అధికారులతో జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ద్వారా మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజి, పర్యాటక శాఖ డీఈ ధనరాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి... నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో నేషనల్ డి వార్మింగ్ డే జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 10న మాత్రలు తీసుకోని వారికి తిరిగి 17వ తేదీన ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 69,652 మందిని గుర్తించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వైద్యాధికారులు పాల్గొన్నారు. పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.. పోటీ పరీక్షలకు సిద్ధపడే వారి కోసం పుస్తకాలు అందుబాటులో ఉంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎల్ విజయలక్ష్మి సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం గ్రంథాలయ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన వివరాలు మరియు 2025–2026 బడ్జెట్ అంచనాల ఆమోదం కోసం పంపేందుకు అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో డీపీఓ నారాయణరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శైలజ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి టి శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.వేసవిలో తాగునీటి ఇబ్బంది రానివ్వొద్దు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా రానున్న 10 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో గ్రామ పంచాయతీ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలలో నిరుపయోగంగా ఉన్న బోర్లు, చేతి పంపులు, పైపులైన్ లీకేజీలు, కొత్త పైపులైన్ల ఏర్పాటు, గేట్ వాల్స్ లీకేజీలను గుర్తించి నివేదిక అందజేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
కేంద్ర బడ్జెట్లో ‘ఓరుగల్లు’కు కురిసేనా వరాల జల్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే 2025–26 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏ మేరకు నిధుల వాటా దక్కనుంది?.. ఈసారైన కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుల విషయమై కరుణిస్తుందన్న ఆశతో ఓరుగల్లు ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో భారీ ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.1.63 లక్షల కోట్లతో చేసిన ప్రతిపాదనల్లో ఉమ్మడి వరంగల్కు చెందిన పలు అంశాలను చేర్చినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందాల్సిన వరంగల్కు ఈసారైనా ప్రాధాన్యం దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్కు సంబంధించిన పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్ ప్రకటించారు. ఈ బడ్జెట్లోనైనా ప్రాధాన్యం ఇవ్వాలి ప్రతిసారీ కేంద్ర బడ్జెట్లో వరంగల్కు అన్యాయం జరుగుతోంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాల్సి ఉంది. అలా అయితేనే పూర్తవుతుంది. కాజీపేటను రైల్వే డివిజన్గా చేయాలని కోరుతున్నా ఇప్పటికి నెరవేరడం లేదు. ఈసారి ప్రాధాన్యమివ్వాలి. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చడంలో ఆంధ్రాకు ప్రాధాన్యమిస్తున్న బీజేపీ తెలంగాణను పట్టించుకోవడం లేదు. – కడియం కావ్య, ఎంపీ, వరంగల్ మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యమివ్వాలి. డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వేలైన్ నిర్మాణానికి కేటాయింపులు చేయాల్సి ఉంది. మేం చేసిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్పై చూపుతున్న ప్రేమ తెలంగాణపై చూపకపోవడం అన్యాయం. ఈ బడ్జెట్లో మంచి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. – పోరిక బలరాం నాయక్, ఎంపీ, మహబూబాబాద్రైల్వేలైన్లు, స్టేషన్ల అభివృద్ధిపై ఆశలు.. ఏళ్లు గడుస్తున్నా కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్గా ప్రకటించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. కాజీపేటలో రైల్వే ఆక్ట్ అంప్రెంటీస్ ట్రైనింగ్ సెంటర్పైనా నాన్చివేత ధోరణి కొనసాగుతోంది. ఈ రెండింటిపై ఉద్యోగ, ప్రజా ఆందోళనలు తరచూ సాగుతున్నాయి. మణుగూరు – రామగుండం రైల్వేలైన్ సర్వే కోసం బడ్జెట్ కేటాయించిన కేంద్రంలో భూసేకరణ, నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తారన్న ఆశతో ఉన్నారు. హసన్పర్తి – కరీంనగర్, డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వేలైన్లు మంజూరు కాగా.. సర్వే, భూసేకరణ, నిర్మాణం కోసం కేటాయింపులు చేయాల్సి ఉంది. రైల్వే కోచ్ఫ్యాక్టరీని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని చెప్పినా, సరిపడా నిధులు ఇవ్వడం లేదు. ఈ బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తే ఈ ఏడాది పూర్తవుతుందన్న నమ్మకం కలిగే అవకాశం ఉంది. కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. కాజీపేట రైల్వే ఆస్పత్రిని సబ్డివిజన్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. స్టేషన్ ఘన్పూర్నుంచి సూర్యాపేట వరకు కొత్త లైన్ ప్రతిపాదన జరిగింది. సగం సర్వే అయింది. ఈ బడ్జెట్లో నిధులు ఇస్తే పూర్తి సర్వే జరిగి కొత్త లైన్కు శ్రీకారం జరుగుతుంది. ఇప్పటికై నా కాజీపేట జంక్షన్ నుంచి ముంబయి. విజయవాడ, కాగజ్నగర్ వరకు ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
పత్తి కొనుగోళ్లలో దళారులకు ‘సీసీఐ’ పెద్దపీట
కాటారం: సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దళారులతో కుమ్మకై ్క వారికి పెద్దపీట వేస్తూ రైతులను కొల్లగొడుతున్నారు. సీసీఐ నిర్వాహకుల అండదండలతో దళారులు స్థానిక పత్తి మిల్లుల్లో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. సీసీఐ అధికారుల నిర్వాహకంతో జిన్నింగ్ మిల్లులకు పత్తి విక్రయించడానికి వచ్చే రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దళారులు ఇచ్చే కమీషన్కు కక్కుర్తిపడి సీసీఐ నిర్వాహకులు రైతులు తెచ్చిన పత్తిని పక్కన పెడుతూ దళారుల పత్తిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మూడు సీసీఐ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు సుమారుగా 3,51,560 క్వింటాల పత్తిని కొనుగోలు చేశారు.రైతుల పత్తి కొనుగోలుకు సాకులు.. దళారులు విక్రయానికి తెచ్చే పత్తి ఎలా ఉన్నా అభ్యంతరం చెప్పని సీసీఐ కేంద్రాల నిర్వాహకులు సాధారణ రైతులు విక్రయించడానికి తెచ్చే పత్తికి మాత్రం అడ్డగోలు నిబంధనలు విధిస్తున్నారు. పత్తి సరిగా లేదు, తేమ శాతం ఎక్కువగా ఉంది అనే కుంటిసాకులు చెపుతూ పత్తిని కొనుగోలు చేయడానికి విముఖత చూపుతున్నారు. తిరిగి ఏదైనా దళారులతో సీసీఐ నిర్వాహకులకు చెప్పించి కమీషన్ మాట్లాడిన తర్వాతనే పత్తిని కొనుగోలు చేస్తున్నారని పలువురు రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా రైతులు పత్తి లోడ్తో తీసుకొచ్చిన వాహనాలు క్యూలో ఉన్నప్పటికీ దళారుల పత్తి వాహనాలను సీసీఐ నిర్వాహకులు దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఫేక్ పట్టా రైతుల పేరిట విక్రయాలు.. దళారులు సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చిన పత్తిని పలువురి పేరుపై ఫేక్ రైతు పట్టాలు సృష్టించి వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట కౌలుకు తీసుకున్నట్లు నమోదు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సీసీఐ ద్వారా విక్రయించిన పత్తి నగదు వారి ఖాతాలో జమ అవుతున్నట్లు సమాచారం. దీంతో చిక్కులు లేకుండా వారి వ్యాపారం సజావుగా సాగుతోంది. -
వాతావరణం
సనాతన ధర్మ పరిరక్షణకు కృషి సనాతన ధర్మం, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడానికి కృషి చేయాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్స్వామి అన్నారు.జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. రాత్రివేళ చలితో పాటు మంచు కురుస్తుంది. – 8లోuగ్రామాల్లో రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దళారులు అడ్డగోలు ధరకు పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన పత్తిని దళారులు గతంలో సమీపంలోని జిన్నింగ్ మిల్లులు, వరంగల్, ఇతర పట్టణాల్లోని కాటన్ ఇండస్ట్రీస్కు పంపించేవారు. కానీ దళారులు ప్రస్తుతం తమ పంథా మార్చుకున్నారు. స్థానిక పత్తి మిల్లుల యాజమాన్యం సహకారంతో రైతుల దగ్గర కొనుగోలు చేసిన పత్తిని నేరుగా సీపీఐ ద్వారా విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించడానికి ముందస్తుగానే దళారులు సదరు సీసీఐ కేంద్రాల నిర్వాహకులతో మామూళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. క్వింటాల్కు రూ.100 నుంచి రూ.200 వరకు సీసీఐ కేంద్రాల నిర్వాహకులు దళారుల వద్ద నుంచి కమీషన్గా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పత్తి కాంటా పూర్తికాగానే సదరు కమీషన్ నగదు మొత్తం దళారులు లెక్కచేసి సీసీఐ కేంద్రాల నిర్వాహకులకు ముట్టజెపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సీసీఐ నిర్వాహకులు దళారులు విక్రయానికి తీసుకొచ్చిన పత్తి ఏ రకంగా ఉన్నా మద్దతు ధర అందజేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.దళారులు టు సీసీఐ.. -
కోటగుళ్లను సందర్శించిన బ్రిటన్ దేశస్తుడు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను బ్రిటన్ దేశానికి చెందిన రోజ్ మెల్విన్ గురువారం సందర్శించారు. ఆయన కాకతీయుల ఆలయాలపై పరిశోధన చేస్తూ హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, ఫోర్ట్ వరంగల్, రామప్ప ఆలయాలను సందర్శిస్తూ గణపురం కోటగుళ్లను సందర్శించి వాటి చరిత్రను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఆయన వెంట పర్యాటక శాఖ అసిస్టెంట్ ప్రమోషన్ అధికారి డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్ ఉన్నారు. నాపాక ఆలయం సందర్శన చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలోని నాపాక సర్వతోభద్ర ఆలయాన్ని రోజ్మెల్విన్ సందర్శించాడు. ఆలయం విశిష్టతను వరంగల్ జిల్లా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ సూర్య కిరణ్ వివరించారు. -
టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్
విద్యారణ్యపురి: ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం పాఠశాల సమయానికి ముందు ఒకగంట, సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక మరో గంట పాటు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం 8 గంటలకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం 5.30 గంటల వరకు ఉండాల్సి వస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఈవినింగ్స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓలకు తాజాగా ఆదేశాలు జారీచేశారు. ఫిబ్రవరి ఒకటి నుంచి స్నాక్స్ స్నాక్స్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు 38 రోజులపాటు అమలు చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున వ్యయం అవుతుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరయ్యాయి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల అకౌంట్లలోకి వీటిని విడుదల చేయనున్నారు. ఆరు రకాల స్నాక్స్..! ఆరు రోజులు ఆరు రకాల స్నాక్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బెర్లు, శనగలు, పల్లీపట్టి, మిల్టెట్ బిస్కెట్స్, ఉల్లిగడ్డ పకోడి అందించాలని నిర్ణయించారు. ఈ స్నాక్స్ కూడా మధ్యాహ్నభోజన ఏజెన్సీల ద్వారానే చేయించి విద్యార్థులకు అందించాలని డీఈఓలకు ఆదేశాలు వచ్చాయి.జిల్లాల వారీగా పదో తరగతి విద్యార్థుల సంఖ్య, మంజూరైన నిధుల వివరాలు జిల్లా విద్యార్థులు నిధులు(రూ.ల్లో) భూపాలపల్లి 1,563 8,96,610 హనుమకొండ 2,834 16,15,380 వరంగల్ 3,474 19,80,180 జనగామ 3,068 17,48,760 మహబూబాబాద్ 3,727 21,81,390 ములుగు 1,076 6,13,320 మొత్తం 15,742 రూ.90,35,640ఒక్కొక్కరికి రూ.15 చొప్పున వ్యయం రేపటి నుంచి 38 రోజులపాటు.. ఉమ్మడి జిల్లాలో 15,742 మంది విద్యార్థులు రూ.90,35,640 నిధులు మంజూరు -
కాళేశ్వరం ‘ట్రస్టుబోర్డు’ ఆలస్యం
కాళేశ్వరం: రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కాళేశ్వరం ఒక్కటి. ఒక్కసారైనా ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి చేయాలని ధృఢ సంకల్పం ఇక్కడి నేతల్లో బలంగా ఉంటుంది. చైర్మన్ పదవితో రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు ఉంటుందని వారి భావన. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో మరోసారి మరింత ఆలస్యం కానుంది. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆశావహులు మరికొన్ని రోజులు నిరీక్షించాల్సి ఉంది. మార్చి 3న ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బోర్డు నియామకం జరుగుతుందని తెలిసింది. అప్పటి వరకు ఆశావహులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. రీ నోటిఫికేషన్తో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది ఆగస్టులో ట్రస్టుబోర్డు నియామకానికి దేవాదాయశాఖ నోటిఫికేషన్ వేసింది. అప్పుడు 20 రోజుల నిర్ణీత గడువులోగా 37 దరఖాస్తులు వచ్చాయి. అంతలోనే మూడు నెలల గడువు ముగిసింది. అనివార్య కారణాలతో ఆ ఉత్తర్వులు రద్దు చేశారు. తరువాత జనవరి 5న ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మళ్లీ రీ నోటిఫికేషన్ను దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆశావహుకులు 90 వరకు దరఖాస్తులు చేసుకున్నారు. 43ఏళ్ల తరువాత మళ్లీ.. కుంభాభిషేకం నిర్వహణపై అసెంబ్లీలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పలు సమావేశాల్లో మంత్రి శ్రీధర్బాబు చర్చించారు. దీంతో దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ ప్రత్యేక శ్రద్దతో కుంభాభిషేకం నిర్వహణకు పూసుకున్నారు. కాళేశ్వరాలయంలో 43ఏళ్ల తరువాత కుంభాభిషేకం వైభవంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఆశావహులకు నిరాశ ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ తేదీలకు ముందుగానే ట్రస్టుబోర్డు నియామకం జరుగుతుందని ఆశావహులు ఆశించి నిరాశ పడ్డారు. ఇప్పటికే కాళేశ్వరం దేవాదాయశాఖ అధికారులు కర్ణాటకలోని శృంగేరి పీఠాధిపతి, శృంగేరి అనుబంధ పీఠం రాజమహేంద్రవరంలోని శ్రీసచ్చిదానంద సరస్వతికి కుంభాభిషేకం పూజల నిర్వహణకు రావాలని ఆహ్వానం అందజేశారు. పూజా నిర్వహణకు అచ్చలాపురం వేదపండితులు రానున్నారు. నాలుగు గోపురాలు, మూడు ఆలయాలకు సంప్రోక్షణ చేసి, కలశాలకు అభిషేకం చేయనున్నారు. అదే నెలలో ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు ఉత్సవాలకు ట్రస్టుబోర్డు ఉంటుందని ఆశావహులు ఆనందం వ్యక్తం చేయగా ఎన్నికల కోడ్తో చుక్కెదురైందని చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఇప్పటికే ఒకసారి వాయిదా.. ఇప్పుడు రెండోసారి.. ఆశావహులకు తప్పని ఎదురుచూపుమంత్రి చుట్టూ ప్రదక్షిణ.. ఆశావహులు మంత్రి శ్రీధర్బాబు చుట్టూ ఆగస్టు నుంచి తిరుగుతున్నారు. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. మళ్లీ నోటిఫికేషన్తో ఆశలు చిగురించినా అప్పటి కన్నా 90 వరకు ధరఖాస్తులు ఎక్కువగా రావడంతో ఎవరికి చైర్మన్ పదవి వరిస్తుందని మంథని ప్రజలు ఆలోచనలో పడ్డారు. గతంలో రెండు పర్యాయాలు సిద్దిపేటకు చెందిన కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మెర వెంకటేశంకు ఇచ్చిన విషయం తెలిసిందే. -
గాంధీ విగ్రహానికి వినతి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు గురువారం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హమీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారని పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్దన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ కార్డును పాతరేసి డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రవి, కుమార్రెడ్డి, భరత్చారి, రాజు, ఐలయ్య పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్గా బిర్రు శ్రీనివాస్
భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్గా బిర్రు శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన కమిషనర్ టి.రాజేశ్వర్ వరంగల్ నగర పాలక సంస్థకు బదిలీపై వెళ్లగా, రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్ను భూపాలపల్లికి బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మున్సిపాలిటీ స్పెషలాఫీసర్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మిని ఐడీఓసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.విద్యుత్ సమస్య పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ భూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీనంబర్ను సంప్రదించాలని భూపాలపల్లి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. 1912 నంబర్లో 24/7 వినియోగదారులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా, ఆగిపోయిన మీటర్లు, నూతన సర్వీసు మంజూరు, మొదలగు అన్ని రకాల విద్యుత్ సమస్యల కోసం సంప్రదించవచ్చని చెప్పారు. జాతిపితకు ఘన నివాళి భూపాలపల్లి అర్బన్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఇన్చార్జ్ జీఎం వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, మురళీ, శైలేంద్రకుమార్, ప్రదీప్, మారుతి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. హత్య కేసులో మరొకరి అరెస్ట్ భూపాలపల్లి అర్బన్: ఈ నెల 26వ తేదీన భర్తకు పురుగుల మందు కలిపి భోజనం తినిపించి హత్య చేసిన కేసులో మరొకరిని అరెస్ట్ చేసినట్లు సీఐ నరేష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన కందుల సురేష్ను అతని భార్య స్వప్న హత్యచేసిన విషయం తెలిసిందే. భూపాలపల్లి పట్టణంలోని జవహర్నగర్కాలనీకి చెందిన కుంట్ల స్వామి మృతుడి భార్య స్వప్నకు సహకరించినట్లు తెలిపారు. వీరిద్దరు కలిసి ఒక పథకం ప్రకారం సురేష్ను హత్య చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కుంట్ల స్వామిని పట్టణంలోని బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. -
తుని పీఠాధిపతికి ఆహ్వానం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 7నుంచి 9వరకు మూడు రోజుల పాటు కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ, శ్రీ శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకు శ్రీ తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామిని గురువారం ఆహ్వానించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణ, యాదగిరిగుట్ట వేద పాఠశాల చైర్మన్, కుంభాభిషేకం మెంబర్ గోవింద హరి ఆధ్వర్యంలో కాళేశ్వరం దేవస్థానం ఈఓ ఎస్.మహేష్, ఉప ప్రధానార్చకులు పనకంటి ఫణీంద్రశర్మ, తుని మఠం వెళ్లి ఆలయ సంప్రదాయం ప్రకారం పీఠాధిపతులు వారిని దర్శించుకొని వారికి కుంభాభిషేకమునకు ఆహ్వానం అందజేసి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట ఆలయ సిబ్బంది దూది శ్రీనివాస్ ఉన్నారు. -
ఉద్యోగ విరమణ సహజం
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని, వృత్తిలో ఉన్నప్పుడు చేసిన సేవలే చిరకాలం గుర్తుండిపోతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి ఎంపీడీఓ మహమ్మద్ ఇక్బాల్ హుస్సేన్ ఉద్యోగ విరమణ వీడ్కోలు కార్యక్రమం గురువారం జెడ్పీ కార్యాయలంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర ముఖ్య అతిథిగా హాజరై ఎంపీడీఓ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శేష జీవితాన్ని సుఖమయంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, వివిధ మండలాల అధికారులు, మండల పరిధి లోని కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, కాంగ్రెస్పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పరంజాల నిర్మాణ పనులు షురూ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో నాలుగు గోపురాలు, దేవాలయాలకు పరంజా (కర్రలతో మెట్లు) నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన రవీంద్రన్ ఆధ్వర్యంలో 20 మంది సిబ్బందితో పనులు ప్రారంభించారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం గోపురాలతో పాటు కాళేశ్వరముక్తీశ్వరస్వామి ప్రధాన ఆలయం, శుభానందదేవి, సరస్వతి అమ్మవార్ల ఆలయాల గోపురాలకు పరంజాల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణం సుమారు 25 నుంచి 30 మంది సామర్థ్యంతో నిల్చుని పూజలు చేసేలాగా పనులు చేపట్టారు. నిర్మాణాలు వారంలోపు పూర్తి చేస్తామని రవీంద్రన్ పేర్కొన్నారు. కాగా పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతిచే కుంభాభిషేకం పూజలు చేపట్టనున్నారని తెలిసింది. అయితే వారి ఆహ్వానానికి దేవస్థానం అఽధికారులు (నేడు) గురువారం రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ బ్రేక్ ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించే కుంభాభిషేకం ఆహ్వాన పత్రికకు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బ్రేక్ పడింది. దీంతో ఆహ్వాన పత్రికలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు వీఐపీల పేర్లు లేకుండా అధికారులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆహ్వాన పత్రికల ముద్రణ కూడా జరిగింది. వాటిస్థానంలో వాల్పోస్టర్లలో అధికారుల పేర్లతో మరోసారి ముద్రించి పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో కుంభాభిషేకం ఆహ్వాన పత్రికకు ఎమ్మెల్సీ ఎన్నికల బ్రేక్ -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ములుగు: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాల ను తప్పనిసరిగా పాటించా లని ములుగు ఓఎస్డీ మహే శ్ గీతే, డీఎస్పీ రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ పంక్షన్ హాల్లో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ములుగు పోలీస్ శాఖ, రోడ్డు ట్రాన్స్పొర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ములుగు ఓఎస్డీ మహేశ్ గీతే మాట్లాడుతూ.. వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. వారిపై వారి కుటుంబం ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ములుగు జిల్లాలో చాలా వరకు జరిగిన రహదారి ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్లో రావడం, తాగి వాహనాలను నడపడం కారణంగానే జరిగాయన్నారు. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేసి రోడ్డు భద్రత నియమాలను పాటించని వారిపై చట్ట ప్రకారంగా కఠిన చర్యలను తీసుకుంటామని చెప్పారు. సుమారుగా 300 మంది వాహనదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఆర్టీఓ శ్రీనివాస్, ఎస్సై వెంకటేశ్వరావు, సిబ్బంది ఉన్నారు. -
నిబంధనలు పాటించకుంటే ఆస్పత్రులు సీజ్
కాటారం: ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించకుంటే శాఖ పరమైన చర్యలతో పాటు ఆస్పత్రులు సీజ్ చేస్తామని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవిరాథోడ్ హెచ్చరించారు. కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు కాటారం మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రుల నిర్వాహణ, వైద్య సేవలు, పరిశుభ్రత, మందుల స్టాక్ వివరాలు, ఆస్పత్రి నిర్వాహణ, లైసెన్స్లు, డాక్టర్ గుర్తింపు పత్రాలు, మౌలిక వసతులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య పరీక్షల ఫీజుల వసూలుపై ఆరా తీశారు. భార్గవి, శ్రీలక్ష్మి, ధర్మశాస్త్ర ఆస్పత్రులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్, బయో మెడికల్ వేస్టేజ్, ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్ సర్టిఫికెట్లు ఉండాలన్నారు. రోగులకు అవసరం లేని వైద్యపరీక్షలు చేసి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయవద్దన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంట హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, ఎంపీహెచ్ఈఓ మురళీధర్, హెల్త్ అసిస్టెంట్స్ సుధీర్, కాపర్తి రాజు, సమ్మయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రంథాలయ భవనం పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసిన అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రంఽథాలయం పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. గ్రంథాలయ భవనానికి అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం సింగరేణి అధికారులతో చర్చించి త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత ప్రాంగణంలో ఉన్న సెల్ టవర్ పక్క నుంచి ప్రధాన గేటు ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంఽథాలయ కార్యదర్శి శ్రీలత, తహసీల్దార్ శ్రీనివాసులు, ఏఈ మహేందర్, ఆర్ఐ రామస్వామి, సిబ్బంది చంద్రమౌళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదవాలి.. గణపురం: ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతు లను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం గణపురం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో ని వంటగది, వంట సామగ్రి ఉందా లేదా అని ఎస్ ఓ లావణ్యను అడిగి తెలుసుకున్నారు. అయితే వస తి గృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదులు పాతపడటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, లో ఓల్టేజీ సమస్య, మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఎస్ఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధి కారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేజీబీవీలను డీఈఓలు నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం కుందూర్పల్లి ఎంపీపీఎస్ను తనిఖీ చేశారు. డీఈఓ రాజేందర్, తహసీల్ధార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
పీహెచ్సీని సందర్శించిన కేంద్ర బృందం
మొగుళ్లపల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రంగాపూర్ ఉప కేంద్రాన్ని బుధవారం కేంద్ర బృందం సభ్యులు శ్రావణకుమార్, రాజ్కుమార్ (పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ బృందం) సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందే సేవల గురించి వైద్యాధికారిని డాక్టర్ నాగరాణి, రంగాపూర్ ఎంఎల్హెచ్పీ డాక్టర్ వాణిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ వైద్యులు డాక్టర్ రాజ్కుమార్, శ్రావణకుమార్, జిల్లా వైద్యులు చిరంజీవి, మధుబాబు డాక్టర్ నాగరాణి, వాణి, డాక్టర్ సంధ్య, సూపర్వైజర్ సునీ త, జమున, ఆశలు, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి టేకుమట్ల: రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉపాధ్యాయ రంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఎంఎల్సీ అభ్యర్థి పూల రవీందర్ గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ డీఏలను విడుదల చేసి 317 జీఓ ద్వారా ఇతర జిల్లాలకు వెళ్లిన వారిని సొంత జిల్లాకు బదిలీ చేయాలన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్, ఎస్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కుర్రె ప్రవీన్కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రమేష్, అంకూస్, గణేష్, జలీల్, వింధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్గా సతీష్ కాటారం:తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విద్యా విభాగం జిల్లా కన్వీనర్గా మండల కేంద్రానికి చెందిన స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కొట్టె సతీష్ నియమితులయ్యారు. ఫోరం రాష్ట్ర కమిటీ చైర్మన్ చీమ శ్రీనివాస్ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సతీష్ చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవకాశం ఇచ్చినట్లు చైర్మన్ పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం పుష్యమాసం మౌని అమావాస్యను పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రభాతసేవ, గణపతిపూజ, రుద్రేశ్వరస్వామి వారికి ఆఘోర పాశుపత రుద్రాభిషేకం జరిపారు. సాయంత్రం జరిగిన ప్రదోషకాల పూజల్లో నగర సీపీ అంబర్ కిశోర్ ఝా కుటుంబ సమేతంగా దేవాలయాన్ని సందర్శిచారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నేటినుంచి శైశిర నవరాత్రులు హన్మకొండ కల్చరల్ : నగరంలోని భద్రకాళి దేవాలయంలో గురువారంనుంచి మాఘమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని మాఘ, శైశిర (గుప్త) నవరాత్రులు ప్రారంభమవుతాయని ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు బుధవారం ఒక ప్రకటలో తెలిపారు. తొమ్మిదిరోజుల పాటు జరిగే నవరాత్రుల్లో అమ్మవారికి భువనేశ్వరీ క్రమంలో ఆరాధన, షోడశీ చండీఆవరాణార్చనలు, అభిషేకాలు, హోమాలు జరుగుతాయని పేర్కొన్నారు. -
విజిలెన్స్ కేసులను పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కారుణ్య నియామకాల విజిలెన్స్ కేసులను పరిష్కరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో మారు పేర్లతో పని చేస్తున్న కార్మికుల పేర్లు సరి చేస్తామని గత ప్రభుత్వం, ప్ర స్తుత ప్రభుత్వాలు, గుర్తింపు కార్మికులు ఎన్నికల సమస్యలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఎని మిది సంవత్సరాలుగా కార్మికులు, వారి పిల్లలు ఇ బ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటి వ రకు సింగరేణి వ్యాప్తంగా వెయ్యి మంది కార్మికుల మారు పేర్ల కేసులు విజిలెన్స్ విచారణలో ఉన్నట్లు ఆరోపించారు. ఇప్పటికై న రాష్ట్ర ప్రభుత్వ, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు స్పందించి కార్మికులకు న్యా యం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నా యకులు జనార్దన్, ప్రసాద్రెడ్డి, శ్రీనివాస్, బాబు, శ్రీధర్, జయశంకర్, నరసింహారెడ్డిలు పాల్గొన్నారు.