బతుకుదెరువు కోసం వెళ్లి బలి.. | - | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు కోసం వెళ్లి బలి..

Mar 28 2025 1:19 AM | Updated on Mar 28 2025 1:17 AM

లింగాలఘణపురం : మండలంలోని మాణిక్యాపురం గ్రామానికి చెందిన వడగం భాస్కర్‌ (45) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పని చేస్తూ దుర్మరణం చెందాడు. గ్రామంలో ఉపాధి లేక సుమారు పదిహేనేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లాడు. జగద్గిరిగుట్టలోని ఓ పైపుల కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రోజువారీగా పనికి వెళ్లిన భాస్కర్‌.. లిఫ్ట్‌లో ఏర్పడిన లోపంతో ఒక్కసారిగా పైనుంచి కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. భాస్కర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, భాస్కర్‌ పదో తరగతి స్నేహితులు (1994–1995 బ్యాచ్‌) ఆ కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మబ్బు మల్లేశం, జహింగాచారి, సురేశ్‌, రమేశ్‌, రాజు, శ్రీనివాస్‌, శ్రీధర్‌, భాస్కర్‌, బ్రహ్మం తదితరులు ఉన్నారు.

లిఫ్ట్‌ నుంచి పడి వ్యక్తి దుర్మరణం

హైదరాబాద్‌లో మండల వాసి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement