
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,393 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో 2,319 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 31,199 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,31,212కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 6,95,942 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ కారణంగా 4,071 మంది బాధితులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment