రెండు నెలలుగా ఆస్పత్రిలో.. కన్నుమూసిన నటుడు | Tamil Actor Jayaseelan Passed Away | Sakshi

వందకు పైగా సినిమాలు చేసిన నటుడు మృతి

Jan 24 2025 8:22 PM | Updated on Jan 24 2025 8:54 PM

Tamil Actor Jayaseelan Passed Away

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు జయశీలన్‌ (40) అనారోగ్యంతో మరణించారు. రెండు నెలల క్రితం కామెర్ల వ్యాధితో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జయశీలన్‌.. విజయ్‌తో బిగిల్‌, తేరి, ధనుష్‌తో పుదుపేట్టై, విజయ్‌ సేతుపతితో విక్రమ్‌ వేద సినిమాల్లో నటించారు.

తన కెరీర్‌లో వందకు పైగా సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలన్న కోరికతో చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పోయారు. కానీ ఆయన టాలెంట్‌కు తగ్గ గుర్తింపు రాలేదు. ఈయన విజయ్‌ సేతుపతికి మంచి స్నేహితుడని తెలుస్తోంది.

చదవండి: హిట్‌ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement