‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం

Apr 26 2025 12:36 AM | Updated on Apr 26 2025 12:36 AM

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం

ఖమ్మం సహకారనగర్‌ : విద్యారంగంలో స్ఫూర్తి ఫౌండేషన్‌ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. కామేపల్లికి చెందిన పేద విద్యార్థి తేజవత్‌ శ్రీనివాస్‌కు ఫౌండేషన్‌ అందించిన రూ. 50వేల చెక్కును శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..కాన్పూర్‌ ఐఐటీలో శ్రీనివాస్‌ అడ్మిషన్‌ పొందగా, ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఆ కోర్సు చదివే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు ఇటీవల కలెక్టరేట్‌లో ప్రజావాణిలో అధికారులకు విన్నవించారని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ ఆ విద్యార్థికి ఆర్థిక సాయం బాధ్యతను విద్యాశాఖ సీఎంఓ రాజశేఖర్‌కు అప్పగించారని తెలిపారు. దీంతో ఆయన సూచన మేరకు స్ఫూర్తి ఫౌండేషన్‌ వారు ఐఐటీ చదువుకు అయ్యే ఖర్చంతా భరిస్తామని ముందుకొచ్చారని, ఈ మేరకు సంస్థ అధికార ప్రతినిధి వరక రామారావు తొలివిడతగా రూ. 50 వేల చెక్కు ఇచ్చారని వివరించారు. కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్‌ వలంటీర్లు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, బైర్ల వెంకటేశ్వర్లు, శిరసాని ఇమ్మానుయేల్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌

ముజమ్మిల్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement