విద్యార్థి సంఘాల నిరసన..
జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల్లో సైతం కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ, నీట్ తరగతులు నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. గతంలో పలు కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని, ఇవ్వాల్సిన మెటీరియల్ ఇవ్వలేదని, సరిగా తరగతులు చెప్పలేదని పలువురు విద్యార్థులు విద్యాశాఖతో పాటు పోలీస్ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.


