ఒకేసారి ఎన్నికలతో దేశాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి ఎన్నికలతో దేశాభివృద్ధి

Mar 25 2025 12:09 AM | Updated on Mar 25 2025 12:10 AM

ఆసిఫాబాద్‌: అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుందని ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ జిల్లా క న్వీనర్‌ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత సంఘ భవనంలో సోమవారం ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల పాలనాపరంగా అనుకూలంగా ఉంటుందని, ఓటింగ్‌శాతం కూడా పెరుగుతుందన్నారు. దర్శక నిర్మాత దండనాయకుల సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ మేధావులు, విశ్రాంత ఉద్యోగులు దేశభవిష్యత్‌ దృష్ట్యా ఈ విషయాన్ని సమాజంలో ప్రతిఒక్కరికి తెలిసేలా చూ డాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరుణాగౌడ్‌, యూనిట్‌ అధ్యక్షుడు కే.రమేశ్‌, విశ్రాంత ఉద్యోగులు గుర్రాల వెంకటేశ్వర్లు, లింగయ్య, రామారావు, వెంకన్న, బాలశ్రీరాములు, సుగుణాకర్‌, కనకమ్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement