రఘునాథపాలెం: దాహార్తి అలమటిస్తున్న మూగజీవాలు పురుగుల మందు కలిపిన నీళ్లు తాగగా మృత్యువాత పడ్డాయి. బాధితులు, గ్రామస్తులు కథనం ప్రకా రం.. మండలంలోని కోయచలకకు చెందిన బొరిగర్ల లింగయ్య, బాబుకు చెందిన గొర్రెల మందను రోజులాగే మేతకు తీసుకెళ్లారు. ఒక రైతు మిర్చి తోటలో పిచికారీకి నీళ్లలో పురుగుల మందు కలిసి సిద్ధం చేయగా.. గొర్రెలు ఆ నీళ్లు తాగాయి. దీంతో గొర్రెలు వరుసగా కింద పడిపోతుండడంతో కాపరులు వెంటనే పశు వైద్యుడికి సమాచారం ఇస్తుండగానే 20గొర్రెలు, రెండు పోతులు ప్రాణం విడిచాయి. మిగిలిన వాటికి వైద్యం అందిస్తుండగా ఎన్ని కోలుకుంటాయో తెలియడం లేదు. సుమారు రూ.3.25లక్షలకు పైగా విలువైన గొర్రెలు చనిపోయినందున తమను ప్రభుత్వం ఆదుకోవాలని యజమానులు కోరారు. కాగా, బాధితులను మాజీ సర్పంచ్లు మాధంశెట్టి హరిప్రసాద్, రాంప్రసాద్, చెరుకూరి పూర్ణ, చెరుకూరి భిక్షమయ్య, నున్నా వెంకటేశ్వర్లు, తోట వెంకట్ తదితరులు పరామర్శించారు.


