ప్రధాన వార్తలు

దమ్ మారో దమ్.. కోరలు చాపిన గంజాయి మాఫియా
రాష్ట్రంలో ఊరూరా.. వీధి వీధినా.. బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి మద్యం ఏరులు పారిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం, అది చాలదు.. అంతకు మించి మత్తులో జోగండంటూ యువతకు గంజాయిని చేరువ చేస్తోంది. గంజాయి క్రయ విక్రయాలు ఊరూరా నిర్విఘ్నంగా సాగేలా తన మాఫియా ముఠాకు అనధికార లైసెన్స్ ఇచ్చేసింది. ఫలితంగా ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ యువతను ఈ మహమ్మారి తన విష కౌగిలిలో బంధిస్తోంది. రాష్ట్రంలో ఏడాదిగా గంజాయి పట్టుబడని రోజే లేదు. సర్కారు నిర్లక్ష్య, స్వార్థపూరిత వైఖరి వల్ల ఎంతో మంది పిల్లలు పిచ్చోళ్లుగా మారిపోతున్న దయనీయ పరిస్థితి నిత్యం కళ్లకు కడుతోంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూ స్థాపితం చేసిన గంజాయి భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పైకి తీసింది. సీసా మూత తీసి రాష్ట్రంపైకి విడిచి పెట్టింది. దానిని ఒడిసి పట్టుకున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠా దాంతో రాష్ట్రాన్ని కకావికలం చేస్తోంది. ఫలితంగా గంజాయి మత్తు మార్కెట్ గుప్పుమంటూ నగరాల నుంచి పల్లెల వరకు కోరలు చాపింది. దమ్ మారో దమ్.. గంజాయి దమ్ము బిగించి కొట్టండంటూ యువతను ఊగించడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్కు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. యావత్ దక్షిణాదిలో గంజాయి స్మగ్లింగ్కు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారింది. వెరసి ఆ ముఠా, రాష్ట్రాన్ని రీటైల్ మార్కెట్గా.. యావత్ దక్షిణాదిని హోల్సేల్ మార్కెట్గా చేసుకుని యథేచ్చగా దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేతలు కీలక సూత్రధారులుగా, ఏఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు పాత్రధారులుగా వ్యవస్థీకృతమైన ఈ గంజాయి మాఫియాకు రాష్ట్ర స్థాయి టీడీపీ అగ్రనేతలు, పెద్దలు రింగ్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రెడ్బుక్ కుట్రల చట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఇరికించి, గంజాయి మాఫియాకు అడ్డు లేకుండా చేసింది. తొలి ఏడాదిలోనే రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడం టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ స్థాయిని వెల్లడిస్తోంది. రానున్న నాలుగేళ్లలో మరింత భారీ దోపిడీకి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా టీడీపీ గంజాయి మాఫియా తన నెట్వర్క్ను పక్కాగా విస్తరించిన వైనం విస్తుగొలుపుతోంది.తొలి ఏడాదే రూ.25 వేల కోట్ల దందా చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దెబ్బకు తోకముడిచి రాష్ట్రం విడిచి పెట్టిన మాఫియా.. గత ఏడాది అల్లూరు సీతారామరాజు(ఏఎస్ఆర్) జిల్లాలో దర్జాగా అడుగు పెట్టింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) ప్రధాన కేంద్రంగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్ దందాకు తెరతీసింది. ప్రధానంగా ఒడిశా, చత్తీస్ఘడ్ల నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఊరూ వాడా రిటైల్ విక్రయాలతోపాటు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు హోల్సేల్గా భారీగా స్మగ్లింగ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ డీఆర్ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2024–25లో ఏవోబీ నుంచి రూ.8 వేల కోట్ల విలువైన గంజాయిని కొనుగోలు చేసి అక్రమ రవాణా చేశారు. ఆ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.25 వేల కోట్ల పైమాటే. అంటే కేవలం ఏడాదిలోనే టీడీపీ మాఫియా ఏకంగా రూ.17 వేల కోట్లు అడ్డగోలుగా ఆర్జించిందన్నది స్పష్టమవుతోంది. నెలకు సగటున రూ.2 వేల కోట్లకు పైగా గంజాయి స్మగ్లింగ్ దందాకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర స్థానంగా మారిందన్నది నిగ్గు తేలుతోంది. ఏవోబీలో తలుపులు బార్లా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోసారి గంజాయి స్మగ్లింగ్కు గేట్వేగా మార్చేసింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి స్మగ్లింగ్ దందాను సాగించిన టీడీపీ నేతలే మరోసారి రంగంలోకి దిగారు. ఏవోబీలోని మన రాష్ట్ర పరిధిలో దశాబ్దాలుగా సాగిన గంజాయి సాగును వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేసింది. ఆపరేషన్ పరివర్తన్ పేరిట రెండు దశల్లో ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా నిర్వహించింది. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 12 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 11,800 ఎకరాల్లో గంజాయి సాగును కూకటి వేళ్లతో సహా పెకలించి వేసింది. రూ.150 కోట్లతో గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. 2024 నాటికి రాష్ట్రంలో గంజాయి సాగు 99 శాతం తగ్గిపోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కాగా గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ గంజాయి మాఫియా మరోసారి ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో వాలిపోయింది. ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగు దాదాపుగా నిలిచిపోవడంతో టీడీపీ మాఫియా కొత్త ఎత్తుగడ వేసింది. సరిహద్దుకు అవతల ఒడిశా, చత్తీస్ఘడ్లో భారీగా సాగు చేస్తున్న గంజాయిని కొనుగోలు చేసి.. ఏపీ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు భారీ స్మగ్లింగ్కు ఎత్తుగడ వేసింది. అంటే మరో మాటలో చెప్పాలంటే గంజాయి అక్రమ రవాణాకు రాష్ట్రాన్ని గేట్వేగా మార్చేసింది.జవసత్వాలు లేని ఈగల్⇒ గంజాయి, డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెబ్ను ప్రత్యేకంగా నెలకొల్పింది. సెబ్కు పూర్తి స్థాయి చీఫ్గా నిబద్దుడైన వినీత్ బ్రిజ్లాల్ను నియమించి పూర్తి మౌలిక వసతులు కల్పించింది. అందుకే రెండు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ అంతగా విజయవంతమైంది. ఇంతటి ఫలితాలిచ్చిన సెబ్ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది.⇒ దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) పేరుతో ఓ విభాగాన్ని నెలకొల్పింది. కానీ ఈగల్ విభాగానికి తగిన మౌలిక వసతులు కల్పించనే లేదు. ఈగల్ చీఫ్గా ఆకే రవి కృష్ణను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆయన చేతులు మాత్రం కట్టేసిందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఆయన్ను రెడ్బుక్ కుట్రలకు పావుగా వాడుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం గమనార్హం. ⇒ ఈగల్ చీఫ్గా ఉన్న ఆయన్ను కాకికాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అంటూ నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం సిట్ ఇన్చార్జ్గా నియమించింది. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట తిరుపతికి చెందిన మదన్ అనే కానిస్టేబుల్పై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానిస్టేబుల్ మదన్ ఫిర్యాదుపై విచారణ అధికారిగా కూడా ఆకే రవి కృష్ణనే ప్రభుత్వం నియమించడం గమనార్హం. ⇒ అంటే ఆయనపై ఇతరత్రా పని భారాన్ని పెంచడం ద్వారా గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై దృష్టి సారించకుండా అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఇప్పటికే గుర్తించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని సమాచారం.డీ అడిక్షన్ కేంద్రాలకు గ్రహణంగంజాయి వ్యసనం బారిన పడిన యువతను తిరిగి సన్మార్గంలో పెట్టేందుకు నెలకొల్పిన డీ అడిక్షన్ కేంద్రాల గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డీ అడిక్షన్ కేంద్రాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటయించగా, టీడీపీ ప్రభుత్వం మాత్రం అరకొరగానే నిధులు విదిల్చడమే అందుకు నిదర్శనం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డీ అడిక్షన్ కేంద్రాలకు 2021–22లో రూ.3.12 కోట్లు, 2022–23లో రూ.3.99 కోట్లు, 2023–24లో రూ.6.33 కోట్లు చొప్పున వెచ్చించింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో కేవలం రూ.1.10 కోట్లే కేటాయించడం గమనార్హం. అంటే యువత గంజాయి మత్తులో జోగితేనే తమ మాఫియా అడ్డగోలు దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఉద్దేశం అని స్పష్టమవుతోంది.మూడు రూట్లు.. ఆరు లారీలు...టీడీపీ మాఫియా తమ ఏజెంట్లను అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలోకి పంపించింది. ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిని ఎంపిక చేసుకుని మరీ ఏజెన్సీ ప్రాంతంలో తిష్టవేసేట్టు చేసింది. వారికి ఏజెన్సీలో అద్దె ఇళ్లు, ఇతర సౌకర్యాలను టీడీపీ నేతలే సమకూర్చారు. ఆ ఏజంట్లు ఏఎస్ఆర్ జిల్లాతోపాటు సరిహద్దులకు అవతల ఒడిశా, చత్తీస్ఘడ్లోని గంజాయి సాగు చేసేవారితో సంప్రదింపులు జరుపుతూ భారీగా గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని యావత్ దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు దర్జాగా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ, కర్ణాటకలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత మాఫియా బాగోతం బట్టబయలైంది. ఈ విషయంపై తెలంగాణ, కర్ణాటక పోలీసులు ఇప్పటికే ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం టీడీపీ మాఫియా ఏఎస్ఆర్ జిల్లా నుంచి దక్షిణ భారతదేశానికి భారీగా అక్రమ రవాణా చేస్తున్న మూడు ప్రధాన మార్గాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా సంస్థలే లక్ష్యంగా పచ్చ నెట్వర్క్అంతర్రాష్ట్ర స్థాయిలో అక్రమ రవాణానే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా గంజాయి మార్కెట్ విస్తరణపై టీడీపీ మాఫియా రంగంలోకి దిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రధాన అనుచరులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని టీడీపీ ద్వీతీయ శ్రేణి నేతలతో ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలనే గంజాయి విక్రయ మార్కెట్గా చేసుకున్నారు. అందుకోసం విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర జిల్లా కేంద్రాల్లో స్టాక్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రత్యేకంగా వెండర్లను సైతం ఎంపిక చేసుకున్నారు. పాన్ షాపులు, చిన్న చిన్న హోటళ్లు, సంచార వర్తకులు.. ఇలా పలువురిని తమ నెట్వర్క్లో భాగస్వాములుగా చేసుకుని చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట గంజాయి విక్రేతలను స్థానిక పోలీసులు గుర్తించి అరెస్టు చేస్తుండటం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి వరకు ప్రతి చోటా గంజాయి ప్యాకెట్లను చాకెట్ల మాదిరిగా విక్రయిస్తుండటం విస్మయ పరుస్తోంది.టీడీపీ మాఫియాను కాపాడేందుకు అమాయకులపై అక్రమ కేసులురాష్ట్రంలో టీడీపీ గంజాయి మాఫియాను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేసేందుకు బరితెగిస్తోంది. ఈ కుట్రలో పోలీసులు భాగస్వాములు కావడం విస్మయ పరుస్తోంది. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం లేని ఆరుగురు యువకులను అక్రమ కేసులో ఇరికించడం ద్వారా టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసుల పన్నాగం బట్టబయలైంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీఐ, బొమ్మూరు ఎస్సై మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తద్వారా టీడీపీ గంజాయి బ్యాచ్ను కాపాడేందుకే పోలీసులు ఇంతగా బరితెగిస్తున్నారన్నది స్పష్టమైంది.టీడీపీ గంజాయి మాఫియాలో చిన్న మొక్కలివి..⇒ రాయదుర్గంలో ఓ టీడీపీ నేత తన మామిడి తోటలోనే దర్జాగా గంజాయి సాగు చేశారు.⇒ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల సాగైన గంజాయి వ్యవహారం బట్టబయలైంది. ఇదే నియోజకవర్గంలో ఇరు వర్గాల యువకులు గంజాయి మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు.⇒ మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో మిత్ అనే పేరుతో చలామణి అయ్యే రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.⇒ మొక్కల లోడ్ ముసుగులో ఏకంగా 326 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా తూర్పు గోదావరి జిల్లా కడియంలో పోలీసులు జప్తు చేశారు. ⇒ సూళ్లూరుపేటలో రూ.3.50 లక్షల విలువైన 20 కిలోల గంజాయిని పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు.

ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడో?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఏపీ ఈసెట్ ఫలితాలొచ్చి 45 రోజులవుతున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రారంభించలేదని.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ అంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు చురకలంటిస్తూ ఆదివారం ‘ఎక్స్’లోని తన ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ.ఈసెట్ ఫలితాలొచ్చి దాదాపు 45 రోజులవుతున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు.. రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. మే 15న ఈ ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’’.

వాస్తవిక రాజకీయం
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా విరామం లభించింది. ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులు వేసింది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై చర్చ చాలాకాలం పాటు కొనసాగుతుంది. బహుశా కోర్టు మెట్లూ ఎక్కవచ్చు. సుమారు 15 కిలోటన్నుల బరువున్న బంకర్ బస్టర్ బాంబులు అణుస్థావరాలను ధ్వంసం చేసే అవకా శాలు తక్కువే. అంటే ఇరాన్ అణు కార్యక్రమం స్తంబించిపోలేదు. పోనీ అమెరికా బాంబులతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొందా? ఇరాన్ లో ప్రభుత్వం మారిందా? ఊహూ! కాదనే చెప్పాలి. బాంబు దాడులకు బదులుగా ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది. అది కూడా అమెరికాకు ముందుగానే చెప్పి! ఇందుకు ట్రంప్ స్వయంగా ఇరాన్కు ధన్యవాదాలూ చెప్పారు. ఏదైతేనేమి... ప్రస్తుతానికైతే శాంతి నెలకొన్నట్టు గానే కనిపిస్తోంది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 20 శాతం కంటే ఎక్కువ రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పార్లమెంట్ బంద్ చేయాలని తీర్మానించినా ప్రస్తుతానికి ఆ నిర్ణయం అమల్లోకైతే రాలేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధమంటే సహజంగానే చమురు ధరల్లో పెరుగుదల ఉంటుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరగడం, పెట్టుబడిదారులు సంశయంలో పడిపోవడం, వాణిజ్యంపై దుష్ప్రభావం సహజంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచ చమురు షేక్ అమెరికా! ఐదో వంతు ముడిచమురు అక్కడే ఉత్పత్తి అవుతోంది. సొంత అవసరాలు పోను ఎగుమతి చేస్తోంది కూడా! ఈ కారణంగానే ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తరువాత కూడా చమురు ధర మునుపటిలా బ్యారెల్కు 100 – 150 డాలర్ల స్థాయికి చేరలేదు. రెండూ కావాల్సిన దేశాలే!వీటన్నింటి ప్రభావం భారత్పై ఎలా ఉండ బోతోంది? భారత్ ఇప్పుడు జాగరూకతతో, ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇరు దేశాలతో సత్సంబంధాలున్న దేశంగా మరింత బ్యాలెన్ ్సడ్గా ఉండాలి. రక్షణ, నిఘా ఉత్పత్తుల విషయంలో ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. హైఫా నౌకాశ్రయంలో భారతీయుల పెట్టు బడులున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇజ్రా యెల్తో మన వ్యాపారం గణనీయంగా పెరిగి 500 కోట్ల డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఇరాన్ మనకు చమురు సరఫరా చేస్తూండటం గమనార్హం. మన రూపాయిల్లోనే ముడిచమురు కొనుగోలుకు అవకాశం కల్పించిన దేశం కూడా ఇరానే! మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చాబహార్ నౌకాశ్రయాన్ని ఇండియా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మన దిగుమతుల్లో 32 శాతం చమురు, 52 శాతం ఎల్ఎన్ జీ హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఇందులో తేడా వస్తే దాని ప్రభావం మన వంటింటి గ్యాస్ సిలిండ ర్లపై పడుతుంది. ఎరువుల ఉత్పత్తిలోనూ తేడా లొస్తాయి. రష్యా నుంచి చమురు తెచ్చుకోవడం సులువు కాదు. ఇలా చేయడం అమెరికాకు ఆగ్రహం తెప్పించేదే. చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని మాత్రమే కాకుండా, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై, ద్రవ్య లోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువను 87 కంటే దిగువకు చేర్చవచ్చు. ముడి చమురు బ్యారెల్ ధర పది డాలర్లు పెరిగితే భారత స్థూల జాతీయోత్పత్తి 0.3 శాతం వరకూ తగ్గవచ్చుననీ, ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరుగుతుందనీ ఒక అంచనా. స్టాక్ మార్కెట్లు కూడా పెరిగే చమురు ధరలకు స్పందించి పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. నైతిక ప్రశ్నలూ ఉన్నాయి...రాజకీయాల్లో నైతికత లేని రోజులివి. అయితే, ఏమాత్రం రెచ్చగొట్టే చర్యలకు దిగకున్నా ఒక సార్వభౌమ దేశంపై జరిగిన దాడిని ఖండించరాదా అన్న ప్రశ్న వస్తోందిక్కడ. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని ‘షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ’ తన ప్రకటనలో ఖండించింది. ఇండియా ఆ ప్రకటనపై సంతకం చేయకుండా దూరం జరిగింది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం: గాజా ప్రాంతంలో వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ జరగాలన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంపై జరిగిన ఓటింగ్లోనూ భారత్ పాల్గొనకపోవడం. ఈ తీర్మానానికి అమెరికా భాగస్వాములైన ఆస్ట్రేలియా, జపాన్ , యూకేలతోపాటు 149 దేశాలు మద్దతిచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ ఉద్దేశం ఏమిటి అంటే... ఇజ్రాయెల్, అమెరికాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వాస్తవిక రాజకీయం అనాలి. అయితే ఇది గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించాలన్న భారత్ కాంక్షను తక్కువ చేసేది కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవిక రాజకీయం చేయడం మన సైద్ధాంతిక మార్గాన్ని తప్పినట్లు అవుతుంది. మన ట్రాక్ రికార్డులో మచ్చగా మిగులుతుంది. ఏ కూటమితోనూ జతకట్ట కూడదన్న అలీనోద్యమ స్ఫూర్తిని దెబ్బతీసినట్లవుతుంది.ప్రస్తుతం భారతదేశం చాలా సంతులనంతో వ్యవహరిస్తోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మన విధానాన్ని స్పష్టం చేసేందుకు ఇదో మంచి అవకాశం కూడా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను నడిపించే మూలభూత విలువలను నిర్వచించుకోవాల్సిన తరుణమిది. వ్యూహాత్మక స్వావ లంబన, దేశీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటివి అంతర్జాతీయ స్థాయిలో అసందిగ్ధతకు, పిరికితనానికి కారణం కారాదు. రష్యా–ఉక్రెయిన్ , ఇజ్రాయెల్– పాలస్తీనా– ఇరాన్ ఘర్షణలు భారత ఆర్థిక, దౌత్య, రాజకీయ నైపుణ్యానికి సవాలు విసురుతున్న మాట వాస్తవం. అజిత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త

కాంగ్రెస్కు ఏటీఎం: అమిత్షా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. రేవంత్రెడ్డి సర్కార్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సింగరేణి నియామకాల వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని భారీగా లూటీ చేసి, ఏటీఎంలా మార్చి దోచేసుకుందని ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి అమిత్షా ప్రారంభించారు. పసుపు రైతులతో మాట్లాడారు. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించారు. రైతు మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.అధికారం మారినా అవినీతి మారలేదు‘రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ అవినీతి మారలేదు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్ సిందూర్కు ఆధారాలు చూపించాలంటూ రాహుల్బాబా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పాకిస్తాన్కు భారత్ తడాఖా ఏంటో చూపించింది. పదేళ్లలో మూడుసార్లు ఆ దేశంపై దాడి చేసింది. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. యూరి, పుల్వామా, పహల్గామ్ దాడులకు ధీటైన బదులు ఇచ్చాం. ఆపరేష¯న్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి దాడి చేశాం. అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టింది. కానీ గతంలో కాంగ్రెస్ సర్కార్.. పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది..’ అని అమిత్షా విమర్శించారు. 2026 మార్చిలోగా నక్సల్స్ ఏరివేత‘దేశ భద్రతను మోదీ ప్రభుత్వం పటిష్టం చేçస్తోంది. దేశంలో అశాంతికి కారణమైన నక్సల్స్ ఏరివేతకు అపరేషన్ కగార్ చేపట్టాం. (ఆపరేషన్ కగార్ చేయాలా.. వద్దా అని సభికులను ప్రశ్నించారు) దశాబ్దాలుగా నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. లొంగిపోవాలని గతంలోనే హెచ్చరించినా లొంగిపోలేదు. అందుకే కగార్ చేపట్టాం. 2026 మార్చిలోగా దేశంలో నక్సల్స్ లేకుండా చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి..’ అని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు రాజధానిగా ఇందూరు‘తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాల్లో, ఔషధాల తయారీలో వినియోగించే పసుపు పంటను నిజామాబాద్ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోంది. అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్లో పసుపు బోర్డును నెలకొల్పారు. ఇప్పుడు నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని నగరంగా మారింది. నిజామాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో క్వింటాలుకు అదనంగా కనీసం రూ.7 వేల వరకు ఎక్కువ ధర దక్కుతుంది. ఎగుమతులు భారీగా పెరిగితే ధర కూడా భారీగా పెరిగిపోతుంది. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు దళారుల ప్రమేయం లేకుండా చేయడం జరుగుతుంది. 2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతోంది..’ అని అమిత్షా వెల్లడించారు.స్థానిక రైతుల పోరాటం ఫలించింది: తుమ్మలతెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయిందని అన్నారు. బోర్డు ద్వారా అధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తోందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

అణుహత్యలు!
ఇరాన్ అణు బలాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జూన్ 13న ఇజ్రాయెల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’, కనీసం 14 మంది అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఇరాన్ అణు సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్త, ‘ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ’ అధిపతి అయిన మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చి, ఆ దేశ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరేడౌన్ అబ్బాసి–దవానీ వంటి ప్రముఖులు కూడా మరణించినవారిలో ఉన్నారు. ఇజ్రాయెల్ కానీ, మరో దేశంగానీ ఎందుకిలా అణు శాస్త్రవేత్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి?! – సాక్షి, స్పెషల్ డెస్క్యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు నేరుగా సైనికులతోనూ పోరాడరు. ఆయుధాలకు ఆయువుపట్టులా ఉన్న శాస్త్రవేత్తలనూ లక్ష్యంగా చేసుకుంటారు. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణు స్థావరాల కంటే ముందు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉండే వ్యూహం ఒకటే. కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను నిర్మూలించటం ద్వారా అణు కార్యక్రమాలను ముందుకు సాగకుండా నిలువరింపజేయటం, సంస్థాగతమైన ఆయువు పట్టును పూర్తిగా దెబ్బతీయడం. ఇరాన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. 2020లో ఇరాన్ అణు సూత్రధారి మొహ్సేన్ ఫక్రిజాదేను చంపడం వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పన్నిన వ్యూహ లక్ష్యం కూడా సరిగ్గా ఇటువంటిదే.ఇప్పటి వరకు 100 హత్యలుఅణు శాస్త్రవేత్తలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం అన్నది ‘అణు’యుగం ప్రారంభం నుంచీ ఉన్నదే. 1944 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు శత్రుదేశాల దాడుల్లో హతమయ్యారు. అయితే ఈసారి ఇజ్రాయెల్, మునుపటి రహస్య కార్యకలాపాల మాదిరిగా కాకుండా, బహిరంగంగానే ఇరాన్ శాస్త్రవేత్తల్ని హతమార్చింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు, వాయుసేన రక్షణ వ్యవస్థలు, ఇంధన వనరులపైన కూడా చెప్పి మరీ ప్రత్యక్ష దాడులు జరిపింది.నాలుగు ‘హంతక’ దేశాలుచరిత్రలో పొందుపరిచి ఉన్న వివరాలను బట్టి చూస్తే ప్రపంచంలో ప్రధానంగా నాలుగు దేశాలు తమ శత్రు దేశాలకు చెందిన తొమ్మిది వేర్వేరు అణు కార్యక్రమాలపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నాలుగు దేశాలలో మొదటి వరుసలో ఇజ్రాయెల్, అమెరికా; రెండో వరుసలో బ్రిటన్, సోవియెట్ యూనియన్ ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్ల కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తల్ని ఆ నాలుగు దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి. తాజా ఇజ్రాయెల్ దాడులకు ముందు వరకు 2007 నుంచి 10 మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం అన్నది సంబంధిత దేశంలోని శాస్త్రవేత్తలకే పరిమితం కాలేదు. ఉదాహరణకు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మోసాద్’ 1980 లో ఇటలీ ఇంజనీరు మారియో ఫియోరెల్లి ఇంటిపై బాంబు దాడి చేసి, ఇరాక్ అణు స్థావరాలకు కోసం పని చేస్తున్న ఐరోపా సంస్థలను పరోక్షంగా హెచ్చరించింది. ఏఐతో చంపేశారుశాస్త్రవేత్తలను ‘మట్టుపెట్టటం’లో మునుపటి విధానాలు మారిపోయాయి. గతంలో వ్యక్తులపై నేరుగా కాల్పులు, లేదంటే బాంబు దాడులు చేసేవారు. ఆ పద్ధతులే ఇప్పుడు మరింత అధునాతనంగా మారాయి. ఉదాహరణకు, తాజా ఆపరేషన్ లో మరణించిన ఫెరేడౌన్ అబ్బాసి గతంలో 2010 కారు బాంబు దాడి నుండి బయటపడిన వారే. ఇరాన్ కు చెందిన సుప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఫక్రిజాదే హత్య అప్పట్లో ఓ సంచలనం. అతడి కదలికలపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ 2019 నుంచీ నిఘా వేసింది. 2020లో అతడి హత్య కోసం.. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఏఐను ఉపయోగించింది. ఒక టన్ను బరువు ఉండే రిమోట్ కంట్రోల్డ్ మెషీన్ గన్ ఇందుకోసం వాడారు. అత్యంత రహస్యంగా ఆ గన్ విడి భాగాలను ఇరాన్ లోకి తీసుకొచ్చారు. వాటిని ఒకచోట అమర్చి, ఫక్రిజాదే ప్రయాణిస్తున్న దారిలో ఒక పాడుబడిన వాహనంలో ఉంచారు. అతడు భార్యతో సహా ప్రయాణిస్తుంటే.. కేవలం ఒక్కడికే గురిపెట్టారు. మొత్తం 15 బుల్లెట్లను కేవలం నిమిషం వ్యవధిలో ప్రయోగించారు. కారులో అతడి పక్కనున్న భార్యకు ఏమీ కాలేదట. హత్య జరిగిన మరుక్షణమే మెషీన్ గన్ ఉంచిన వాహనం కూడా పేలిపోయి, అందులో ఎలాంటి ఆనవాలూ లభించలేదట. ఈ మొత్తం ఆపరేషన్ ను ఇరాన్ వెలుపల ఒక కమాండ్ సెంటర్ నుంచి నిర్వహించడం విశేషం.చెప్పి చేయటం మొదలైంది!సైనిక చర్యలతో పాటు, దౌత్యం, ఆంక్షలు, సైబర్ దాడులు, నిఘా కార్యకలాపాలు అన్నవి విస్తృతమైన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక వ్యూహంలో భాగంగా ఉంటాయి. అయితే ప్రధానంగా శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే – దౌత్యపరమైన ప్రయత్నాలన్నిటినీ జాప్యం అయ్యేలా చేయటం, తద్వారా అణ్వస్త్రాల తయారీ ఖర్చులు పెరిగేలా చేయటం, అలాంటి కార్యక్రమాలకు ఇతరులకు సహకరించకుండా నిరోధించడం. ఎంత ప్రభావం ఉంటుంది?శాస్త్రవేత్తలను హతమార్చటం అన్నది బలమైన సందేశాన్ని పంపుతుందని, శత్రువు దూకుడును తగ్గిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలి తన దాడులను ‘సామూహిక విధ్వంసక ఆయుధాలను సమకూర్చుకునే సామర్థ్యానికి గట్టి దెబ్బ’గా అభివర్ణించింది. అయితే, ఇరాన్ అణు కార్యక్రమంలో వేలాది మంది శాస్త్రవేత్తలు పాల్గొంటూ ఉండొచ్చనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నదే. ఒకరిద్దరు శాస్త్రవేత్తలను హతమార్చటం వల్ల అణ్వస్త్ర దేశ గమనం పెద్దగా మారకపోవచ్చు. పైగా ఇటువంటి హత్యలు నైతికమైన, చట్టపరమైన, మానవతాపరమైన ఆందోళనలను పెంచుతాయి. శాస్త్రవేత్తల హత్యలు వారిని అమరవీరుల స్థాయికి పెంచే అవకాశం ఉండటంతో అణు అభివృద్ధికి ప్రజల మద్దతు లభించవచ్చు కూడా.

ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ యెండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకునేవారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు పార్టీ పెద్దలు ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయ కత్వానికి దిశానిర్దేశం చేశారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే..అందరి సమ్మతితో ఎన్నిక జరిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియలో అందరి సమ్మతితో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేసేలా క్షేత్రస్థాయి నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నామినేషన్ పరిశీలన నిర్వహిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే... విత్డ్రాకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియంతా నామమాత్రమేనని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలను కలిసి అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి నాయకత్వంతో సమాలోచనలు చేసి అభిప్రాయాలను సైతం స్వీకరించినట్టు తెలిసింది. అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారు.నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పోటీలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి అధ్యక్ష స్థానాన్ని బీసీకే ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే ప్రచారముంది.

నానాకాలం చదువులు
‘వానాకాలం చదువు’లంటారు. ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల వానకీ, చదువుకీ చుక్కెదురే. చెట్ల కిందో, అరుగుల మీదో, అంతంతమాత్రపు కప్పు కిందో బడులు నడిపేటప్పుడు; చక్కా నడిచి పోడానికి పక్కారోడ్లు లేనప్పుడు వానాకాలంలో చదువుకు గంట కొట్టి ఇంటికి పరిమితమవక తప్పదు. వెనకటి కాలంలో చదువు చెప్పే రోజులతో సమానంగా నిషేధించే రోజులూ ఉండేవి. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి మొదలైన తిథుల్లో, గ్రహణం పట్టినప్పుడూ అధ్యయనం కూడదు. వాటిని ‘అనధ్యయన దినా’లనేవారు. వేదాలు, ఇతర రహస్య విద్యల వల్లింపైతే వర్షాకాలంలో పూర్తిగా నిషిద్ధం. నేర్చుకున్నది మాత్రం నెమరు వేసుకోవచ్చు. క్రమంగా కేలండర్ మారిపోయి వర్షర్తువూ, చదువుల ఋతువూ ఒకేసారి మొదలవడం ప్రారంభించాయి. మినహాయింపులున్నా ఆ రెంటి మధ్యా వైరుద్ధ్యం పోయి సయోధ్య వెల్లివిరుస్తోంది. వానలతో పచ్చదనాన్ని తెచ్చుకుని కొత్త ఉత్సాహాన్ని నింపుకొనే ప్రకృతితో చదువుల ఋతువు పోటీపడుతూ రహదారులనూ, బడితావులనూ పిల్లల సందడితో వర్ణరంజితమూ, కర్ణరంజితమూ చేస్తోంది. మరోపక్క విచిత్రంగా ముల్లు ఈ కొస నుంచి పూర్తిగా దాని వ్యతిరేక దిశకు తిరగడమూ జరుగుతోంది. చదువుల అభావ దినాలు పోయి ఉల్బణ దినాలు వచ్చాయి. ఋతు నిర్బంధాలూ, తిథివార నిషేధాలూ పోయి చదువుల కేలండర్ ‘సార్వకాలికత’ను తెచ్చుకుంటోంది. వానా కాలం చదువులు పోయి నానాకాలం చదువులొచ్చాయి. అది మరోరకం వైపరీత్యానికి దారి తీసింది. అంతటా కాకపోయినా, అనేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో వేసవి సెలవులు కుదించుకుపోతున్నాయి. ప్రత్యేకించి పబ్లిక్ పరీక్షలు రాయబోయే పిల్లలకు వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ పైన వేసవి పొడవునా ట్యూషన్ తరగతులకు హాజరవడం అనివార్యమవుతోంది. భుజాలను వంచే పుస్తకాల బరువుకు తోడు మస్తకాలను భయాందోళనలతో నింపే చదువు బరువూ పెరిగిపోతోంది. ‘స్కూలు వర్కు’ను మించి ‘హోము వర్కు’ నివ్వడంతో బడికీ, ఇంటికీ తేడా చెరిగిపోయి, వేరే వృత్తి ఉద్యోగాల్లో తలమునకలయ్యే తల్లితండ్రులే టీచర్లు గానూ మారి, అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. తల్లుల పరిస్థితి మరీ ఘోరం. ఉద్యోగానికి అదనంగా వంటపనీ, ఇంటిపనీ, పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే ఉపాధ్యాయిని పాత్రనూ పోషించవలసి వస్తోంది. స్త్రీ, పురుష బాధ్యతల మధ్య అసమానతలు కొనసాగుతున్న పరిస్థితిలో గృహిణికి ఇదెంత భారమో ఊహించగలం. స్కూలు ఫీజులూ, ఇతరత్రా వసూళ్ల రూపంలో వేలు, లక్షలు ధారపోస్తున్నా తల్లితండ్రులకు ‘టీచరీ’ రూపంలో ఈ అదనపు చాకిరీ తప్పడం లేదు. ఆటపాటలతో సహా ఇతరేతర మానసికోల్లాసాలకు ఒకటి, రెండు గంటలైనా ఒత్తిడి లేని స్వేచ్ఛా సమయం చిక్కని పిల్లల పాలిట చదువు అక్షరాలా ‘నిర్బంధ’ విద్యే అవుతోంది. విద్యాసంస్థలు చదువు బరువు తగ్గించకుండానే అదనపు వేళల్లో ఆటపాటల బరువునూ మోపడంతో పిల్లలకసలే ఊపిరి సలపడం లేదు. దేశంలో విద్యాబోధన ఎంత శాస్త్రీయంగా జరుగుతోందో పట్టించుకునే వ్యవస్థ అసలేదైనా ఉందా, చదువులు పిల్లల శారీరక మానసిక వికాసానికేమైనా సాయపడు తున్నాయా అన్న ప్రశ్నలు తల్లితండ్రుల నుంచే ఎదురవుతున్నాయి. పరీక్షలలో సాధించాల్సిన మార్కుల గరిష్ఠ శాతం కూడా ఇప్పుడు మారిపోయింది. తదుపరి చదువుకు ఏ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలోనైనా సీటు రావడానికి డెబ్బై, ఎనభై శాతం మార్కులు కూడా సరిపోవడం లేదు, తొంభై శాతం దాటి తీరాల్సిందే. దాంతో పిల్లల్లో పోటీ, అసూయ, అలజడి, ఆందోళన, ఒత్తిడి పెరిగి పోతున్నాయి. తమ చదువూ, భవిష్యత్తుల గురించి తల్లితండ్రులు కనే కలల భారం పిల్లల కను రెప్పల మీద పడి వాళ్ళ నిద్రను హరిస్తోంది.పిల్లల్లో గ్రహణశక్తి, చురుకుదనం పెరిగిన మాట నిజమే కానీ, మొత్తంగా నేటి ఈ చదువుల తీరు ఆదర్శవంతమేనా అన్న సందేహం మాత్రం వదలకుండా వేధిస్తూనే ఉంది. ఇక చదువుల్లో రకరకాల అసమానతలు పెరగడమే తప్ప తగ్గుతున్న జాడలేదు. ఉజ్జ్వల భవిష్యత్తు వైపు నడిపించే చదువుల నిచ్చెనపై చివరి మెట్ల మీద చతికిల బడుతున్నవారు నేటికీ అసంఖ్యాకమే. ఇంకోవైపు నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించడానికి ప్రభుత్వాలు ఇప్పటికీ ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. నూటయాభయ్యేళ్ళ క్రితం, బ్రిటిష్ వలస పాలన ప్రారంభం నాటికి మూడు శాతం పైచిలుకు ఉన్న అక్షరాస్యత ఇప్పుడు ఎనభై శాతానికి చేరడం, విడిగా చూసినప్పుడు ఒకింత ఊరటే కానీ, ఎన్నో దేశాలతో పోల్చితే ఈ పెరుగుదల వేగమూ, శాతమూ ఏమంత విశేషం కావని పెదవి విరిచేవారూ ఉన్నారు. ఇందులో మళ్ళీ ప్రాంతీయంగా, జెండర్ పరంగా అంతరాలూ యథాతథం. ఎప్పుడో కానీ సోదిలోకి రాని ఈశాన్య రాష్ట్రాలు అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉండటం ఒక విశేష మైతే, ఎంత ప్రామాణికమో తెలియదు కాని, బిహార్తో కలసి ఆంధ్రప్రదేశ్ ఆ పట్టికలో అడుగు బొడుగు స్థానాలలో కనిపించడం కలవరపరిచే విషయం. ఇక చదువుల నాణ్యత విషయానికొస్తే, పట్టికలో మన దేశం స్థానం ఉసూరుమనిపించే మరో అధ్యాయం. చదువుకీ, మంచి రాబడిగల ఉద్యోగాలకూ పీటముడి పడిన దశలో విద్యాభ్యాసం పూర్తిగా పరుగు పందెంగా మారి పిల్లల్ని విపరీత శ్రమకూ, అలసటకూ గురిచేస్తున్న మాట నిజం. చదువుల మరో పరమార్థమైన జ్ఞాన సముపార్జనకు కూడా పెద్ద పీట వేస్తూ ఎప్పటికది నిలకడ తెచ్చుకుంటుందో, పిల్లల్ని పరీక్షల భయతీరాన్ని దాటించి వైజ్ఞానికపు వెలుగుల ఉల్లాస తీరం వైపు నడిపిస్తుందో కాలమే తేల్చాలి.

స్కోరుంటేనే.. లోన్
తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని ఓ యువతి పెళ్లికి నిరాకరించింది. మహారాష్ట్రలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. మరో సంఘటనలో క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఈ రెండు సందర్భాల్లోనూ రెండు జీవితాలను క్రెడిట్ స్కోర్ మార్చేసింది. క్రెడిట్ స్కోర్ అంత ముఖ్యమా.. ఇంతకీ ఈ స్కోర్ ఏమిటి.. ఎవరు, ఎలా నిర్ణయిస్తారు.. సామాన్యుల మదిలో ఉన్న సందేహాలకు జవాబు తెలుసుకుందాం. – సాక్షి, స్పెషల్ డెస్క్నాకు లోన్ కావాలి. క్రెడిట్ స్కోర్ ఉంటేనే ఇస్తామన్నారు. ఏమిటీ స్కోర్?ఓసారి మీ స్నేహితులనో, బంధువులనో ఓ రూ.లక్షో.. 2 లక్షలో చేబదులు అడిగి చూడండి! ఎంతమంది ఇచ్చి ఉంటారు? ఎంతమంది బంగారమో, ఇంటి పత్రాల వంటి హామీలు అడిగి ఉంటారు? మీరు బాగా తెలిసినవారే అయినా మీరు తిరిగి చెల్లించగలరా అని వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది మీరెవరో తెలియకుండా ఓ బ్యాంకు లేదా లోన్ యాప్ మిమ్మల్ని నమ్మి, ఎలాంటి తనఖా లేకుండా అప్పు ఎలా ఇస్తాయి? అందుకే, మీరేంటి.. గతంలో ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే తిరిగి ఎలా చెల్లించారు.. చెల్లించకుండా ఎగ్గొట్టారా.. వంటి అంశాలన్నీ వారు చూస్తారు. ఇలా వినియోగదారుడి రుణ అర్హతను సూచించే సంఖ్యే క్రెడిట్ స్కోర్. దీని ఆధారంగానే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ఒకరికి రుణం ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తాయి. చెల్లింపుల చరిత్ర, రుణ అర్హత–తీసుకున్న మొత్తాలు, కాల పరిమితి, తరచూ లోన్లకు దరఖాస్తులు, విభిన్న రుణాలు.. వీటి ఆధారంగా స్కోర్ మారుతుంది. మనదేశంలో తొలి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్యూనియన్ సిబిల్. ఈ కంపెనీ ఇచ్చే క్రెడిట్ స్కోర్.. సిబిల్ స్కోర్గా జనంలో బాగా పాపులర్ అయింది.నా క్రెడిట్ స్కోరు తక్కువైతే రుణం రాదా? ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను నిర్వహించిన తీరు ఆధారంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ/క్రెడిట్ బ్యూరోలు 300 నుంచి 900 వరకు స్కోర్ ఇస్తున్నాయి. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే రుణం లభించే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. 90 శాతం లోన్స్ 750కిపైగా స్కోర్ ఉన్నవారికే మంజూరు అవుతున్నాయి. ఆదాయం, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణ అర్హతను ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. ఏ కంపెనీలు ఈ స్కోర్ ఇస్తున్నాయి? వాటికి ఆర్బీఐ అనుమతి ఉందా?క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ లేదా క్రెడిట్ బ్యూరోలు వ్యక్తులు, కంపెనీల రుణ సమాచారాన్ని ఆర్థిక సంస్థల నుంచి నెలవారీ ప్రాతిపదికన సేకరించి, నిర్వహణతోపాటు విశ్లేషిస్తాయి. ఈ రుణ సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తుల కోసం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు, కంపెనీల కోసం క్రెడిట్ కంపెనీ రిపోర్ట్లు రూపొందిస్తాయి. రుణ అర్హత, గత రుణ చరిత్ర ఆధారంగా వ్యక్తుల కోసం క్రెడిట్ స్కోర్, కంపెనీలకు క్రెడిట్ ర్యాంక్లను జారీ చేస్తాయి. ఆర్బీఐ లైసెన్స్ పొందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు భారత్లో ట్రాన్స్యూనియన్ సిబిల్, ఈక్విఫ్యాక్స్ ఇండియా, ఎక్స్పీరియన్ ఇండియా, సీఆర్ఐఎఫ్ హై మార్క్. ఆర్బీఐ నియంత్రణలోనే ఇవి పనిచేస్తాయి. స్కోర్ ఎక్కువగా ఉంటే ప్రయోజనం ఏమిటి?ట్రాన్స్యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2025 జనవరి–మార్చిలో కొత్తగా మంజూరైన రుణాల్లో 57.6 శాతం వినియోగదారుల స్కోర్ 800లకుపైగా ఉంది. 22.8 శాతం మంది స్కోర్ 750–799 మధ్య, 9.7 శాతం వినియోగదారులకు 700–749 మధ్య, 5.2 శాతం కస్టమర్లకు 650–699 మధ్య, 4.7 శాతం మందికి 650 కంటే తక్కువ స్కోర్ ఉంది. స్కోర్ ఎక్కువగా ఉన్నవారికే లోన్ లభిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. గృహ, వాహన రుణాల వంటి సెక్యూర్డ్ లోన్స్కు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, క్రెడిట్ హిస్టరీ లేకున్నా రుణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వ్యక్తిగత రుణం, విద్యా రుణాల వంటి అన్ సెక్యూర్డ్ లోన్స్కు క్రెడిట్ స్కోర్ ఉండాల్సిందే. కొత్త వాళ్లకు రుణం రాదంటున్నారు. నిజమేనా?అలాంటిది ఏమీ లేదు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో లోన్లు తీసుకున్నవారిలో 16 శాతం మంది కొత్తవారే. ఉద్యోగులైతే వారు పనిచేస్తున్న కంపెనీని బట్టి రుణ సంస్థలు సూపర్–ఏ, కేటగిరీ–ఏ, బీ, సీ, డీ అని విభజించి రుణ మొత్తాన్ని, కాల పరిమితిని నిర్ణయిస్తున్నాయి. కంపెనీ పనితీరు కూడా లోన్ అప్లికేషన్ ను ప్రభావితం చేస్తుంది.నాకు క్రెడిట్ హిస్టరీ లేదు. యూపీఐ వాడుతున్నాను. లోన్ వస్తుందా?క్రెడిట్ హిస్టరీ లేని ఉద్యోగులు అయితే కనీసం మూడు నెలల పే స్లిప్స్ను సమర్పించాలి. ఎన్ బీఎఫ్సీలు చిన్న మొత్తాల్లో రుణం ఇస్తాయి. సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ లిమిట్ (రుణ మొత్తం) పెంచుతాయి. యూపీఐ వాడుతున్న చిరు వ్యాపారులు, కార్మికులకు కూడా ఆదాయం, యూపీఐ చెల్లింపులను విశ్లేషించి ఎన్ బీఎఫ్సీలు చిన్న మొత్తాల్లో అప్పులు ఇస్తున్నాయి.ఏది మంచి స్కోర్ ?851-900 (అద్భుతం)బకాయిలు లేని రుణగ్రహీతలు.751-850 (మంచిది)సకాలంలో చెల్లింపులతో బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారు.651-750 (సగటు)తగిన రుణ నిర్వహణతో సగటు రుణ చరిత్ర కలిగినవారు.501- 650 (పేలవమైనది)సమయానికి పూర్తికాని చెల్లింపులు, అధిక రుణ వినియోగం కారణంగా ఎక్కువ రిస్క్ ఉన్నవారు.300 - 500 (చాలా పేలవమైనది)బకాయిలు, రుణం పొందడంలో ఇబ్బందులతో దారుణమైన రుణ చరిత్ర ఉన్నవారు.రూ.50 లక్షల వరకు.. దరఖాస్తుదారు పనిచేస్తున్న కంపెనీ సూపర్–ఏ ప్లస్ విభాగంలో ఉండి, స్కోర్ మెరుగ్గా ఉంటే.. ఎన్ బీఎఫ్సీలు 8 ఏళ్ల కాల పరిమితితో రూ.50 లక్షల వరకు అన్ సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నాయి. గతంలో ఈ కాల పరిమితి అయిదేళ్లు ఉండేది. కంపెనీల స్థిరత్వం, లాభ, నష్టాలు, ఆదాయం కూడా వారి ఉద్యోగులు పొందే రుణ మొత్తాన్ని నిర్ణయిస్తోంది. అంతిమంగా దరఖాస్తుదారు క్రెడిట్ స్కోరే ముఖ్యం. – సాయి కుమార్ మామిడి, ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ సేల్స్ అడ్వైజర్, హైదరాబాద్

ఈ పాపం సర్కారుదే
తిరుపతి రూరల్: మామిడి రైతులకు ఇదివరకెన్నడూ లేనంత పెద్ద కష్టం వచ్చింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే సమస్య సృష్టించి రైతులను అధఃపాతాళానికి తొక్కుతోంది. అయిన వారికి మేలు చేసేందుకు రైతులను ముప్పు తిప్పలు పెడుతూ నష్టాలపాలు చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా మామిడి సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. మామిడిలో అత్యధిక డిమాండ్ కలిగిన తోతాపురి వైపు మొగ్గు చూపించారు. ఈ ఏడాది కూడా పంట దిగుబడి బాగానే వచ్చింది. అయితే కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. కూటమి పార్టీల నేతలకు చెందిన పల్ప్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నందున, వారికి మేలు చేయడం కోసం ధర ఎంతగా పతనమవుతున్నా పట్టించుకోలేదు. దీంతో రైతులు నడిరోడ్డుపై మామిడి కాయలను పారబోసి ఆందోళనలు చేపట్టారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదు.పల్ప్ తయారీ ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. ఫ్యాక్టరీల ముందు కిలోమీటర్ల కొద్దీ మామిడి లోడుతో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంకా వేలాది టన్నుల మామిడి తోటల్లోనే దర్శనమిస్తోంది. మామిడి పంట సాగు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూడలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడంతో నష్టాలను భరించలేక, వారికి వారే శిక్ష విధించుకుంటున్నారు.పసి బిడ్డల్లా పెంచుకున్న పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి, గోకులాపురం, వేపకుప్పం, గంగిరెడ్డిపల్లి, గడ్డకిందపల్లి గ్రామాల్లోని మామిడి రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకున్న మామిడి చెట్లను మొదళ్లకు నరికేసి కలప వ్యాపారులకు అమ్మేస్తున్నారు. 40 ఏళ్లకు పైబడ్డ భారీ చెట్లను యంత్రాలతో తొలగించేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాలకు పైగా మామిడి చెట్లను తొలగించేసినట్టు సమాచారం. అప్పుడు చెరకు.. ఇప్పుడు మామిడి ⇒ పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కొద్ది రోజులకే నల్ల బెల్లంపై నిషేధం విధించారు. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కనిపించే చెరకు తోటలు క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి. నల్లబెల్లం తయారు చేసిన రైతులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడంతో అత్యధిక శాతం మంది రైతులు చెరకు సాగును వదిలేసుకున్నారు. ⇒ ఆ తర్వాత వేరుశనగ, వరి పంటల సాగుకు అవసరమైన నీరు లేక, వర్షాలు పడక ఆ పంటలను దూరం చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి ఇచ్చే మామిడిని చిన్న, సన్నకారు రైతులు అందరూ సాగు చేసుకున్నారు. ⇒ ఇప్పుడు మళ్లీ కూటమి పార్టీలతో కలిసి గద్దెనెక్కిన చంద్రబాబు.. తన వాళ్లకు లబ్ధి చేకూర్చే ఉదే్దశంతో మామిడికి గిట్టుబాటు ధర లేకుండా చేశారు. దీంతో రైతులు రోడ్డున పడ్డారు. ఈ ఏడాదే కాదు.. మరో నాలుగేళ్లు చంద్రబాబు పాలనలో మామిడి రైతులకు నష్టాలు, కష్టాలు తప్పవని భావించే రైతులు ఏళ్లతరబడి పెంచుకున్న తోటలను నిర్ధాక్షిణంగా తొలగించేస్తున్నారు. కన్నీటి గాధలు.. బెదిరింపులు⇒ భవిష్యత్తులో కూడా తమకు న్యాయం జరగదన్న ఆలోచనతో రైతులు మామిడి తోటలను తొలగించేస్తున్న విషయం మీడియాలో రావడంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కి పడింది. తన చేతకాని తనం బయట పడుతుందనే భయంతో అధికారులను రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా ఉద్యానవన, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా రైతులను బెదిరింపులకు చేస్తున్నారు. ⇒ ‘ఏ అధికారంతో మామిడి తోటను తొలగిస్తున్నావు.. పరి్మషన్ ఉందా.. అనుమతి లేకుండా చెట్లు కొట్టేస్తే.. అది మీ తోట అయినా సరే కేసు పెడతాం’ అంటూ రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన మామిడి రైతు మహేందర్రెడ్డిని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం పట్టించుకోనందునే ఈ దుస్థితి వచ్చిందని, ధర లేక ఏడుస్తుంటే ఓదార్చి న్యాయం చేయడానికి ముందుకు రాని మీరు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారని సదరు రైతు తిరగబడే సరికి అధికారులు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది. ⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం సరకల్లు గ్రామంలో రమేశ్ అనే రైతు తన ఆరు ఎకరాల తోటలో మామిడి కాయలు కోయకుండానే వదిలేశారు. కనీసం కాయలు తెంపిన కూలి కూడా రాని పరిస్థితి ఉండటంతో మామిడి తోటను తొలగించేస్తున్నాడు. తన తండ్రి రెక్కల కష్టంపై 40 ఏళ్లుగా నీరందించి కన్నబిడ్డల్లా సాకిన చెట్లను ఇలా తొలగించడం బాధగా ఉన్నా, ఇకపై మామిడికి గిట్టుబాటు ధర రాదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘పెట్టిన పెట్టుబడి ఎలాగూ రాదు. కనీసం కాయలు కోసినందుకు అయ్యే ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. పంట పక్వానికి వచ్చి కుళ్లిపోతున్న అడిగేవారు లేరు. లారీల్లో తీసుకెళ్తే బాడుగ ఖర్చు కూడా రావడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అందుకే తోటను తొలగించేస్తున్నా’ అంటూ రైతు రమేశ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇకపై గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశ లేదు మామిడి దిగుబడి బాగానే వచ్చింది. అయితే గిట్టుబాటు ధర మాత్రం రాలేదు. దళారులు సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ వారికి సహకరించడం దుర్మార్గం. పంటను తీసుకుని వ్యాపారి వద్దకు తీసుకువెళితే.. ఇక్కడ ఖాళీ లేదు.. ఇంకో చోటుకు వెళ్లు.. అంటూ చీదరించుకోవడం చూసి తట్టుకోలేకపోయాను. ఇకపై మామిడికి గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశలేదు. అందుకే చెట్లు నరికేసు్తన్నా. – గిరీష్ రెడ్డి, పీవీ పురం, రామచంద్రాపురం మండలంనష్టాలు భరించలేకనే.. మామిడి పంట సాగులో పెడుతున్న ఖర్చులకు సరిపడా ఆదాయం రావడం లేదు. సాగులో నష్టాలు భరించలేక పోతున్నా. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినా ఒక్క రూపాయి మేరకు అయినా సాయం చేయలేదు. వ్యాపారులు పంటను చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నష్టపోవడం కంటే మామిడిని వదిలించుకోవడమే మేలు. అందుకే తోటను నరికేస్తున్నా. – మహేందర్రెడ్డి, గంగిరెడ్డిపల్లి, రామచంద్రాపురం మండలంకరోనాలో కూడా రూ.12వేలు ఇచ్చారు మామిడి పంటకు ఇప్పడు ఇస్తున్న ధర చూస్తే కడుపు కాలుతోంది. కరోనా సమయంలో కూడా టన్నుకు రూ.12 వేలు ఇచ్చారు. ఇప్పుడు సీజన్ అయిపోతున్నా సరే పంటను అడిగేవారు లేరు. పండించిన పంటను అమ్ముకోవడానికి నరకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మీదట మామిడి పంటలో లాభాలు చూస్తామన్న ఆశ లేదు. అందుకే ఆ చెట్లన్నీ నరికి వేసి వేరే పంట సాగు చేయాలనుకుంటున్నా. – దొరస్వామిరెడ్డి, గోకులాపురం, రామచంద్రాపురం మండలంఇంత దరిద్రం ఎప్పుడూ లేదు మామిడి పంటకు ఇంత దరిద్రమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. రూ.2కు చాక్లెట్ కూడా రావడం లేదు. అలాంటిది ఎంతో కష్టపడి సాగుచేసిన మామిడి కేజీ రూ.2కు ఇవ్వాలంటే ఆ రైతు చచ్చిపోక ఏం చేయగలడు? చావడం చేతగాకనే ఇలా చెట్లను చంపేస్తున్నాం. దీనంతటికీ కారణం ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే. గిట్టుబాటు ధర కల్పించి ఉంటే చెట్లను ఎందుకు నరుకుతాం? – చెంగారెడ్డి, రేఖల చేను, రామచంద్రాపురం మండలం చిత్తూరు–పుత్తూరు రహదారిపై రైతుల ఆందోళనగంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద ఆదివారం మామిడి రైతులు చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మామిడి పంటను ఫ్యాక్టరీల వద్దకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. జైన్ కర్మాగారం యూనిట్ వన్ వద్ద 350 వాహనాలు, యూనిట్ టు వద్ద 450కి పైగా వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరాయి. దీంతో సకాలంలో అన్లోడ్ గాక ట్రాక్టర్లలో తీసుకొచ్చిన పంట సగానికి సగం కుళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లూ వాకిలి, కుటుంబాన్ని వదిలి రోజుల తరబడి రేయింబవళ్లూ తిండి, నిద్ర లేక అవస్థలు పడుతూ రోడ్లపై పడిగాపులు కాస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం హీనంగా చూస్తోందని ఆరోపించారు.వారం పది రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట పడిగాపులు కాస్తున్నా తమను పట్టించుకోకపోగా, అధికారులతో కుమ్మక్కైన దళారులు మాత్రం లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. వరుస క్రమంలో టోకెన్లు ఇవ్వకుండా, మిస్ చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నారని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్న వారి సరుకునే కొంటున్నారని ఆరోపించారు. ఓ ఉన్నతాధికారి ఫోన్ చేస్తే 20–30 ట్రాక్టర్లు దర్జాగా మెయిన్ గేటు ద్వారా లోపలికి వెళుతున్నాయని ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీల వద్ద ఒక ట్రాక్టర్ అన్లోడ్ కావడానికి దాదాపు వారం, పది రోజులు పడుతోందని, ఆ సమయానికి అధిక శాతం పంట కుళ్లిపోవడంతో ఆ సరుకు వద్దంటూ ఫ్యాక్టరీ వారు తిప్పి పంపుతున్నారని రైతులు వాపోయారు.

ఇకపై మళ్లీ ఆడగలనా?
లండన్: భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పుడైతే మైదానంలో సెంచరీలు చేసి... పిచ్పై ఎగిరి గంతులేస్తూ... పల్టీలతో సంబరాలు చేసుకుంటున్నాడు. కానీ... రెండున్నరేళ్ల క్రితమైతే అతను ఇకపై క్రికెట్ ఆడనేమో అన్న కంగారులో మంచంపై ఉండిపోయాడు. 2022లో పంత్ ఘోరమైన ప్రమాదానికి గురయ్యాడు. ఆ ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి సొంతూరు రూర్కీకి కారు నడుపుకుంటూ వెళ్తుండగా ఆ కారు అదుపుతప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘోరప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు ప్రాణంమీదికి తెచ్చుకున్నాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా... స్పృహలోకి రాగానే తొలుత క్రికెట్ కెరీర్ గురించే ఆందోళన చెందాడు. తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ దిన్షా పర్దివాలాతో ‘ఇకపై నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా?’ అని ప్రశ్నించాడని ఆ డాక్టర్ వెల్లడించాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్గా వ్యవహరించిన ఈ సీనియర్ డాక్టర్ అప్పటి ప్రమాదం, తదనంతర చికిత్సపై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులివి... బతికి బట్టకట్టడమే గొప్ప ఘోరమైన ఆ ప్రమాదంలో రిషభ్ బతికి బట్టకట్టడమే పెద్ద అదృష్టం. మంచంపై అతన్ని మొదట చూసినప్పుడు... పంత్ కుడికాలు మామూలు స్థితిలోనే లేదు. అక్కడక్కడ విరిగి చాలావరకు జరిగిపోయింది. ఆ కాలి చీలమండకు పెద్ద గాయమే అయ్యింది. ఒళ్లంతా గాయాలే. ప్రమాదంలో చర్మం అంతా గీరుకొనిపోయింది. శరీరభాగాల్లో పెద్దగా రాసుకుపోయింది. మెడ నుంచి మోకాళ్ల వరకైతే పైచర్మమంతా చీరుకుపోయింది. కారు లోపలి నుంచి లాగే ప్రయత్నంలో పగిలిన అద్దాలు అతని వీపును, చర్మాన్ని లోపలిదాకా చీల్చాయి. ఇలాంటి పరిస్థితిలోని ఓ క్షతగాత్రుడు బ్రతకడమే కష్టం. పంత్ చాలా అదృష్టవంతుడు కాబట్టే బ్రతకడం కాదు... ఏకంగా తనకిష్టమైన ఆటను ఆడేస్తున్నాడు 635 రోజులపాటు... వెంటనే ఐసీయూలో చికిత్స, తదనంతరం మోకాలుకు పలుమార్లు ఆపరేషన్లు, రోజుల తరబడి క్రమం తప్పని ఫిజియోథెరపీ చికిత్స అతన్ని బతికించాయి. కానీ ఆడించాలంటే అది చాలదుగా... ఇంకా చేయాలి. అప్పటిదాకా వైద్యులు శ్రమించారు. అక్కడి నుంచి వైద్యులతో కలిసి పంత్ శ్రమించాల్సి వచ్చింది. అలా ఓ వారమో నెలనో కాదు... ఏకంగా 635 రోజులు అంటే దాదాపు రెండేళ్లపాటు సాగిన వైద్యచికిత్స, పునరావాస కార్యక్రమాలతోనే రిషభ్ ఓ పెషెంట్ నుంచి ఎప్పట్లాగే మళ్లీ క్రికెటర్ అయ్యాడు. నిజం చెప్పాలంటే అతని పోరాటం క్రీడాచరిత్రలో నిలిపోయే పాఠమని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన ప్రమాదాల్లో మరణాలే ఎక్కువగా సంభవిస్తాయి. రక్తనాళాలు పని చేయడంవల్లే... ప్రమాదం తీవ్రత వల్ల అతని మోకాలు నుంచి పాదం వరకు జరిగిపోవడంతో అక్కడక్కడ ఎముక స్నాయువులు విరిగాయి. ఇలాంటపుడు కండరాలు, ప్రధాన రక్తనాళాలు కూడా తెగిపోయి రక్తసరఫరా ఆగిపోతుంది. దీంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి రావడం సహజం. కానీ అదృష్టమేమిటంటే... ఇంత జరిగినా కూడా అతని రక్తనాళాలేవీ గాయపపడలేదు. తెగలేదు. దీనివల్లే అతని కాలు తీసేయాల్సిన దుస్థితి రాలేదు. కాలు తిరిగి యథాతథ స్థితికి వచ్చేందుకు, నడిచేందుకు, ఇప్పుడైతే ఆడేందుకు పనిచేస్తుందంటే దీనికంతటికి ప్రధాన కారణం బలమైన రక్తనాళాలే! ఇది ఎంతో అదృష్టముంటేగానీ జరగదు. వాళ్ల అమ్మయితే నడుస్తాడా అని విలపించింది రిషభ్ తాను మళ్లీ క్రికెట్ ఆడగలనా అని ప్రశ్నిస్తే... అతడి పరిస్థితిని చూసిన వాళ్ల అమ్మయితే ‘నా కొడుకు అసలు నడవగలడా’ అని విలపించింది. దీంతో అప్పుడు గాయాల తీవ్రత గురించి వివరించాను. మళ్లీ మోకాలు పునర్నిర్మాణానికి ఉన్న అవకాశాల్ని చెప్పాను. ఆ తర్వాతే ఏదైనా ఆశించవచ్చని బదులిచ్చాను. 2023 జనవరి 6న నిష్ణాతులైన ఆర్థోపెడిక్ వైద్య బృందం నాలుగు గంటలపాలు తొలి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.మూడు చోట్ల ఎముక స్నాయువుల్ని సరిచేసింది. మామూలుగా విరిగిన చోట్ల చికిత్స చేసింది. కొన్నివారాల తర్వాత కూడా అతను సొంతంగా తన పళ్లను బ్రష్ చేసుకోలేకపోయాడు. చేతులకు అయిన గాయాలు, చర్మంలోతుగా అయిన గాట్లతో చేతుల్ని కూడా సాధారణంగా కదిలించలేకపోయాడు. మెల్లమెల్లగా నీళ్లు తాగడంతో మొదలుపెట్టి... తర్వాత తర్వాత అన్ని పనులు అలవాటు చేసుకున్నాడు.హ్యాట్రిక్ మిరాకిల్స్ వల్లే...సర్జరీ, తదనంతరం పరిస్థితిని సమీక్షించిన మీదటే పంత్ తల్లికి అతను నడవగలడనే ధైర్యమిచ్చాం. ఇక అతను మాత్రం ఇంతటి ఘోరమైన ప్రమాదంలో జీవించి ఉండటమే అద్భుతమని, కాలు తిరిగి సాధారణ స్థితిలో నడవడం, పరుగెత్తడం మరో అద్భుతమని చెప్పాను. ఇక క్రికెట్ ఆడటమైతే మూడో మిరాకిల్ అని అతని ధైర్యాన్ని పెంచాను. తను కూడా ఆత్మస్థయిర్యంతో మెలిగాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్ కోసం తిరిగి పునరాగమనం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాడు. అందువల్లే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి తర్వాత మైదానంలోకి వచ్చి యథేచ్ఛగా ఆడగలుగుతున్నాడు. అయితే సెంచరీ చేశాక ఉత్సాహంతో పంత్ మైదానంలో పల్టీలు కొడుతున్నాడు. ఈ విన్యాసాలు చేయకపోతేనే మంచిదని సలహా ఇస్తున్నా.
ప్రయాణానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్
అరటి సాగులో ఆదర్శం
దేశమంతటా రుతుపవనాలు
ఉచిత ప్రవేషాలు
ఎమర్జెన్సీ యోధులు చిరస్మరణీయులు
నో రూల్.. ఇది ఆర్జేడీల డీల్
తాడిపత్రిలో పోలీసు రాజ్యం
2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన
టచ్ చేసి చూడు!
మా శవాలపై వెళ్లి భూములు తీసుకోండి
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. ఇంట్లో ఒప్పుకోలేదు: తేజస్విని
అత్తతో కలిసి అల్లుడి పరార్
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన టీమిండియా
పోటీ చేసి గెలిచి పనిచేయని పార్టీలపై కూడా కొరడా ఝళిపిస్తే బావుండు!
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు
మంచు విష్ణు కన్నప్ప.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్!
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
జూలైలో ‘సిల్వర్ బాంబ్’.. వెండిపై ‘రిచ్డాడ్ పూర్డాడ్’ రచయిత
సాక్షి కార్టూన్ 28-06-2025
కన్నప్పపై 'ఆర్జీవీ' ట్వీట్.. మంచు విష్ణు రియాక్షన్
ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
ఈ రాశి వారు ఆస్తులు కొనుగోలు చేస్తారు
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
మనకి తప్ప అన్నిటికీ సేఫే ఈ విమానాలు!
నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్
swetcha votarkar: యాంకర్ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు
వివాహేతర సంబంధం వద్దన్నా వినలేదు!
ప్రయాణానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్
అరటి సాగులో ఆదర్శం
దేశమంతటా రుతుపవనాలు
ఉచిత ప్రవేషాలు
ఎమర్జెన్సీ యోధులు చిరస్మరణీయులు
నో రూల్.. ఇది ఆర్జేడీల డీల్
తాడిపత్రిలో పోలీసు రాజ్యం
2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన
టచ్ చేసి చూడు!
మా శవాలపై వెళ్లి భూములు తీసుకోండి
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. ఇంట్లో ఒప్పుకోలేదు: తేజస్విని
అత్తతో కలిసి అల్లుడి పరార్
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన టీమిండియా
పోటీ చేసి గెలిచి పనిచేయని పార్టీలపై కూడా కొరడా ఝళిపిస్తే బావుండు!
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు
మంచు విష్ణు కన్నప్ప.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్!
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
జూలైలో ‘సిల్వర్ బాంబ్’.. వెండిపై ‘రిచ్డాడ్ పూర్డాడ్’ రచయిత
సాక్షి కార్టూన్ 28-06-2025
కన్నప్పపై 'ఆర్జీవీ' ట్వీట్.. మంచు విష్ణు రియాక్షన్
ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
ఈ రాశి వారు ఆస్తులు కొనుగోలు చేస్తారు
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
మనకి తప్ప అన్నిటికీ సేఫే ఈ విమానాలు!
నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్
swetcha votarkar: యాంకర్ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు
వివాహేతర సంబంధం వద్దన్నా వినలేదు!
సినిమా

ఆ డైరెక్టర్ మాట వల్లే కన్నప్ప వాయిదా వేశా: మంచు విష్ణు
కన్నప్ప మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు హీరో మంచు విష్ణు. తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరెకెక్కించిన కన్నప్ప ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంటోంది. దీంతో కన్నప్ప బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు మంచు విష్ణు హాజరై మాట్లాడారు. కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సంచలన డైరెక్టర్ ఆర్జీవీ వల్లే తాను మూవీని పోస్ట్పోన్ చేశానని వెల్లడించారు. దీనికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'నా జనరేషన్లో నేను నమ్మే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇవాళ ఆయన నాకు ఓ మేసేజ్ పెట్టాడు. మార్చిలో నాన్నగారిని కలవడానికి వచ్చారు. ఆ రోజు ఇంట్లో కన్నప్ప సినిమా మేకింగ్ నాలుగు నిమిషాల వీడియోను ఆయనకు చూపించాను. మీ సినిమా మొత్తం గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్..ఎక్స్ట్రార్డినరీ అని వీవీఎస్ రవి అన్నారు. ఈ మాట విన్న రాంగోపాల్ వర్మ ఒక మాట అన్నారు. ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ను వదిలిపెడతాడా.. అవీ కూడా బ్రహ్మండగానే ఉంటాయి అన్నారు. అది విన్న తర్వాత భయపడి పోస్ట్పోన్ చేసేశా. ఈ రోజు కూడా టెక్నికల్గా మా డైరెక్టర్, ఎడిటర్, నేను చాలా సీక్వెన్స్లు వదిలిపెట్టేశాం. మేము అనుకున్నంతగా వీఎఫ్ఎక్స్ రాలేదు. ఇది మాకు ఒక పెద్ద గుణపాఠం' అని వెల్లడించారు. #RamGopalVarma అన్న ఒక్క మాటకి ఏప్రిల్ నుంచి పోస్టుపోన్ చేశాను - #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/yiMnZW5RdU— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2025

రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలున్నాయా..? భయపెడుతున్న టాప్ హీరోయిన్స్ అనుభవాలు
దక్షిణాదిలో పలువురు సినిమా షూటింగ్స్ కోసం ఎంచుకునే హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీ లో దయ్యాలు ఉన్నాయా? తరచుగా సినీతారలు ఆ ఫిలిం సిటీ గురించి ప్రకటిస్తున్న భయాలు, అనుభవాలు దేనికి సంకేతం? విశేషం ఏమిటంటే, సదరు ఫిలిం సిటీలో తాము ఎదుర్కున్న భయానక అనుభవాలు వెల్లడిస్తున్న వారు కూడా ఏదో చిన్నా చితకా నటీమణులు కాకపోవడం, ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో అత్యంత పేరున్న ప్రముఖ తారలు కావడమే విశేషం. హైదరాబాద్ శివార్లలో విస్తరించిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ హంటెడ్ స్థలం అనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షూటింగ్స్ సమయంలో కొన్నిసార్లు రాత్రంతా నిద్రపోలేని ప్రదేశాలలో గడిపాపనని, అలాంటి సమయంలో అక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత బాగుంటుందని భావించానని కాజోల్ చెప్పారు. అందుకు ఉదాహరణగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీని పేర్కొన్నారు, ‘‘అది ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించవచ్చు’’ అన్నారామె. అయితే, అదృష్టవశాత్తూ తనకు ఏ దయ్యమో భూతమో లాంటివి తనకు కనపడలేదంటూ తీవ్రమైన భయాలను ఆమె వ్యక్తం చేశారు. భారతదేశంలోనే ఒక ప్రముఖ సీనియర్ నటి, అదే విధంగా అజయ్ దేవగణ్ వంటి స్టార్ హీరో భార్య ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన సంచలనం కలిగించాయి. ఇవి దేశవ్యాప్తంగా సినిమా రూపకర్తలను ఆందోళనకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటోందని గ్రహించిన ఫిలింసిటీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఫలించి కొన్ని రోజుల తర్వాత ఫిలింసిటీ చాలా గొప్ప ప్రదేశం అంటూ కాజోల్ కితాబిచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయిందని సినీ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... కేవలం కాజోల్ మాత్రమే కాకుండా గతంలోనూ టాలీవుడ్ కి చిరపరిచితమైన రాశి ఖన్నా తాను అక్కడ బస చేసినప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో తనను ఎవరో అనుసరిస్తున్నట్టుగా అడుగుల శబ్ధం వినిపించింది అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మరో అగ్ర తార తాప్సీ పన్ను కూడా అక్కడేదో అసహజ వాతావరణ ఉంది అంటూ మాట్లాడారు. అదే విధంగా తమిళ దర్శకుడు సుందర్ సి వంటి సెలబ్రిటీలు సైతం తమకు అక్కడ షూటింగ్ సందర్భంగా ఎదురైన అనుభవాలను పంచుకోవడం... గమనార్హం. ఫిలింసిటీ...హారర్కి అడ్రెస్సా?రామోజీ ఫిల్మ్ సిటీని వందల ఎకరాల్లో నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో ఒకప్పుడు నిజాం సైనికుల సమాధులు ఉండేవని కొందరు అలాగే ఆ స్థలం పూర్వపు యుద్ధభూమి అని మరికొందరు నమ్ముతున్నారు. దీనివల్ల అక్కడ చుట్టుపక్కల నివాసితులకు శాంతి లేదని, అక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని ఈ తరహా విషయాలను నమ్మేవారు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి మూఢనమ్మాకాలను వ్యాప్తి చెందించడం మంచిది కాదనేది నిజమే అయినప్పటికీ, ఎన్నో రకాల అనుభవాలను చవి చూసిన ధైర్యవంతులైన సినీ తారలు వ్యక్తం చేసే అభిప్రాయాలను కొట్టిపారేయలేం. మూఢనమ్మకాల సంగతెలా ఉన్నా, ఆయా తారలకు ఎదురవుతున్న అనుభవాల వెనుక ఉన్నవి అతీంద్రీయ శక్తులా? లేక అనుమానాస్పద వ్యక్తులా? అనే నిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సమంతపై ట్రోలింగ్.. ఆ వీడియోతో ఇచ్చిపడేసిన సామ్!
శుభం మూవీ తర్వాత సమంత సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. సోషల్ మీడియాలో ఇటీవల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. జిమ్లో వర్కవుట్స్ చేస్తూ తెగ బిజీ అయిపోయింది. ముంబయిలో జిమ్ వెలుపల ఆమె కనిపించడంతో కొందరు ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత కాస్తా అసహనానికి గురైంది.ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో జిమ్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. అందులో వీడియోతో పాటు ఓ కోటేషన్ కూడా రాసుకొచ్చింది. తన బాడీ గురించి కామెంట్స్ వారిని ఉద్దేశించి అందులో ప్రస్తావించింది. వీటిలో మొదటి మూడు చేయగలిగితే తప్ప నన్ను సన్నగా, అనారోగ్యంగా ఉన్నారని అలా చెత్తగా మీరు పిలవలేరు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఇది తన బాడీని షేమింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను జిమ్లో కష్టపడుతున్న వీడియోలను కూడా పంచుకుంది. సమంత తన వర్కౌట్ వీడియోతో ట్రోలర్స్కు సవాలు విసురుతోంది.కాగా.. సమంత చివరిసారిగా శుభం సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించింది. అంతకుముందు వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం 'రఖ్త్ బ్రహ్మండ్'తో పాటు 'బంగారం' అనే తెలుగు చిత్రంలో కనిపించనుంది.

మంచు విష్ణు కన్నప్ప.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా థియేటర్లలోకి వచ్చిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. మొదటి రోజు రూ. 9.35 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో కలిపి ఇండియా వ్యాప్తంగా రూ. 16.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.కాగా.. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే విష్ణు మంచు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కన్నప్ప నిలవనుంది. గతంలో మంచు విష్ణు చిత్రాలైన జిన్నా, మోసగాళ్లు సినిమాలకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో మెప్పించగా.. మంచు విష్ణు తిన్నడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కనిపించింది. అంతేకాకుండా మోహన్ బాబు, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, రఘు బాబు, మధు కీలక పాత్రల్లో నటించారు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్
నాటింగ్హమ్ వేదికగా నిన్న (జూన్ 28) జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్పై భారత మహిళల క్రికెట్ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో స్మృతి మంధన విధ్వంసకర శతకం (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు) సాధించి టీమిండియాను గెలిపించింది. ఈ సెంచరీతో మంధన మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. మంధన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకుంది. తద్వారా మహిళల టీ20ల్లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని, భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీని (హర్మన్-49 బంతుల్లో) నమోదు చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మంధన శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ సీవర్ బ్రంట్(66) టాప్ స్కోరర్గా నిలిచింది.ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు మరో షాక్ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్లో 10 శాతం జరిమానాగా విధించబడింది. నిర్ణీత సమయంలోగా ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడింది. ఓవర్కు 5 శాతం చొప్పున ఐసీసీ 10 శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐసీసీ జరిమానాను ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ స్వీకరించింది. ఇంగ్లండ్ జట్టులోకి సభ్యులందరికీ ఈ జరిమానా వర్తిస్తుంది.కాగా, ఇంగ్లండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. టీ20ల్లో ఇంగ్లండ్పై 200 ప్లస్ స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా జులై 1న జరుగనుంది.

అద్భుతమైన సెంచరీ.. ఆండీ ఫ్లవర్ తర్వాతి స్థానంలో సీన్ విలియమ్స్
బులవాయో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో (23/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి 121 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 38 ఏళ్ల విలియమ్స్కు టెస్ట్ల్లో ఇది ఆరో శతకం. సెంచరీ అనంతరం కూడా విలియమ్స్ పోరాటం కొనసాగిస్తూ జింబాబ్వేను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. విలియమ్స్ ప్రస్తుతం 134 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మసెకెస (4) క్రీజ్లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఆ జట్టు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 176 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36, వెస్లీ మెదెవెరె 15, మసౌరే 7, ట్సిగా 9, మసకద్జ 4 పరుగులు చేసి ఔట్ కాగా.. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్ట్ హర్ట్గా (తలకు గాయం) వెనుదిరగాడు. బెన్నెట్ ఈ మ్యాచ్లో తిరిగి బరిలోకి దిగడు. అతని స్థానంలో మసౌరేను కన్కషన్ సబ్స్టిట్యూట్గా ప్రకటించింది జింబాబ్వే మేనేజ్మెంట్. సౌతాఫ్రికా బౌలర్లలో యూసఫ్ కోడి, వియాన్ ముల్దర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.ప్లవర్ సరసన విలియమ్స్ఈ మ్యాచ్లో సెంచరీతో విలియమ్స్ జింబాబ్వే మాజీ ఆటగాళ్లు గ్రాంట్ ఫ్లవర్, బ్రెండన్ టేలర్ సరసన చేరాడు. ఫ్లవర్, టేలర్, విలియమ్స్ టెస్ట్ల్లో తలో ఆరు సెంచరీలు చేసి జింబాబ్వే తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. టెస్ట్ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీల రికార్డు ఆండీ ఫ్లవర్ పేరిట ఉంది.

ఎక్సలెన్సియా అద్భుత విజయం.. Varsity ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కైవసం
సాక్షి, మొయినాబాద్: డెక్కన్ అరేనాలో జరిగిన 2025 Varsity ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఎక్సలెన్సియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గార్డియంను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 1,000 మంది అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ మ్యాచ్ భారతదేశ పాఠశాల క్రీడల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.ఆట ప్రారంభంలో గార్డియం ఆధిక్యత ప్రదర్శించినా, ఎక్సలెన్సియా పట్టుదలతో నిలబడి తొలి అర్ద భాగంలో గోల్స్ పడకుండా 0-0తో ముగించింది. సగం సమయం విరామంలో ఒక అద్భుతమైన వాతావరణం కనిపించింది. విద్యార్థుల బ్యాండ్ ప్రదర్శన, స్వచ్ఛంద సంస్థలు పెట్టిన ఆహార స్టాల్స్, ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకుల సందడితో స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొంది.అనంతరం రెండో అర్ద భాగం 58వ నిమిషంలో నిమిష్ 30 అడుగుల యార్డ్ నుంచి కొట్టిన అద్భుతమైన షాట్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ఆ ఒక్క గోల్తో ఎక్సలెన్సియా 1-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరి విజిల్ మోగగానే ఎక్సలెన్సియా అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. మూడు నెలల క్రితం క్వాలిఫైయర్స్తో మొదలైన ఎక్సలెన్సియా ప్రస్థానం ఛాంపియన్షిన్ కైవసం చేసుకోవడంతో ముగిసింది.మ్యాచ్ అనంతరం నిమిష్కు బ్యాలన్ డి'ఓర్(Ballon d’Or), గోల్డెన్ బూట్ అవార్డులు లభించాయి. అభిమానులు రాత్రంతా నిమిష్ పేరుతో విజయ నినాదాలు చేశారు. ఇది కేవలం ఒక చివరి ఆట మాత్రమే కాదు. Varsity అనే ఒక కొత్త క్రీడా ఉద్యమం ఆవిర్భావం అని చెప్పొచ్చు.

సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్
సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ దేశం తరఫున తొలిసారి ఓ స్పిన్నర్ టెస్ట్ల్లో 200 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున 200 టెస్ట్ వికెట్ల మార్కును ఇప్పటివరకు ఏ స్పిన్నర్ తాకలేదు. ఆ దేశం తరఫున 200కు పైగా టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లంతా ఫాస్ట్ బౌలర్లే. సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్ బౌలర్గా కేశవ్ మహారాజ్ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్లో కేశవ్ ఈ ఘనత సాధించాడు. జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ వికెట్ కేశవ్కు 200వ టెస్ట్ వికెట్. కేశవ్ తర్వాత టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లుగా టేఫీల్డ్ (170), పాల్ ఆడమ్స్ (134), పాల్ హ్యారిస్ (103), నికీ బోయే (100) ఉన్నారు. ఓవరాల్గా టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా డేల్ స్టెయిన్ (439) ఉన్నాడు. అతని తర్వాత షాన్ పోలాక్ (421), ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్ (330), మోర్కెల్ (309), కల్లిస్ (291), ఫిలాండర్ (224) 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. వీరంతా ఫాస్ట్ బౌలర్లే.మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. రెండో సెషన్ సమయానికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్డ్ హర్ట్ కాగా.. కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36 పరుగులకు ఔటయ్యారు. సీన్ విలియమ్స్ (81), వెస్లీ మెదెవెరె (15) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కోడి యూసఫ్ 2, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.
బిజినెస్

పట్టాలెక్కిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పట్టాలెక్కింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ తదితర అభివృద్ధి ప్రణాళికలతో నగర స్థిరాస్తి రంగం పుంజుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో నగరంలో 10,741 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే కేవలం 3 శాతం తగ్గుదల కనిపించింది. గృహ కొనుగోలుదారులు ప్రీమియం, హైఎండ్ లగ్జరీ గృహాలకే మొగ్గు చూపిస్తుండటంతో అందుబాటు, మధ్యస్థాయి గృహాల లాంచింగ్స్ స్వల్పంగా తగ్గాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోహాట్స్పాట్ ప్రాంతాలివే.. లాంచింగ్స్లో పశ్చిమ హైదరాబాద్ ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. మొత్తం లాంచింగ్స్లో ఈ జోన్ వాటా ఏకంగా 51 శాతంగా ఉంది. వెస్ట్ హైదరాబాద్లో నానక్రాంగూడ ప్రధాన హాట్స్పాట్గా నిలిచింది. లాంచింగ్స్లో ఉత్తర హైదరాబాద్ వాటా 18 శాతంగా ఉండగా.. ఈ జోన్లో బాచుపల్లి హాట్స్పాట్గా ఉంది. ఇక, దక్షిణ హైదరాబాద్ వాటా 17 శాతంగా ఉండగా.. రాజేంద్రనగర్ హాట్స్పాట్గా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి పశ్చిమ హైదరాబాద్ చోదకశక్తిగా ఉన్నప్పటికీ.. రెండేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. ఇదే సమయంలో భూమి లభ్యత, అందుబాటు ధరల కారణంగా ఉత్తర, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. శివారు ప్రాంతాలలో గృహ నిర్మాణాలు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం.హైఎండ్ లగ్జరీదే ఆధిపత్యం.. 2025 క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో లాంచింగ్స్లో అత్యధికంగా 83 శాతం హైఎండ్ లగ్జరీ యూనిట్లు హైదరాబాద్లోనే లాంచింగ్ అయ్యాయి. నగరంలో 2024 క్యూ1లోని లాంచింగ్స్లో ప్రీమియం ఇళ్ల వాటా 34 శాతంగా ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 70 శాతానికి పెరిగింది. నానక్రాంగూడ, గండిపేట, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో ప్రీమియం ఇళ్లకు అత్యధిక డిమాండ్ ఉంది. లాంచింగ్స్లో మధ్యస్థాయి విభాగం గృహాల వాటా 17 శాతంగా ఉంది. అత్యధికంగా బాచుపల్లిలో ఈ తరహా ఇళ్లకు గిరాకీ ఉంది. తూర్పు హైదరాబాద్లో ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.పెరిగిన ఇళ్ల అద్దెలు.. నగరంలో గృహాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 7 శాతం పెరిగాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లోని అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, ఇతర ఉన్నతస్థాయి వర్గాలు ఆయా ప్రాంతాలలో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటమే అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణం.ఆఫీసు స్పేస్ అదరహో.. నగరంలో 2025 క్యూ1లో 18.2 లక్షల చ.అ. నికర ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. లక్ష చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన ఆఫీసు లీజులు అత్యధికంగా జరిగాయి. హెల్త్కేర్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలలో కంపెనీల విస్తరణల కారణంగా లావాదేవీలలో వృద్ధి నమోదైంది. 2025 క్యూ1లోని ఆఫీసు స్పేస్ లీజులలో అత్యధికంగా 32 శాతం హెల్త్కేర్ అండ్ ఫార్మా రంగాలది కాగా.. ఆ తర్వాత ఐటీ–బీపీఎం విభాగం 21 శాతం, బ్యాంకింగ్ అండ పైనాన్షియల్స్ విభాగం వాటా 11 శాతంగా ఉంది. మాదాపూర్ (81 శాతం), గచి్చ»ౌలి (16 శాతం) ప్రాంతాల్లోని ఆఫీసు స్పేస్కు ఎక్కువ డిమాండ్ ఉంది.సప్లయి 13.2 లక్షల చ.అ. ఇక నగరంలో 2025 క్యూ1లో కొత్తగా మార్కెట్లోకి 13.2 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సప్లయి అయింది. అయితే గతేడాది క్యూ1తో పోలిస్తే మాత్రం ఇది 55 శాతం తగ్గుదల. ఆఫీసు స్పేస్ ప్రాజెక్ట్ల అనుమతుల జారీలో జాప్యమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. నగరంలో కార్యాలయ స్థలాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 13 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా మాదాపూర్లో అద్దెలు పెరిగాయి. ఈ ప్రాంతంతో పోలిస్తే గచ్చిబౌలిలో కిరాయిలు 20–25 శాతం తక్కువగా ఉన్నాయి. మెట్రో ఫేజ్–2, హెచ్–సిటీ రోడ్ల విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఆఫీసు అద్దెలు మరింత వృద్ధి చెందుతాయి.

ఈ కంపెనీ ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు ఇక ఉండవ్..
జపాన్కు చెందిన ప్రముఖ అప్లయెన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పానాసోనిక్ నుంచి ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు ఇక రావు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారతదేశంలోని రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి పానాసోనిక్ నిష్క్రమించింది. ఈ సెగ్మెంట్లు రెండూ భారత్లో పానాసోనిక్కు నష్టాల్లో ఉన్న వ్యాపారాలు. ఇక్కడ మార్కెట్లో స్థానం సంపాదించడానికి కష్టపడుతున్నాయి.మార్కెట్ రీసెర్చ్ సంస్థ జీఎఫ్కే గణాంకాల ప్రకారం.. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ విభాగాలలో పానాసోనిక్ చాలా తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. వాషింగ్ మెషీన్లలో దీని వాటా 1.8 శాతం, రిఫ్రిజిరేటర్లలో 0.8 శాతంగా ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో పానాసోనిక్ గత ఆరేళ్లుగా అమ్మకాల్లో నష్టాలను చవిచూస్తోంది.రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి నిష్క్రమిస్తున్నప్పటికీ డీలర్ల వద్ద ఇప్పటికే ఉన్న ఆయా ఉపకరణాల అమ్మకాలకు సహకరిస్తామని, విడిభాగాలు, వారంటీ కవరేజీతో సహా పూర్తి కస్టమర్ సేవను అందిస్తూనే ఉంటామని పానాసోనిక్ తెలిపింది.స్తబ్దత నుంచి బయటపడేందుకు, భవిష్యత్తులో బలమైన, పునరుద్ధరించిన వృద్ధి కోసం పానాసోనిక్ గ్రూప్ను నిలబెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న వ్యాపారాల నుంచి నిష్క్రమించాలని యోచిస్తున్నట్లు ఈ ఏడాది మేలో పానాసోనిక్ గ్రూప్ సీఈఓ యుకీ కుసుమి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో పానాసోనిక్ ఇండియా ఆదాయం సుమారు రూ .11,500 కోట్లు.

నిర్మాణం.. మరింత భారం
సాక్షి, సిటీబ్యూరో: అధిక రుణాలు, నిధుల లేమితో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్ రీసెర్చ్ తెలిపింది.టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్పుట్ కాస్ట్ పెరిగాయి.2024 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయి. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండ్రస్టియల్ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు.ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితి అని పేర్కొన్నారు.

94 ఏళ్ల వయసులో రూ.50వేల కోట్ల విరాళం..
విజయవంతమైన గొప్ప ఇన్వెస్టర్, సంపాదనలో తిరుగులేని శక్తి అని బెర్క్షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ గురించి గొప్పగా చెబుతారు. అయితే దాతృత్వంలోనూ తనకు సాటి లేరని చాటుతున్నారు బఫెట్. తాజాగా 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50 వేల కోట్లు) విలువైన కంపెనీ షేర్లను ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారాయన.ఇప్పుడు 94 ఏళ్ల బఫెట్ మొత్తం 9.43 మిలియన్ల బెర్క్షైర్ షేర్లను బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చారు. తన దివంగత భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,43,384 షేర్లను ఇచ్చారు. అంతేకాకుండా తన ముగ్గురు పిల్లల నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థలు హోవార్డ్ జి బఫెట్ ఫౌండేషన్, షెర్వుడ్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్లకు 6,60,366 షేర్లను విరాళంగా ఇచ్చారు.బఫెట్ ఇదివరకే ఇలాంటి భారీ విరాళాలను అందించారు. గత జూన్లో 5.3 బిలియన్ డాలర్లు, అంతకు ముందు నవంబర్లో 1.14 బిలియన్ డాలర్లు విరాళమిచ్చారు. ఈ తాజా విరాళం తర్వాత కూడా బఫెట్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. విరాళానికి ముందు ఆయన నికర సంపద (అంచనా) 152 బిలియన్ డాలర్. ఫోర్బ్స్ ప్రకారం బఫెట్ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ విరాళం తర్వాత ఆరో స్థానానికి తగ్గే అవకాశం ఉంది. విరాళాలు ఇస్తున్నప్పటికీ, ఆయన ఇప్పటికీ బెర్క్షైర్ హాత్వేలో 13.8% వాటాను కలిగి ఉన్నారు. తన వాటాలను విక్రయించే యోచన లేదని బఫెట్ ఇదివరకే పేర్కొన్నారు.వారెన్ బఫెట్ 1965 నుండి బెర్క్షైర్ హాత్వేకు నాయకత్వం వహిస్తున్నారు. దానిని ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన సంస్థలలో ఒకటిగా మార్చారు. తెలివైన పెట్టుబడి సలహాలకు ప్రసిద్ది చెందిన బఫెట్ కొటేషన్లలో "అద్భుతమైన ధరతో మామూలు కంపెనీని కొనడం కంటే అద్భుతమైన కంపెనీని మామూలు ధరకు కొనడం గొప్ప" అనే ప్రసిద్ధమైంది. తన సంపద ఎలా వినియోగించాలన్నది కూడా బఫెట్ ముందే ప్లాన్ చేసుకున్నారు. తాను మరణించిన తర్వాత మిగిలిన సంపదలో 99.5 శాతాన్ని కుటుంబం నిర్వహించే ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సంస్థలకు అందేలా గత ఏడాది తన వీలునామాను అప్డేట్ చేశారు.
ఫ్యామిలీ

రక్తం పంచే అమ్మకు బ్లడ్ తక్కువ..!
మహిళలను రక్తహీనత (అనీమియా) సమస్య ఒక పట్టాన వదలదు. అసలు నెలనెలా వచ్చే రుతుస్రావం సమస్యతో రక్తంపోతూ ఉండటం, బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో రక్తంపోవడం, వాళ్లకు వచ్చే యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలతో మహిళల్లో రక్తంపోవడం చాలా సాధారణం. మన కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే 5వ కుటుంబ ఆరోగ్య సర్వే (ఫిఫ్త్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే)లోనూ గర్భవతుల్లోని 52 శాతం కంటే ఎక్కువమందిలో తీవ్రమైన రక్తహీనత ఉన్నట్లు అధికారికంగానే తేలింది. అంటే గర్భవతులందరిలో సగంమంది కంటే ఎక్కువే రక్తహీనతతో బాధపడుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో మహిళల్లో రక్తహీనత (అనీమియా) సమస్య, దాన్ని అధిగమించడమెలా అనే అంశాలను తెలుసుకుందాం. సాధారణంగా రక్తహీనత అన్నది స్త్రీ, పురుషులిద్దరిలో కనిపించేదే అయినా మహిళల్లో మాత్రం చాలా ఎక్కువ. అందునా గర్భవతుల్లో 52 శాతానికి పైగా మహిళల్లో అనీమియా ఉండటం ఎలా ఉన్నా సాధారణ మహిళల్లోని దాదాపు 70 శాతం మందికి పైగా రక్తహీనత ఉంటుందనేది అనేక మంది డాక్టర్ల పరిశీలనల్లో తేలిన అంశం.రక్తహీనత (అనీమియా) అంటే... రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేక΄ోవడాన్ని రక్తహీనత (అనీమియా)గా పరిణిస్తారు. మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తంలోని ఎర్ర రక్తకణాల (ఆర్బీసీ) ద్వారానే పోషకాలూ, ఆక్సిజన్ అందుతాయి. వాటి సంఖ్య తగ్గడంతో అన్ని అవయవాలకూ పోషకాలూ, ఆక్సిజన్ అందక΄ోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఈ హీమోగ్లోబినే అన్ని కణాలకూ ఆక్సిజన్ అందజేస్తుంటుంది. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణమన్నది మగవారిలో 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నారని అర్థం.మహిళల్లో రక్తహీనతకు కారణాణాలివి... మహిళల్లో ప్రతినెలా వచ్చే రుతుస్రావం కారణంగా ప్రతి నెలా రక్తం పోతుంటుంది. ఇక మరికొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. అనీమియా లక్షణాలు కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి.రక్తహీనత లక్షణాలు : రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గి΄ోవడం వల్ల వాళ్లు పాలిపోయిన చర్మం, గోళ్ల కింద రక్తం లేని కారణంగా గోళ్లు తెల్లగా కనిపించడం, ఎర్రగా కనిపించాల్సిన కింది కనుపాప కింద తెల్లగా పాలిపోయినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనిమియా లక్షణాలను తెలుసుకోడానికి భౌతికంగా తొలి పరీక్షగా డాక్టర్లు వీటినే చూస్తారు. ఇవిగాక... ముఖం పాలిపోయినట్లుగా ఉండటం కొద్దిపాటి నడకకే ఆయాసం శ్వాస కష్టంగా తీసుకోవడం ∙తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, అలసట మగతగా ఉండటం చికాకు / చిరాకు / కోపం తలనొప్పి నిద్రపట్టకపోవడం పాదాలలో నీరు చేరడం ఆకలి తగ్గడం కాళ్లుచేతుల్లో తిమ్మిర్లతో అవి చల్లగా మారడం కొందరిలో ఛాతీనొప్పి త్వరగా భావోద్వేగాలకు గురికావడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు / చికిత్స : మాంసాహారులైతే ఐరన్ పుష్కలంగా లభించే కాలేయం వంటివి తీసుకోవాలి. ఇక శాకాహారులతోటు అందరూ ముదురాకుపచ్చ రంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం. అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొందరికి రక్తం ఇవ్వాల్సి రావచ్చు. ఇక టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉన్నందున వాటిని డాక్టర్ల సూచన మేరకు, వారి పర్యవేక్షణలోనే వాడాలి. ఇతరత్రా సమస్యలు కనిపిస్తుంటే డాక్టర్లు వారికి సరిపడే మందుల్ని సూచిస్తారు. డాక్టర్ విమీ బింద్రా, సీనియర్ గైనకాలజిస్ట్ (చదవండి: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..! నటి కరీనా కపూర్ కూడా..)

ప్లాన్ చేస్తున్నాం కానీ...
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. నా రెండు రొమ్ముల్లో గడ్డల్లాగా ఉన్నాయి. కాని, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లా¯Œ చేస్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– అనిత, విజయవాడ.మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుండగా రొమ్ముల్లో గడ్డలు కనిపిస్తే, అది చిన్న సమస్య అయి ఉండొచ్చు, కాని నిర్లక్ష్యం చేయరానిది. చాలా సందర్భాల్లో ఇది ఫైబ్రో ఎడినోమా అనే సాదారణ సమస్యగా ఉంటుంది. ఇది నొప్పి లేకుండా కనిపిస్తుంది. మీ వయస్సు, కుటుంబంలో బ్రెస్ట్ కేన్సర్ చరిత్ర, బాడీ మాస్ ఇండెక్స్ 35 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలుంటే, తప్పకుండా బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ చెక్ చేయించాలి. గడ్డల పరిమాణం, ప్రదేశం, స్వభావం ఆధారంగా దానికి బైరాడ్స్ గ్రేడింగ్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఇది తక్కువ గ్రేడింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఇది ప్రమాదకరం కాదు. అలాగే ఇది భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్కు కూడా అంత అడ్డు రాదు. కానీ బ్రెస్ట్లో ఆకస్మికంగా వాపు, రంగు మారటం, నొప్పి రావడం లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుని కలవాలి. సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. అలాగే స్వయంగా పరిశీలించి చూసుకోవడం వలన ఏదైనా మార్పు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. అవసరమైతే డాక్టర్ ఎఫ్ఎ¯Œ ఏసీ లేదా బయాప్సీ చెయ్యమని సూచిస్తారు. ఎక్కువ మార్పులు కనిపిస్తే శస్త్రచికిత్స కూడా చేస్తారు. ఇది ప్రెగ్నెన్సీకి ఏ ప్రమాదం చేయదు. అయితే ప్రతి మార్పును గమనిస్తూ రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ, డాక్టర్ సూచించిన పరీక్షలు, స్కానింగ్లను తప్పకుండా చేయించుకోవాలి.నేను ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. మా ఫ్యామిలీలో చాలామందికి థైరాయిడ్ ఉంది. అందుకే, ప్రెగ్నెన్సీలో నాకు కూడా వస్తుందేమో అనిపిస్తోంది. ఇందుకు ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?– సుమలత, నూజివీడు.మీ కుటుంబంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లయితే, ప్రెగ్నెన్సీ సమయంలో మీరు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఉంటే అవి శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మెదడు అభివృద్ధి, నరాల వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ అనే థైరాయిడ్ పరీక్ష చేయించాలి. ఈ సమయంలో టీఎస్హెచ్ స్థాయి 2.5 కంటే తక్కువగా ఉండాలి. అలాగే కుటుంబంలో ఇప్పటికే థైరాయిడ్ ఉన్నవారు ఉంటే, థైరాయిడ్ యాంటీబాడీ పరీక్ష కూడా చేయించాలి. ఈ పరీక్షలో యాంటీబాడీలు పాజిటివ్గా ఉంటే, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, అలాంటి సందర్భాల్లో వైద్యుని సూచనల మేరకు తక్కువ మోతాదులో థైరాక్సి¯Œ అనే మందును వాడాలి. ప్రెగ్నెన్సీ మొత్తం వ్యవధిలో టీఎస్హెచ్ స్థాయిని ప్రతి నెలా పరీక్ష చేయాలి. మూడో నెల దాటిన తర్వాత టీఎస్హెచ్ స్థాయి 3 వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువైతే, వైద్యులు మందుల మోతాదును సరిచేస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు టీఎస్హెచ్ స్థాయి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అందువలన ప్రతిసారీ పరీక్షల ద్వారా స్థాయిని గమనించి, మందుల మోతాదును మార్చుకుంటూ ఉండాలి. చాలామంది గర్భవతులకు డెలివరీ తర్వాత కూడా థైరాయిడ్ యాంటీబాడీలు కొనసాగుతాయి. అందుకే డెలివరీ అనంతరం కూడా మందులను కొనసాగించే అవసరం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా శిశువు ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ముఖ్యంగా శిశువు మెదడు, చురుకుదనం, శరీరాభివృద్ధి బాగా జరగాలంటే మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ స్థాయిని 2.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకే, ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం చాలా అవసరం. ∙

తీవ్ర వ్యసనం
మొన్నటి మేలో కర్నాటకలోని ఉడిపిలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు మీద తిరుగుతున్న ఒక పిచ్చివాణ్ణి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సంరక్షించి, వైద్యం చేయించి, తిరిగి మామూలు మనిషిని చేశాడు. మెల్లగా ఆ కోలుకున్న వ్యక్తి తమిళుడని, సొంత ఊరు కుంభకోణం అని తెలిసింది. అతని మనుషులు వెతుక్కుంటూ వచ్చారు. ‘ఇతను ఆరునెలలుగా కనిపించకుండా పోయాడు. దానికి ముందు ఫోన్లో రీల్స్ చూస్తూ కుటుంబంతో మాట్లాడక, స్నానం చేయక, తిండి తినక అదే లోకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ స్థితిలో దొరికాడు’ అని చెప్పి తీసుకెళ్లారు. రీల్స్ను వరుసపెట్టి చూడటానికి ‘డూమ్ స్క్రోలింగ్’ అంటున్నారు నిపుణులు. రీల్స్ మనిషి మెదడును ఏ విధంగా ఆక్రమించగలదో ఇదొక ఉదాహరణ.ఇటీవలే గుజరాత్లోని వడోదరలో మరో ఘటన జరిగింది. అక్కడి ఒక కొడుకు తన భార్యతో కలిసి పోలీసుల సహాయం కోరుతూ ఫోన్ చేశాడు. దానికి కారణం ఆ ఇంట్లోని తల్లి రీల్స్లో పడి తిండి తినడం మానేసింది. కొడుకు, కోడలు డ్యూటీకి వెళుతుంటే ఆమెకు బోర్ కొట్టి రీల్స్ చూడటానికి అలవాటు పడిందట. ఆ రీల్స్లో కూడా ఒక ఇన్ఫ్లూయెన్సర్ పెట్టే రీల్స్ చూస్తుందట. వాటికింద కామెంట్స్ పెడుతుందట. ఆ కామెంట్స్కు ఆ ఇన్ఫ్లూయెన్సర్ రియాక్ట్ అయితే ఆమెకు సంతోషం. లేదంటే అప్సెట్ అయ్యి అన్నం తినదు. కొడుకు కోడలు ఆమె ఫోన్ నుంచి ఇన్స్టా యాప్ను తొలగించారు. దాంతో ఇంకా పెద్ద గొడవ జరిగి, ఆమె అన్నం తినడం మానేసింది. దాంతో ఇప్పుడా కొడుకు, కోడలు తల పట్టుకుని కూచుని ఉన్నారు.అసలు రీల్స్ అంటే ఏమిటి? కొన్ని సెకన్ల విన్యాసం. 2020లో మన దేశంలో టిక్టాక్ను నిషేధించాక, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోస్ను ప్రవేశ పెట్టింది. వీటిద్వారా గుర్తింపు, పేరు, ఫాలోయెర్సు తద్వారా డబ్బు... ఇవన్నీ వచ్చేసరికి కేవలం రీల్స్ మీద ఆధారపడినవారు కోకొల్లలుగా పెరిగారు. వీరు రకరకాల విన్యాసాలతో నిత్యం వేలకొద్దీ రీల్స్ వదులుతుంటారు. అవి చూడటానికి ఎవరికైనా, ఎన్ని సంవత్సరాలైనా సరిపోవు. ఆ సంగతి గ్రహించి ఎప్పుడైనా సరదాగా చూసి ఫోన్ కట్టేయాలి తప్పితే వాటిలోనే కూరుకుపోతే మెదడు ఆ రీల్స్కు బానిసవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చేయి విరగ్గొట్టుకున్న అమ్మాయిఅహ్మదాబాద్లో నర్సింగ్ కోర్సులో చేరిన ఒక అమ్మాయి హాస్టల్లో బోరు కొడుతున్నదని రీల్స్ చూడటానికి అలవాటు పడింది. పరీక్షలు వచ్చాయి. రీల్స్ చూడాలంటే పరీక్షలు రాయకూడదని ఆ అమ్మాయి తన కుడి చేతిని బల్ల మీద పదేపదే బాది విరగ్గొట్టుకుంది. ఇలా ఉంటాయి రీల్స్ ఉత్పాతాలు.బి.పి. పెరుగుతుందిచైనాలోని హైబె మెడికల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం రీల్స్ వల్ల 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో బి.పి. పెరుగుతుందని నిరూపణ అయ్యింది. రీల్స్లోని కంటెంట్ ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా కొనసాగుతూ మూడ్స్ను హెచ్చుతగ్గులు తెచ్చిపెడుతుండటం వల్ల ఇలా జరుగుతుంది. రాత్రివేళ గంటలు గంటలు రీల్స్ చూస్తూ నిద్ర పాడుచేసుకుని ఉద్యోగాల్లో కునికిపాట్లు పడుతున్నవారు వేలమంది ఉన్నారు. ఇక దేహం కదల్చకుండా ఉండటం వల్ల వస్తున్న శారీరక సమస్యలు ఎన్నో.టీవీ నయంరీల్స్ చూడటం కన్నా టీవీ చూడటం నయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీవీ చూస్తూ కనీసం ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయొచ్చు. లేదా పుస్తకాల ర్యాక్ సర్దుకోవచ్చు. లేదా బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగడమో... ఏదో ఒక పని టీవీ చూస్తూ చేయొచ్చు. రీల్స్ చూడాలంటే ఇలా చేయడానికి చేతులు ఖాళీ ఉండవు. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్ చేస్తూ వెళ్లాలి. కాబట్టి శరీరం వేరే పని చేయలేదు.కాపురాలలో చిచ్చురీల్స్ చూడటం భార్యాభర్తల మధ్య చిచ్చు తెస్తోంది. నాలుగురోజుల క్రితం కర్నాటకలోని మంగళూరు సమీపంలో రీల్స్ చూస్తున్న భార్యను కట్టడి చేయలేక భర్త ఆమెను చంపేశాడు. ఉత్తర ప్రదేశ్లో ఒక భార్య రీల్స్ చూడనివ్వడం లేదని, గిన్నెలు తోమమంటున్నాడని భర్త మీద కేసుపెట్టింది. వీటన్నింటికి విరుగుడు ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉండటమే అంటున్నారు నిపుణులు. హస్తకళలు, పుస్తకాలు చదవడం, క్రీడలు వీటిలో సమయాన్ని వెచ్చించడం మేలంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని రీల్స్ బారిన పడకుండా చూడమంటున్నారు.

వారు విడిపోయి వీరికి... 'ఒడి'పోయి
విడాకులు కేవలం ఇద్దరు పెద్దల మధ్యే కాదు, ఆ కుటుంబంలో ముఖ్యంగా ఐదారేళ్ల వయసు పిల్లలపైనా తీవ్ర భావోద్వేగాల గందరగోళాన్ని, ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తాయని, ఆయుష్షునూ తగ్గిస్తాయని నివేదికలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఐదారేళ్ల వయస్సులో విడిపోతే, ఆ పిల్లలకు ఆయుష్షు తగ్గే అవకాశాలు పెరుగుతాయంటోంది ఒక అధ్యయనం. ఈ పరిశోధనను మిడ్ అట్లాంటిక్లోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రొఫెసర్ నోలన్ పోప్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మెర్సెడ్ నుండి ఆండ్రూ సి. జాన్స్ స్టన్, అమెరికా జనగణన బ్యూరోకి చెందిన మ్యాగీ ఆర్. జోన్స్ సంయుక్తంగా ఈ ఫలితాలను వివరించారు.జీవనశైలిలో తీవ్ర మార్పులుచిన్నవయస్సులో తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు జీవితాంతం అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు దూరమైన పిల్లల్లో తక్కువ ఆదాయం, చిన్న వయస్సులోనే గర్భం ధరించడం, జైలు శిక్షలు, త్వరగా మరణించే ప్రమాదాలు .. వంటివి ఉన్నాయి. ఇవన్నీ కుటుంబంలో విడాకుల కారణంగా ఏర్పడ్డ అగాథాల మూలంగా జరుగుతున్నాయని పరిశోధకులు వివరించారు. విడాకుల తర్వాత తల్లిదం డ్రులు వేరు వేరు చోట్ల నివసించాల్సి వస్తుంది. ఆదాయం తగ్గిపోతుంది. ఒంటరిగా పిల్లల్ని పెంచాల్సిన తల్లిదండ్రులు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. తరచూ నివాసం మారుతుంది. తక్కువ ఆర్థిక అవకాశాలు ఉన్న పేద ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ పిల్లల జీవితంలో సామాజిక, ఆర్థిక సవాళ్లకు దారితీస్తాయి. 1988 నుండి 1993 మధ్యకాలంలో జన్మించిన 50 లక్షల మందికి పైగా పిల్లలపై వారు గణాంకాలను విశ్లేషించారు. ఫెడరల్ ట్యాక్స్ రికార్డులు, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, జనగణనా బ్యూరో డేటా ఆధారంగా వారు ఈ విశ్లేషణ చేశారు.వ్యాధుల పాలయ్యే ప్రమాదంకొందరు పిల్లలు తమ వల్లే తల్లిదండ్రులు విడిపోయారేమో అనే ఆలోచనను పెంచుకుంటారు. ఇది వారిలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న పిల్లలలో 16 శాతం అధిక స్థాయి సి–రియాక్టివ్ ప్రోటీన్ ఉందని అధ్యయనం. ఈ ప్రొటీన్ వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, టైప్– 2 డయాబెటిస్ వంటి వ్యాధులకు లోన య్యే రిస్క్ ఎక్కువ ఉందని గుర్తించారు.మానసిక అనారోగ్యంపిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సహకారం చూసి పెరుగుతారు. ఆ మద్దతు వారికి ధైర్యాన్నిస్తుంది. కానీ విడాకుల సమయంలో వారిలో భయాలు, అనిశ్చితి, ఒంటరితనం మొదలై మనోవేదన ఎక్కువవుతుంది. ఒక అధ్యయనంలో విడాకులు తీసుకున్న, విడిపోయిన లేదా మరణించిన తల్లిదండ్రులలో ఇద్దరు పిల్లలు కౌమారదశలో ఉంటే వారిలో ఒకరికి మానసిక రుగ్మత ఉందని తేలింది. విపరీతమైన భావోద్వేగాలుతిండి తినడంలో మార్పులు, నిద్రలో ఆటుపోట్లు, శరీర బలహీనత .. వంటి లక్షణాలు పిల్లల్లో బయటపడతాయి. ఇది వారి చదువు పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఏకాగ్రత లోపించటం, స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం, ఇంటి నుంచి వెళ్లిపోవడం.. వంటివీ కనిపించవచ్చు.సమాజంలో ప్రవర్తనకొన్ని సందర్భాల్లో పిల్లలు అతి శాంతంగా మారిపోతారు. లేదంటే మొండిగా ప్రవర్తించవచ్చు. స్నేహితులు, బంధువులతో సంబంధాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాలు చూసిన పిల్లలు తమ భవిష్యత్తు సంబంధాలపై నమ్మకాన్ని కోల్పోతారు. విడాకులు అనివార్యమైతే, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా తల్లిదండ్రులు పరస్పర సహకారంతో ముందడుగు వేయాలి. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా ప్రేమ, మద్దతు, మార్గదర్శకం పిల్లలకు ఇవ్వాలి. ఇద్దరిదీ సమాన బాధ్యతఐదారేళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రుల సమస్య ఏంటో అర్థం కాదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, దంపతులు తమ జీవితంలో సర్దుబాట్ల చేసుకోవాలి. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకొని, ధైర్యమివ్వాలి. విడాకుల అనంతరం పిల్లలు ఇద్దరిలో ఎవరి దగ్గర ఉన్నా మరొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇవి పిల్లల భవిష్యత్తుకు పెద్ద అవరోధమని గ్రహించాలి. మారుతున్న కాలానికి తగినట్టు బంధాలను అర్థం చేసుకుంటూ సామాజికంగానూ బంధుమిత్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అండగా ఉండాలి. విడాకులకు ముందు తల్లిదండ్రులుగా ఎలా ఉన్నారో, ఆ తర్వాత కూడా ఇద్దరూ పిల్లల పట్ల సమాన బాధ్యత తీసుకో వాలి. విడాకులకు ముందు మానసిక నిపుణుల సూచనలు అవసరం. – డా. సునీత, సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు
అంతర్జాతీయం

రష్యాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి
మాస్కో: రష్యా ఆందోళనను పట్టించుకోకుండా పశ్చిమదేశాలు విస్తరణ వాదాన్ని అనుసరిస్తున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. తమ దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. శుక్రవారం పుతిన్ బెలారస్ రాజధాని మిన్స్క్లో జరిగిన యురేసియన్ ఎకనామిక్ సమిట్(ఈఏఈయూ)కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రష్యాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు, కాల్పులకు తెగబడుతున్నా ఎవరూ పట్టించుకోరు. ఇప్పటికీ దారుణాలు కొనసాగుతున్నా వాటి గురించి మాట్లాడరు. అంతా బాగుందని చెప్పుకుంటుంటారు’అంటూ పశ్చిమదేశాలపై పుతిన్ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని సైతం రష్యాలో వేర్పాటువాదానికి ఒక సాధనంగా పశ్చిమ దేశాలు భావించాయని ఆరోపించారు. ‘నాటో విస్తరణకు సంబంధించి రష్యాకు ఇచ్చిన హామీలను పశ్చిమదేశాలు విస్మరించాయి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సైతం విఫలమయ్యాయి. ఉక్రెయిన్లో మేం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ మూలాలేమిటనే అంశంపై పశ్చిమ దేశాలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఉక్రెయిన్ సంక్షోభానికి దశాబ్దాల క్రితమే బీజాలు పడ్డాయి. నాటో విస్తరణ విషయంలో చెప్పిన పచ్చి అబద్ధాలే తాజా సమస్యకు కారణం. ఒకదాని తర్వాత మరో దేశాన్ని నాటోలోకి కలుపుకుంటూ విస్తరించుకుంటూ వస్తున్నాయి. మా ఆందోళనలను పట్టించుకోకుండా నాటో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగిస్తోంది. ఇది కాదా దుందుడుకు వైఖరి? ఇది కచ్చితంగా దుందుడుకు విధానమే. పశ్చిమ దేశాలు దీనిపై దృష్టి పెట్టడానికి ఇష్టపడవు’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో మూడేళ్లుగా సాగిస్తున్న యుద్ధంపై పశ్చిమ దేశాలతో రష్యాకు విభేదాలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యా దూకుడును నిలువరించేందుకు సభ్య దేశాలు తమ జీడీపీలో 5 శాతం రక్షణకు కేటాయించాలంటూ నాటో ఇటీవల నిర్ణయించడం తెల్సిందే.

ఒంటి చేత్తో యుద్ధం ఆపేశా
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడగా, తానే చొరవ తీసుకొని ఒంటిచేత్తో ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టంచేశారు. అన్ని రకాల వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని హెచ్చరించడంతో ఈ రెండు దేశాలు తన మాట విని దారికొచ్చాయని, యుద్ధం ఆపేశాయని చెప్పారు. ట్రంప్ తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత తన సీనియర్ అధికారులను రంగంలోకి దించానని, ఇరుదేశాలను ఒత్తిడి పెంచానని తెలిపారు. తన చాతుర్యం ఫలించి యుద్ధం ఆగిపోయిందని వెల్లడించారు. తానే కనుక చొరవ తీసుకోకపోత రెండు దేశాల మధ్య కచ్చితంగా అణు యుద్ధం జరిగేదని స్పష్టంచేశారు. తనలాగా గొప్ప పని చేసిన అమెరికా అధ్యక్షుడు గతంలో మరొకరు ఉన్నారో లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మధ్య కాల్పుల విరమణకు భారత్, పాక్లను ఒప్పించడం ద్వారా గొప్ప పని చేశానని అన్నారు. సెర్బియా, కొసావో దేశాలను సైతం ఇలాంటి దారికి తీసుకొచ్చానని, అక్కడ పెద్ద యుద్ధం ఆపేశానని ట్రంప్ ఉద్ఘాటించారు. వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటానని బెదిరించడంతో అవి ఘర్షణకు స్వస్తి చెప్పి, శాంతిని ఆశ్రయించాయని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల్లో మంచి నాయకులు ఉన్నారని, వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అమెరికాతో వాణిజ్యం కావాలా? లేక ఒకరిపై ఒకరు అణు బాంబులతో దాడులు చేసుకుంటారా? అని ప్రశ్నించగా, వాణిజ్యమే కావాలని బదులిచ్చారని వివరించారు.

పాక్ మళ్లీ మొదలుపెట్టేసింది.,.!
కరాచీ: భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. మళ్లీ భారత్పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరికల నేపథ్యంలో వారు కాల్పుల విరమణకు వచ్చారు. ఈ తరహా దాడుల్ని ఊహించని పాక్.. ప్రస్తుతం మళ్లీ తిరిగి భారత్ నేలకూల్చిన నిర్మాణాలను పునః నిర్మించుకునే పనిలో పడింది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలుగా భావిస్తున్న వాటిని తిరిగి నిర్మిస్తోంది. ఇటీవల పాక్కు విదేశీ ఫండింగ్ బాగానే అందడంతో దానిని ధ్వంసమైన ఉగ్రస్థావరాల కోసం కూడా ఖర్చు చేస్తోంది. దాంతో పాటు పాక్ ఆర్మీ క్యాంప్లకు సంబంధించి శాటిలైట్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో దానిని కూడా పునరుద్దరించే పనిలో పడింది. లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్ మరియు జంగ్లోరా వంటి ప్రాంతాలలో ఈ మేరక పాకిస్తాన్ పునర్నిర్మాణాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ సహకారంతో, నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలోని దట్టమైన అడవులలో హైటెక్ టెక్నాలజీతో చిన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి యత్సిస్తున్నట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. అసలు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్.. ఉగ్రవాద శిబిరాల పునః నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను అప్పులు చేసి మరీ తిప్పలు తెచ్చకోవడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పాక్లో ఆత్మాహుతి దాడి.. 13 మంది సైనికులు మృతి
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికుల మృతిచెందారు. పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా దూసుకొచ్చిన ఆత్మాహుతి దళంలోని సభ్యుడు.. ఆర్మీ వాహనంపైకి దూసుకొచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది పాక్ సైనికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో 19 మంది స్థానికులు, మరో 10 మంది ఆర్మీలోని సైనికులు గాయాలపాలయ్యారు.మిలటరీ కాన్వాయ్ వెళుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ ఒక్కసారిగా ఆ కాన్వాయ్పై దూకాడు. ఆపై వెంటనే తన వెంట తెచ్చుకున్న బాంబును పేల్చేసుకున్నట్లు పాక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో దగ్గర్లో ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు తెలిపారు. అయితే ఇది ఎవరు చేశారు అనే దానిపై ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ తెహ్రిక్-ఈ-తాలిబన్ గ్రూప్ అనేది తరుచుగా పాక్లోని సైనికులే లక్ష్యంగా దాడులు చేయడంతో ఇది కూడా వారే చేసే ఉంటారని అనుమానిస్తున్నారు. ఇది బలూచిస్తాన్ ప్రాంతంలో జరగ్గా, ఇటీవల కాలంలో పాకిస్తాన్లోని పలు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాన్డోలా చెక్పోస్ట్ పరిధిలో సూసైడ్ బాంబింగ్ జరిగింది. ఇక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపే లక్ష్యంగా దాడి జరిగింది. బలోచ్ మిలిటెంట్లు జఫ్ఫార్ ఎక్స్ప్రెస్ను అటాక్ చేసిన ఘటనలో 21 మంది ప్రయాణికులు అసువులు బాశారు. ఇక గ్లోబెల్ టెర్రర్ ఇండెక్స్ లో పాకిస్తాన్లోనే అత్యధికంగా ఉంది. పాక్లో ఉగ్రవాదం అనేది 45 శాతంగా నమోదు కాగా, అంతకంతకు పెరుగుతూ ఉంది. మరణాల పరంగా చూస్తే 2023లో ఉగ్రవాద చర్యలతో 748 ప్రాణాలు కోల్పోగా, 2024 నాటికి అది 1, 081గా పెరిగింది.
జాతీయం

దిగొచ్చిన ‘మహా’ సర్కారు.. 'హిందీ తప్పనిసరి' తీర్మానం రద్దు
ముంబై: దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్న ‘త్రి భాషా విధానం’లో భాగంగా హిందీని తప్పనిసరి చేయాలనే అంశంపై పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా ఈ సెగ గట్టిగానే ఉండటంతో ఫడ్నవీస్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఈ త్రి భాషా విధానం పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది. గత ఉద్ధవ్ ఠాక్రే సర్కారే దీనికి ఆమోదం తెలిపి, ఇప్పుడు నిరసనలకు పిలుపునివ్వడంపై ఫడ్నవీస్ తప్పుబడుతున్నారు. మహారాష్ట్రలో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని ఉద్ధవ్ సర్కార్ అప్పుడు నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని సీఎం ఫడ్నవీస్ ప్రశ్నించారు. త్రి భాషా విధానంపై శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో నిరసన సెగ తీవ్రతరమైంది. హిందీని తప్పనిసరి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తీర్మానాన్ని వ్యతిరేకించాలని, దానికి సంబంధించిన తీర్మానం ప్రతులను చించి వేయాలని శివసేన(యూబీటీ) చీఫ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. దక్షిణ ముంబైలో జరిగే నిరసన కార్య క్రమానికి నేటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ పాలసీని రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సభలో కలకలం.. తేజస్వీ వైపు దూసుకొచ్చిన డ్రోన్
పాట్నా: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆదివారం.. పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్లో ‘సేవ్ వక్ఫ్, సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరిట ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తేజస్వీ ప్రసంగిస్తుండగా ఆయన వైపు ఓ డ్రోన్ దూసుకొచ్చింది. ర్యాలీ వీడియో కవర్ చేసేందుకు డ్రోన్ ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్.. తేజస్వీ యాదవ్ మాట్లాడుతుండగా దిశ మారి.. హఠాత్తుగా ఆయన వైపుకు వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తేజస్వీ యాదవ్ తన ప్రసంగాన్ని ఆపేసి వెనక్కి జరిగి.. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.కాగా, భద్రతా సిబ్బంది డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై పాట్నా సెంట్రల్ ఎస్పీ దీక్ష స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతం.. నిషేధిత ప్రదేశమని డ్రోన్లు ఎగరవేయకూడదని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.VIDEO | Patna: While addressing ‘Waqf Bachao, Samvidhan Bachao Sammelan’ at Gandhi Maidan, RJD leader Tejashwi Yadav (@yadavtejashwi) narrowly escapes injury as a drone crashes into the podium.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/66B1fMRaHs— Press Trust of India (@PTI_News) June 29, 2025

అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..!
వారిది కచ్చితంగా అన్యోన్య దాంపత్యమనే చెప్పొచ్చు. కానీ వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక్కడ అన్యోన్య దాంపత్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అది సీసీ టీవీ ఫుటేజ్ చెబుతున్న మాట. మనిషి మాట నమ్మని ఈ రోజుల్లో.. సీసీ టీవీ ఫుటేజ్ ‘మాట’ కచ్చితంగా నమ్ముతాం. వీరు శవాలుగా మారకముందు గత రెండు రోజుల సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించి చూస్తే వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మరి ఈ జంట ఎలా చనిపోయిందనేది ప్రశ్న. ఏమైనా చిన్నపాటి మనస్పర్థలు తలెత్తి అది ఆత్మహత్య వరకూ వెళ్లిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగానే ఈ కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.రాజస్థాన్ రాష్ట్రంలోనే జైపూర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దంపతుల్లో భర్త పేరు ధర్మేంద్ర కాగా, భార్య పేరు సుమన్. వీరికి 11, 8 ఏళ్లు కల్గిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి ఇద్దరు భరత్పూర్ గ్రామంలో తమ నానమ్మ, తాతయ్యలు దగ్గర ఉంటున్నారు. సమ్మర్ హాలీ డేస్కు తాతయ్య ఇంటికి వెళ్లిన ఆ పిల్లలు ఇంకా రాలేదు.ధర్మేంద్ర- సుమన్ జంట ఈ శుక్రవారం(జూన్ 27వ తేదీ) తమ ఫ్లాట్లో విగతజీవులుగా కనిపించారు. అంతకుముందూ వరకూ ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట.. ఎందుకు ఇలా చేశారు అనేది చర్చగా మారింది. ధర్మేంద్ర బ్యాంక్ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ధర్మేంద్ర బ్యాంక్కు వెళ్లకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని సదర ఉద్యోగి.. ధర్మేంద్ర బంధువులకు తెలియజేశాడు. దీంతో వారు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఆ జంట విగతజీవులుగా కనిపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు. ఇటీవలే రీసెంట్గా ఫ్లాట్ కొనుగోలు చేసిన వీరి ఆర్థికపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు అంటున్నారు. మూడు సీసీ ఫుటేజ్లో ఇలా..ఒక సీసీ ఫుటేజ్లో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వారు ఫ్లాట్లో కారు పార్కు చేసే క్రమంలో భార్య సుమన్.. భర్త ధర్మేంద్ర భుజంపై తలపెట్టుకుని అతని చేతుల్ని పట్టుకుని ఉంది. ఆపై కారు దిగి వెళ్లిపోతున్న వీడియోలో ఆమె భుజంపై భర్త ధర్మేంద్ర చేయి వేసి నడుచుకుంటూ వెళ్లినట్లు ఉంది. అయితే వారు చనిపోవడానికి ముంద రోజు గురువారం మాత్రం ఇద్దరికీ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం భార్య సుమన్.. ఒక క్యారీ బ్యాగ్ తీసుకుని వెళుతున్నట్లు కనిపించింది. అదే వారు చివరిసారి సజీవంగా కనిపించడం. ఆ తర్వాత రోజే ఈ దారుణం చోటు చేసుకుంది. సుమన్ ఒంటిపై గాయాలుఅయితే భార్య సుమన్ ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబంలో ఎటువంటి వైవాహిక విభేదాలు ఉన్నట్లు తమకు కనిపించలేదని పోలీస్ అధికారి అజయ్ సింగ్ తెలిపారు. అయితే ఇద్దరూ సూసైడ్ చేసుకుని ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏమైనా క్లూ దొరుకుతుందనే కోణంలో వారి మొబైల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు.

హలో.. లంచం త్వరగా ఇచ్చేయాలి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన డాక్టర్ ఆడియో ఒకటి వైరల్గా మారిన ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా జవగొండనహళ్లిలో వెలుగు చూసింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండేళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ రెన్యూవల్ కోసం అక్కడి వైద్యుడు డాక్టర్ క్రిష్ణను కోరగా రూ.5వేలు లంచం అడిగాడు.డబ్బు ఇవ్వకపోతే రేటు రూ.10వేలు అవుతుందని, ఇంకా లేట్ చేస్తే రూ.15వేలు అవుతుందని, ఎవరికి చెపుకున్నా తాను సంతకం పెట్టబోనని నర్స్ను హెచ్చరించాడు. ఈమేరకు ఆడియో లీక్ అయ్యి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఎన్ఆర్ఐ

NRI: బ్లూమింగ్టన్లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
బ్లూమింగ్టన్: అమెరికాలో తెలుగు వారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరింత చేరువ అవుతుంది. తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ నాట్స్ విభాగాలను ప్రారంభిస్తున్నారు. క్రమంలోనే తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ - నార్మల్ జంట నగరాల్లో నాట్స్ చాప్టర్ ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో దాదాపు ఎనభై మంది తెలుగు ప్రజలు నాట్స్ చాప్టర్ ప్రారంభంలో పాల్గొన్నారు. బ్లూమింగ్టన్ చాప్టర్ సలహాదారులకా వేణుకుమార్ మద్దినేని, కృష్ణ వైట్ల వ్యవహరిస్తున్నారు. నాట్స్ బ్లూమింగ్టన్ చాప్టర్ కో ఆర్డినేటర్ బాధ్యతలను విజయ్ కృష్ణ చింటాకు నాట్స్ అప్పగించింది. బ్లూమింగ్టన్ నాట్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్లుగా ప్రేమేష్ గోగినేని, భరత్ అబ్బూరి, మహిపాల్ రెడ్డి గసిరెడ్డి లను నియమించింది. నాట్స్ బ్లూమింగ్టన్ మహిళా సమన్వయకర్తగా సుష్మ గుడ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని వివరించారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల సహకారంతో నాట్స్ విభాగం కార్యక్రమాలు చేపడుతుందని బ్లూమింగ్టన్ నాట్స్ నాయకులు తెలిపారు. స్థానికంగా ఉండే తెలుగు వారికి సేవలు అందించేందుకు నాట్స్ బ్లూమింగ్టన్ టీంను సిద్ధం చేసేలా ఈ చాప్టర్ ప్రారంభంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో బ్లూమింగ్టన్ - నార్మల్ జంట నగరాల తరపున ప్రాతినిధ్యం వహించబోతున్న వారి ఆలోచనలను ఈ కార్యక్రమలో పంచుకున్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలను బ్లూమింగ్టన్ లో చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికపై నాట్స్ నాయకులు చర్చించారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

చెవిరెడ్డి అరెస్ట్ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు
తన జీవితంలో ఏనాడు మద్యం వాసన కూడా తెలియనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఆ కేసులో ఇరికించటం అత్యంత హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ఎన్నారైలు ఖండించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించటం దారుణమన్నారు. ఈ పరిణామాలు అన్నిటికీ రిటర్న్ గిఫ్టులు కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రేలియా ఎన్నారై సూర్యనారాయణ రెడ్డి అన్నారు

పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
డల్లాస్: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వేల ఆహార కిట్లను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగు ప్రజలు, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆహార కిట్లను సిద్ధం చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుకబడిన దేశాల్లో వేల మంది చిన్నారుల ఆకలి తీర్చడంలో దోహదపడనుంది. మానవ సేవే మాధవ సేవ అనే నాట్స్ చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఉంటుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచుతాయని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని, సమిష్టి శక్తిని చూపించడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలే మంచి ఉదాహరణలు అని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డల్లాస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలకు నాట్స్ నాయకత్వం అభినందించింది. అలాగే స్పాన్సర్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ డల్లాస్ జట్టు సభ్యులు బద్రి బియ్యపు, పద్మసుందరి రాతినం, శ్యామల తూనుగుంట్ల తదితరులతో పాటు 20 కి పైగా యువ వాలంటీర్లు పాల్గొన్నారు. సమాజంలో సేవా స్ఫూర్తిని పెంచేలా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

సెయింట్ లూయిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్లోని మహాత్మగాంధీ సెంటర్లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక తెలుగు వారు వినియోగించుకున్నారు. నాట్స్ బోర్డు సలహా సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ బాపూజీ దర్శిలు ఈ ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర్ల, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాగ శ్రీనివాస్ శిష్ట్ల తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న నాట్స్ మిస్సోరీ విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు.

కూతురిపై తల్లి అత్యాచార పర్వం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కన్నకూతురిపై తల్లి లైంగిక దాడులు చేస్తున్న దారుణ ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. ఆరేళ్లుగా ఓ తల్లి కుమార్తెపై లైంగికదాడి చేస్తున్నట్టు తెలిసింది. ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక తల్లి దాష్టీకం గురించి ఉపాధ్యాయురాలికి మొరపెట్టుకుంది. దీంతో విషయం పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసి, తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వివాహం జరిగాక భర్తతో ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లు నిందితురాలు బుకాయించింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన తల్లి కుమార్తె మీద లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కోర్టు భవనంపై నుంచి దూకిన కుటుంబం
మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ: అత్త, భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి శనివారం మెదక్ జిల్లా కోర్టుకు వచ్చాడు. కేసుకు హాజరైన అనంతరం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. ఘటనలో భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలు, అతడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన డాకొల్ల నవీన్ ఐదేళ్ల క్రితం మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య (24)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్లలోపు ఆడపిల్లలు రుచిక, యశ్విక ఉన్నారు. గతేడాది నవీన్ తన అత్తగారిల్లు లక్ష్మాపూర్కు వచ్చి గొడవపడ్డాడు. ఈ క్రమంలో అత్త రాజమణి, భార్య రమ్యను చంపే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో రామాయంపేటలో నవీన్పై హత్యాయత్నం కేసు నమోదుకాగా, జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో రమ్య సైతం నవీన్పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇటీవలే లోక్అదాలత్లో ఈ కేసుపై వారిద్దరూ రాజీపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అత్త, భార్యపై హత్యాయత్నం కేసు విషయమై శనివారం కోర్టుకు హాజరైన నవీన్.. భార్య పిల్లలతో కలిసి కోర్టు భవనంపైనుంచి దూకాడు. భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా నవీన్, పిల్లలు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. అదనపు ఎస్పీ మహేందర్ ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, నవీనే భార్యాపిల్లలను చంపే కుట్రలో భాగంగా భవనంపైనుంచి తోసిఉంటాడని రమ్య కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. తల్లడిల్లుతున్న చిన్నారులు.. కాగా, బాలిక రుచికకు ఎడమ చేయి మూడు చోట్ల విరిగింది. ఛాతీలోనూ తీవ్ర గాయమైంది. ఏడాది న్నర వయసున్న యశ్విక నోట్లోని పళ్లన్నీ రాలిపో యాయి. తీవ్రగాయాలతో ఉన్న ఆ చిన్నారులను చూసిన వారంతా చలించిపోతున్నారు.

డబ్బుల కోసం తల్లికి నిప్పంటించి..
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు.