రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతి

Published Wed, Feb 19 2025 1:27 AM | Last Updated on Wed, Feb 19 2025 1:26 AM

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతి

మొవ్వ: కూచిపూడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మొవ్వ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 65 ఏళ్లకు పైబడిన గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధు రాలి తలకు తీవ్ర గాయమైంది. ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందింది. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగి ఉంటుందని కూచిపూడి ఎస్‌ఐ ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. వృద్ధురాలి వివరాలు తెలవాల్సి ఉందన్నారు. కొన్ని రోజులుగా మొవ్వ, కొడాలి మధ్య ఈ వృద్ధురాలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు కూచిపూడి పోలీసులకు సమా చారం అందించాల్సిందిగా కోరారు. ఈ ప్రమా దంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement