హఠాత్తుగా కుంగిన భూమి.. లోపల ఏమున్నాయో తెలుసా.. | Antiquities Found During Excavations In Karnataka | Sakshi

హఠాత్తుగా కుంగిన భూమి.. లోపల ఏమున్నాయో తెలుసా..

Aug 9 2021 6:52 AM | Updated on Aug 9 2021 10:45 AM

Antiquities Found During Excavations In Karnataka - Sakshi

వెలుగు చూసిన గుహ, ప్రాచీన వస్తువులు  

మాగడి తాలూకాలో మఠానికి చెందిన భూమిలో తవ్వకాలు జరుపుతుండగా ప్రాచీన వస్తువులు బయటపడడం ఆసక్తిగా మారింది.

దొడ్డబళ్లాపురం: మాగడి తాలూకాలో మఠానికి చెందిన భూమిలో తవ్వకాలు జరుపుతుండగా ప్రాచీన వస్తువులు బయటపడడం ఆసక్తిగా మారింది. మాగడి తాలూకా కన్నూరు గ్రామంలో మక్కళ దేవర మఠంలో మఠానికి చెందిన భూమిలో వ్యవసాయ పనుల నిమిత్తం జేసీబీతో తవ్విస్తుండగా హఠాత్తుగా భూమి లోపలకు కూలిపోయింది. దీంతో అక్కడ తవ్వి చూడగా ఒక గుహ, ప్రాచీన కాలం నాటి ఇత్తడి, తామ్రం, మట్టి వస్తువులు లభించాయి.

తట్టలు, దీపం స్తంభాలు, విభూధి ఉండలు, ఉయ్యాల స్తంబం, గంట తదితర వస్తువులు వెలుగుచూసాయి. గతంలో మఠానికి చెందిన స్వామీజీ ఒకరు సజీవ సమాధి అయ్యారని, ఆయన వస్తువులు కూడా సమాధిలో ఉండిపోయి ఇప్పుడు వెలుగు చూసాయని మఠం నిర్వాహకులు తెలిపారు. పోలీసులు పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.   


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement