
●ఉద్యోగం చేస్తూనే..
ఖమ్మంక్రైం: ఖమ్మం ఏఎంవీఐగా పనిచేస్తున్న వెల్ది గోపీకృష్ణ గ్రూప్–1 ఫలితాల్లో సత్తాచాటాడు. జనరల్ కేటగిరిలో స్టేట్లో 70 ర్యాంక్, జోనల్లో 38 ర్యాంక్ సాధించారు. ఇటీవల రవాణాశాఖలో ఏఎంవీఐగా చేరిన గోపీకృష్ణ హనుమకొండ జిల్లాకు చెందినవారు. ఆయన గ్రూప్–1 పరీక్ష రాసే సమయంలో తండ్రి నాగేశ్వరరావు హఠాన్మరణం పొందారు. అయినా కష్టపడి చదివి గ్రూప్–1 ఫలితాల్లో ర్యాంక్ సాధించాడు. గోపీకృష్ణ ఇప్పటివరకు 10 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆయన్ను జిల్లా ఇన్చార్జ్ రవాణాశాఖాధికారి వెంకటరమణ, ఎంవీఐ వరప్రసాద్, ఏఎంవీఐ స్వర్ణలత, ఇతర సిబ్బంది అభినందించారు.