
ముగిసిన పదో తరగతి పరీక్షలు
నల్లగొండ : పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిసాయి. మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 2న సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. బుధవారం జరిగిన పరీక్షకు మొత్తం 18666 మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా.. 18,628 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. 99.79 శాతం హాజరు నమోదైందని అధికారులు తెలిపారు.
లిటిల్ఫ్లవర్ స్కూల్లో ఏర్పాట్లు..
పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం జరుగనుంది. ఇతర జిల్లాల నుంచి నల్లగొండకు 2 లక్షలకుపైగా పేపర్లు రానున్నాయి. ఏ జిల్లా నుంచి వచ్చే విషయం ఎవరికీ తెలియదు. నల్లగొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు.
7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం