ఆయిల్‌ రూపంలో గంజాయి సరఫరా.. | - | Sakshi

ఆయిల్‌ రూపంలో గంజాయి సరఫరా..

Apr 3 2025 1:26 AM | Updated on Apr 3 2025 1:26 AM

ఆయిల్‌ రూపంలో గంజాయి సరఫరా..

ఆయిల్‌ రూపంలో గంజాయి సరఫరా..

జనగామ: ఏపీ నుంచి ఆయిల్‌ రూపంలో ఉన్న గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడిన ఘటన బుధవారం జిల్లా కేంద్రం నెహ్రూపార్కు ఏరియాలో చోటు చేసుకుంది. ఎస్సై భరత్‌ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలానికి చెందిన ఏజెంట్లు సురేశ్‌, నవీన్‌ మధ్యవర్తుల ద్వారా గంజాయి ఆయిల్‌ను రవాణా చేస్తున్నారు. ఇదే మండలానికి చెందిన గాలి రాహుల్‌ గాంధీ, సుక్రిల్‌ లైకాన్‌ ఆశీష్‌ పేరుతో ఉన్న ఆయిల్‌ గంజాయి కవర్లను వెంట తీసుకుని వైజాగ్‌ నుంచి ఈస్ట్‌కోస్ట్‌ రైలులో హైదరాబాద్‌ బయలుదేరారు. మార్గమధ్యలో రైలులో పోలీసులు తనిఖీ చేస్తున్నట్లు గుర్తించిన ఆ ఇద్దరు జనగామ రైల్వేస్టేషన్‌లో దిగి.. నెహ్రూపార్కు ఏరియాకు నడుచుకుంటూ బయలుదేరారు. జంక్షన్‌లో ఎస్సై భరత్‌ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల ను తనిఖీ చేస్తుండగా, వారిని చూసి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వెంటనే పట్టుకున్నారు. తనిఖీ చేయగా, గంజాయితో తయారు చేసిన ఆయిల్‌ కవర్లను లభించాయి. దీని విలువ రూ.13.42 లక్షలు ఉంటుంది. చింతపల్లికి చెందిన ఏజెంట్లు సురేశ్‌, నవీన్‌ ద్వారా ఇద్దరు వ్యక్తులు రాహుల్‌గాంధీ, లైకాన్‌ రూ.8వేలకు మాట్లాడుకుని హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి ఇచ్చేందుకు వైజాగ్‌ నుంచి బయలుదేరినట్లు ఎస్సై తెలిపారు. ఈఘట నపై విచారణ జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు.

జనగామలో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు

రూ.13.42 లక్షల విలువైన

సరుకు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement