ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని పలు విభాగాల్లో ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదు. ఇందులో చాలావరకు పాతవి కావడంతో మొరాయిస్తుండగా, ఎన్నిసార్లు మరమ్మతు చేయించినా అదే పరిస్థితి పునరావృతమవుతోంది. జనరల్ ఆస్పత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కలిపి 120 వరకు ఏసీలు ఉండగా అందులో సుమారు 100 మేర పనిచేయడం లేదు. ప్రస్తుతం మధ్యాహ్న సమయంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో చికిత్స కోసం వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు, చిన్నారుల వార్డుల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. చివరకు మిల్క్ బ్యాంక్లోనూ అన్ని ఏసీలు పనిచేయని కారణంగా సేవలో ప్రభావం పడుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఆస్పత్రికి కొత్త ఏసీలు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.
పలు విభాగాల్లో ఇదే పరిస్థితి
పెద్దాస్పత్రిలో పనిచేయని ఏసీలు