
మైత్రి
సంతోష్, స్నేహ, మైత్రి హీరో హీరోయిన్లుగా మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రసింహా’. ధరగయ్య బింగి, ఆంజనేయులు నందవరం, కోటేశ్వర్ రావు జింకల, మనోహర్ కాటేపోగు నిర్మించిన చిత్రం ఇది. ఈ నెల 8న ‘రుద్రసింహా’ చిత్రం థియేటర్స్లో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న సీనియర్ నటులు సుమన్, భానుచందర్ ఆడియోను విడుదల చేశారు. ‘‘యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులందరూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఎంతో థ్రిల్ అవుతారు’’ అన్నారు మనోహర్. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment