వచనాలయ అభివృద్ధికి సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

వచనాలయ అభివృద్ధికి సహకరించాలి

Apr 12 2025 2:18 AM | Updated on Apr 12 2025 2:18 AM

వచనాలయ అభివృద్ధికి సహకరించాలి

వచనాలయ అభివృద్ధికి సహకరించాలి

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని బాపూజీ వచనాలయం అభివృద్ధికి సహకరించాలని వచనాలయం కమిటీ ప్రతినిధులు కోరారు. బాపూజీ వచనాలయం కమిటీలో నూతనంగా సలహాదారులు, కోఆప్షన్‌ సభ్యుల నియామకం చేపట్టగా శుక్రవారం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్షుడు భక్తవత్సలం మాట్లాడుతూ.. బాపూజీ వచనాలయాన్ని డిజిటల్‌ మాధ్యమంలోకి తీసుకెళ్లే ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఇకపై పుస్తకాలతో పాటు డిజిటల్‌ చదువుకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందన్నారు. ఇందుకోసం సభ్యులు, సలహాదారులు, కోప్షన్‌ సభ్యులు ఆలోచనలు, సూచనలు అందించాలని కోరారు. అనంతరం నూతన సలహాదారులు తాహెర్‌ బిన్‌ హందన్‌, గడుగు గంగాధర్‌, కేశవేణు, శేఖర్‌ గౌడ్‌, దినేష్‌ రెడ్డి, ప్రకాష్‌ రెడ్డి, ధర్మపురి సురేందర్‌, కోప్షన్‌ సభ్యులుగా బంటు రాజేశ్వర్‌, మాస్టర్‌ శంకర్‌, శ్రీహరి ఆచార్య, మెగా సుబేధర్‌, సాయిబాబా గౌడ్‌ను సన్మానించారు. ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్‌, కోశాధికారి గంగాధర్‌రావు, ఉపాధ్యక్షుడు దాస్‌, సంయుక్త కార్యదర్శి సాంబయ్య, దత్తాత్రి, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement