
డ్రోన్ల వినియోగంతో మెరుగైన సేవలు
భూపాలపల్లి: మారుమూల ప్రాంతాల్లోని ప్రజల వివిధ అవసరాలకు డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఈసీఐఎల్ కంపెనీ సీఎస్ఆర్ నిధులు నుంచి 20 ఎలక్టాన్రిక్ స్కూటీలు, 12 డ్రోన్లను కలెక్టర్ రాహుల్ శర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ సూపర్ వైజర్లు మారుమూల గ్రామాల్లో సేవలు అందించడానికి, వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం, వైద్య సేవలు సిటీ స్కాన్, ఇతర పరికరాలు ఈసీఐఎల్ సీఎస్ఆర్ నిధులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. మారుమూలు ప్రాంతాలకు అంగన్వాడీ సూపర్ వైజర్లు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేవని గ్రామాలకు ఎలక్టాన్రిక్ స్కూటీలు సులువుగా వెళ్లడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ రోజుల్లో వ్యవసాయ పనులకు కూలీలు కొరత ఉందని, ఈ ఆధునిక సాంకేతికత డ్రోన్ల విని యోగం రైతులకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రసాయన మందుల పిచికారీ సమయంలో ప్రజలు ప్రాణాలకు అపాయం ఏర్పడుతుందని, డ్రోన్ల వినియోగం ద్వారా ప్రాణాలకు ఎలాంటి అపాయం ఏర్పడదని తెలిపారు. సమయం కూడా ఆదా అవుతుందని అన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి లో మెరుగైన వైద్య సేవలకు సిటీ స్కాన్ ఇతర పరికరాలు ఇవ్వనున్నారని తెలిపారు. రానున్న నెల రోజుల్లో వైద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ.. ఎలక్టాన్రిక్ స్కూటీలు, డ్రోన్లు, వైద్య పరికరాలు మొత్తం రూ.4 కోట్ల సీఎస్ఆర్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సీపీఓ బాబు రావు, సంక్షేమ అధికారి మల్లీశ్వరీ, వ్యవసాయ అధికారి వీరునాయక్, ఆస్పత్రి పర్యవేక్షకులు నవీన్ కుమార్, ఈసీఐఎల్ హెచ్ఆర్ ఈడీ మురళీధర్, సీఎంఓ వేణుబాబు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ