ఆర్థిక ఒడిదుడుకులు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఒడిదుడుకులు

Published Thu, Feb 20 2025 8:41 AM | Last Updated on Thu, Feb 20 2025 8:37 AM

ఆర్థిక ఒడిదుడుకులు

ఆర్థిక ఒడిదుడుకులు

తలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్‌..

2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132 కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్‌ రూరల్‌ (వరంగల్‌) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174కు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే, రూ.1,86,278 ఉన్న జనగామ ఈసారి రూ.2,21,424తో 16, రూ.1,79,222తో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్‌ రూ.2,00,309తో 25వ స్థానం, రూ.1,77,316తో 21వ స్థానంలో ఉన్న ములుగు రూ.2,15,772తో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086తో చివరి స్థానంలో నిలిచిన వరంగల్‌ అర్బన్‌ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618తో 31వ స్థానంలో ఉంది.

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్‌ అర్బన్‌ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్‌ రూరల్‌ 22, (వరంగల్‌), మహబూబాబాద్‌ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్‌ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్‌–2024’లో ఈ వివరాలు వెల్లడించారు.

పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనే....

ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికిగాను ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాలలో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్‌ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు అ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్‌ 22, మహబూబాబాద్‌ 23, జనగామ 29, జేఎస్‌ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7.583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్‌ వరంగల్‌ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్‌–2లో నిలిచినట్లు చెబుతున్నారు.

పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్‌....

ఉమ్మడి వరంగల్‌లో 38,20,369 జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జ నం ఊళ్లలోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98, 618 (46.9 శాతం) మంది గ్రా మాల్లో ఉంటున్నారు. వరంగల్‌ జిల్లాలో 7,37,148 మంది 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63, 634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3 శాతం) పట్టణాల్లో, జేఎస్‌ భూపాలపల్లిలో 4,16,763 మందికి 3,74,376 (89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్‌ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671కి 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం) మంది పట్నవాసం చేస్తున్నారు.

జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..

జిల్లా మొత్తం గ్రామీణం పట్టణ/నగరం

జనాభా జనాభా జనాభా

హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629

వరంగల్‌ 7,37,148 5,10,057 2,27,091

జనగామ 5,34,991 4,63,634 71,357

జేఎస్‌.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387

మహబూబాబాద్‌ 7,74,549 6,98,173 76,376

ములుగు 2,94,671 2,83,178 11,493

మొత్తం 38,20,369 28,28,036 9,92,333

జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనకబాటు

రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు

జేఎస్‌ భూపాలపల్లిలో తగ్గి..

ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’

15వ స్థానంలో జేఎస్‌ భూపాలపల్లి

హనుమకొండ జిల్లాలో అర్బన్‌ జనాభా..

మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే

‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్‌–2024’లో వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement