Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

Huge Marijuana smuggling under Chandrababu Coalition Govt1
దమ్‌ మారో దమ్‌.. కోరలు చాపిన గంజాయి మాఫియా

రాష్ట్రంలో ఊరూరా.. వీధి వీధినా.. బెల్ట్‌ షాపులు ఏర్పాటుచేసి మద్యం ఏరులు పారిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం, అది చాలదు.. అంతకు మించి మత్తులో జోగండంటూ యువతకు గంజాయిని చేరువ చేస్తోంది. గంజాయి క్రయ విక్రయాలు ఊరూరా నిర్విఘ్నంగా సాగేలా తన మాఫియా ముఠాకు అనధికార లైసెన్స్‌ ఇచ్చేసింది. ఫలితంగా ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ యువతను ఈ మహమ్మారి తన విష కౌగిలిలో బంధిస్తోంది. రాష్ట్రంలో ఏడాదిగా గంజాయి పట్టుబడని రోజే లేదు. సర్కారు నిర్లక్ష్య, స్వార్థపూరిత వైఖరి వల్ల ఎంతో మంది పిల్లలు పిచ్చోళ్లుగా మారిపోతున్న దయనీయ పరిస్థితి నిత్యం కళ్లకు కడుతోంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూ స్థాపితం చేసిన గంజాయి భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పైకి తీసింది. సీసా మూత తీసి రాష్ట్రంపైకి విడిచి పెట్టింది. దానిని ఒడిసి పట్టుకున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠా దాంతో రాష్ట్రాన్ని కకావికలం చేస్తోంది. ఫలితంగా గంజాయి మత్తు మార్కెట్‌ గుప్పుమంటూ నగరాల నుంచి పల్లెల వరకు కోరలు చాపింది. దమ్‌ మారో దమ్‌.. గంజాయి దమ్ము బిగించి కొట్టండంటూ యువతను ఊగించడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. యావత్‌ దక్షిణాదిలో గంజాయి స్మగ్లింగ్‌కు ఆంధ్రప్రదేశ్‌ గేట్‌వేగా మారింది. వెరసి ఆ ముఠా, రాష్ట్రాన్ని రీటైల్‌ మార్కెట్‌గా.. యావత్‌ దక్షిణాదిని హోల్‌సేల్‌ మార్కెట్‌గా చేసుకుని యథేచ్చగా దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్‌ నేతలు కీలక సూత్రధారులుగా, ఏఎస్‌ఆర్‌ జిల్లా టీడీపీ నేతలు పాత్రధారులుగా వ్యవస్థీకృతమైన ఈ గంజాయి మాఫియాకు రాష్ట్ర స్థాయి టీడీపీ అగ్రనేతలు, పెద్దలు రింగ్‌ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ కుట్రల చట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఇరికించి, గంజాయి మాఫియా­కు అడ్డు లేకుండా చేసింది. తొలి ఏడాదిలోనే రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడం టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ స్థాయిని వెల్లడిస్తోంది. రానున్న నాలుగేళ్లలో మరింత భారీ దోపిడీకి కార్యాచర­ణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా టీడీపీ గంజాయి మా­ఫియా తన నెట్‌వర్క్‌ను పక్కాగా విస్తరించిన వైనం విస్తుగొలుపుతోంది.తొలి ఏడాదే రూ.25 వేల కోట్ల దందా చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) దెబ్బకు తోకముడిచి రాష్ట్రం విడిచి పెట్టిన మాఫియా.. గత ఏడాది అల్లూరు సీతారామరాజు(ఏఎస్‌ఆర్‌) జిల్లాలో దర్జాగా అడుగు పెట్టింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) ప్రధాన కేంద్రంగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్‌ దందాకు తెరతీసింది. ప్రధానంగా ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఊరూ వాడా రిటైల్‌ విక్రయాలతోపాటు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు హోల్‌సేల్‌గా భారీగా స్మగ్లింగ్‌ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ డీఆర్‌ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2024–25లో ఏవోబీ నుంచి రూ.8 వేల కోట్ల విలువైన గంజాయిని కొనుగోలు చేసి అక్రమ రవాణా చేశారు. ఆ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో ఏకంగా రూ.25 వేల కోట్ల పైమాటే. అంటే కేవలం ఏడాదిలోనే టీడీపీ మాఫియా ఏకంగా రూ.17 వేల కోట్లు అడ్డగోలుగా ఆర్జించిందన్నది స్పష్టమవుతోంది. నెలకు సగటున రూ.2 వేల కోట్లకు పైగా గంజాయి స్మగ్లింగ్‌ దందాకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర స్థానంగా మారిందన్నది నిగ్గు తేలుతోంది. ఏవోబీలో తలుపులు బార్లా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోసారి గంజాయి స్మగ్లింగ్‌కు గేట్‌వేగా మార్చేసింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి స్మగ్లింగ్‌ దందాను సాగించిన టీడీపీ నేతలే మరోసారి రంగంలోకి దిగారు. ఏవోబీలోని మన రాష్ట్ర పరిధిలో దశాబ్దాలుగా సాగిన గంజాయి సాగును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేసింది. ఆపరేషన్‌ పరివర్తన్‌ పేరిట రెండు దశల్లో ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా నిర్వహించింది. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 12 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆపరేషన్‌ పరివర్తన్‌ ద్వారా 11,800 ఎకరాల్లో గంజాయి సాగును కూకటి వేళ్లతో సహా పెకలించి వేసింది. రూ.150 కోట్లతో గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. 2024 నాటికి రాష్ట్రంలో గంజాయి సాగు 99 శాతం తగ్గిపోవడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కాగా గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ గంజాయి మాఫియా మరోసారి ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో వాలిపోయింది. ఏఎస్‌ఆర్‌ జిల్లాలో గంజాయి సాగు దాదాపుగా నిలిచిపోవడంతో టీడీపీ మాఫియా కొత్త ఎత్తుగడ వేసింది. సరిహద్దుకు అవతల ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లో భారీగా సాగు చేస్తున్న గంజాయిని కొనుగోలు చేసి.. ఏపీ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు భారీ స్మగ్లింగ్‌కు ఎత్తుగడ వేసింది. అంటే మరో మాటలో చెప్పాలంటే గంజాయి అక్రమ రవాణాకు రాష్ట్రాన్ని గేట్‌వేగా మార్చేసింది.జవసత్వాలు లేని ఈగల్‌⇒ గంజాయి, డ్రగ్స్‌ దందాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సెబ్‌ను ప్రత్యేకంగా నెలకొల్పింది. సెబ్‌కు పూర్తి స్థాయి చీఫ్‌గా నిబద్దుడైన వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను నియమించి పూర్తి మౌలిక వసతులు కల్పించింది. అందుకే రెండు దశల్లో ఆపరేషన్‌ పరివర్తన్‌ అంతగా విజయవంతమైంది. ఇంతటి ఫలితాలిచ్చిన సెబ్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది.⇒ దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈగల్‌ (ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) పేరుతో ఓ విభాగాన్ని నెలకొల్పింది. కానీ ఈగల్‌ విభాగానికి తగిన మౌలిక వసతులు కల్పించనే లేదు. ఈగల్‌ చీఫ్‌గా ఆకే రవి కృష్ణను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆయన చేతులు మాత్రం కట్టేసిందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఆయన్ను రెడ్‌బుక్‌ కుట్రలకు పావుగా వాడుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం గమనార్హం. ⇒ ఈగల్‌ చీఫ్‌గా ఉన్న ఆయన్ను కాకికాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్‌ అంటూ నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం సిట్‌ ఇన్‌చార్జ్‌గా నియమించింది. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట తిరుపతికి చెందిన మదన్‌ అనే కానిస్టేబుల్‌పై సిట్‌ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానిస్టేబుల్‌ మదన్‌ ఫిర్యాదుపై విచారణ అధికారిగా కూడా ఆకే రవి కృష్ణనే ప్రభుత్వం నియమించడం గమనార్హం. ⇒ అంటే ఆయనపై ఇతరత్రా పని భారాన్ని పెంచడం ద్వారా గంజాయి స్మగ్లింగ్‌ కట్టడిపై దృష్టి సారించకుండా అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. గంజాయి స్మగ్లింగ్‌ కట్టడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఇప్పటికే గుర్తించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని సమాచారం.డీ అడిక్షన్‌ కేంద్రాలకు గ్రహణంగంజాయి వ్యసనం బారిన పడిన యువతను తిరిగి సన్మార్గంలో పెట్టేందుకు నెలకొల్పిన డీ అడిక్షన్‌ కేంద్రాల గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డీ అడిక్షన్‌ కేంద్రాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటయించగా, టీడీపీ ప్రభుత్వం మాత్రం అరకొరగానే నిధులు విదిల్చడమే అందుకు నిదర్శనం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డీ అడిక్షన్‌ కేంద్రాలకు 2021–22లో రూ.3.12 కోట్లు, 2022–23లో రూ.3.99 కోట్లు, 2023–24లో రూ.6.33 కోట్లు చొప్పున వెచ్చించింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో కేవలం రూ.1.10 కోట్లే కేటాయించడం గమనార్హం. అంటే యువత గంజాయి మత్తులో జోగితేనే తమ మాఫియా అడ్డగోలు దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఉద్దేశం అని స్పష్టమవుతోంది.మూడు రూట్లు.. ఆరు లారీలు...టీడీపీ మాఫియా తమ ఏజెంట్లను అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్‌) జిల్లాలోకి పంపించింది. ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిని ఎంపిక చేసుకుని మరీ ఏజెన్సీ ప్రాంతంలో తిష్టవేసేట్టు చేసింది. వారికి ఏజెన్సీలో అద్దె ఇళ్లు, ఇతర సౌకర్యాలను టీడీపీ నేతలే సమకూర్చారు. ఆ ఏజంట్లు ఏఎస్‌ఆర్‌ జిల్లాతోపాటు సరిహద్దులకు అవతల ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లోని గంజాయి సాగు చేసేవారితో సంప్రదింపులు జరుపుతూ భారీగా గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని యావత్‌ దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు దర్జాగా స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ, కర్ణాటకలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎస్‌ఆర్‌ జిల్లా కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత మాఫియా బాగోతం బట్టబయలైంది. ఈ విషయంపై తెలంగాణ, కర్ణాటక పోలీసులు ఇప్పటికే ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం టీడీపీ మాఫియా ఏఎస్‌ఆర్‌ జిల్లా నుంచి దక్షిణ భారతదేశానికి భారీగా అక్రమ రవాణా చేస్తున్న మూడు ప్రధాన మార్గాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా సంస్థలే లక్ష్యంగా పచ్చ నెట్‌వర్క్‌అంతర్రాష్ట్ర స్థాయిలో అక్రమ రవాణానే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా గంజాయి మార్కెట్‌ విస్తరణపై టీడీపీ మాఫియా రంగంలోకి దిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రధాన అనుచరులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని టీడీపీ ద్వీతీయ శ్రేణి నేతలతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్‌ కాలేజీలతోపాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలనే గంజాయి విక్రయ మార్కెట్‌గా చేసుకు­న్నారు. అందుకోసం విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర జిల్లా కేంద్రాల్లో స్టాక్‌ పాయింట్లను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రత్యేకంగా వెండర్లను సైతం ఎంపిక చేసుకున్నారు. పాన్‌ షాపులు, చిన్న చిన్న హోటళ్లు, సంచార వర్తకు­లు.. ఇలా పలువురిని తమ నెట్‌వర్క్‌లో భాగస్వా­ములుగా చేసుకుని చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట గంజాయి విక్రేతలను స్థానిక పోలీసులు గుర్తించి అరెస్టు చేస్తుండటం పరిపాటిగా మారింది. ముఖ్య­మంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి మంత్రి లోకేశ్‌ నియోజకవర్గం మంగళగిరి వరకు ప్రతి చోటా గంజాయి ప్యాకెట్లను చాకెట్ల మాదిరిగా విక్రయిస్తుండటం విస్మయ పరుస్తోంది.టీడీపీ మాఫియాను కాపాడేందుకు అమాయకులపై అక్రమ కేసులురాష్ట్రంలో టీడీపీ గంజాయి మాఫియాను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమాయకులపై అక్ర­మ కేసులు నమోదు చేసేందుకు బరితెగిస్తోంది. ఈ కుట్రలో పోలీసులు భాగస్వాములు కావడం విస్మయ పరుస్తోంది. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం లేని ఆరుగురు యువకులను అక్రమ కేసులో ఇరికించడం ద్వారా టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసుల పన్నాగం బట్టబయలైంది. తూర్పు గోదా­వరి జిల్లా రాజానగరం సీఐ, బొమ్మూరు ఎస్సై మధ్య ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మా­రింది. తద్వారా టీడీపీ గంజాయి బ్యాచ్‌ను కాపా­డేందుకే పోలీసులు ఇంతగా బరితెగిస్తున్నారన్నది స్పష్టమైంది.టీడీపీ గంజాయి మాఫియాలో చిన్న మొక్కలివి..⇒ రాయదుర్గంలో ఓ టీడీపీ నేత తన మామిడి తోటలోనే దర్జాగా గంజాయి సాగు చేశారు.⇒ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల సాగైన గంజాయి వ్యవహారం బట్టబయలైంది. ఇదే నియోజకవర్గంలో ఇరు వర్గాల యువకులు గంజాయి మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు.⇒ మంత్రి లోకేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో మిత్‌ అనే పేరుతో చలామణి అయ్యే రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.⇒ మొక్కల లోడ్‌ ముసుగులో ఏకంగా 326 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా తూర్పు గోదావరి జిల్లా కడియంలో పోలీసులు జప్తు చేశారు. ⇒ సూళ్లూరుపేటలో రూ.3.50 లక్షల విలువైన 20 కిలోల గంజాయిని పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు.

YS Jagan Fires On Education System In Andhra Pradesh Over Delay In AP- ECET Counseling2
ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడో?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ఏపీ ఈసెట్‌ ఫలితాలొచ్చి 45 రోజులవుతున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రారంభించలేదని.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ టీడీపీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు చురకలంటిస్తూ ఆదివారం ‘ఎక్స్‌’లోని తన ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ.ఈసెట్‌ ఫలితాలొచ్చి దాదాపు 45 రోజులవుతున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు.. రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34 వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. మే 15న ఈ ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’’.

Sakshi Guest Column On Israel, Iran War Real politics3
వాస్తవిక రాజకీయం

ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధానికి తాత్కాలికంగానైనా విరామం లభించింది. ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై అమెరికా బంకర్‌ బస్టర్‌ బాంబులు వేసింది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌ వైఖరిపై చర్చ చాలాకాలం పాటు కొనసాగుతుంది. బహుశా కోర్టు మెట్లూ ఎక్కవచ్చు. సుమారు 15 కిలోటన్నుల బరువున్న బంకర్‌ బస్టర్‌ బాంబులు అణుస్థావరాలను ధ్వంసం చేసే అవకా శాలు తక్కువే. అంటే ఇరాన్‌ అణు కార్యక్రమం స్తంబించిపోలేదు. పోనీ అమెరికా బాంబులతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొందా? ఇరాన్‌ లో ప్రభుత్వం మారిందా? ఊహూ! కాదనే చెప్పాలి. బాంబు దాడులకు బదులుగా ఇరాన్‌ పొరుగున ఉన్న ఖతార్‌లోని అమెరికన్‌ స్థావరాలపై దాడులు చేసింది. అది కూడా అమెరికాకు ముందుగానే చెప్పి! ఇందుకు ట్రంప్‌ స్వయంగా ఇరాన్‌కు ధన్యవాదాలూ చెప్పారు. ఏదైతేనేమి... ప్రస్తుతానికైతే శాంతి నెలకొన్నట్టు గానే కనిపిస్తోంది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 20 శాతం కంటే ఎక్కువ రవాణా అయ్యే హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ పార్లమెంట్‌ బంద్‌ చేయాలని తీర్మానించినా ప్రస్తుతానికి ఆ నిర్ణయం అమల్లోకైతే రాలేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధమంటే సహజంగానే చమురు ధరల్లో పెరుగుదల ఉంటుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరగడం, పెట్టుబడిదారులు సంశయంలో పడిపోవడం, వాణిజ్యంపై దుష్ప్రభావం సహజంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచ చమురు షేక్‌ అమెరికా! ఐదో వంతు ముడిచమురు అక్కడే ఉత్పత్తి అవుతోంది. సొంత అవసరాలు పోను ఎగుమతి చేస్తోంది కూడా! ఈ కారణంగానే ఇరాన్‌ , ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలైన తరువాత కూడా చమురు ధర మునుపటిలా బ్యారెల్‌కు 100 – 150 డాలర్ల స్థాయికి చేరలేదు. రెండూ కావాల్సిన దేశాలే!వీటన్నింటి ప్రభావం భారత్‌పై ఎలా ఉండ బోతోంది? భారత్‌ ఇప్పుడు జాగరూకతతో, ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇరు దేశాలతో సత్సంబంధాలున్న దేశంగా మరింత బ్యాలెన్‌ ్సడ్‌గా ఉండాలి. రక్షణ, నిఘా ఉత్పత్తుల విషయంలో ఇజ్రాయెల్‌ ఇప్పుడు భారత్‌కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. హైఫా నౌకాశ్రయంలో భారతీయుల పెట్టు బడులున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇజ్రా యెల్‌తో మన వ్యాపారం గణనీయంగా పెరిగి 500 కోట్ల డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఇరాన్‌ మనకు చమురు సరఫరా చేస్తూండటం గమనార్హం. మన రూపాయిల్లోనే ముడిచమురు కొనుగోలుకు అవకాశం కల్పించిన దేశం కూడా ఇరానే! మిడిల్‌ ఈస్ట్‌ యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా చాబహార్‌ నౌకాశ్రయాన్ని ఇండియా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మన దిగుమతుల్లో 32 శాతం చమురు, 52 శాతం ఎల్‌ఎన్‌ జీ హోర్ముజ్‌ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఇందులో తేడా వస్తే దాని ప్రభావం మన వంటింటి గ్యాస్‌ సిలిండ ర్లపై పడుతుంది. ఎరువుల ఉత్పత్తిలోనూ తేడా లొస్తాయి. రష్యా నుంచి చమురు తెచ్చుకోవడం సులువు కాదు. ఇలా చేయడం అమెరికాకు ఆగ్రహం తెప్పించేదే. చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని మాత్రమే కాకుండా, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై, ద్రవ్య లోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువను 87 కంటే దిగువకు చేర్చవచ్చు. ముడి చమురు బ్యారెల్‌ ధర పది డాలర్లు పెరిగితే భారత స్థూల జాతీయోత్పత్తి 0.3 శాతం వరకూ తగ్గవచ్చుననీ, ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరుగుతుందనీ ఒక అంచనా. స్టాక్‌ మార్కెట్లు కూడా పెరిగే చమురు ధరలకు స్పందించి పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. నైతిక ప్రశ్నలూ ఉన్నాయి...రాజకీయాల్లో నైతికత లేని రోజులివి. అయితే, ఏమాత్రం రెచ్చగొట్టే చర్యలకు దిగకున్నా ఒక సార్వభౌమ దేశంపై జరిగిన దాడిని ఖండించరాదా అన్న ప్రశ్న వస్తోందిక్కడ. ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ దాడిని ‘షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ ’ తన ప్రకటనలో ఖండించింది. ఇండియా ఆ ప్రకటనపై సంతకం చేయకుండా దూరం జరిగింది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం: గాజా ప్రాంతంలో వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ జరగాలన్న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లోనూ భారత్‌ పాల్గొనకపోవడం. ఈ తీర్మానానికి అమెరికా భాగస్వాములైన ఆస్ట్రేలియా, జపాన్‌ , యూకేలతోపాటు 149 దేశాలు మద్దతిచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్‌ ఉద్దేశం ఏమిటి అంటే... ఇజ్రాయెల్, అమెరికాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వాస్తవిక రాజకీయం అనాలి. అయితే ఇది గ్లోబల్‌ సౌత్‌కు నాయకత్వం వహించాలన్న భారత్‌ కాంక్షను తక్కువ చేసేది కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవిక రాజకీయం చేయడం మన సైద్ధాంతిక మార్గాన్ని తప్పినట్లు అవుతుంది. మన ట్రాక్‌ రికార్డులో మచ్చగా మిగులుతుంది. ఏ కూటమితోనూ జతకట్ట కూడదన్న అలీనోద్యమ స్ఫూర్తిని దెబ్బతీసినట్లవుతుంది.ప్రస్తుతం భారతదేశం చాలా సంతులనంతో వ్యవహరిస్తోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మన విధానాన్ని స్పష్టం చేసేందుకు ఇదో మంచి అవకాశం కూడా. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను నడిపించే మూలభూత విలువలను నిర్వచించుకోవాల్సిన తరుణమిది. వ్యూహాత్మక స్వావ లంబన, దేశీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటివి అంతర్జాతీయ స్థాయిలో అసందిగ్ధతకు, పిరికితనానికి కారణం కారాదు. రష్యా–ఉక్రెయిన్‌ , ఇజ్రాయెల్‌– పాలస్తీనా– ఇరాన్‌ ఘర్షణలు భారత ఆర్థిక, దౌత్య, రాజకీయ నైపుణ్యానికి సవాలు విసురుతున్న మాట వాస్తవం. అజిత్‌ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త

Amit Shah Fires On Revanth Reddy Govt4
కాంగ్రెస్‌కు ఏటీఎం: అమిత్‌షా

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ నాయకత్వానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, సింగరేణి నియామకాల వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని భారీగా లూటీ చేసి, ఏటీఎంలా మార్చి దోచేసుకుందని ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డిలతో కలిసి అమిత్‌షా ప్రారంభించారు. పసుపు రైతులతో మాట్లాడారు. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించారు. రైతు మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.అధికారం మారినా అవినీతి మారలేదు‘రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ అవినీతి మారలేదు. బీఆర్‌ఎస్‌ చేసిన అవినీతిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్‌ సిందూర్‌కు ఆధారాలు చూపించాలంటూ రాహుల్‌బాబా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పాకిస్తాన్‌కు భారత్‌ తడాఖా ఏంటో చూపించింది. పదేళ్లలో మూడుసార్లు ఆ దేశంపై దాడి చేసింది. సర్జికల్‌ స్ట్రైక్స్, ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేశాం. యూరి, పుల్వామా, పహల్‌గామ్‌ దాడులకు ధీటైన బదులు ఇచ్చాం. ఆపరేష¯న్‌ సిందూర్‌ ద్వారా పాకిస్తాన్‌ గడ్డపైకి వెళ్లి దాడి చేశాం. అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టింది. కానీ గతంలో కాంగ్రెస్‌ సర్కార్‌.. పాకిస్తాన్‌ విషయంలో మెతక వైఖరి అవలంబించింది..’ అని అమిత్‌షా విమర్శించారు. 2026 మార్చిలోగా నక్సల్స్‌ ఏరివేత‘దేశ భద్రతను మోదీ ప్రభుత్వం పటిష్టం చేçస్తోంది. దేశంలో అశాంతికి కారణమైన నక్సల్స్‌ ఏరివేతకు అపరేషన్‌ కగార్‌ చేపట్టాం. (ఆపరేషన్‌ కగార్‌ చేయాలా.. వద్దా అని సభికులను ప్రశ్నించారు) దశాబ్దాలుగా నక్సల్స్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. లొంగిపోవాలని గతంలోనే హెచ్చరించినా లొంగిపోలేదు. అందుకే కగార్‌ చేపట్టాం. 2026 మార్చిలోగా దేశంలో నక్సల్స్‌ లేకుండా చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి..’ అని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు రాజధానిగా ఇందూరు‘తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాల్లో, ఔషధాల తయారీలో వినియోగించే పసుపు పంటను నిజామాబాద్‌ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోంది. అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డును నెలకొల్పారు. ఇప్పుడు నిజామాబాద్‌ పసుపు పంటకు రాజధాని నగరంగా మారింది. నిజామాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో క్వింటాలుకు అదనంగా కనీసం రూ.7 వేల వరకు ఎక్కువ ధర దక్కుతుంది. ఎగుమతులు భారీగా పెరిగితే ధర కూడా భారీగా పెరిగిపోతుంది. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు దళారుల ప్రమేయం లేకుండా చేయడం జరుగుతుంది. 2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బిలియన్‌ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్‌ కోఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్‌ లిమిటెడ్, ఆర్గానిక్‌ పంటను ప్రోత్సహించేందుకు రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లను నెలకొల్పుతోంది..’ అని అమిత్‌షా వెల్లడించారు.స్థానిక రైతుల పోరాటం ఫలించింది: తుమ్మలతెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయిందని అన్నారు. బోర్డు ద్వారా అధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తోందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్‌ ఆర్‌.భూపతిరెడ్డి, కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, కోఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

 14 nuclear scientists death in Operation Rising Lion5
అణుహత్యలు!

ఇరాన్‌ అణు బలాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జూన్‌ 13న ఇజ్రాయెల్‌ ప్రారంభించిన ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’, కనీసం 14 మంది అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఇరాన్‌ అణు సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్త, ‘ఇస్లామిక్‌ ఆజాద్‌ యూనివర్సిటీ’ అధిపతి అయిన మొహమ్మద్‌ మెహదీ టెహ్రాన్చి, ఆ దేశ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరేడౌన్‌ అబ్బాసి–దవానీ వంటి ప్రముఖులు కూడా మరణించినవారిలో ఉన్నారు. ఇజ్రాయెల్‌ కానీ, మరో దేశంగానీ ఎందుకిలా అణు శాస్త్రవేత్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి?! – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు నేరుగా సైనికులతోనూ పోరాడరు. ఆయుధాలకు ఆయువుపట్టులా ఉన్న శాస్త్రవేత్తలనూ లక్ష్యంగా చేసుకుంటారు. ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధంలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణు స్థావరాల కంటే ముందు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉండే వ్యూహం ఒకటే. కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను నిర్మూలించటం ద్వారా అణు కార్యక్రమాలను ముందుకు సాగకుండా నిలువరింపజేయటం, సంస్థాగతమైన ఆయువు పట్టును పూర్తిగా దెబ్బతీయడం. ఇరాన్‌ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. 2020లో ఇరాన్‌ అణు సూత్రధారి మొహ్సేన్‌ ఫక్రిజాదేను చంపడం వెనుక ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ పన్నిన వ్యూహ లక్ష్యం కూడా సరిగ్గా ఇటువంటిదే.ఇప్పటి వరకు 100 హత్యలుఅణు శాస్త్రవేత్తలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం అన్నది ‘అణు’యుగం ప్రారంభం నుంచీ ఉన్నదే. 1944 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు శత్రుదేశాల దాడుల్లో హతమయ్యారు. అయితే ఈసారి ఇజ్రాయెల్, మునుపటి రహస్య కార్యకలాపాల మాదిరిగా కాకుండా, బహిరంగంగానే ఇరాన్‌ శాస్త్రవేత్తల్ని హతమార్చింది. ఇరాన్‌ అణు మౌలిక సదుపాయాలు, వాయుసేన రక్షణ వ్యవస్థలు, ఇంధన వనరులపైన కూడా చెప్పి మరీ ప్రత్యక్ష దాడులు జరిపింది.నాలుగు ‘హంతక’ దేశాలుచరిత్రలో పొందుపరిచి ఉన్న వివరాలను బట్టి చూస్తే ప్రపంచంలో ప్రధానంగా నాలుగు దేశాలు తమ శత్రు దేశాలకు చెందిన తొమ్మిది వేర్వేరు అణు కార్యక్రమాలపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నాలుగు దేశాలలో మొదటి వరుసలో ఇజ్రాయెల్, అమెరికా; రెండో వరుసలో బ్రిటన్, సోవియెట్‌ యూనియన్‌ ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్‌ల కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తల్ని ఆ నాలుగు దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి. తాజా ఇజ్రాయెల్‌ దాడు­లకు ముందు వరకు 2007 నుంచి 10 మంది ఇరాన్‌ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం అన్నది సంబంధిత దేశంలోని శాస్త్రవేత్తలకే పరిమితం కాలేదు. ఉదాహరణకు, ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ‘మోసాద్‌’ 1980 లో ఇటలీ ఇంజనీరు మారియో ఫియోరెల్లి ఇంటిపై బాంబు దాడి చేసి, ఇరాక్‌ అణు స్థావరాలకు కోసం పని చేస్తున్న ఐరోపా సంస్థలను పరోక్షంగా హెచ్చరించింది. ఏఐతో చంపేశారుశాస్త్రవేత్తలను ‘మట్టుపెట్టటం’లో మునుప­టి విధానాలు మారిపోయాయి. గతంలో వ్యక్తులపై నేరుగా కాల్పులు, లేదంటే బాంబు దాడులు చేసేవారు. ఆ పద్ధతులే ఇప్పుడు మరింత అధునాతనంగా మారా­యి. ఉదాహరణకు, తాజా ఆపరేషన్ లో మరణించిన ఫెరేడౌన్ అబ్బాసి గతంలో 2010 కారు బాంబు దాడి నుండి బయటప­డిన వారే. ఇరాన్ కు చెందిన సుప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఫక్రిజాదే హత్య అప్పట్లో ఓ సంచలనం. అతడి కదలికలపై ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్‌ 2019 నుంచీ నిఘా వేసింది. 2020లో అతడి హత్య కోసం.. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఏఐను ఉపయోగించింది. ఒక టన్ను బరువు ఉండే రిమోట్‌ కంట్రోల్డ్‌ మెషీన్ గన్ ఇందుకోసం వాడారు. అత్యంత రహస్యంగా ఆ గన్ విడి భాగాలను ఇరాన్ లోకి తీసుకొచ్చారు. వాటిని ఒకచోట అమర్చి, ఫక్రిజాదే ప్రయాణిస్తున్న దారిలో ఒక పాడుబడిన వాహనంలో ఉంచారు. అతడు భార్యతో సహా ప్రయాణిస్తుంటే.. కేవలం ఒక్కడికే గురిపెట్టారు. మొత్తం 15 బుల్లెట్ల­ను కేవలం నిమిషం వ్యవధిలో ప్రయోగించారు. కారులో అతడి పక్కను­న్న భార్యకు ఏమీ కాలేదట. హత్య జరిగిన మరుక్షణమే మెషీన్ గన్ ఉంచిన వాహనం కూడా పేలిపో­యి, అందులో ఎలాంటి ఆనవాలూ లభించలేదట. ఈ మొత్తం ఆపరేషన్ ను ఇరాన్ వెలుపల ఒక కమాండ్‌ సెంటర్‌ నుంచి నిర్వహించడం విశేషం.చెప్పి చేయటం మొదలైంది!సైనిక చర్యలతో పాటు, దౌత్యం, ఆంక్షలు, సైబర్‌ దాడులు, నిఘా కార్యకలాపాలు అన్నవి విస్తృతమైన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక వ్యూహంలో భాగంగా ఉంటాయి. అయితే ప్రధానంగా శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే – దౌత్యపరమైన ప్రయత్నాలన్నిటినీ జాప్యం అయ్యేలా చేయటం, తద్వారా అణ్వస్త్రాల తయారీ ఖర్చులు పెరిగేలా చేయటం, అలాంటి కార్యక్రమాలకు ఇతరులకు సహకరించకుండా నిరోధించడం. ఎంత ప్రభావం ఉంటుంది?శాస్త్రవేత్తలను హతమార్చటం అన్నది బలమైన సందేశాన్ని పంపుతుందని, శత్రువు దూకుడును తగ్గిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇజ్రాయెల్‌ సైన్యం ఇటీవలి తన దాడులను ‘సామూహిక విధ్వంసక ఆయుధాలను సమకూర్చుకునే సామర్థ్యానికి గట్టి దెబ్బ’గా అభివర్ణించింది. అయితే, ఇరాన్‌ అణు కార్యక్రమంలో వేలాది మంది శాస్త్రవేత్తలు పాల్గొంటూ ఉండొచ్చనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నదే. ఒకరిద్దరు శాస్త్రవేత్తలను హతమార్చటం వల్ల అణ్వస్త్ర దేశ గమనం పెద్దగా మారకపోవచ్చు. పైగా ఇటువంటి హత్యలు నైతికమైన, చట్టపరమైన, మానవతాపరమైన ఆందోళనలను పెంచుతాయి. శాస్త్రవేత్తల హత్యలు వారిని అమరవీరుల స్థాయికి పెంచే అవకాశం ఉండటంతో అణు అభివృద్ధికి ప్రజల మద్దతు లభించవచ్చు కూడా.

BJP Telangana President will be One of Etala Rajender Or Ramchander Rao6
ఎన్నిక ఏకగ్రీవమే!

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ యెండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకునేవారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు పార్టీ పెద్దలు ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ అభయ్‌పాటిల్, సంస్థాగత ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయ కత్వానికి దిశానిర్దేశం చేశారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే..అందరి సమ్మతితో ఎన్నిక జరిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియలో అందరి సమ్మతితో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేసేలా క్షేత్రస్థాయి నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నామినేషన్‌ వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నామినేషన్‌ పరిశీలన నిర్వహిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్‌ వేస్తే... విత్‌డ్రాకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియంతా నామమాత్రమేనని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలను కలిసి అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి నాయకత్వంతో సమాలోచనలు చేసి అభిప్రాయాలను సైతం స్వీకరించినట్టు తెలిసింది. అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారు.నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పోటీలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి అధ్యక్ష స్థానాన్ని బీసీకే ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే ప్రచారముంది.

Sakshi Editorial On School education of Childrens7
నానాకాలం చదువులు

‘వానాకాలం చదువు’లంటారు. ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల వానకీ, చదువుకీ చుక్కెదురే. చెట్ల కిందో, అరుగుల మీదో, అంతంతమాత్రపు కప్పు కిందో బడులు నడిపేటప్పుడు; చక్కా నడిచి పోడానికి పక్కారోడ్లు లేనప్పుడు వానాకాలంలో చదువుకు గంట కొట్టి ఇంటికి పరిమితమవక తప్పదు. వెనకటి కాలంలో చదువు చెప్పే రోజులతో సమానంగా నిషేధించే రోజులూ ఉండేవి. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి మొదలైన తిథుల్లో, గ్రహణం పట్టినప్పుడూ అధ్యయనం కూడదు. వాటిని ‘అనధ్యయన దినా’లనేవారు. వేదాలు, ఇతర రహస్య విద్యల వల్లింపైతే వర్షాకాలంలో పూర్తిగా నిషిద్ధం. నేర్చుకున్నది మాత్రం నెమరు వేసుకోవచ్చు. క్రమంగా కేలండర్‌ మారిపోయి వర్షర్తువూ, చదువుల ఋతువూ ఒకేసారి మొదలవడం ప్రారంభించాయి. మినహాయింపులున్నా ఆ రెంటి మధ్యా వైరుద్ధ్యం పోయి సయోధ్య వెల్లివిరుస్తోంది. వానలతో పచ్చదనాన్ని తెచ్చుకుని కొత్త ఉత్సాహాన్ని నింపుకొనే ప్రకృతితో చదువుల ఋతువు పోటీపడుతూ రహదారులనూ, బడితావులనూ పిల్లల సందడితో వర్ణరంజితమూ, కర్ణరంజితమూ చేస్తోంది. మరోపక్క విచిత్రంగా ముల్లు ఈ కొస నుంచి పూర్తిగా దాని వ్యతిరేక దిశకు తిరగడమూ జరుగుతోంది. చదువుల అభావ దినాలు పోయి ఉల్బణ దినాలు వచ్చాయి. ఋతు నిర్బంధాలూ, తిథివార నిషేధాలూ పోయి చదువుల కేలండర్‌ ‘సార్వకాలికత’ను తెచ్చుకుంటోంది. వానా కాలం చదువులు పోయి నానాకాలం చదువులొచ్చాయి. అది మరోరకం వైపరీత్యానికి దారి తీసింది. అంతటా కాకపోయినా, అనేక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో వేసవి సెలవులు కుదించుకుపోతున్నాయి. ప్రత్యేకించి పబ్లిక్‌ పరీక్షలు రాయబోయే పిల్లలకు వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ పైన వేసవి పొడవునా ట్యూషన్‌ తరగతులకు హాజరవడం అనివార్యమవుతోంది. భుజాలను వంచే పుస్తకాల బరువుకు తోడు మస్తకాలను భయాందోళనలతో నింపే చదువు బరువూ పెరిగిపోతోంది. ‘స్కూలు వర్కు’ను మించి ‘హోము వర్కు’ నివ్వడంతో బడికీ, ఇంటికీ తేడా చెరిగిపోయి, వేరే వృత్తి ఉద్యోగాల్లో తలమునకలయ్యే తల్లితండ్రులే టీచర్లు గానూ మారి, అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. తల్లుల పరిస్థితి మరీ ఘోరం. ఉద్యోగానికి అదనంగా వంటపనీ, ఇంటిపనీ, పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే ఉపాధ్యాయిని పాత్రనూ పోషించవలసి వస్తోంది. స్త్రీ, పురుష బాధ్యతల మధ్య అసమానతలు కొనసాగుతున్న పరిస్థితిలో గృహిణికి ఇదెంత భారమో ఊహించగలం. స్కూలు ఫీజులూ, ఇతరత్రా వసూళ్ల రూపంలో వేలు, లక్షలు ధారపోస్తున్నా తల్లితండ్రులకు ‘టీచరీ’ రూపంలో ఈ అదనపు చాకిరీ తప్పడం లేదు. ఆటపాటలతో సహా ఇతరేతర మానసికోల్లాసాలకు ఒకటి, రెండు గంటలైనా ఒత్తిడి లేని స్వేచ్ఛా సమయం చిక్కని పిల్లల పాలిట చదువు అక్షరాలా ‘నిర్బంధ’ విద్యే అవుతోంది. విద్యాసంస్థలు చదువు బరువు తగ్గించకుండానే అదనపు వేళల్లో ఆటపాటల బరువునూ మోపడంతో పిల్లలకసలే ఊపిరి సలపడం లేదు. దేశంలో విద్యాబోధన ఎంత శాస్త్రీయంగా జరుగుతోందో పట్టించుకునే వ్యవస్థ అసలేదైనా ఉందా, చదువులు పిల్లల శారీరక మానసిక వికాసానికేమైనా సాయపడు తున్నాయా అన్న ప్రశ్నలు తల్లితండ్రుల నుంచే ఎదురవుతున్నాయి. పరీక్షలలో సాధించాల్సిన మార్కుల గరిష్ఠ శాతం కూడా ఇప్పుడు మారిపోయింది. తదుపరి చదువుకు ఏ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలోనైనా సీటు రావడానికి డెబ్బై, ఎనభై శాతం మార్కులు కూడా సరిపోవడం లేదు, తొంభై శాతం దాటి తీరాల్సిందే. దాంతో పిల్లల్లో పోటీ, అసూయ, అలజడి, ఆందోళన, ఒత్తిడి పెరిగి పోతున్నాయి. తమ చదువూ, భవిష్యత్తుల గురించి తల్లితండ్రులు కనే కలల భారం పిల్లల కను రెప్పల మీద పడి వాళ్ళ నిద్రను హరిస్తోంది.పిల్లల్లో గ్రహణశక్తి, చురుకుదనం పెరిగిన మాట నిజమే కానీ, మొత్తంగా నేటి ఈ చదువుల తీరు ఆదర్శవంతమేనా అన్న సందేహం మాత్రం వదలకుండా వేధిస్తూనే ఉంది. ఇక చదువుల్లో రకరకాల అసమానతలు పెరగడమే తప్ప తగ్గుతున్న జాడలేదు. ఉజ్జ్వల భవిష్యత్తు వైపు నడిపించే చదువుల నిచ్చెనపై చివరి మెట్ల మీద చతికిల బడుతున్నవారు నేటికీ అసంఖ్యాకమే. ఇంకోవైపు నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించడానికి ప్రభుత్వాలు ఇప్పటికీ ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. నూటయాభయ్యేళ్ళ క్రితం, బ్రిటిష్‌ వలస పాలన ప్రారంభం నాటికి మూడు శాతం పైచిలుకు ఉన్న అక్షరాస్యత ఇప్పుడు ఎనభై శాతానికి చేరడం, విడిగా చూసినప్పుడు ఒకింత ఊరటే కానీ, ఎన్నో దేశాలతో పోల్చితే ఈ పెరుగుదల వేగమూ, శాతమూ ఏమంత విశేషం కావని పెదవి విరిచేవారూ ఉన్నారు. ఇందులో మళ్ళీ ప్రాంతీయంగా, జెండర్‌ పరంగా అంతరాలూ యథాతథం. ఎప్పుడో కానీ సోదిలోకి రాని ఈశాన్య రాష్ట్రాలు అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉండటం ఒక విశేష మైతే, ఎంత ప్రామాణికమో తెలియదు కాని, బిహార్‌తో కలసి ఆంధ్రప్రదేశ్‌ ఆ పట్టికలో అడుగు బొడుగు స్థానాలలో కనిపించడం కలవరపరిచే విషయం. ఇక చదువుల నాణ్యత విషయానికొస్తే, పట్టికలో మన దేశం స్థానం ఉసూరుమనిపించే మరో అధ్యాయం. చదువుకీ, మంచి రాబడిగల ఉద్యోగాలకూ పీటముడి పడిన దశలో విద్యాభ్యాసం పూర్తిగా పరుగు పందెంగా మారి పిల్లల్ని విపరీత శ్రమకూ, అలసటకూ గురిచేస్తున్న మాట నిజం. చదువుల మరో పరమార్థమైన జ్ఞాన సముపార్జనకు కూడా పెద్ద పీట వేస్తూ ఎప్పటికది నిలకడ తెచ్చుకుంటుందో, పిల్లల్ని పరీక్షల భయతీరాన్ని దాటించి వైజ్ఞానికపు వెలుగుల ఉల్లాస తీరం వైపు నడిపిస్తుందో కాలమే తేల్చాలి.

Credit score is the standard for loans8
స్కోరుంటేనే.. లోన్‌

తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందని ఓ యువతి పెళ్లికి నిరాకరించింది. మహారాష్ట్రలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. మరో సంఘటనలో క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉన్న వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు సమర్థించింది. ఈ రెండు సందర్భాల్లోనూ రెండు జీవితాలను క్రెడిట్‌ స్కోర్‌ మార్చేసింది. క్రెడిట్‌ స్కోర్‌ అంత ముఖ్యమా.. ఇంతకీ ఈ స్కోర్‌ ఏమిటి.. ఎవరు, ఎలా నిర్ణయిస్తారు.. సామాన్యుల మదిలో ఉన్న సందేహాలకు జవాబు తెలుసుకుందాం. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌నాకు లోన్ కావాలి. క్రెడిట్‌ స్కోర్‌ ఉంటేనే ఇస్తామన్నారు. ఏమిటీ స్కోర్‌?ఓసారి మీ స్నేహితులనో, బంధువులనో ఓ రూ.లక్షో.. 2 లక్షలో చేబదులు అడిగి చూడండి! ఎంతమంది ఇచ్చి ఉంటారు? ఎంతమంది బంగారమో, ఇంటి పత్రాల వంటి హామీలు అడిగి ఉంటారు? మీరు బాగా తెలిసినవారే అయినా మీరు తిరిగి చెల్లించగలరా అని వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది మీరెవరో తెలియకుండా ఓ బ్యాంకు లేదా లోన్‌ యాప్‌ మిమ్మల్ని నమ్మి, ఎలాంటి తనఖా లేకుండా అప్పు ఎలా ఇస్తాయి? అందుకే, మీరేంటి.. గతంలో ఏదైనా బ్యాంక్‌ నుంచి లోన్ తీసుకుంటే తిరిగి ఎలా చెల్లించారు.. చెల్లించకుండా ఎగ్గొట్టారా.. వంటి అంశాలన్నీ వారు చూస్తారు. ఇలా వినియోగదారుడి రుణ అర్హతను సూచించే సంఖ్యే క్రెడిట్‌ స్కోర్‌. దీని ఆధారంగానే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఒకరికి రుణం ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తాయి. చెల్లింపుల చరిత్ర, రుణ అర్హత–తీసుకున్న మొత్తాలు, కాల పరిమితి, తరచూ లోన్లకు దరఖాస్తులు, విభిన్న రుణాలు.. వీటి ఆధారంగా స్కోర్‌ మారుతుంది. మనదేశంలో తొలి క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ ట్రాన్స్యూనియన్ సిబిల్‌. ఈ కంపెనీ ఇచ్చే క్రెడిట్‌ స్కోర్‌.. సిబిల్‌ స్కోర్‌గా జనంలో బాగా పాపులర్‌ అయింది.నా క్రెడిట్‌ స్కోరు తక్కువైతే రుణం రాదా? ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను నిర్వహించిన తీరు ఆధారంగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ/క్రెడిట్‌ బ్యూరోలు 300 నుంచి 900 వరకు స్కోర్‌ ఇస్తున్నాయి. స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే రుణం లభించే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. 90 శాతం లోన్స్ 750కిపైగా స్కోర్‌ ఉన్నవారికే మంజూరు అవుతున్నాయి. ఆదాయం, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా రుణ అర్హతను ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. ఏ కంపెనీలు ఈ స్కోర్‌ ఇస్తున్నాయి? వాటికి ఆర్‌బీఐ అనుమతి ఉందా?క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ లేదా క్రెడిట్‌ బ్యూరోలు వ్యక్తులు, కంపెనీల రుణ సమాచారాన్ని ఆర్థిక సంస్థల నుంచి నెలవారీ ప్రాతిపదికన సేకరించి, నిర్వహణతోపాటు విశ్లేషిస్తాయి. ఈ రుణ సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తుల కోసం క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌లు, కంపెనీల కోసం క్రెడిట్‌ కంపెనీ రిపోర్ట్‌లు రూపొందిస్తాయి. రుణ అర్హత, గత రుణ చరిత్ర ఆధారంగా వ్యక్తుల కోసం క్రెడిట్‌ స్కోర్, కంపెనీలకు క్రెడిట్‌ ర్యాంక్‌లను జారీ చేస్తాయి. ఆర్‌బీఐ లైసెన్స్ పొందిన క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు భారత్‌లో ట్రాన్స్యూనియన్ సిబిల్, ఈక్విఫ్యాక్స్‌ ఇండియా, ఎక్స్‌పీరియన్ ఇండియా, సీఆర్‌ఐఎఫ్‌ హై మార్క్‌. ఆర్‌బీఐ నియంత్రణలోనే ఇవి పనిచేస్తాయి. స్కోర్‌ ఎక్కువగా ఉంటే ప్రయోజనం ఏమిటి?ట్రాన్స్యూనియన్ సిబిల్‌ గణాంకాల ప్రకారం 2025 జనవరి–మార్చిలో కొత్తగా మంజూరైన రుణాల్లో 57.6 శాతం వినియోగదారుల స్కోర్‌ 800లకుపైగా ఉంది. 22.8 శాతం మంది స్కోర్‌ 750–799 మధ్య, 9.7 శాతం వినియోగదారులకు 700–749 మధ్య, 5.2 శాతం కస్టమర్లకు 650–699 మధ్య, 4.7 శాతం మందికి 650 కంటే తక్కువ స్కోర్‌ ఉంది. స్కోర్‌ ఎక్కువగా ఉన్నవారికే లోన్ లభిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. గృహ, వాహన రుణాల వంటి సెక్యూర్డ్‌ లోన్స్కు సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నా, క్రెడిట్‌ హిస్టరీ లేకున్నా రుణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వ్యక్తిగత రుణం, విద్యా రుణాల వంటి అన్ సెక్యూర్డ్‌ లోన్స్కు క్రెడిట్‌ స్కోర్‌ ఉండాల్సిందే. కొత్త వాళ్లకు రుణం రాదంటున్నారు. నిజమేనా?అలాంటిది ఏమీ లేదు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో లోన్లు తీసుకున్నవారిలో 16 శాతం మంది కొత్తవారే. ఉద్యోగులైతే వారు పనిచేస్తున్న కంపెనీని బట్టి రుణ సంస్థలు సూపర్‌–ఏ, కేటగిరీ–ఏ, బీ, సీ, డీ అని విభజించి రుణ మొత్తాన్ని, కాల పరిమితిని నిర్ణయిస్తున్నాయి. కంపెనీ పనితీరు కూడా లోన్ అప్లికేషన్ ను ప్రభావితం చేస్తుంది.నాకు క్రెడిట్‌ హిస్టరీ లేదు. యూపీఐ వాడుతున్నాను. లోన్ వస్తుందా?క్రెడిట్‌ హిస్టరీ లేని ఉద్యోగులు అయితే కనీసం మూడు నెలల పే స్లిప్స్‌ను సమర్పించాలి. ఎన్ బీఎఫ్‌సీలు చిన్న మొత్తాల్లో రుణం ఇస్తాయి. సకాలంలో చెల్లిస్తే క్రెడిట్‌ లిమిట్‌ (రుణ మొత్తం) పెంచుతాయి. యూపీఐ వాడుతున్న చిరు వ్యాపారులు, కార్మికులకు కూడా ఆదాయం, యూపీఐ చెల్లింపులను విశ్లేషించి ఎన్ బీఎఫ్‌సీలు చిన్న మొత్తాల్లో అప్పులు ఇస్తున్నాయి.ఏది మంచి స్కోర్‌ ?851-900 (అద్భుతం)బకాయిలు లేని రుణగ్రహీతలు.751-850 (మంచిది)సకాలంలో చెల్లింపులతో బలమైన క్రెడిట్‌ చరిత్ర ఉన్నవారు.651-750 (సగటు)తగిన రుణ నిర్వహణతో సగటు రుణ చరిత్ర కలిగినవారు.501- 650 (పేలవమైనది)సమయానికి పూర్తికాని చెల్లింపులు, అధిక రుణ వినియోగం కారణంగా ఎక్కువ రిస్క్‌ ఉన్నవారు.300 - 500 (చాలా పేలవమైనది)బకాయిలు, రుణం పొందడంలో ఇబ్బందులతో దారుణమైన రుణ చరిత్ర ఉన్నవారు.రూ.50 లక్షల వరకు.. దరఖాస్తుదారు పనిచేస్తున్న కంపెనీ సూపర్‌–ఏ ప్లస్‌ విభాగంలో ఉండి, స్కోర్‌ మెరుగ్గా ఉంటే.. ఎన్ బీఎఫ్‌సీలు 8 ఏళ్ల కాల పరిమితితో రూ.50 లక్షల వరకు అన్ సెక్యూర్డ్‌ లోన్స్ ఇస్తున్నాయి. గతంలో ఈ కాల పరిమితి అయిదేళ్లు ఉండేది. కంపెనీల స్థిరత్వం, లాభ, నష్టాలు, ఆదాయం కూడా వారి ఉద్యోగులు పొందే రుణ మొత్తాన్ని నిర్ణయిస్తోంది. అంతిమంగా దరఖాస్తుదారు క్రెడిట్‌ స్కోరే ముఖ్యం. – సాయి కుమార్‌ మామిడి, ప్రైవేట్‌ బ్యాంక్‌ సీనియర్‌ సేల్స్‌ అడ్వైజర్, హైదరాబాద్‌

Farmer Destroy Mango Trees: Andhra pradesh9
ఈ పాపం సర్కారుదే

తిరుపతి రూరల్‌: మామిడి రైతులకు ఇదివరకెన్నడూ లేనంత పెద్ద కష్టం వచ్చింది. ఆదుకోవాల్సి­న ప్రభుత్వమే సమస్య సృష్టించి రైతులను అధఃపాతాళానికి తొక్కుతోంది. అయిన వారికి మేలు చేసేందుకు రైతులను ముప్పు తిప్పలు పెడుతూ నష్టాలపాలు చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా మామిడి సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. మామిడిలో అత్యధిక డిమాండ్‌ కలిగిన తోతాపురి వైపు మొగ్గు చూపించారు. ఈ ఏడాది కూడా పంట దిగుబడి బాగానే వచ్చింది. అయితే కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. కూటమి పార్టీల నేతలకు చెందిన పల్ప్‌ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నందున, వారికి మేలు చేయడం కోసం ధర ఎంతగా పతనమవుతున్నా పట్టించుకోలేదు. దీంతో రైతులు నడిరోడ్డుపై మామిడి కాయలను పారబోసి ఆందోళనలు చేపట్టారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదు.పల్ప్‌ తయారీ ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. ఫ్యాక్టరీల ముందు కిలోమీటర్ల కొద్దీ మామిడి లోడుతో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంకా వేలాది టన్నుల మామిడి తోటల్లోనే దర్శనమిస్తోంది. మామిడి పంట సాగు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూడలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడంతో నష్టాలను భరించలేక, వారికి వారే శిక్ష విధించుకుంటున్నారు.పసి బిడ్డల్లా పెంచుకున్న పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి, గోకులాపురం, వేపకుప్పం, గంగిరెడ్డిపల్లి, గడ్డకిందపల్లి గ్రామాల్లోని మామిడి రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకున్న మామిడి చెట్లను మొదళ్లకు నరికేసి కలప వ్యాపారులకు అమ్మేస్తున్నారు. 40 ఏళ్లకు పైబడ్డ భారీ చెట్లను యంత్రాలతో తొలగించేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాలకు పైగా మామిడి చెట్లను తొలగించేసినట్టు సమాచారం. అప్పుడు చెరకు.. ఇప్పుడు మామిడి ⇒ పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కొద్ది రోజులకే నల్ల బెల్లంపై నిషేధం విధించారు. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కనిపించే చెరకు తోటలు క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి. నల్లబెల్లం తయారు చేసిన రైతులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడంతో అత్యధిక శాతం మంది రైతులు చెరకు సాగును వదిలేసుకున్నారు. ⇒ ఆ తర్వాత వేరుశనగ, వరి పంటల సాగుకు అవసరమైన నీరు లేక, వర్షాలు పడక ఆ పంటలను దూరం చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి ఇచ్చే మామిడిని చిన్న, సన్నకారు రైతులు అందరూ సాగు చేసుకున్నారు. ⇒ ఇప్పుడు మళ్లీ కూటమి పార్టీలతో కలిసి గద్దెనెక్కిన చంద్రబాబు.. తన వాళ్లకు లబ్ధి చేకూర్చే ఉదే­్దశంతో మామిడికి గిట్టుబాటు ధర లేకుండా చేశారు. దీంతో రైతులు రోడ్డున పడ్డారు. ఈ ఏడాదే కాదు.. మరో నాలుగేళ్లు చంద్రబాబు పాలనలో మామిడి రైతులకు నష్టాలు, కష్టాలు తప్పవని భావించే రైతులు ఏళ్లతరబడి పెంచుకున్న తోటలను నిర్ధాక్షిణంగా తొలగించేస్తున్నారు. కన్నీటి గాధలు.. బెదిరింపులు⇒ భవిష్యత్తులో కూడా తమకు న్యాయం జరగ­దన్న ఆలోచనతో రైతులు మామిడి తోటలను తొలగించేస్తున్న విషయం మీడియాలో రావడంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కి పడింది. తన చేతకాని తనం బయట పడుతుందనే భయంతో అధికారులను రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా ఉద్యానవన, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా రైతులను బెదిరింపులకు చేస్తున్నారు. ⇒ ‘ఏ అధికారంతో మామిడి తోటను తొలగిస్తున్నావు.. పరి్మషన్‌ ఉందా.. అనుమతి లేకుండా చెట్లు కొట్టేస్తే.. అది మీ తోట అయినా సరే కేసు పెడతాం’ అంటూ రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన మామిడి రైతు మహేందర్‌రెడ్డిని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం పట్టించుకోనందునే ఈ దుస్థితి వచ్చిందని, ధర లేక ఏడుస్తుంటే ఓదార్చి న్యాయం చేయడానికి ముందుకు రాని మీరు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారని సదరు రైతు తిరగబడే సరికి అధికారులు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది. ⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం సరకల్లు గ్రామంలో రమేశ్‌ అనే రైతు తన ఆరు ఎకరాల తోటలో మామిడి కాయలు కోయకుండానే వదిలేశారు. కనీసం కాయలు తెంపిన కూలి కూడా రాని పరిస్థితి ఉండటంతో మామిడి తోటను తొలగించేస్తున్నాడు. తన తండ్రి రెక్కల కష్టంపై 40 ఏళ్లుగా నీరందించి కన్నబిడ్డల్లా సాకిన చెట్లను ఇలా తొలగించడం బాధగా ఉన్నా, ఇకపై మామిడికి గిట్టుబాటు ధర రాదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘పెట్టిన పెట్టుబడి ఎలాగూ రాదు. కనీసం కాయలు కోసినందుకు అయ్యే ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. పంట పక్వానికి వచ్చి కుళ్లిపోతున్న అడిగేవారు లేరు. లారీల్లో తీసుకెళ్తే బాడుగ ఖర్చు కూడా రావడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అందుకే తోటను తొలగించేస్తున్నా’ అంటూ రైతు రమేశ్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇకపై గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశ లేదు మామిడి దిగుబడి బాగానే వచ్చింది. అయితే గిట్టుబాటు ధర మాత్రం రాలేదు. దళా­రులు సిండికేట్‌గా మారి రైతు­లను మోసం చేస్తుంటే ప్రభుత్వం చో­ద్యం చూ­స్తూ వారికి సహకరించడం దుర్మా­ర్గం. పంటను తీసుకుని వ్యాపారి వద్దకు తీసుకువెళితే.. ఇక్కడ ఖాళీ లేదు.. ఇంకో చోటుకు వెళ్లు.. అంటూ చీదరించుకోవడం చూసి తట్టుకోలేకపోయాను. ఇకపై మామిడికి గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశలేదు. అందుకే చెట్లు నరికేసు­్తన్నా. – గిరీష్‌ రెడ్డి, పీవీ పురం, రామచంద్రాపురం మండలంనష్టాలు భరించలేకనే.. మామిడి పంట సాగులో పెడుతున్న ఖర్చులకు సరిపడా ఆదాయం రావడం లేదు. సాగులో నష్టాలు భరించలేక పోతున్నా. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినా ఒక్క రూపాయి మేరకు అయినా సాయం చేయలేదు. వ్యాపారులు పంటను చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నష్టపోవడం కంటే మామిడిని వదిలించుకోవడమే మేలు. అందుకే తోటను నరికేస్తున్నా. – మహేందర్‌రెడ్డి, గంగిరెడ్డిపల్లి, రామచంద్రాపురం మండలంకరోనాలో కూడా రూ.12వేలు ఇచ్చారు మామిడి పంటకు ఇప్పడు ఇస్తున్న ధర చూస్తే కడుపు కాలుతోంది. కరోనా సమయంలో కూడా టన్నుకు రూ.12 వేలు ఇచ్చారు. ఇప్పుడు సీజన్‌ అయిపోతున్నా సరే పంటను అడిగేవారు లేరు. పండించిన పంటను అమ్ముకోవడానికి నరకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మీదట మామిడి పంటలో లాభాలు చూస్తామన్న ఆశ లేదు. అందుకే ఆ చెట్లన్నీ నరికి వేసి వేరే పంట సాగు చేయాలనుకుంటున్నా. – దొరస్వామిరెడ్డి, గోకులాపురం, రామచంద్రాపురం మండలంఇంత దరిద్రం ఎప్పుడూ లేదు మామిడి పంటకు ఇంత దరిద్రమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. రూ.2కు చాక్లెట్‌ కూడా రావడం లేదు. అలాంటిది ఎంతో కష్టపడి సాగుచేసిన మామిడి కేజీ రూ.2కు ఇవ్వాలంటే ఆ రైతు చచ్చిపోక ఏం చేయగలడు? చావడం చేతగాకనే ఇలా చెట్లను చంపేస్తున్నాం. దీనంతటికీ కారణం ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే. గిట్టుబాటు ధర కల్పించి ఉంటే చెట్లను ఎందుకు నరుకుతాం? – చెంగారెడ్డి, రేఖల చేను, రామచంద్రాపురం మండలం చిత్తూరు–పుత్తూరు రహదారిపై రైతుల ఆందోళనగంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని జైన్‌ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద ఆదివారం మామిడి రైతులు చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మామిడి పంటను ఫ్యాక్టరీల వద్దకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. జైన్‌ కర్మాగారం యూనిట్‌ వన్‌ వద్ద 350 వాహనాలు, యూనిట్‌ టు వద్ద 450కి పైగా వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరాయి. దీంతో సకాలంలో అన్‌లోడ్‌ గాక ట్రాక్టర్లలో తీసుకొచ్చిన పంట సగానికి సగం కుళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లూ వాకిలి, కుటుంబాన్ని వదిలి రోజుల తరబడి రేయింబవళ్లూ తిండి, నిద్ర లేక అవస్థలు పడుతూ రోడ్లపై పడిగాపులు కాస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం హీనంగా చూస్తోందని ఆరోపించారు.వారం పది రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట పడిగాపులు కాస్తున్నా తమను పట్టించుకోకపోగా, అధికారులతో కుమ్మక్కైన దళారులు మాత్రం లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. వరుస క్రమంలో టోకెన్లు ఇవ్వకుండా, మిస్‌ చేసి బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్న వారి సరుకునే కొంటున్నారని ఆరోపించారు. ఓ ఉన్నతాధికారి ఫోన్‌ చేస్తే 20–30 ట్రాక్టర్లు దర్జాగా మెయిన్‌ గేటు ద్వారా లోపలికి వెళుతున్నాయని ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీల వద్ద ఒక ట్రాక్టర్‌ అన్‌లోడ్‌ కావడానికి దాదాపు వారం, పది రోజులు పడుతోందని, ఆ సమయానికి అధిక శాతం పంట కుళ్లిపోవడంతో ఆ సరుకు వద్దంటూ ఫ్యాక్టరీ వారు తిప్పి పంపుతున్నారని రైతులు వాపోయారు.

Dr Pardiwala comment on Rishabh Pant struggle10
ఇకపై మళ్లీ ఆడగలనా?

లండన్‌: భారత వికెట్‌ కీపర్, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ఇప్పుడైతే మైదానంలో సెంచరీలు చేసి... పిచ్‌పై ఎగిరి గంతులేస్తూ... పల్టీలతో సంబరాలు చేసుకుంటున్నాడు. కానీ... రెండున్నరేళ్ల క్రితమైతే అతను ఇకపై క్రికెట్‌ ఆడనేమో అన్న కంగారులో మంచంపై ఉండిపోయాడు. 2022లో పంత్‌ ఘోరమైన ప్రమాదానికి గురయ్యాడు. ఆ ఏడాది డిసెంబర్‌ 30వ తేదీన ఢిల్లీ నుంచి సొంతూరు రూర్కీకి కారు నడుపుకుంటూ వెళ్తుండగా ఆ కారు అదుపుతప్పి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘోరప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు ప్రాణంమీదికి తెచ్చుకున్నాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా... స్పృహలోకి రాగానే తొలుత క్రికెట్‌ కెరీర్‌ గురించే ఆందోళన చెందాడు. తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ దిన్‌షా పర్దివాలాతో ‘ఇకపై నేను మళ్లీ క్రికెట్‌ ఆడగలనా?’ అని ప్రశ్నించాడని ఆ డాక్టర్‌ వెల్లడించాడు. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత బృందానికి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన ఈ సీనియర్‌ డాక్టర్‌ అప్పటి ప్రమాదం, తదనంతర చికిత్సపై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులివి... బతికి బట్టకట్టడమే గొప్ప ఘోరమైన ఆ ప్రమాదంలో రిషభ్‌ బతికి బట్టకట్టడమే పెద్ద అదృష్టం. మంచంపై అతన్ని మొదట చూసినప్పుడు... పంత్‌ కుడికాలు మామూలు స్థితిలోనే లేదు. అక్కడక్కడ విరిగి చాలావరకు జరిగిపోయింది. ఆ కాలి చీలమండకు పెద్ద గాయమే అయ్యింది. ఒళ్లంతా గాయాలే. ప్రమాదంలో చర్మం అంతా గీరుకొనిపోయింది. శరీరభాగాల్లో పెద్దగా రాసుకుపోయింది. మెడ నుంచి మోకాళ్ల వరకైతే పైచర్మమంతా చీరుకుపోయింది. కారు లోపలి నుంచి లాగే ప్రయత్నంలో పగిలిన అద్దాలు అతని వీపును, చర్మాన్ని లోపలిదాకా చీల్చాయి. ఇలాంటి పరిస్థితిలోని ఓ క్షతగాత్రుడు బ్రతకడమే కష్టం. పంత్‌ చాలా అదృష్టవంతుడు కాబట్టే బ్రతకడం కాదు... ఏకంగా తనకిష్టమైన ఆటను ఆడేస్తున్నాడు 635 రోజులపాటు... వెంటనే ఐసీయూలో చికిత్స, తదనంతరం మోకాలుకు పలుమార్లు ఆపరేషన్లు, రోజుల తరబడి క్రమం తప్పని ఫిజియోథెరపీ చికిత్స అతన్ని బతికించాయి. కానీ ఆడించాలంటే అది చాలదుగా... ఇంకా చేయాలి. అప్పటిదాకా వైద్యులు శ్రమించారు. అక్కడి నుంచి వైద్యులతో కలిసి పంత్‌ శ్రమించాల్సి వచ్చింది. అలా ఓ వారమో నెలనో కాదు... ఏకంగా 635 రోజులు అంటే దాదాపు రెండేళ్లపాటు సాగిన వైద్యచికిత్స, పునరావాస కార్యక్రమాలతోనే రిషభ్‌ ఓ పెషెంట్‌ నుంచి ఎప్పట్లాగే మళ్లీ క్రికెటర్‌ అయ్యాడు. నిజం చెప్పాలంటే అతని పోరాటం క్రీడాచరిత్రలో నిలిపోయే పాఠమని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన ప్రమాదాల్లో మరణాలే ఎక్కువగా సంభవిస్తాయి. రక్తనాళాలు పని చేయడంవల్లే... ప్రమాదం తీవ్రత వల్ల అతని మోకాలు నుంచి పాదం వరకు జరిగిపోవడంతో అక్కడక్కడ ఎముక స్నాయువులు విరిగాయి. ఇలాంటపుడు కండరాలు, ప్రధాన రక్తనాళాలు కూడా తెగిపోయి రక్తసరఫరా ఆగిపోతుంది. దీంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి రావడం సహజం. కానీ అదృష్టమేమిటంటే... ఇంత జరిగినా కూడా అతని రక్తనాళాలేవీ గాయపపడలేదు. తెగలేదు. దీనివల్లే అతని కాలు తీసేయాల్సిన దుస్థితి రాలేదు. కాలు తిరిగి యథాతథ స్థితికి వచ్చేందుకు, నడిచేందుకు, ఇప్పుడైతే ఆడేందుకు పనిచేస్తుందంటే దీనికంతటికి ప్రధాన కారణం బలమైన రక్తనాళాలే! ఇది ఎంతో అదృష్టముంటేగానీ జరగదు. వాళ్ల అమ్మయితే నడుస్తాడా అని విలపించింది రిషభ్‌ తాను మళ్లీ క్రికెట్‌ ఆడగలనా అని ప్రశ్నిస్తే... అతడి పరిస్థితిని చూసిన వాళ్ల అమ్మయితే ‘నా కొడుకు అసలు నడవగలడా’ అని విలపించింది. దీంతో అప్పుడు గాయాల తీవ్రత గురించి వివరించాను. మళ్లీ మోకాలు పునర్నిర్మాణానికి ఉన్న అవకాశాల్ని చెప్పాను. ఆ తర్వాతే ఏదైనా ఆశించవచ్చని బదులిచ్చాను. 2023 జనవరి 6న నిష్ణాతులైన ఆర్థోపెడిక్‌ వైద్య బృందం నాలుగు గంటలపాలు తొలి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.మూడు చోట్ల ఎముక స్నాయువుల్ని సరిచేసింది. మామూలుగా విరిగిన చోట్ల చికిత్స చేసింది. కొన్నివారాల తర్వాత కూడా అతను సొంతంగా తన పళ్లను బ్రష్‌ చేసుకోలేకపోయాడు. చేతులకు అయిన గాయాలు, చర్మంలోతుగా అయిన గాట్లతో చేతుల్ని కూడా సాధారణంగా కదిలించలేకపోయాడు. మెల్లమెల్లగా నీళ్లు తాగడంతో మొదలుపెట్టి... తర్వాత తర్వాత అన్ని పనులు అలవాటు చేసుకున్నాడు.హ్యాట్రిక్‌ మిరాకిల్స్‌ వల్లే...సర్జరీ, తదనంతరం పరిస్థితిని సమీక్షించిన మీదటే పంత్‌ తల్లికి అతను నడవగలడనే ధైర్యమిచ్చాం. ఇక అతను మాత్రం ఇంతటి ఘోరమైన ప్రమాదంలో జీవించి ఉండటమే అద్భుతమని, కాలు తిరిగి సాధారణ స్థితిలో నడవడం, పరుగెత్తడం మరో అద్భుతమని చెప్పాను. ఇక క్రికెట్‌ ఆడటమైతే మూడో మిరాకిల్‌ అని అతని ధైర్యాన్ని పెంచాను. తను కూడా ఆత్మస్థయిర్యంతో మెలిగాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ కోసం తిరిగి పునరాగమనం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాడు. అందువల్లే బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి తర్వాత మైదానంలోకి వచ్చి యథేచ్ఛగా ఆడగలుగుతున్నాడు. అయితే సెంచరీ చేశాక ఉత్సాహంతో పంత్‌ మైదానంలో పల్టీలు కొడుతున్నాడు. ఈ విన్యాసాలు చేయకపోతేనే మంచిదని సలహా ఇస్తున్నా.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement