
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో మరోసారి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజే 52,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 18,03,695కి చేరింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటెన్ను విడుదల చేసింది.
కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 771 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 38,135 కు చేరింది. ఇక గత 24 గంటల్లో 40,574 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 11,86,203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాపంగా రికవరీ రేటు 65.77శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,02,02,858 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. భారత్లో ప్రస్తుతం 5,79,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన!)
Comments
Please login to add a commentAdd a comment