Mayawati Slams UP Government Over Kanpur Dehat Eviction Drive Deaths, Tweet Viral - Sakshi
Sakshi News home page

‘మీ బుల్డోజర్లతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్‌’ యోగి సర్కార్‌పై యూపీ మాజీ సీఎం ఫైర్‌

Feb 15 2023 7:23 PM | Updated on Feb 15 2023 7:39 PM

Mayawati Slams UP Government That Tragedy More Attention In News - Sakshi

యూపీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 కంటే..

ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కార్‌ తీరుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్‌లో.. తల్లికూతుళ్లు మరణించిన ఘటనను ప్రస్తావించారు బీఎస్పీ చీఫ్‌ మాయావతి. తాజాగా యూపీలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 కంటే.. తల్లీకూతుళ్ల మరణం ఘటనే వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచిందంటూ  మండిపడ్డారామె.

బీజేపీ చేస్తున్న బుల్డోజర్‌ రాజకీయాలు అమాయకులైన పేదల ప్రాణాలు తీస్తున్నాయని, ఇది చాలా బాధకరమన్నారు. ఇలాంటి వాటివల్ల ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందంటూ.. సోషల్‌ మీడియా వేదికగా యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తూ హిందీలో ట్వీట్‌ చేశారు. కాగా, బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చడంతో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ యోగి 'బుల్డోజర్‌ బాబాగా' ప్రజల నోళ్లల్లో నానుతుండటం గమనార్హం. 

(చదవండి: ఎవరైనా సీన్‌ క్రియేట్‌ చేస్తే నడుములు విరిగిపోతాయ్‌!: మధ్యప్రదేశ్‌ మంత్రి వార్నింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement