Corona Updates
-
దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్ఠానికి కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కోవిడ్ -19 నుండి 548 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. అటు.. జేఎన్.1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 47కి చేరుకున్నాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 41 కేసులు బయటపడ్డాయి. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! -
వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కొత్తగా 797 కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 797 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరుకుంది. దేశంలో కొత్త వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇప్పటివరకు 157 జేఎన్.1 కరోనా వేరియంట్కు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో అత్యధికంగా 78, గుజరాత్ (34), గోవా (18), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4) కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదైంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు?
2019 డిసెంబర్ చివర్లో సాంప్రదాయంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. తర్వాత కొద్ది వారాల్లోనే ప్రపంచమంతా చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపించింది. మళ్లీ అదే డిసెంబర్లోనే మరో వేరియంట్ రూపంలో వైరస్ మనముందుకొచ్చింది. అసలు డిసెంబర్లోనే ఎందుకని వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇందుకు గల కారణాలేంటి? కరోనా ప్రధానంగా మూడు ప్రధాన మ్యుటేషన్లుగా మార్పు చెందింది. డిసెంబర్ 2020లో వ్యాప్తి చెందిన కరోనా ఆల్ఫా(B.1.1.7), బీటా(B.1.351), గామా(P.1)గా మార్పు చెందింది. మరుసటి ఏడాది 2021 డిసెంబర్లో ఉద్భవించింన ఒమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని మిగిల్చింది. మరుసటి ఏడాది డిసెంబర్ 2022లో ప్రధాన వేరియంట్ వ్యాప్తి చెందనప్పటికీ ఒమిక్రాన్లోనే BA.2, BA.5గా పరిణామం చెందింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న JN1 కూడా ఒమిక్రాన్ వేరియంట్లోని ఉపరకమే. ఇది కూడా డిసెంబర్లోనే వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్లోనే ఎందుకు? ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నుంచి కొవిడ్-19 కొత్త రకంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే. శీతాకాలంలోని చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగానే వైరస్ మార్పు చెంది వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. డెల్టా వేరియంట్, మహమ్మారి మొదటి దశలోనూ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నేచర్ జర్నల్ పేర్కొంది. వేసవి నుంచి శీతాకాలానికి మారినప్పుడు ఉష్ణోగ్రత పడిపోతుంది. గాలి కూడా పొడిగా మారుతుంది. ఉత్తర అర్ధగోళంలోని దేశాలలో కోవిడ్-19 వ్యాప్తికి ఈ అంశాలే దోహదం చేస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. చైనాలోని సిచువాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే విశయాన్ని వెల్లడించారు. వెచ్చని పరిస్థితుల్లోని వారికంటే చల్లని పరిస్థితుల్లో నివసించేవారికి కరోనావైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని వారి అధ్యయనం కనుగొంది. 'కొవిడ్-19 అనేది శ్వాసకోశ వైరస్. దీన్ని ఎదుర్కొనే క్రమంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి వైరస్, రెండోది మన శరీరం. వైరస్ నిరంతరం మార్పు చెంది వేరియంట్లుగా పరిణామం చెందుతోంది. మన శరీరం గత వేరియంట్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని కల్పించుకుంటే మరో రకమైన వేరియంట్ సవాళ్లను విసురుతోంది. అంటే కొత్త వేరియంట్కు మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది.' అని అమృత హాస్పిటల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపు తెలిపారు. సెలవుల్లో పర్యటనలు.. కరోనా వేరియంట్ చైనాలో డిసెంబర్లోనే ఉద్భవించింది. నెలలోనే విపరీతంగా వ్యాప్తి చెందింది. ఉత్తర, దక్షిణ అర్ధగోళంలో డిసెంబర్ నెలలో ఎక్కువగా సెలువులు ఉన్నాయి. క్రిస్టమస్ సెలవులు, చైనాలో జనవరిలో లునార్ న్యూ ఇయర్ వేడుకలు వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయి. ఈ సారి జేఎన్1 వేరియంట్ కూడా సరిగ్గా ఇదే సమయంలో వ్యాప్తి చెందుతోంది. అని డాక్టర్ దీపు తెలిపారు. భయం అవసరం లేదు.. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న జేఎన్ 1 వేరియంట్తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్ 1 వేరియంట్ నుంచి కూడా రక్షిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇదీ చదవండి: Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు -
Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
ఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు పెరిగింది. కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 4054 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 128 కొత్త కేసులు కేరళలో నమోదయ్యామని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. 24 గంటలల్లో కేరళతో కలుపుకొని దేశవ్యాప్తంగా మరో 334 కొత్త కేసులు నమోదు కావటంతో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది. కేరళలో కోవిడ్తో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,248 (4.50 కోట్లు). వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 (4.44 కోట్లు). జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. -
జయశంకర్ భూపాలపల్లిలో కోవిడ్ కలకలం
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్వో మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. చదవండి: Year Ender 2023: జనం సెర్చ్చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ
ఢిల్లీ: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు, రాజస్థాన్, కర్నాటకలో ఒకరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కు చేరుకుంది. అటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ జేఎన్-1 వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 38కి చేరాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. జేఎన్.1 వ్యాప్తి ముందు వేరియెంట్లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఇదీ చదవండి: Year Ender 2023: జనం సెర్చ్చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
TS: ఒక్కరోజులో 12 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 1,322 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ వెల్లడించారు. ఈ మేరకు కరోనా బులెటిన్ విడుదల చేశారు. నమోదైన కేసుల్లో తొమ్మిది హైదరాబాదులోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 38 మంది ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.44 లక్షలకు చేరింది. అందులో 8.40 లక్షల మంది రికవరీ అయ్యారు. చలికాలం కావడం, ఫ్లూ జ్వరాలు కూడా ఉండటం తదితర కారణాలతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. పర్యాటకులకు తప్పనిసరి ఐసోలేషన్ తాజాగా రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకుల కోసం తప్పనిసరి ఐసోలేషన్ను ప్రారంభించాలని రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ వైద్యుల ప్యానెల్ వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ, గోవా, మహారాష్ట్రలలో కోవిడ్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరింది. జేఎన్.1 వేరియంట్ పై స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉందని పేర్కొంది. కేరళ లేదా ఇతర ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు ఎవరైనా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పైగా చాలా మందిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదనిడాక్టర్ల బృందం అభిప్రాయపడింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 40 నమూనాలు..: రాష్ట్రంలో కరోనా కేసులు ఏ వేరియంట్ అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. గత వారం మొత్తం 40 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 4–5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. సమావేశంలో మంత్రి ఆదేశాలిలా.. పని చేయని పీఎస్ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరిగ్గా వినియోగించాలి. అన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య పరికరాలు, డ్రగ్స్, డయాగ్నస్టిక్స్ మొదలైన వాటి అవసరాలను ఆసుపత్రులు తెలియజేయాలి. మొత్తం 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు రోజుకు 16,500 నమూనాలను పరీక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లతో పాటు, రాష్ట్రంలో 84 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ కిట్లు మొదలైన వాటిని టిఎస్ఎంఎస్ఐడిసి సేకరించి సరఫరా చేస్తుంది. గత 2 వారాల్లో మొత్తం 6,344 నమూనాలు సేకరించారు. నెలాఖరు నాటికి పరీక్షలను వేగవంతం చేయాలి. రోజుకు 4,000 పరీక్షలు నిర్వహించాలి. గాంధీ హాస్పిటల్లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపాలి కోవిడ్ రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలి. కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ సంస్థల నుంచి గత నాలుగేళ్లుగా అందిన సీఎస్ఆర్ విరాళాల జాబితాపై నివేదిక అందజేయాలి. -
దేశంలో కరోనా విజృంభణ.. 3 వేలకు చేరిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,997కు చేరింది. ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బిహార్లో నమోదైన కేసులతో దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరిలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా వేరియంట్ జేఎన్1 విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 జేఎన్1 వేరియంట్ కేసులు ఉన్నాయి.కాగా.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇదీ చదవండి: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే.. -
Covid Variant JN.1: కరోనా కొత్త వేరియంట్.. 21 కేసులు నమోదు
కరోనా వైరస్ మరోసారి తన పంజా విసురుతోంది. అంతమైపోయిందనుకున్న కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు భారత్లోనూ నమోదవుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు దేశంలో ఇప్పటి వరకు జేఎన్.1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. చదవండి: ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా?.. కారణమిదే! కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు . వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. -
భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు
-
ఒక్కరోజులో నాలుగు కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా నలుగురికి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కోవిడ్ బులెటిన్ విడుదల చేశారు. కాగా గత వారం రోజుల్లో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితులు అందరూ ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు... కరోనా ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన జేఎన్1 సబ్ వేరియంట్వని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఈ వేరియంట్వి ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కరోనాపై మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలి కొత్త సబ్ వేరియంట్ జేఎన్1 పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గత అనుభవంతో పరిస్థితులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలనీ మాక్డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లోని జేఎన్ 1 వైరస్ పరిస్థితిపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సమగ్ర సమాచారం అందజేశారు. భయపడాల్సిన అవసరం లేదన్న అధికారులు ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మంత్రికి అధికారులు వివరించారు. అయితే ఇతర దేశాల్లో కేసులు పెరిగినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు విరివిగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బుధవారం నుంచి పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇళ్లల్లో వారిని ఐసోలేషన్లో ఉంచడం వల్ల ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. మాస్క్లు అవసరం లేదు కానీ... మాస్క్లు ధరించాల్సిన ప్రత్యేక అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కరోనా కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ సబ్ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయని, కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. -
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మే రకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని, మాస్కులను ధరిం చాలని సూచించారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవా రు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనడానికి రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని, వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజలు ఆందోళన చెంద వద్దని, చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది కరోనా గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న కరోనా వేరియంట్ జేఎన్1 ఒమిక్రాన్కు చెందినదే. ఇది ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో రెండు నెలలుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ప్రమాదకారి కాదని ఇప్పటికే నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శ్వాస కోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ కిరణ్మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
కరోనా డేంజర్ బెల్స్.. మరోసారి 12 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది వైరస్కు బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరగా.. మృతుల సంఖ్య 5,31,300కు పెరిగింది. కాగా.. వైరస్ సోకిన వారిలో 4,42,83,021 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కొనసాగించాలన్నారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఉంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని చెబుతున్నారు. చదవండి: అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది? -
కోవిడ్ గుప్పిట్లో దేశ రాజధాని.. ఏకంగా 430 శాతం పెరిగిన కేసులు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కోవిడ్ గుప్పిట్లో చిక్కుకుంది. కొత్త కేసుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. మూడు వారాల లోపే కేసుల సంఖ్య ఏకంగా 430 శాతం పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పాజిటివిటీ రేటు కూడా 26.54 శాతంగా ఉండటం కలవారుపాటుకు గురిచేస్తోంది. మార్చి 30న ఢిల్లీలో 4,976 కేసులు ఉండగా.. ఏప్రిల్ 17నాటికి ఆ సంఖ్య 13,200కు చేరింది. తాజాగా బుధవారం మరో 1,537 కేసులు వెలుగుచూశాయి. మరో ఐదుగురు వైరస్కు బలయ్యారు. ఫలితంగా ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,25,781కి చేరింది. మృతుల సంఖ్య 26,572గా ఉంది. దేశంలో 10వేలకు పైగా కొత్త కేసులు.. మరోవైపు దేశంలో కరోనా కొత్త కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగి మళ్లీ 10వేల మార్కును దాటాయి. మంగళవారం 7,633 కేసులు వెలుగుచూడగా.. బుధవారం ఆ సంఖ్య 10,542కు పెరిగింది. మరో 38 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63,562గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,31,190కి చేరింది. రికవరీ రేటు 98.67శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..? -
Covid-19: దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు
దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసుల నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226కి చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేల మార్క్కు దాటింది. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో మొత్తం 6,313 రికవరీలు జరగగా మొత్తం రికవరీల సంఖ్య 4,42,35,772కి చేరుకుంది. గత కొద్ది రోజలుగా పెరుతున్న కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే తాజగా నమోదైన కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదీగాక గత 24 గంటల వ్యవధిలో గుజరాత్లో ఆరుగురు, ఉత్తర్ ప్రదేశ్, కేరళలో నలుగురు చొప్పున, ఢిల్లీ, రాజస్థాన్లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్, చత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,31,141కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.13శాతం కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,26,522) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్బీ1.16 వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దేశంలో పదిరోజుల వరకు ఇలానే కొనసాగుతుందని తదనంతరం తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 11,109 మందికి పాజిటివ్.. 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు) -
Covid-19: ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 11,109 మందికి పాజిటివ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 11,109 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేల మార్క్కు చేరువై 49,622గా ఉంది. కరోనా కారణంగా మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు మొత్తం 4,42,16,853 మంది కోలుకున్నారు. మొత్తం 5,31,064 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే రోజువారి పాజిటివిటీ రేటు 5.01శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉంది. కాగా.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా యాంటీ ఇన్ఫెక్టివ్, రెస్పిరేటరీ డ్రగ్స్ విక్రయాలు దాదాపు 50 శాతం పెరిగినట్లు ఓ నివేదిక తెలిపింది. జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారు మెడికల్ షాపులకు వెళ్లి ఈ మందులు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల్లో వృద్ధి నమోదవుతున్న కారణంగా ఉత్తర్ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్కూళ్లు, కాలేజీలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. అలాగే కార్యాలయాల్లో శానిటైజేషన్ చేసి పరిశుభ్రత పాటించాలని, కరోనా లక్షణాలు కన్పించిన ఉద్యోగులకు వర్క్ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వాలని తెలిపింది. చదవండి: స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు తప్పనిసరి.. దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్ఫ్రం హోం..! -
స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు.. ఆ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోం..!
లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. వైరస్ బారినపడకుండా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు పని ప్రదేశాల్లో యజమాన్యాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు తెలిపారు. కార్యాలయాలను శానిటైజర్లతో శుభ్రం చేయాలని, ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ ఉష్ణోగ్రత స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎవరైనా ఉద్యోగుల్లో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తే వాళ్లకు వర్క్ఫ్రం హోం ఇవ్వాలని చెప్పారు. లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ఉద్యోగులకు సూచించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో దాని పక్కనే ఉన్న గౌతమ్ బుద్ధ నగర్, సహా ఇతర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నోయిడా అధికారులు ఈమేరకు చర్యలు చేపట్టారు. దేశ రాజధానిలో గురువారం 1,527 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారంతో పోల్చితే ఇవి 33 శాతం అధికం. పాజిటివీ రేటు కూడా 27.7 శాతంగా ఉంది. దీంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ముందు జాగ్రత్త చర్యగా చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. చదవండి: సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’ -
కొత్తగా 10,158 కరోనా కేసులు నమోదు
-
దేశం లో కొత్త కరోనా కేసులు...
-
Covid-19: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,830 మందికి పాజిటివ్గా తేలింది. గత ఏడు నెలల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. క్రితం రోజుతో(5,676 కేసులు) పోల్చితే దాదాపు 50 శాతం అధికం. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40వేల మార్క్ దాటి 40,215కు చేరింది. కరోనావ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ బారినపడివారిలో 4,42,04,771 మంది కోలుకున్నారు. కోవిడ్ సోకి ఇప్పటివరకు మొత్తం 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త తెలిపారు. వైరస్ వివిధ రకాలుగా మ్యుటేషన్లు చెంది బలహీనపడుతోందని చెప్పారు. అందుకే పాజిటివ్గా తేలిన వారిలో స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావడం లేదని పేర్కొన్నారు. అయితే ప్రజలు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని సూచించారు. చదవండి: కోవిడ్ అంతమయ్యే అవకాశముంది.. అయినా సరే నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే -
గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
-
మళ్లీ పంజా విసురుతున్న కరోనా
-
Corona Virus: జాగ్రత్త! కేసులే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తగ్గుముఖం పట్టిందనుకునేలోపే మరోసారి మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,880 మంది కరోనా బారినపడ్డారు. కిందటి రోజుతో పోలిస్తే కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఇక నిన్న ఒక్క రోజే 14 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 44,196,318కు చేరింది. మరణాల సంఖ్య 5,30,979కు చేరింది. మరణాలు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. రికవరీ రేటు 98.74, మరణాల రేటు 1.19గా ఉంది. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లోనే కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. అంతేగాక మూడు రాష్ట్రాలు (హర్యానా, కేరళ పుదుచ్చేరి) బహరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీచేశాయి. చదవండి: తెలంగాణ పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ -
తెలంగాణలో భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసులు.. దేశంలోనే టాప్-2
సాక్షి, హైదరాబాద్: ఎక్స్బీబీ1.16 కరోనా కొత్త వేరియంట్ కేసులు తెలంగాణలో ఇప్పటివరకు 93 నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కేసులతో తొమ్మిది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు మహారాష్ట్రలో 104 కేసులు, కర్ణాటకలో 57, గుజరాత్లో 54, ఢిల్లీలో 19, పుదుచ్చేరిలో 7, హరియాణాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 3 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఆ వేరియంట్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 344కి చేరుకుంది. ఈ వేరియంట్ వైరస్ అధిక వ్యాప్తిని కలిగి ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని తీవ్రతను ఇంకా నిర్ణయించలేదని పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ సోకినవారు ఇప్పటివరకు తీవ్రమైన స్థితిలో ఉన్నట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు. ఈ కొత్త వేరియంట్ నిర్ధారణకు జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యం. జలుబు, దగ్గు లేదా జ్వరంతో బాధపడేవారు మాస్్కలు ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదు రాష్ట్రంలో మంగళవారం 5,122 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..వారిలో 23 మంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8.42 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 52 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 190 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
Covid XBB 1.16: దేశంలో కరోనా కొత్త వేరియంట్.. నాలుగో వేవ్ తప్పదా?
న్యూఢిల్లీ: దేశంలో తొలి కరోనా కేసు గుర్తించి మూడేళ్లు దాటింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ మహమ్మారి నుంచి బయపడినట్లే అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనాతో పాటు, ఇన్ఫ్లూయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితితో భారత్లో కరోనా కొత్త వేరియంట్ XBB 1.16 వెలుగుచూడటం కలవరపాటుకు గురి చేస్తోంది. అత్యంత వేగంగా వ్యాపించే ఈ ఎక్స్బీబీ రకం వేరియంట్ను ఇప్పటికే చాలా దేశాల్లో గుర్తించారు. అయితే భారత్లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ మున్ముందు పెరిగి దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ కోవిడ్ ట్రాకింగ్ ప్లాట్ఫాం వివరాల ప్రకారం XBB 1.16 వేరియంట్ కేసులు భారత్లోనే అధికంగా నమోదయ్యాయి. మనదేశంలో ఈ వేరియంట్ అధికారిక కేసుల సంఖ్య 48గా ఉంది. అమెరికా, సింగపూర్లో ఈ సంఖ్య 20 లోపే ఉండటం గమనార్హం. గత కొద్ది వారాలుగా భారత్లో ఈ వేరియంట్ కేసుల్లో సడన్ జంప్ నమోదైంది. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్లో XBB 1.16 వేరియంట్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కోవ్స్పెక్ట్రం ప్రకారం XBB 1.16 వేరియంట్ XBB 1.15 నుంచి అవతరించలేదు. కానీ రెండూ XBB నుంచి వచ్చిన ఉపరకాలే. ప్రస్తుతానికి, కోవిడ్ XBB 1.16, XBB 1.15 లక్షణాల మధ్య ఎటువంటి తేడాలు లేవు. ఇది సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, అలసట వంటి లక్షణాలే ఉంటాయి. ఈ వేరియంట్ జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజీపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్ సర్వే వైరల్ -
వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక..!
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్-19 జాగ్రత్తలపై ప్రజలను అలర్ట్ చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్లు పైడినవారు, పిల్లలు, గర్భణీలు గుంపుల్లో తిరగకూడదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ హెచ్చరించారు. వీరు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది మొత్తం కచ్చితంగా మాస్కులు ధరించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అయితే కరోనా పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఏమీ లేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా నిపుణుల కమిటీతో సమావేశమై పరిస్థితిపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. వేసవికాలం సమీపించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్పైనా సమీక్షించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలు రోజుకు రూ.2-3 లీటర్ల నీటిని తీసుకొని హైడ్రేట్గా ఉండాలని సూచించారు. నీటితో పాటు మజ్జిక, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలన్నారు. భారత్లో కరోనా కేసులు తగ్గి చాలా రోజులవుతున్నప్పటికీ ఈ మధ్య మళ్లీ కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పిస్తోంది. మార్చి 5న 281 మంది, మార్చి 4న 324 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) కేసులు వెలుగుచూస్తున్నాయి. అనేక మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తఫ్లూ కరోనా లాంటిది కాకపోయినప్పటికీ జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కర్ణాటక ఆరోగ్యమంత్రి కూడా కరోనా విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చదవండి: కొత్త ఫ్లూ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్ -
గండం నుంచి గట్టెక్కిన చైనా.. భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు!
బీజింగ్: కరోనా గండం నుంచి చైనా మరోసారి గట్టెక్కింది. జనవరిలో మొదట్లో కోవిడ్ పీక్ స్టేజికి వెళ్లి భారీగా నమోదైన కేసులు, మరణాలు ఎట్టకేలకు దిగొచ్చాయి. మూడు వారాల క్రితంతో పోల్చితే గణనీయంగా తగ్గాయి. జనవరి మొదటి వారంతో పోల్చితే కరోనా కొత్త కేసులు 72 శాతం, మరణాలు 79 శాతం తగ్గినట్లు చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం అధికారిక వెబ్సైట్లో బుధవారం వెల్లడించింది. చైనా జనాభాలో 80శాతం మంది కరోనా బారినపడ్డారని, మరో రెండు మూడు నెల్లలో మరో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వ శాస్త్రవేత్త ఒకరు గతవారమే హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం కరోనా లెక్కలను అధికారికంగా వెల్లడించింది. కేసులు తగ్గినట్లు పేర్కొంది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం జనవరి 4న 1,28,000 కరోనా రోగులు ఉండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య 36,000కు పడిపోయింది. అలాగే మరణాలు అప్పుడు రోజుకు 4,273 నమోదు కాగా.. ఇప్పుడా సంఖ్య 896కు దిగొచ్చింది. జ్వరంతో ఆస్పత్రులకు వెళ్లిన వారి సంఖ్య డిసెంబర్ 22న 28 లక్షలుగా ఉండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య లక్షా 11వేలకు పడిపోయింది. చదవండి: మోదీకి షాకిచ్చిన అమెరికా.. బీబీసీ డాక్యుమెంటరీపై యూటర్న్! -
భారత్లో కరోనా కొత్త వేరియంట్లు లేవు.. భయాందోళన వద్దు.. కానీ..!
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కొత్త వేరియంట్లేమీ వెలుగు చూడలేదని కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లు ప్రమాదకరం ఏమీ కాదని, రోగులు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా రాలేదని స్పష్టం చేసింది. ఈమేరకు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా తెలిపారు. కరోనా వేరియంట్ల గురించి ఆందోళన లేనప్పటికీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహిరిస్తోందని అరోరా స్పష్టం చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించారు. అందుకే ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లకు పంపిస్తున్నట్లు చెప్పారు. భారత్లో ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతన్నప్పటికీ, వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా లేదని కేంద్రం వివరించింది. అనేక నమూనాలను పరీక్షించినా కొత్త వేరియంట్లు కన్పించలేదని చెప్పింది. వచ్చే వారం కూడా కేసులు పెరిగే సూచనలు లేవని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, కానీ కరోనా జగ్రత్తలు పాటిస్తేనే మంచిదని సూచించింది. చదవండి: ఆయిల్ పైప్ లైన్ను కట్ చేసిన దుండగులు.. పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం -
25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దీని ముప్పు గురించి తెలుసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పింది. ఎక్స్బీబీ.1.5 వేరియంట్ ప్రపంచానికి కొత్త ముప్పుగా పరిణమించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో గత ఏడాది డిసెంబర్లో ఈ వేరియంట్ వల్లే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. భారత్ బేఫికర్.. మరోవైపు భారత్లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.01గా ఉంది. ప్రస్తుతం 2,509 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.8శాతంగా ఉంది. చదవండి: చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్ లేక నేలపైనే రోగులకు చికిత్స -
చైనా.. ఇప్పటికైనా కరోనా అసలు లెక్కలు చెప్పు..!
బీజింగ్: చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించిన వివరాలను బయటపెడ్డడం లేదు. వైరస్ బాధితులను ట్రాక్ చేయడం సాధ్యం కాదని కొద్దిరోజుల క్రితమే చేతులెత్తేసింది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలను చైనా దాస్తోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వాస్తవ గణాంకాలను చైనా వెల్లడించాలని, దేశంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని కోరింది. వైరస్కు కట్టడిచేసేందుకు అవసరమైతే అంతర్జాతీయంగా సహకారం అందిస్తామని చెప్పింది. కోవిడ్ నిర్వహణకు వైద్య సామర్థ్యాన్ని పెంచుకోవాలని డబ్ల్యూహెచ్ఓ చైనాకు సూచించింది. చైనా నుంచి వచ్చేవారికి ఫ్రాన్స్లో పరీక్షలు.. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయడం కొనసాగిస్తామని ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్ని తెలిపారు. చైనా నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ దీనిపై తాము రాజీపడబోమన్నారు. పరీక్షలు నిర్వహించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. చైనా నుంచి వచ్చే వారికి భారత్, అమెరికా సహా పలు దేశాలు కరోనా పరీక్షను తప్పనిసరి చేశాయి. దీనిపై డ్రాగన్ దేశం తీవ్రంగా స్పందించింది. ఇది వివక్షపూరిత చర్య అని వ్యాఖ్యానించింది. చదవండి: అతి చేష్టలు: ఉక్రెయిన్కు రష్యా న్యూఇయర్ విషెస్ -
Covid-19: ఈ 6 దేశాల మీదుగా వస్తే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైన విషయం తెలిసిందే. చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్, థాయ్లాండ్, హాంకాంగ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనసరి చేసింది. తాజాగా కేంద్రం మరోసారి ఇందుకు సంబంధించి నూతన ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులు ఎవరైనా ఈ ఆరు దేశాల మీదుగా ప్రయాణించి వేరే దేశం నుంచి వచ్చినా సరే ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ ప్రయాణికులు 72 గంటలకు మందు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్టులో నెగిటివ్ వస్తేనే భారత్లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే అనుమతి లేదు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వారం రోజుల క్వారంటన్ నిబంధనను అమలు చేస్తోంది. చదవండి: Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం.. -
గుడ్ న్యూస్.. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులు ఫ్రీ..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్లోకి ఎంట్రీ..! -
Corona Virus: చైనాలో ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు..!
న్యూఢిల్లీ: చైనాలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కే అరోరా వెల్లడించారు. చైనా నుంచి సరైన సమాచారం లేనందున.. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. చైనాలో కోవిడ్ వ్యాప్తికి ఒకటి కాదు నాలుగు వేరియంట్లు కారణమని పేర్కొన్నారు. డ్రాగన్ దేశంలో మహమ్మారి విలయానికి వైరస్ల కాక్టెయిల్ కారణమని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బీఎఫ్.7 వేరియంట్ కేసులు కేవలం 15 శాతం మాత్రమే నమోదవుతున్నాయని.. అత్యధికంగా 50 శాతం కేసులు బీఎన్, బీక్యూ వేరియంట్ ద్వారా వ్యాపిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ఎస్వీవీ వేరియంట్ నుంచి మరో 15 శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. దీంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. కోవిడ్ మొదటి, రెండు, మూడో వేవ్ల నుంచి వ్యాక్సిన్లు, ఇన్ఫెక్షన్ల ద్వారా భారతీయులకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ లభించిందని తెలిపారు. దీని కారణంగా జలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే చైనా వాళ్లకు ఈ వేరియంట్లు వారికి కొత్తవని అన్నారు. ఇంతకుముందు ఇన్ఫెక్షన్ బారిన పడలేదన్నారు. అంతేగాక అక్కడి వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఉండటం, వంటి కారణాల వల్ల చైనీయుల్లో ఎక్కువ మంది మూడు, నాలుగు డోసులు తీసుకున్నారని పేర్కొన్నారు. చదవండి: పసలేని చైనా టీకా.. ఏమాత్రమూ లొంగని కరోనా.. తమకొద్దంటున్న దేశాలు చైనాతో పోల్చుకుంటే భారత్ లో 97 శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని ఆరోరా తెలిపారు. మిగిలిన వారు ఒకటి కంటే ఎక్కువసార్లు కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. ఇక పిల్లల విషయానికొస్తే 12 ఏళ్ల లోపు చిన్నారులు 96 శాతం మంది ఒక్కసారి వైరస్ బారిన పడినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో కూడా చాలా మందికి కోవిడ్ సోకిందని... వీటన్నింటిని చూస్తే మహమ్మారి నుంచి మనం చాలా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అయితే కేసుల విషయంలో చైనా నుంచి అస్పష్టమైన సమాచారం ఉన్నందుకున జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు. చదవండి: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు -
చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు
బీజింగ్: చైనాలో కరోనా నానాటికీ చుక్కలు చూపుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక నగరం జిజెయాంగ్లో రోజుకు కనీసం 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇవి రోజుకు పాతిక లక్షలు దాటొచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులకు రోగుల వెల్లువ నానాటికీ పెరుగుతోంది. మార్చురీల బయట శవాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. చాలాచోట్ల కనీసం 10 రోజులకు పైగా వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఒకవైపు కేసులు ఇలా కట్టలు తెంచుకుంటుంటే మరోవైపు వాటి కట్టడి ప్రయత్నాలను, నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తూ చైనా ప్రభుత్వం హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను పూర్తిగా తెరవాలని నిర్ణయించింది. అంతేగాక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడేళ్లుగా అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనను కూడా పూర్తిగా ఎత్తేయనుంది. ఇవన్నీ జనవరి 8 నుంచి అమల్లోకి వస్తాని ప్రకటించింది. ఇందుకు వీలుగా కరోనాను డెంగీ తదితర జ్వరాలతో సమానమైన బి కేటగిరీకి తగ్గిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య వెల్లడిని కూడా ఆదివారం నుంచి చైనా ఆపేయడం తెలిసిందే. చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం -
కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే?
బెంగళూరు: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపింది. రెవెన్యూ మంత్రి ఆర్ ఆశోక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బీఎఫ్.7 వేరియంట్ సోకిన బాధితుల కోసం ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్లాక్ హాస్పిటల్లో చికిత్స అందించనున్నట్లు చెప్పారు. అలాగే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు కచ్చితంగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఆశోక స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలు, బార్లు, పబ్లు, హోటళ్లలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అర్ధ రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని చెప్పారు. చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అస్వస్థత.. ఎయిమ్స్లో చేరిక -
కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్..
బీజింగ్: కరోనా నిబంధనలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని సోమవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. జనవరి 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో మూడేళ్ల తర్వాత విదేశీ ప్రయాణికులకు విముక్తి లభించింది. ఇకపై చైనాకు వెళ్లేవారు కరోనా నెగిటివ్ ద్రువపత్రం చూపిస్తే సరిపోతుంది. 48 గంటలకు ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలి. అలాగే కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగిన విదేశీయులను ట్రాక్ చేయడాన్ని కూడా చైనా నిలిపివేస్తోంది. సరకు దిగుమతికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వెలుగు చూసిన కొత్తలో విదేశీ ప్రయాణికులు కచ్చితంగా 14 రోజులు ప్రభుత్వ కారంటైన్ కేంద్రంలో ఉండాలని చైనా రూల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకు దీన్ని 21 రోజులకు పెంచింది. అయితే కేసులు తగ్గాక ఐదు రోజులకు తగ్గించింది. కోవిడ్ జీరో పాలసీ పేరుతో దాదాపు మూడేళ్లుగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది డ్రాగన్ దేశం. అయితే ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ మొదటి వారంలో ఆంక్షలు సడలించింది. కానీ ఆ తర్వాత కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
Covid-19: కోట్లలో కోవిడ్ కేసులు.. చైనా దిక్కుమాలిన చర్య..
బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు లక్షల కొత్త కేసులు, వేల మరణాలు నమోదవుతున్నాయి. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పడకలు ఖాళీలేక బేంచీలు, బల్లల మీదే చికిత్స అందిస్తున్నారు. శవాలను పూడ్చేందుకు శ్మశాన వాటికల్లో స్థలం లేక వేరే ప్రదేశాలకు తరలిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే చైనా ఆరోగ్య శాఖ ఆదివారం అనూహ్య ప్రకటన చేసింది. ఇకపై కరోనా కేసుల వివరాలు తాము వెల్లడించమని తెలిపింది. అంటువ్యాధుల నియంత్రణ, పరిశోధన కేంద్రమే కరోనా వివరాలను చూసుకుంటుందని చెప్పింది. అయితే కేసుల లెక్కలు ఎప్పుడు వెల్లడిస్తారు అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో కరోనా లెక్కలు దాచేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. రేడియో ఫ్రీ ఆసియా లీక్ చేసిన ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకారం చైనాలో 20 రోజుల వ్యవధిలోనే 25 కోట్ల మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య చైనా జనాభాలో 17.65 శాతం కావడం గమనార్హం. అంతేకాదు రానున్న మూడు నెలల్లో చైనాలో కరోనా కారణంగా 20 లక్షల మంది చనిపోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా.. -
అక్కడ పరిస్థితులు భయానకం..ఏ క్షణంలోనైనా లాక్డౌన్..ప్లీజ్ వెళ్లకండి
వాషింగ్టన్: చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తమ పౌరులను హెచ్చరించింది అమెరికా. చైనాకు వెళ్లాలనుకునే అమెరికన్లు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పింది. వీలైతే పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించింది. చైనాలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. కరోనా బాధితులకు వైద్యం అందించడానికి ఆలస్యం అవుతోంది. అంబులెన్సులు కూడా సరిగ్గా అందుబాటులో లేవు. పలు చోట్లు ఆంక్షలు కూడా అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు అక్కడకు వెళ్తే ఇబ్బందులు తప్పవు. మేం కూడా వైద్యపరంగా సాయం అందించలేం. అని అమెరికా తమ పౌరులను అప్రమత్తం చేసింది. అలాగే చైనా వెళ్లినవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, పాజిటివ్గా తేలితే క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. కరోనా లాక్డౌన్ ఉండదని ఎవరూ పొరపాటుగా అంచనా వేయవద్దని, పరిస్థితి అదపుతప్పితే చైనా ఏ క్షణంలోనైనా మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశం ఉందని అగ్రరాజ్యం తమ పౌరులను హెచ్చరించింది. చదవండి: మంచు గుప్పెట్లో అమెరికా.. వణికిస్తున్న అతి శీతల గాలులు -
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్కు తరలిస్తారు. ఆక్సిజన్పై ఆరా.. అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో మళ్లీ కేసులు పెరిగి లాక్డౌన్ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్ స్పష్టత ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు అనిల్ గోయల్. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు. అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములాపై మరోసారి దృష్టిసారించాలన్నారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు. చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు.. -
Covid-19: దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రాండమ్గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపే ఏర్పాట్లు చేసింది. బెంగళూరు సహా దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఎయిర్పోర్టులోని ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. కరోనా కొత్త వేరియంట్తో భయాపడాల్సిన పనిలేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రతివారం కరోనా సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని పేర్కొంది. 185 కొత్త కేసులు.. కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటికి దేశంలో గురువారం 185 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,402 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4.47కోట్ల మంది వైరస్ బారినపడగా.. 5.31 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు -
గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..!
బీజింగ్: చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగాయి. రోజు వేల మంది వైరస్ బారినపడుతున్నారు. వందల మంది చనిపోతున్నారు. ఆస్పత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నారు. శ్మశాన వాటికల్లో శవాలు గట్టలుగుట్టలుగా కన్పిస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. చైనా లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కరోనా వల్ల మంగళవారం ఒక్కరు కూడా చనిపోలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ బుధవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఐదుగురే మరణించారని పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 5,241 మంది మాత్రమే వైరస్ కారణంగా చనిపోయినట్లు చెబుతోంది. మంగళవారం కొత్తగా 3,101 మందికి వైరస్ సోకిందని చైనా వెల్లడించింది. వీరిలో 52 మంది విదేశాల నుంచి వచ్చిన వారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి చైనాలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,86,276కి చేరిందని పేర్కొంది. అయితే చైనా లెక్కలకు వాస్తవ పరిస్థితుల వ్యత్యాసానికి కారణం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా సోకిన వారు దుష్ప్రభావాలు లేదా మరే ఇతర కారణంతో చనిపోయినా దాన్ని కోవిడ్ మరణాల కిందే లెక్కకడుతున్నాయి. చైనాలో మాత్రం నిబంధనలు మరోలా ఉన్నాయి. వైరస్ సోకి శ్వాసకోస వ్యవస్థ దెబ్బతిని చనిపోయిన వారిని మాత్రమే కరోనా మృతులుగా గుర్తిస్తోంది. వైరస్ సోకి మిగతా ఏ కారణంతో చనిపోయినా.. వారిని కోవిడ్ మృతులుగా గుర్తించడం లేదు. అలాగే లక్షణాలు ఉంటేనే కరోనా కేసుగా లెక్కగడుతోంది. చైనాలోని ఓ ఆస్పత్రిలో శవాలు ఈ కారణంగానే చైనాలో రోజుకు ఎంతమంది చనిపోయినా.. అధికారిక కరోనా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ నిపుణుల అంచనాల ప్రకారం చైనాలో ప్రస్తుతం రోజుకు 40వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. వందల మంది వైరస్కు బలవుతున్నారు. అక్కడ ఆస్పత్రులు కూడా పడకల ఖాళీ లేనంత రద్దీగా మారాయి. శవాలను ఖననం చేసేందుకు శ్మశానవాటికల్లో ఖాళీ కూడా లేని దుస్థితి ఉంది. చదవండి: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు -
షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..!
బీజింగ్: కరోనా కోరల నుంచి బయటపడిన ప్రపంచంపై మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతాయని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. చైనాలో కరోనా ఆంక్షలు ఇటీవలే ఎత్తివేశారు. దీంతో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అక్కడ రోజులు కాదు గంటల్లోనే వైరస్ బాధితులు రెట్టింపు అవుతున్నారు. ఆస్ప్రత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే 90 రోజుల్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చైనాలో అత్యధికంగా 60 శాతం మందికి వైరస్ సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా ప్రపంచ దేశాల్లో 10 శాతం మంది వైరస్ బారిన పడవచ్చని చెబుతున్నారు. కొత్త సంవత్సరం సమయానికి చైనాలో మరో కరోనా వేవ్ వస్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి కరోనా మూడో వేవ్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. చదవండి: మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు.. -
Maharashtra: కరోనా మృతుల్లో రాష్ట్రానిదే అగ్రస్థానం!
ముంబై: కరోనా మహమ్మారి నియంత్రణలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికీ మృతుల సంఖ్యపై ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. వివిధ ప్రభుత్వ ఆరోగ్య శాఖలు వేర్వేరు సంఖ్య వెల్లడించడంతో అయోమయ పరిస్ధితి నెలకొంది. దీంతో అసలు మృతుల సంఖ్య ఎంత.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక శాఖ 1,39,007 మంది అని వెల్లడించగా మరోశాఖ 1,48,404 అని పేర్కొంది. కరోనా మృతుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉంది. ఆ తరువాత స్ధానంలో కేరళ రాష్ట్రం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. మూడు దశల్లో వచ్చిన కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు ఏకంగా 1,39,007 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇందులో అధిక శాతం కుటుంబ పెద్ద దిక్కు, కుటుంబంకోసం సంపాదించే వారే ఉన్నారు. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశంలో 2020 మార్చిలో కరోనా వైరస్ విజృంభించడం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి లాక్డౌన్ అమలుచేసింది. 2020 మార్చి నుంచి 2021 అక్టోబర్ వరకు రాష్ట్రంలో 1,39,007 మంది కరోనా కారణంగా మృతి చెందారని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో 92,212 మంది పురుషులు, మిగతా మహిళలు, పిల్లలున్నారు. కాని సార్వజనిక ఆరోగ్య విభాగానికి చెందిన సిబ్బంది ఈ నెలలో నిర్వహించిన తాజా అ ధ్యయనంలో 1,48,404 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు పేర్కొంది. దేశంలోని వివిధ రా ష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉంది. కరోనా కారణంగా మృతి చెందిన వారిలో పురుషుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ అందులో కుటుంబ పెద్ద దిక్కు, సంపాధించే వారే అధికంగా ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి ఇద్దరిని కోల్పోయినవారున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 851 మంది పిల్లలు అనాధలయ్యారు. అప్పట్లో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తల్లిదండ్రులను కోల్పొయి ఇలా అనాధలైన పిల్లలకు సాయం చేసింది. ప్రత్యేక పథకం ద్వారా ఆనాథ పిల్లల పేరట రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసింది. వీటి ద్వారా ఈ పిల్లలకు ప్రతీ నెల రూ.1,225 సాయం అందుతుంది. అంతేగాకుండా పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా అనాథలైన ఈ పిల్లలకు 23 ఏళ్ల వయసొచ్చే సరికి బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలతో పోలిస్తే ముంబై అగ్రస్ధానం... ఆరోగ్య శాఖ అందించిన గణాంకాల ప్రకారం కరోనా మృతుల్లో రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లాలతో పోలిస్తే ముంబై ప్రథమ స్ధానంలో ఉంది. రా్ర‹Ù్టరంలో కరోనా రోగుల సంఖ్య 81,35,620 ఉండగా అందులో ఒక్క ముంబైలోనే 11,53,951 ఉంది. అలాగే రాష్ట్రంలో కరోనా రోగులు 98.17 శాతం కోలుకోగా, మృత్యు రేషియో 1.82 ఉందని ఆరోగ్య శాఖ గుణంకాలు చెబుతున్నాయి. ‘టీకా’ చట్టపరమైన బాధ్యత కాదు... ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ప్రజలను కచ్చితంగా ప్రోత్సహిస్తుందని, అయితే టీకాలు వేయడం ప్రభుత్వాల చట్టపరమైన బాధ్యత కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. వ్యాక్సిన్ వల్ల ఎవరైనా దుష్ప్రభావాలకు లోనైతే ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మార్చి 22న కరోనా వ్యాక్సిన్కు సంబంధించి తమ ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు ప్రజా సౌకర్యాలను ఉపయోగించకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. విచారణ సందర్భంగా, తమిళనాడు ప్రభుత్వం తరపున ఏఏజీ అమిత్ ఆనంద్ తివారీ, దీని వెనుక గొప్ప ప్రజా ప్రయోజనం ఉందని చెప్పారు. బహిరంగ ప్రదేశాలను సందర్శించడానికి కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి, తద్వారా కరోనా ఇన్ఫెక్షన్ మరింత విస్తరించబోదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఆయన ఉదహరించారు, ఇందులో రాష్ట్రాలు 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ పొందాలని కోరాయి. కరోనా వ్యాక్సినేషన్ మ్యుటేషన్ను నివారిస్తుందని, వ్యాక్సిన్ లేని వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్కు సంబంధించిన మొత్తం సమాచారం పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉందని కేంద్రం చెబుతోంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి సమ్మతి ఇచ్చిన వ్యక్తికి పూర్తిగా సమాచారం ఇవ్వలేదనే ప్రశ్న తలెత్తదు. పరిహారం కోసం పిటిషనర్లు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మే 2న విచారణ సందర్భంగా, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ విధానాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచింది, ఇది శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడి ఉందని, అయితే ఎవరినీ బలవంతంగా టీకాలు వేయించుకోలేమని పేర్కొంది. కానీ ప్రభుత్వ నిబంధనలు అయితే ప్రయాణానికి టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. -
సుదీర్ఘకాలంగా కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత విముక్తి
కోవిడ్.. రెండేళ్లుగా ప్రజలను అల్లాడిచ్చిన ఈ మహమ్మారి ప్రస్తుతం పత్తాలేకుండా పోయింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓరియంట్ వేరియంట్లతో యావత్ ప్రపంచాన్ని తన గుప్పట్లో పెట్టుకున్న వైరస్ ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. జనాలు కూడా కరోనాను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలేవి పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. సాధారణంగా కోవిడ్ బారిన పడితే 10 లేదా 20 మహా అయితే నెలలో కోలుకుంటారు. కానీ బ్రిటన్కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి సంవత్సరానికి మించి మహమ్మారితో పోరాడుతూనే ఉన్నాడు. ఏకంగా 411 రోజులుగా అతన్ని కరోనా విడిచిపెట్టడం లేదు. దీర్ఘకాలంగా కోవిడ్తో బాధపడుతున్న రోగి తాజాగా వైరస్ నుంచి బయటపడ్డాడు. నిర్ధిష్ట వైరస్ జన్యు కోడ్ను విశ్లేషించి సరైన చికిత్సను అందిచడంతో కోలుకున్నాడని బ్రిటీష్ పరిశోదకులు తెలిపారు. గైస్ &సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, కింగ్స్ కాలేజ్ లండన్లోని పరిశోధకుల బృందం క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో 13 నెలలపాటు కరోనా సోకిన 59 ఏళ్ల వ్యక్తికి చేసిన చికిత్స గురించి వివరించారు. చదవండి: విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు మూత్రపిండం మార్పిడి కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి 2020 డిసెంబరులో కోవిడ్ సోకిందని.. ఈ ఏడాది జనవరి వరకు పాజిటివ్ గానే కొనసాగిందనిప పేర్కొన్నారు. దీర్ఘకాల కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు నానోపోర్ సీక్వెన్సింగ్ టెక్నాలజీతో వేగవంతమైన జన్యు విశ్లేషణ చేశారు. ఈ క్రమంలో రోగికి బీ.1 వేరియంట్ సోకినట్లు గుర్తించారు. కాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ద్వారా చికిత్స చేసినట్లు పరిశోధకులు తెలిపారు. సదరు వ్యక్తి కోవిడ్ ఫస్ట్వేవ్లోనే కరోనాకు గురవ్వడంతో ఈ చికిత్స ద్వారా నయం చేశామని. ఇది ఓమిక్రాన్ వంటి వేరియంట్పై సమర్థంగా పనిచేయదని పేర్కొన్నారు. ఇలా మొత్తానికి కరోనా ఫస్ట్ వేవ్ నుంచి వైరస్తో పోరాడుతున్న రోగిని విజయవంతంగా దాని నుంచి విముక్తి కలిగించారు. సాధారణ వైరస్ కాదు అయితే అతనికి సోకింది పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్. ఇది నార్మల్ కోవిడ్ కంటే భిన్నమైంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇది సోకిన వారు నెలలు ఒక్కోసారి సంవత్సరాలు కూడా కరోనా పాటిజివ్గా వస్తుందని సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టుకు చెందిన అంటువ్యాధుల ప్రత్యేక వైద్యుడు ల్యూక్ స్నెల్ తెలిపారు. అంటువ్యాధుల తీవ్ర ముప్పు వల్ల సగం మంది రోగుల్లో ఊపిరితిత్తుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
భారత్లో కొత్తగా 7 వేల కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,231 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోన కేసుల సంఖ్య 4,44,28,393కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మొత్తం సుమారు 45 మరణాలు సంభవించాయని, దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 5 లక్షలకు చేరుకుందని వెల్లడించింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 0.15 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో సుమారు 377 క్తొత కేసులు నమోదయ్యాయని పేర్కొంది. అలాగే కరోనా సంబంధితన మరణాలు రెండు సంభవించాయని తెలిపింది. ప్రస్తుతం తాజగా అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 2.58 శాతంగా ఉందని పేర్కొంది. (చదవండి: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు) -
కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కేసులు.. గురువారం ఒక్కసారిగా పెరిగాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళనకంగా మారింది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,608 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 16,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,01,343 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.23 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 4,42,98,864 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,36,70,315 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,27,206 మంది మృతి చెందారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 1652 మందికి పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. రెండు వారాల కింద 291 మంది ఆసుప్రతిలో చేరగా.. తాజాగా 591 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య.. 2,08,95,79,722కు చేరింది. బుధవారం ఒక్కరోజే.. 38,64,471 మందికి టీకాలు అందించారు. ఇది కూడా చదవండి: గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా.. -
వామ్మో కరోనా.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఢిల్లీ: క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా.. తాజా కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. నిత్యం 19వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి ఈ మధ్య. మరో వేవ్ ముప్పు తప్పినట్లేనని, వైరస్ ప్రభావం తగ్గిందని, వ్యాక్సినేషన్ ప్రభావంతో కరోనా కట్టడి జరుగుతుందని వైద్య నిపుణులు భావించారు ఇంతకాలం. అయితే కొత్త వేరియెంట్ ప్రస్తావన లేకుండా కొత్త కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా కేసులు పెరిగిపోతున్నందున కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరింది. అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్రేసింగ్పై దృష్టి సారించాలని సూచించింది. ముఖ్యమంగా ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమం తప్పకుండా పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిలకు లేఖలు రాసింది. అంతేకాదు.. దేశంలో కొవిడ్-19 జబ్బుతో మరణించేవాళ్ల సంఖ్య సైతం యాభైకి తక్కువ కాకుండా నమోదు అవుతోంది. కాబట్టి, కరోనా ప్రొటోకాల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య కార్యదర్శి లేఖలో కోరారు. తాజాగా గడిచిన 24 గంటల్లో.. 19,406 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో దేశవ్యాప్తంగా 49 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు దేశంలో నమోదు అయిన మరణాల సంఖ్య 5,26,649కి చేరింది. పాజిటివిటీ రేటు సైతం ఆందోళనకరంగానే ఉంది. అయితే అదే సమయంలో.. గత 24 గంటల్లో రికవరీల సంఖ్య 19,928కి పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35 వేల నుంచి లక్షా 34 వేలకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదీ చదవండి: నా కూతుళ్లకే వ్యాక్సిన్ వేస్తారా! -
జర జాగ్రత్త.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
Corona cases Updates.. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే, కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలపైనే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 20,409 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,988 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి ఇప్పటి వరకు 4,33,09,484 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 5,26,258 మంది కరోనా కారణంగా మృతిచెందారు. మరోవైపు.. 2,03,60,46,307 మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. India reports 20,409 new COVID19 cases today; Active caseload at 1,43,988 pic.twitter.com/3YYULK8bZJ — ANI (@ANI) July 29, 2022 ఇది కూడా చదవండి: 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తుకు అవకాశం.. ఈసీ కీలక నిర్ణయం -
IND: కరోనా రెడ్ అలర్ట్.. భయపెడుతున్న కేసులు, మరణాలు
Corona Cases Updates In India.. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు.. 20వేలపైనే నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 67 మంది మృత్యువాతపడ్డారు. ఇక, కరోనా నుంచి 20,726 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,50,100 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు.. మొత్తం కేసులు 4,38,68,476కు చేరుకోగా.. కరోనా మృతుల సంఖ్య 5,25,997 మందికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,31,92,379 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. ఇప్పటివరకు 201.68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. #COVID19 | India reports 21,411 fresh cases, 20,726 recoveries and 67 deaths in the last 24 hours. Active cases 1,50,100 Daily positivity rate 4.46% pic.twitter.com/jxr8ep9utB — ANI (@ANI) July 23, 2022 ఇది కూడా చదవండి: అప్పుడు ప్రధాని మోదీ, ఇప్పుడు సీఎం యోగికి షాకిచ్చిన బీజేపీ ఎంపీ -
దేశంలో కరోనా కలవరం.. భారీగా పెరిగిన కోవిడ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 21,880 మంది వైరస్ బారిన పడగా.. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కరోనా నుంచి 21,219 మంది కోలుకున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం 149,482 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో వైరస్ నుంచి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 43,171,653కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43,847,065కు చేరింది. మొత్తం 5,25,930 మంది వైరస్కు బలయ్యారు. మొత్తం కేసుల్లో మరణాలు 1.20 శాతంగా ఉన్నాయి. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 201 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. గురువారం ఒక్కరోజే 37,06,997 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,53,341 మందికి వైరస్ సోకింది. 1,789 మంది మరణించారు. 8 లక్షలకుపైగా కోలుకున్నారు. జపాన్లో అత్యధికంగా 135,239 కేసులు రావటం కలకలం సృష్టిస్తోంది. అమెరికాలో కొత్త కేసులు మళ్లీ లక్ష మార్క్ను దాటాయి. 250 మంది మరణించారు. జర్మనీలోనూ 107,819 కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 80వేలు, దక్షిణ కొరియాలో 71 వేల మందికి వైరస్ సోకింది. India records 21,880 new Covid19 cases and 60 deaths in the last 24 hours; Active cases at 1,49,482 pic.twitter.com/HCE6x3uNiW — ANI (@ANI) July 22, 2022 ఇదీ చదవండి: India Covid Updates: దేశంలో కరోనా టెన్షన్ షురూ.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు -
IND: దేశంలో కరోనా టెన్షన్ షురూ.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్దిరోజలుగా తగ్గుముఖం పట్టిన కేసులు బుధవారం అన్యూహంగా పెరిగాయి. దీంతో, ఆందోళన నెలకొంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,566 మంది వైరస్ బారిన పడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కరోనా నుంచి 18,294 మంది కోలుకున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం 1,48,881 పాజిటివ్ కేసులు ఉన్నాయని.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. మరోవైపు.. దేశవ్యాపంగా ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,25,185కు చేరుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,25,870కి చేరింది. వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,31,50,434 చేరుకుంది. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 200.91 కోట్లు వ్యాక్సిన్ డోసులను అందించారు. బుధవారం ఒక్కరోజే 29,12,855 మందికి టీకాలు అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,71,390 మంది వైరస్ బారినపడగా.. మరో 2,015 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో కొత్తగా 1,36,624 మందికి వైరస్ సోకింది. 177 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 1,13,588 మందికి వైరస్ సోకగా.. 367 మంది చనిపోయారు. ఫ్రాన్స్లో కొత్తగా 89,982 మందికి కరోనా సోకగా.. 125 మంది మరణించారు. #COVID19 | India reports 21,566 fresh cases and 18,294 recoveries in the last 24 hours. Active cases 1,48,881 Daily positivity rate 4.25% — ANI (@ANI) July 21, 2022 -
India: వ్యాక్సినేషన్లో కొత్త రికార్డు.. మోదీ ఏమన్నారంటే..?
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా 20వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,528 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా, అదే సమయంలో కరోనాతో 49 మంది మృతిచెందారు.దీంతో, దేశంలో ఇప్పటికి వరకు నమోదైన పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 4,37,50,599కి చేరగా.. కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 5,25,709 మందికి చేరుకుంది. ఇదిలా ఉండగా.. దేశంలో ప్రస్తుతం 1,43,449 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 17,790 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్లో పేర్కొంది. కాగా, కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. వయోజన జనాభాలో 98 శాతం మంది మొదటి డోసు టీకాను తీసుకున్నట్టు తెలిపింది. ఇక, శనివారం ఒక్కరోజే 25,59,840 మందికి వ్యాక్సినేషన్ చేశారు. COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449 199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd — ANI (@ANI) July 17, 2022 ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. అసమానంగా కృషిచేసి ఈ రికార్డును అందుకోవడం గర్వకారణం. ఇది కోవిడ్కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేస్తుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. India creates history again! Congrats to all Indians on crossing the special figure of 200 crore vaccine doses. Proud of those who contributed to making India’s vaccination drive unparalleled in scale and speed. This has strengthened the global fight against COVID-19. https://t.co/K5wc1U6oVM — Narendra Modi (@narendramodi) July 17, 2022 -
భారత్లో కరోనా టెన్షన్.. భయపెడుతున్న పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వరుసగా మూడో రోజూ కూడా 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు రావడం ఆందోళన లిగిస్తోంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,044 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ఇదే సమయంలో కరోనాతో 53 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,30,071కు చేరింది. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కోలుకోగా, 5,25,660 మంది మృతిచెందారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం 1,40,760 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 18,301 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగిందని, యాక్టివ్ కేసులు 0.32 శాతం ఉండగా.. మరణాలు 1.20 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. డ్రాగన్ కంట్రీ చైనాలో కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో నిన్ని ఒక్కరోజే 547 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. #COVID19 | India reports 20,044 fresh cases, 18,301 recoveries, and 56 deaths in the last 24 hours. Active cases 1,40,760 Daily positivity rate 4.80% pic.twitter.com/lvMcyWZ0ti — ANI (@ANI) July 16, 2022 -
కరోనా వైరస్: కలవరపెడుతున్న కొత్త కేసులు
న్యూఢిల్లీ: కొత్త వేరియెంట్ ముప్పు రాకున్నా.. భారత్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20వేలకు పైనే కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో.. 20, 038 కొత్త కేసులు రికార్డు అయ్యాయి. దేశవ్యాప్తంగా 47 మంది కరోనాతో చనిపోయారు. గత ఇరవై నాలుగు గంట్లో దేశవ్యాప్తంగా 20, 038 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే వంద కేసులు తక్కువే(20, 139) నమోదు అయినప్పటికీ.. మరణాలు మాత్రం ఎక్కువే రికార్డు అయ్యాయి. డెయిలీ పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే ఎక్కువగా నమోదు అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని, బూస్టర్ డోసు పంపిణీ ద్వారా వైరస్ కట్టడికి మరింత కృషి చేస్తామని కేంద్రం ప్రకటించుకుంది. సరిగ్గా 145 రోజుల తర్వాత భారత్లో గురువారం 20వేల మార్క్ దాటాయి కొత్త కేసులు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1, 39, 073కి చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో.. 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలు సాధారణ స్థాయికి చేరడం, పాజిటివిటీ రేటు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనాతో ఇప్పటివరకు 5, 25, 604 మంది మృతి చెందారు. జనజీవనం సాధారణంగా మారినప్పటికీ వ్యాక్సినేషన్ ప్రభావంతో కేసులు తక్కువగా నమోదు అవుతుండగా.. చాలామంది టెస్టులకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కొత్త వేరియెంట్ రాకుంటే భారత్ కరోనా గండాన్ని దాటినట్లేనని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఒకరికి కరోనా పాజిటివ్.. లాక్డౌన్లోకి 3 లక్షల మంది!
బీజింగ్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్ ప్రభావిత నగరాలపై లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా.. ఓ చిన్న నగరంలో మంగళవారం ఒకరికి కోవిడ్ పాజిటివ్గా తేలటం వల్ల ఆ నగరం మొత్తం లాక్డౌన్ విధించింది జిన్పింగ్ ప్రభుత్వం. దీంతో 3 లక్షల మందికిపైగా లాక్డౌన్లోకి వెళ్లాల్సి వచ్చింది. హెనాన్ ప్రావిన్స్లోని వుగాంగ్ నగరంలో సోమవారం ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వ్యాధిని అరికట్టేందుకంటూ మూడు రోజుల లాక్డౌన్ విధించారు అధికారులు. నగరంలోని 3,20,000 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలోని ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. అయితే.. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను స్థానిక ప్రభుత్వ సంస్థలు అందిస్తాయని తెలిపారు. మరోవైపు.. అత్యవసర పరిస్థితిలో కారులో వెళ్లేందుకు స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆంక్షల చట్రంలో 25 కోట్ల మంది చైనాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రకాల ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆంక్షల చట్రంలో ఉన్నట్లు జపనీస్ బ్యాంక్ నోమురా వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఆ సంఖ్య రెండింతలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మంగళవారం 347 స్థానిక కేసులు నమోదయ్యాయి. అందులో 80 శాతానికిపైగా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇదీ చూడండి: ప్రమాదకరంగా బీఏ5 వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకుతోంది -
డ్రాగన్ కంట్రీకి దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా సబ్వేరియంట్ కలకలం
షాంఘై: కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్ను గుర్తించినట్లు నగర హెల్త్ కమిషన్ డిప్యూటీ డెరెక్టర్ జావో డాండన్ వెల్లడించారు. రెండు నెలల అనంతరం షాంఘై నగరంలో జూన్ మొదటివారంలో లాక్డౌన్ను ఎత్తివేశారు. అయితే కొత్త కేసులు వెలుగుచూసిన ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానికంగా వ్యాప్తి చెందుతున్న కేసుల సంఖ్య పెరిగినట్లు జావో వివరించారు. దీంతో షాంఘైలో నివాసముండే వారికి జులై 12-14 మధ్య రెండు రౌండ్ల కరోనా పరీక్షలు నిర్వహించిననున్నట్లు చెప్పారు. విదేశాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ BA.5 రకాన్ని చైనాలో తొలిసారి మే 13న షాంఘై నగరంలో గుర్తించారు. ఉగాండ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో ఇది బయటపడింది. ఇప్పుడు అందులోనే సబ్వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. చైనాలో ఇప్పటివరకు మొత్తం 2,26,610 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 5,226 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో 2,20,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,004 యాక్టివ్ కేసులున్నాయి. -
దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 18,257 మందికి పాజిటివ్గా తెేలింది. వైరస్ బారినపడినవారిలో 14,553 మంది కోలుకున్నారు. మరో 42 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,22,651కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,428కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,28,428(0.30 శాతం) యాక్టివ్ కేసులున్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.08శాతంగా నమోదైంది. కరోనా రికవరీ రేటు 98.50శాతంగా ఉంది. మరణాల రేటు 1.20శాతంగా నమోదైంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.76 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మరో 4,32,777 కరోనా పరీక్షలు నిర్వహించారు. -
తెలంగాణలో కరోనా రెడ్ అలర్ట్.. కేసులు ఎన్నంటే..?
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 608 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో కరోనా నుంచి 459 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా మరణాలు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,146 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, ఇప్పటి వరకు తెలంగాణలో 8,05,137 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు 7,95,880 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా బులిటెన్ ప్రకారం.. హైదరాబాద్ 329, మేడ్చల్ మల్కాజ్గిరి 54, ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 5, జగిత్యాల 6, జనగామ 7, గద్వాల 1 , కరీంనగర్ 10, ఖమ్మం 11, ఆసిఫాబాద్ 5, మహబూబ్నగర్ 8, మహబూబాబాద్ 4, మంచిర్యాల 5, మెదక్ 1 , నాగర్ కర్నూల్ 2, నల్గొండ 7, నారాయణపేట్ 4, నిజామాబాద్ 10, పెద్దపల్లి 12, సిరిసిల్ల 4, రంగారెడ్డి 67, సంగారెడ్డి 16, సిద్దిపేట 6, వికారాబాద్ 7, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 2, యాదాద్రి 6 చొప్పున నమోదయ్యాయి. Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.08.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/VwoZEmewKJ — IPRDepartment (@IPRTelangana) July 8, 2022 -
Corona Updates: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసుల పెరుగుదల చూస్తుంటే ఫోర్త్వేవ్ మొదలైందా అనే సంకేతాలకు ఊతమిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా అధికమవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18,930 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,66,739కు పెరిగింది. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 35 మంది మరణించారు. ఇప్పటి వరకు 5,24,305 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 14,650 మంది కోలుకోగా మొత్తం మహమ్మారి నుంచి 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 1,19,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.52శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు 4,29,21,977 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇక ఇప్పటి వరకు 198 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. చదవండి: హైదరాబాద్లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా #COVID19 | India reports 18,930 fresh cases, 14,650 recoveries, and 35 deaths in the last 24 hours. Active cases 1,19,457 Daily positivity rate 4.32% pic.twitter.com/cAqSEIWR0L — ANI (@ANI) July 7, 2022 -
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మరో 28 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 16,159 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,35,47,809కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,270కి పెరిగింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసుల సంఖ్య 737 పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,15,212 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడినవారిలో 98.53 శాతం మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. మరణాల శాతం 1.21గా నమోదైంది. రోజూవారి పాజిటివిటీ రేటు 3.56శాతం కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.54శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.20 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన 4,54,465 కరోనా పరీక్షలతో కలిపి మొత్తం పరీక్షల సంఖ్య 86.49 కోట్లకు చేరింది. -
భారత్ను టెన్షన్ పెడుతున్న కరోనా.. పాజిటివ్ కేసులు ఎన్నంటే..?
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు, మరణాల రేటు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో 16,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో వైరస్ కారణంగా మరో 31 మంది మృతిచెందారు. కాగా, ప్రస్తుతం దేశంలో 1,11,711 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 13,929 బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 4,35,02,429కి చేరాయి. ఇందులో 4,28,65,519 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,199 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉంది. ఇక మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 197.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. #COVID19 | India reports 16,103 fresh cases, 13,929 recoveries and 31 deaths, in the last 24 hours. Active cases 1,11,711 Daily positivity rate 4.27% pic.twitter.com/bSAssBCfIX — ANI (@ANI) July 3, 2022 -
కరోనా భారత్: ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు!
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గత వారంగా క్రమం తప్పకుండా 15వేలకు పైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి తోడు డెయిలీ పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. తాజాగా.. దేశంలో ఒక్కరోజులో 17,092 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 29 నమోదుకాగా.. 14,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి చేరుకోగా.. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రేసింగ్పై దృష్టిసారించాలని కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరుతోంది. #AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/VkryOJG5vz pic.twitter.com/QxO99p5odW — Ministry of Health (@MoHFW_INDIA) July 2, 2022 భారత్లో ఇప్పటిదాకా కరోనాతో 5,25,168 మంది మరణించారు. కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,28,51,590 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా 1,97,84,80, 015 డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉందన్న డబ్ల్యూహెచ్వో హెచ్చరికలను ఇప్పటికే పలు దేశాలు పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. -
భారత్లో కరోనా: యాక్టివ్ కేసులు పైపైకి..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 17, 070 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే (18వేలకుపైగా) తక్కువే అయినప్పటికీ.. పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం, రికవరీలు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా 17,070 కేసులు నమోదు అయ్యాయి. 23 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07, 189కి చేరింది. దేశంలో 3.40 శాతానికి కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. ఈ మధ్యకాలంలో రికవరీల సంఖ్య పెరగకపోవడంపై వైద్య విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని అంచనా వేస్తున్నారు. ఇక సుమారు 122 రోజుల తర్వాత.. దేశంలో లక్ష మార్క్ను దాటేశాయి కరోనా యాక్టివ్ కేసులు. గత రెండు వారాల సగటున 78 శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోందని, మరణాలు కూడా 119 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ విషయంలోనూ కేంద్రం స్పష్టమైన ప్రకటనలూ చేస్తూ వస్తోంది. #Unite2FightCorona ➡️ Over 86.28 Cr COVID Tests conducted so far. ➡️ Weekly Positivity Rate currently at 3.59%. ➡️ Daily Positivity Rate stands at 3.40%. pic.twitter.com/aRFcPhQ8Is — Ministry of Health (@MoHFW_INDIA) July 1, 2022 ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్. గత వారం రోజుల్లో 4.1 మిలియన్ కేసులు నమోదు అయ్యాయని, 18 శాతం పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి కథ ముగియలేదని, మార్పు తీసుకుని వేరియెంట్ల రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తోంది డబ్ల్యూహెచ్వో. చదవండి: కరోనా మారుతోంది.. జాగ్రత్తగా ఉండండి -
ఫోర్త్ వేవ్ రెడ్ అలర్డ్: లక్ష దాటిన యాక్టివ్ కేసులు
Corona Active Cases In India.. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,819 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో 39 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 13,827 మంది కోలుకున్నారు. అయితే, రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.16 శాతానికి పెరిగింది. #COVID19 | India reports 18,819 fresh cases and 39 deaths, in the last 24 hours. Active cases 1,04,555 Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr — ANI (@ANI) June 30, 2022 ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఫిబ్రవరి 28 తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటడం ఇదే రెండోసారి. కాగా, ఫిబ్రవరి 28న దేశంలో 1,02,601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ జూన్ 30(నేడు)వ తేదీన ఆ మార్కు దాటి యాక్టివ్ కేసులు పెరిగాయి. -
భారత్లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారతీయులకు స్వల్ప ఊరట లభించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,793 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్తో 27 మంది మృతిచెందారు. ఇక, కరోనా నుంచి 9,486 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 96,700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశంలో 43,418,839 మంది వైరస్ బారినపడగా.. కరోనాతో 5,25,047 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 4,27,97,092 కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది. భారత్లో సోమవారం 19,21,811 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 366,742 మంది కరోనా బారినపడగా.. మరో 759 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,351,925కు చేరుకుంది. ఇది కూడా చదవండి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 25 మంది.. -
Corona Alert: దేశంలో 45 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్తో దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 పాజిటవ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఇక, దేశంలో ప్రస్తుతం 94,420 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,208 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,87,606 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,25,020 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. ఇక దేశంలో 1,97,11,91,329 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఇక, ఆదివారం 11,739 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సోమవారానికి కేసుల సంఖ్య ఒక్కసారిగా 17వేల మార్కును దాటింది. దీంతో, పాజిటివ్ కేసుల సంఖ్య 45 శాతం పెరిగింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 20 తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య 17వేలు దాటడం జూన్ 24న, మళ్లీ సోమవారమే(జూన్ 27) చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో 6493 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 1891 కేసులు నమోదయ్యాయి. India reports 17,073 fresh COVID19 cases & 21 deaths today; Active caseload at 94,420 pic.twitter.com/NBcPK0kcl7 — ANI (@ANI) June 27, 2022 ఇది కూడా చదవండి: దావత్లు ఇవ్వరు.. డీజే, బారాత్లు బంద్.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు అక్కడ!! -
భారత్లో కరోనా: కొత్తగా కేసులు ఎన్నంటే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో.. 15,940 కొత్త కేసులు రికార్డు అయ్యాయి. పాజిటివ్ కేసులు కాస్త తగ్గినప్పటికీ.. వరుసగా రెండు రోజుల పాటు 15 వేల పైచిలుకు కేసులు నమోదవడం విశేషం. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 91,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.21 శాతంగా ఉంది. కరోనా వల్ల గత 24 గంటల్లో 20 మంది చనిపోయారు. కరోనాతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 5,24,974కి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4, 27,61,481కి చేరుకుంది. కరోనా బారిన పడినవారిలో 98.58 శాతం కోలుకుంటున్నారు. ఇక గడచిన 24 గంటల్లో 15,73,341 కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. దాంతో, దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 196.94 కోట్ల డోసులు పంపిణీ జరిగింది. -
భారత్లో కరోనా.. ఒక్కసారిగా పెరిగిన కేసులు
న్యూఢిల్లీ: కొత్త వేవ్ సంకేతాలకు ఊతమిచ్చేలా.. భారత్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం తదితర కారణాలతో కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 30 శాతం కేసులు పెరిగిపోగా.. నాలుగు నెలల తర్వాత దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత వారం నుంచి రోజూ 10 వేలకుపైనే కొత్త కేసులు వస్తు న్నాయి. గురువారం 13,313 కేసులు.. కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శుక్రవారం 17,336 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అంటే.. గత ఇరవై నాలుగు గంటల్లో ఇది 30 శాతం(4,294 కేసులు) మేర పెరిగింది. గత ఇరవై నాలుగు గంటల్లో.. కరోనాతో 13 మంది చనిపోయారు. అలాగే పాజిటివిటీ రేటు కూడా దాదాపు 4 శాతంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 88,284కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 కేసులు వచ్చాయి. కేరళలో 3,890, ఢిల్లీ 1,934 కేసులు, తమిళనాడు 1,063 కేసులు, హర్యానా(872) కేసులు వచ్చాయి. ఢిల్లీలో అంతకు ముందు రోజు 926 కేసులు రాగా, తాజాగా 1,934 కేసులతో రెట్టింపు కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి.. వైరస్ మ్యూటేషన్ గురించి ఆరా తీశారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని పలు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కరోనాతో ఇప్పటిదాకా దేశంలో 5,24,954 మరణాలు నమోదు అయ్యాయి. 4,27,49,056 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,96,77,33,217 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. -
Covid 4th Wave: గత అనుభవాలతో గట్టిగా ఎదుర్కొందాం..!
కరోనా.. ప్రపంచాన్ని గడగడ లాడించిన మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రూపుమార్చుకుని.. కొత్త వేరియంట్లు/ ఉప వేరియంట్లతో మరోసారి దాడికి సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాల్లో విజృంభిస్తున్న ఈ వైరస్.. కొద్దిరోజులుగా మన దేశంలోనూ ప్రభావం చూపుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ గణనీయంగానే నమోదవు తున్నాయి. గత మూడు వేవ్ల తాకిడికి మనమంతా తీవ్రంగా నష్టపోయినా గత అనుభవాలు నేర్పిన పాఠంతో వైరస్ను గట్టిగా ఎదుర్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ కొద్ది నెలలుగా కలకలం.. 2019 డిసెంబర్లో చైనాలో కరోనా కలకలం మొద లైంది. అప్పటికే చాప కింద నీరులా చాలా దేశా లకు విస్తరించిన మహమ్మారి.. ఒక్కసారిగా పంజా విసరడం మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ దేశాలను కబళించింది. ఒకటి, రెండు, మూడో వేవ్ అంటూ కరాళనృత్యం చేసింది. విస్తృతమైన వ్యాక్సినేషన్ ఓవైపు.. విపరీత మైన మ్యుటేషన్లతో వైరస్ బలహీనపడటం మరోవైపు.. కలిసి అదుపులోకి వచ్చింది. కాదు వచ్చినట్టే కనబడింది. కొద్దిరోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, కొన్ని దేశాల్లో అయితే లక్షల్లో నమోదవుతూ ఉండటం కలవరం రేపుతోంది. మళ్లీ మాస్కుల్లోకి.. కరోనా మహమ్మారి మొదలైన కొత్తలో అందరూ డాక్టర్లే. ఆ మందు పనిచేస్తుందని ఒకరు.. ఈ మందు పనిచేస్తుందని మరొకరు.. ఆయుర్వేదం నుంచి అల్లోపతి దాకా ఎన్నో ప్రయోగాలు. చివరికి వ్యాక్సిన్లు తెరపైకి వచ్చినా ఎన్నో అనుమానాలు. అన్ని అనుమానాలను, ఆటంకాలను దాటేసుకుని టీకాలు అందరికీ చేరినా.. కరోనా కొత్త రూపాంత రాలతో మళ్లీ విజృంభిస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నా మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో చాలా వరకు ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్లవేనని.. వాటితో లక్షణాలు తీవ్రంగా ఏమీ ఉండటం లేదని చెప్తున్నారు. జనం గుమిగూడిన చోట మాస్కు ధరించడం, శానిటైజేషన్ వంటి కోవిడ్ మార్గదర్శకాలను సరిగ్గా పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. మన దేశంలోనూ మెల్లగా.. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత వారం రోజులుగా రోజూ 10 వేలకుపైనే కొత్త కేసులు వస్తు న్నాయి. గురువారం 13,313 కేసులు వచ్చినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. పాజిటివిటీ రేటు 2.8 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 83,990కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 కేసులు వచ్చాయి, ఒకరు చనిపోయారు. కేరళలోని 11 జిల్లాలు, మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం వరకు నమోదవుతోంది. కేరళలో గురువారం ఒక్క రోజే నలుగురు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో 1,934 పాజిటివ్ కేసులురాగా.. పాజిటివిటీ రేటు ఏకంగా 10% దాటడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తమిళనాడులో 1,063 కొత్త కేసులు వచ్చాయి. కర్ణాటకలో ఒక్కరోజే 858 కేసులురాగా.. అందులో సగానికి పైగా కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి. తెలంగాణలో 494 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడు కరోనా వేవ్ల ప్రారంభంలోనూ ఇదే తరహాలో కేసులు నమోదు అయ్యాయని.. ఇది నాలుగో వేవ్కు ప్రారంభం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, తాజాగా కేంద్ర మంత్రి çస్మృతి ఇరానీ, కేంద్ర మాజీ మంత్రి ఆజాద్కు కోవిడ్ సోకింది. కొత్త వేరియంట్లతో.. చైనాలో మొదలైన నాటి నుంచి కరోనా ఎన్నో రూపాంతరాలు చెందింది. పదుల కొద్దీ మ్యుటేషన్లు చెందింది. అందులో ఆల్ఫా, డెల్టా వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ తర్వాత అన్నింటినీ తోసిరాజంటూ ఒమిక్రాన్ వచ్చింది. మెల్లమెల్లగా ఒమిక్రాన్లోనూ బీఏ.2, బీఏ.4, బీఏ.5 వంటి సబ్ వేరియంట్లు పుట్టాయి. ఏ వేరియంటో తేల్చేందుకు... దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. ఒక్కసారిగా కేసుల పెరుగుదల నమోదైన జిల్లాలు, ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని రాష్ట్రా లకు సూచించింది. ఏదైనా కొత్త వేరియంట్/ ఉప వేరియంట్గానీ పుట్టిందా? ఏ వేరియంట్ ఇలా విజృంభిస్తోందన్న దానిని జీనోమ్ సీక్వెన్సింగ్తో తేల్చనున్నారు. టీకా.. ఇమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలై రెండేళ్లు కావస్తోంది. చాలా వరకు వ్యాక్సిన్ల ప్రభావశీలత (ఇమ్యూనిటీ సమ యం) గరిష్టంగా 6 నెలల–9 నెలల వరకు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా సోకి తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా దాదాపు ఇంతేకాలం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజల్లో కరోనా సోకి తగ్గడం, వ్యాక్సిన్లతో వచ్చిన ఇమ్యూనిటీ బాగా తగ్గి పోయి ఉంటుందని.. కరోనా కేసులు పెరగడా నికి ఇదీ కారణమని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఒమిక్రాన్ ఉప వేరి యంట్లు అయిన బీఏ.2, బీఏ.4, బీఏ.5 రకాలు వ్యాప్తిలో ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో బీఏ.2 వేరియంట్కు వ్యాప్తి సామర్థ్యం ఎక్కువని వెల్లడించాయి. ఇవి ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న ఇమ్యూనిటీ నుంచి తప్పించుకుని, ఇన్ఫెక్షన్ కలిగించగలవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో పరిస్థితి ఇదీ.. కరోనా మరోసారి పంజా విసురుతుండటం తో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు అప్రమత్తమ య్యాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించలేకున్నా.. ముందు జాగ్రత్త చర్యలు,నియంత్రణలను అమలు చేస్తున్నాయి. అమెరికాలో కేసులు గణనీయంగా నమోద వుతున్నాయి. దీనితో ఆ దేశం వ్యాక్సినేష న్ను మరింత విస్తరించింది. తొలిసారిగా 6 నెలల నుంచి ఐదేళ్ల వయసున్న చిన్నారు లకూ వ్యాక్సిన్లు వేసేందుకు అను మతిం చింది. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అనుమతి జారీ చేసింది. యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతుండ టంతో ప్రజలు జాగ్రత్తలు చేపట్టాలని ప్రభు త్వాలు హెచ్చరించాయి. ముఖ్యంగా పోర్చు గల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, గ్రీస్, నెదర్లాండ్స్, డెన్మార్క్ దేశాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఆయా దేశాల్లో కోవిడ్తో ఆస్పత్రుల్లో చేరికలూ స్వల్పంగా పెరుగుతున్నాయి. పోర్చుగల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. 90% పైగా బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. అయినా ఇటీవల కేసులు పెరగడం, మరణాల రేటు కూడా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వీరిలో వృద్ధుల శాతం ఎక్కువగా ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇరాక్లో మరో కోవిడ్ వేవ్ మొదలైనట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, తైవాన్, బ్రెజిల్లో రోజుకు 30, 40 వేల కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, చిలీ, ఇజ్రా యెల్ తదితర దేశాల్లోనూ 10 వేలకుపైగా కొత్త కేసులు వస్తున్నాయి. తైవాన్, బ్రెజిల్, రష్యా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. -
Covid: భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే!
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,899 మంది కోవిడ్ బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే వైరస్తో 15 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 72,474. యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్పై ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,855కు చేరుకుంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 7.71 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,99, 363కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 14,88,807 మందికి కరోనా వ్యాక్సిన్లను అందించినట్టు కేంద్రం తెలిపింది. చదవండి: Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్ -
భారీగా పెరిగిన కరోనా కేసులు.. నిన్నటితో పోలిస్తే 38% అధికం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు అమాంతం పెగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్ బారినపడ్డారు. నిన్నటితో పోలిస్తే 38% ఎక్కువ నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తరువాత ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం దేశంలో నాలుగో వేవ్ ప్రారంభమైందా అనే అనుమానాలు రేకేత్తిస్తోంది. పెరిగిన యాక్టివ్ కేసులు భారత్లో ఇప్పటి వరకు 4,32,57,730 మంది కరోనా బారినపడ్డారు. బుధవారం 11 మంది కోవిడ్ కారణంగా మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 5,24,803కు పెరిగింది. నిన్న ఒక్క రోజు 7,624 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4,26,74,712 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. యాక్టిక్ కేసుల సంఖ్య 58,215కు పెరిగింది. పాజిటివిటీ రేటు 2.35% శాతంగా ఉంది. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మహారాష్ట్ర టాప్ అత్యధికంగా మహారాష్ట్రలో 4,024, కేరళలో 3,488 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానాల్లో ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క ముంబైలోనే నిన్న రెండు వేలకు పైగా కేసులొచ్చాయి. అయిదు నెలల తర్వాత అక్కడ ఇన్ని కేసులు కావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్క రోజు 1.21 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటి వరకు 195 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. చదవండి: AP: నియంత్రణలోనే కరోనా.. పొరుగుతో పోలిస్తే తక్కువే -
భారత్ కు పొంచి ఉన్న కరోనా ముప్పు
-
Corona Virus: 50 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతోపాటు యాక్టివ్ కేసులు సంఖ్య కూడా పెరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా కరోనా మహమ్మారి కేసుల్లో స్వల్ప ఊరట లభించింది. కిందటి రోజుతో పోలిస్తే 2 వేల కేసులు తక్కువ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,594 మంది కోవిడ్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,36,695కు చేరాయి. యాక్టిక్ కేసుల సంఖ్య 50,548కు పెరిగింది. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వస్తుండటంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీని ప్రకారం గత 24 గంటల్లో 3,21,873 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పాజిటివిటీ రేటు 2.32 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,26,61,370 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.67%గా ఉంది. చదవండి: కరోనా డేంజర్ బెల్స్.. ‘ఫోర్త్ వేవ్’ మొదలైందా? -
కరోనా డేంజర్ బెల్స్: 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనాను జనం తేలిగ్గా తీసుకుంటుండంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో కేసులు పీక్స్కు చేరనున్నట్లు, మరో ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చెబుతున్నారు. భారత్లో కేసుల నమోదు చూస్తుంటే కోవిడ్ నాలుగో వేవ్ దగ్గరికి వచ్చినట్లే కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. ఒక్క రోజే 10 మంది మరణించడంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,24,771కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువగా ఉన్నాయి. ప్రస్తుతం 47,995 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 4,592 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీని ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2946 కేసులు ఉన్నాయి. కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 నమోదయ్యాయి.ఇక యాక్టివ్ కేసులు 0.11 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపింణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొంది. చదవండి: పోస్ట్ కోవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయా? నిర్లక్ష్యం చేయకండి.. -
కరోనా విజృంభణ: ఎనిమిది వేలకు పైగా కొత్త కేసులు
న్యూఢిల్లీ: మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా.. మెల్లగా తన వ్యాప్తిని అంతకంతకూ విస్తరిస్తూ పోతుంది. పరిస్థితులు సాధారణ స్థితిక వచ్చేసాయని ప్రజలు మాస్క్లు, శానిటైజర్ల వాడకం తగ్గించేశారు. దీంతో మరోసారి భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. భారత్లో గడిచిన 24 గంటల్లో ఎనిమిది వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 8,582 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గడిచిన మూడు నెలల్లో ఇంత భారీగా కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. శనివారం కోవిడ్తో 4 మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే 3,791 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం కోవిడ్పై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 2,922 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో ప్రస్తుతం 44,513 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,24,761కు చేరింది. గడిచిన 24 గంటల్లో 4,435 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4,26,52,743గా ఉంది. చదవండి: చదువుకున్నంత మాత్రాన పని చేయాలనేం లేదు -
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..?
-
ముంచుకొస్తున్న మహమ్మారి.. పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే!
న్యూఢిల్లీ: మహమ్మారి మళ్లీ వచ్చేస్తోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా..చాపకింద నీలా మళ్లీ విస్తరిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసింది. దేశ విదేశాల రాకపోకలు పెరిగాయి. ప్రజలు మాస్క్, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి అంశాలను పూర్తిగా విస్మరించారు. పబ్బులు,క్ల ్లబ్బులు, విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, విహార యాత్రల్లో మునిగితేలుతున్నారు. అడ్డూ అదుపు లేని ప్రయాణాలు, ఒకే చోట వేలాదిమంది గుమిగూడటం వంటి చర్యలతో వైరస్ మరోసారి వణికిస్తోంది. భారత్లో గడిచిన 24 గంటల్లో ఏడు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 7,584 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గడిచిన మూడు నెలల్లో ఇంత భారీగా కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో అత్యధికంగా 2,813 మంది కరోనా బారినపడ్డారు. గురువారం కోవిడ్తో 24 మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే 3,791 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 36,267 ఉన్నాయి. చదవండి: ముంచుకొస్తుంది.. జాగ్రత్త పడదాం! ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్పై శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,747కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కి పెరిగింది. దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,26,44,092కి చేరింది. #COVID19 | India reports 7,584 fresh cases, 3,791 recoveries, and 24 deaths in the last 24 hours. Total active cases are 36,267 pic.twitter.com/kwQIIy8K3s — ANI (@ANI) June 10, 2022 -
కరోనా ఫోర్త్ వేవ్!: మూడు నెలల తర్వాత హయ్యెస్ట్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. కరోనా వైరస్ నాలుగో వేవ్ను దాదాపుగా ధృవీకరిస్తున్నారు వైద్య నిపుణులు. గత 24 గంటల్లో.. ఏకంగా 7,240 తాజా కేసులు నమోదు అయ్యాయి. మార్చి 2 తర్వాత ఇదే అత్యధిక కేసులు కావడ గమనార్హం. భారత్లో కరోనా ఫోర్త్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుసగా రెండో రోజూ దేశంలో కొత్త కేసుల పెరుగుదల 40 శాతంపైగా కనిపిస్తోంది. మొత్తం 7, 240 తాజా కేసులు నమోదు అయ్యాయి. మూడున్నర లక్షల టెస్టులకుగానూ.. ఈ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్ర, కేరళలో కొత్త, క్రియాశీలక కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క ముంబై నగరంలోనే బుధవారం 1, 765 కేసులు వెలుగు చూశాయి. దీంతో మహారాష్ట్ర అప్రమత్తం అయ్యింది. క్లోజ్డ్ పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ను తప్పనిసరి చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళ మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోనే ఉందని చెప్తుండడం విశేషం. తాజా కరోనా మరణాలు ఎనిమిది రికార్డు కాగా.. దేశంలో ఇప్పటిదాకా కరోనాతో 5, 24, 723కి చేరింది. డెయిలీ పాజిటివిటీ రేటు 2.13 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.31 శాతంగా నమోదు అవుతోంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 32,498కి చేరడం కలవర పరుస్తోంది. #AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/EcaW7dPkRU pic.twitter.com/XgCWmTPGtU — Ministry of Health (@MoHFW_INDIA) June 9, 2022 చదవండి: కేసులు పెరుగుతున్నాయ్.. తెలంగాణలో టెస్టులు పెంచండి -
మహారాష్ట్ర: పెరిగిపోతున్న కరోనా కేసులు
ముంబై: మహారాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రం అక్కడి వైద్యశాఖ విడుదల చేసిన బులిటెట్ ప్రకారం.. గత ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా 2,701 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ముంబైలోనే 1,765 కేసులు వెలుగు చూడడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐదు నెలల తర్వాత ఇదే హయ్యెస్ట్ కేసులు. ఒక్కరోజులోనే ముంబైలో కేసుల పెరుగుదల 42 శాతం నమోదు అయ్యింది. ముంబైలో మంగళవారం బులిటెన్లో 1,242 కేసులు రికార్డు అయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత వెయ్యికి పైగా కేసులు వరుసగా రెండు రోజుల పాటు నమోదు అయ్యాయి. ఇక ముంబై తర్వాత థానేలో కరోనా విజృంభణ అధికంగా ఉంది. పుణేతో పాటు రాయ్గడ్, పాయిగఢ్లోనూ కేసులు అధికంగానే నమోదు అవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 1,327 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా మరణాలు శూన్యం. ప్రస్తుతం 9,806 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. Maharashtra | 2701 new COVID cases were reported today in the state while 1327 patients were discharged. With zero deaths today, active cases stood at 9806 pic.twitter.com/paj2ceOecp — ANI (@ANI) June 8, 2022