Mayawati
-
మేనల్లుడికి మరోసారి మాయావతి షాక్
ఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్కు మరోసారి ఝలక్కు ఇచ్చారు. తాజాగా, ఆకాశ్ ఆనంద్ను పార్టీ జాతీయ సమన్వయకర్తతో పాటు అన్నీ పదవుల నుంచి తొలగించారు. గతేడాది ఆకాష్ ఆనంద్కు ఇదే పదవిలో కొనసాగుతుండగా.. తొలగిస్తూ మాయావతి అన్యూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి నియమించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి బాధ్యతల నుంచి ఆకాష్ నుంచి పార్టీ పదవుల నుంచి తొలగించారు మాయావతి. ఆకాష్ స్థానంలో ఆయన తండ్రి ఆనంద్ కుమార్, సీనియర్ నాయకుడు రామ్జీ గౌతమ్లను జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు.2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఆకాష్ ఆనంద్ రాజకీయ అరంగేట్రం చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2023 చివర్లో పార్టీ జాతీయ సమన్వయకర్తతో నియమితులయ్యారు. అయితే, లోక్సభ ఎన్నికలకు ముందు మాయావతి అతనిని పార్టీలోని పదవుల నుంచి తొలగించింది. రాజకీయాల్లో ఆకాష్ మరింత పరిణితి పొందాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ సున్నా స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత జూన్ 2024లో ఆకాష్ ఆనంద్ను తిరిగి పార్టీకి తీసుకున్నారు. పలు పార్టీ పదవుల్ని కట్టబెట్టారు. మళ్లీ ఏమైందో ఏమో ఆ మేనల్లుడిని అన్నీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది. -
పదవికి ఎసరు పెట్టిన కొడుకు పెళ్లి.. బీఎస్పీ సీనియర్ నేత సస్పెండ్
లక్నో: అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్న కొడుకు పెళ్లి.. తన పొలిటికల్ కేరీర్ను దెబ్బకొట్టింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కారణమైంది. ఇందుకు కారణం.. తనకు కాబోయే కోడలు మరో పార్టీ నాయకుడి కూతురు కావడమే. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే త్రిభువన్ దత్ కుమార్తెతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్ నాయకుడు సురేంద్ర సాగర్ తన కుమారుడితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ పార్టీకి చెందిన నేతతో వియ్యం అందుకోవడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సీరియస్ అయ్యారు. తక్షణమే సురేంద్ర సాగర్పై చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి ఓ లేఖను ఇచ్చారు.ఈ సందర్భంగా సురేంద్ర సాగర్ స్పందిస్తూ.. పార్టీ వ్యతిరేక చర్యలకు నేను పాల్పడలేదు. ఎమ్మెల్యే త్రిభువన్ కూతురితో నా కుమారుడికి వివాహం జరిపించడం నేరమా?. నేను ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సురేంద్ర కుమార్.. బరేలీ డివిజన్లో బీఎస్పీకి కీలక నేతగా ఉన్నారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 ఎన్నికల్లో మిలాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సాగర్ పోటీ చేసి ఓడిపోయారు.ఇక, ఆయన వియ్యంకుడు మాజీ ఎంపీ త్రిభువన్ దత్ ప్రస్తుతం అంబేద్కర్ నగర్ నుంచి సమాజ్వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీ మాయావతి ఇలాంటి నిర్ణయం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే పార్టీలో వచ్చినప్పుడు మాజీ డివిజనల్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ గౌతమ్ను సస్పెండ్ చేశారు. -
ఈవీఎంల సాయంతో నకిలీ ఓట్లు: మాయావతి ఆరోపణ
లక్నో: ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ రెండు స్థానాల్లో, ఆర్ఎల్డీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఉప ఎన్నికల్లో బీఎస్ఫీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయింది.ఈ ఫలితాల అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయని ఆరోపించారు. వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు. గతంలో బ్యాలెట్ పేపర్ను దుర్వినియోగం చేయడం ద్వారా నకిలీ ఓట్లు వేసేవారని, ఈ పని ఇప్పుడు ఈవీఎంల ద్వారా కూడా జరుగుతోందని మాయావతి ఆరోపించారు. ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ -
ఇకపై మాది ఒంటరిపోరే: మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ: అనుకున్నదొక్కటి... అయినదొక్కటిలా తయారైంది మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిస్థితి. హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో ఐఎన్ఎల్డీతో బీఎస్పీ పొత్తు చేదు అనుభవం మిగల్చడంతో, మున్ముందు జరిగే ఎన్నికల్లో ఎక్కడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోరాదని మాయావతి నిర్ణయించారు. యూపీ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లు కూటమి పార్టీకి బదలాయించినా.. వారి సంప్రదాయ ఓట్లను బీఎస్పీకి బదలాయించే సామర్థ్యం మిత్రపక్షానికి లేకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని మాయావతి పేర్కొన్నారు. ఈ కారణంగానే బీఎస్పీ కేడర్ తీవ్ర నిరాశకు గురైందని శుక్రవారం ఆమె ‘ఎక్స్’లో అభిప్రాయపడ్డారు. -
రాజకీయాల నుంచి వైదొలగడం లేదు: మాయావతి
లక్నో: తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి ఖండించారు. తాను క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని సోమవారం స్పష్టం చేశారు.తాను రాజకీయాల వైదొలగటం లేదని, కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వంగా కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చివరి శ్వాసవరకు తాను బీఎస్పీని ముందుకు తీసుకెళ్లటంలో పోరాటం కొనసాగిస్తానని అన్నారు.‘‘డాక్టర్. అంబేద్కర్, కాన్షీరామ్ వారసులైన బహుజనులను బలహీనపరిచే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి నా చివరి శ్వాస వరకు ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం అవుతాను. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పార్టీని ఆకాష్ ఆనంద్ ముందుకు తీసుకువెళ్తారు. నాపై వస్తున్న అసత్య ప్రచారాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి’’ అని ‘ఎక్స్’లో తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా మాయావతి రాజకీయాలకు దూరంగా ఉండనున్నారని వార్తలు వస్తున్నాయి.26-08-2024-BSP PRESS NOTE-SANYAS FAKE NEWS pic.twitter.com/nhbBIEJhUl— Mayawati (@Mayawati) August 26, 2024 -
ఢిల్లీలో కనిపించని భారత్ బంద్ ప్రభావం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నేడు (బుధవారం) భారత్ బంద్కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పలుపునిచ్చింది. అయితే ఈ బంద్ ప్రభావం ఢిల్లీలో కనిపించలేదు.ఢిల్లీలోని వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానుల సమన్వయ సంస్థ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్ మీడియాతో మాట్లాడుతూ తాము కాష్మీరే గేట్, చాందినీ చౌక్, ఖరీ బావోలి, నయా బజార్, చావ్రీ బజార్, సదర్ బజార్, కరోల్ బాగ్, కమ్లా నగర్, కన్నాట్ ప్లేస్, లజ్పత్ నగర్, సరోజినీ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన 100కు పైగా మార్కెట్ సంఘాలతో ఈ విషయమై చర్చించామన్నారు. ఈ దరిమిలా తాము బంద్కు మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. ఢిల్లీలోని మొత్తం 700 మార్కెట్లు పూర్తిగా తెరిచి ఉంటాయని, 56 పారిశ్రామిక ప్రాంతాలు కూడా పని చేస్తాయని తెలిపారు.మాయావతి మద్దతుభారత్ బంద్కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు పలికారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వెనుక బీజేపీ కుట్ర దాగున్నదని ఆమె ఆరోపించారు. అందుకే తాము భారత్ బంద్కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 1. बीएसपी का भारत बंद को समर्थन, क्योंकि भाजपा व कांग्रेस आदि पार्टियों के आरक्षण विरोधी षडयंत्र एवं इसे निष्प्रभावी बनाकर अन्ततः खत्म करने की मिलीभगत के कारण 1 अगस्त 2024 को SC/ST के उपवर्गीकरण व इनमें क्रीमीलेयर सम्बंधी मा. सुप्रीम कोर्ट के निर्णय के विरुद्ध इनमें रोष व आक्रोश।— Mayawati (@Mayawati) August 21, 2024 -
యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికలు: అభ్యర్థులను ప్రకటించిన మాయావతి, ఆజాద్
ఉత్తరప్రదేశ్లోని పది అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొననున్నదనే మాట వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించుకుంది. లోక్సభలో విజయం సాధించిన చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పోరులోకి దూకారు. ఇప్పటి వరకూ మాయావతి రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ఘజియాబాద్ సదర్ స్థానం నుండి చౌదరి సత్పాల్, ముజఫర్నగర్లోని మీరాపూర్ స్థానం నుండి జాహిద్ హసన్, మీర్జాపూర్లోని మజ్వాన్ స్థానం నుండి ధీరజ్ మౌర్యలను ఎన్నికల బరిలోకి దించినట్లు ప్రకటించింది. మిగిలిన ఏడు స్థానాల్లో పోటీకి దిగే అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని పార్టీ తెలిపింది.ఇక బీఎస్పీ విషయానికొస్తే మిల్కిపూర్, మిరాపూర్ నుండి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించింది. మిల్కీపూర్ టిక్కెట్ను రామ్ గోపాల్ కోరికి ఇవ్వగా, మీరాపూర్ నుండి చంద్రశేఖర్ ఆజాద్కు సన్నిహితుడైన షా నాజర్ను అభ్యర్థిగా నిలబెట్టారు. షా నాజర్ ప్రస్తుతం బీఎస్పీ జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన చంద్రశేఖర్ ఆజాద్ పార్టీలో సభ్యునిగా ఉన్నారు. -
ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడు ఎన్కౌంటర్
చెన్నై : పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం మరణించాడు. శనివారం సాయంత్రం చెన్నై పోలీసులు ఆర్మ్స్ట్రాంగ్ హత్య కోసం నిందితుడు తిరువేంగడం ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు నిందితుణ్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ లభ్యమైన గన్తో నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.అత్యవసర చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. నిందితుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని చెన్నై పోలీస్ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణహత్యకు గుయ్యారు. చెన్నై పెరంబూర్లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తితో దాడిచేసి పారిపోయారు.స్థానికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం థౌజండ్లైట్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.ఈ దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ముఖ్యంగా బలహీన వర్గాలు సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వం సీరియస్గా ఉంటే, నిందితులను అరెస్టు చేసి ఉండేవారు. అది లేదు కాదు కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఆమె అన్నారు. -
ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు: సీబీఐ దర్యాప్తునకు మాయావతి డిమాండ్
చెన్నై: తమిళనాడు బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కే. ఆర్మ్స్ట్రాంగ్ గుర్తుతెలియని దుండగుల చేతిలో శుక్రవారం హత్యకు గురయ్యారు. ఆదివారం మాజీ సీఎం, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆర్మ్స్ట్రాంగ్ భౌతికకాయనికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ హత్య కేసులు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితలు అసలైనవారు కాదని అన్నారు. హత్య కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ను డిమాండ్ చేశారు.#WATCH | Chennai, Tamil Nadu: BSP Chief Mayawati and party's National Coordinator, Akash Anand pay their last respects to Tamil Nadu BSP President K Armstrong.K Armstrong was hacked to death by a group of men near his residence in Perambur on 5 July. pic.twitter.com/4kQImXFYX9— ANI (@ANI) July 7, 2024 ఆర్మ్స్ట్రాంగ్ హత్య పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు గుంపుగా వచ్చి ఆర్మ్స్ట్రాంగ్ను హత్య చేసిన తీరును గమనిస్తే.. తమిళనాడులో అసలు శాంతి భద్రతలు లేవనిపిస్తోందని అన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ఈ కేసును వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించి, న్యాయం అందించాంని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం ఈ కేసులో తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని తెలిపారు. ఆర్మ్స్ట్రాంగ్ ఘటనతో రాష్ట్రంలో దళితలు అభద్రతాభావంతో తీవ్రంగా ఆందోళన పడుతున్నారని అన్నారు. ఈ ఘటనను బీఎస్పీ చాలా సీరియస్గా తీసుకుంది. కానీ, పార్టీ కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అన్నారు.బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్స్ట్రాంగ్ (47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్స్ట్రాంగ్పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. -
ఆకాష్పై అలక వీడిన మాయావతి
మేనల్లుడు ఆకాష్ ఆనంద్పై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అలక వీడాడు. ఆమె తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఆమె మేనల్లుడు ఆకాష్ అత్త మాయావతి పాదాలను తాకి, ఆశీర్వదించాలని కోరారు. దీంతో ఆమె ఆనందంతో పొంగిపోతూ ఆకాష్ తలపై చేయివుంచి, నిండుగా ఆశీర్వదించారు.అలాగే మాయావతి ఆకాష్ వీపు తడుతూ ఇకపై జాగ్రత్తగా ఉండు అనేలా సంకేతమందించారు. దీనికితోడు అతనిని రాబోయే ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్గా ఎంపిక చేశారు. ఆకాష్ ఆనంద్ బీఎస్పీ మాజీ జాతీయ సమన్వయకర్త.గతంలో మాయావతి ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా ప్రకటిస్తూ యూపీ, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించారు. అయితే ఆకాష్ ఎన్నికల సమయంలో సీతాపూర్లో వివాదాస్పద ప్రసంగం చేయడంతో అతనిని జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. అయితే ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఆకాష్పై అలకవీడి స్టార్ క్యాంపెయినర్గా ఎంపికచేసి, పార్టీలో తగిన స్థానం కల్పించారు. #WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati holds a meeting with party workers in Lucknow. pic.twitter.com/b5bBrDlesv— ANI (@ANI) June 23, 2024 -
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
లక్నో: తన మేల్లుడైన ఆకాశ్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తొలగించారు. ఈ తొలగింపుపై తాజాగా గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆకాష్ ఆనంద్ స్పందించారు. ‘బీఎస్పీ చీఫ్ మాయావతి.. బహుజన సమాజానికి రోల్ మోడల్. బహుజనలు అంటే.. దళితులు, ఎస్టీలు, ఓబీసీలు. మీ పోటం వల్లనే నేడు బహుజన సమాజానికి ఇంత రాజకీయం బలం చేకూరింది. బహుజన సమాజం గౌరవంగా బ్రతకటం నేర్చుకుంది. మీరే మా అధినేత్రి. నా కడ శ్వాస వరకు భీమ్ మిషన్, బహుజన సమాజం కోసం పోరాడతాను’’ అని ఆకాష్ ఆనంద్ ‘ఎక్స్’లో తెలిపారు.ఇక.. ఇటీవల ఆకాశ్ ఆనంద్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ మాట్లాడుతూ యూపీలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్గా అభివర్ణించారు.आदरणीय बहन @mayawati जी, आप पूरे बहुजन समाज के लिए एक आदर्श हैं, करोड़ों देशवासी आपको पूजते हैं। आपके संघर्षों की वजह से ही आज हमारे समाज को एक ऐसी राजनैतिक ताक़त मिली है जिसके बूते बहुजन समाज आज सम्मान से जीना सीख पाया है। आप हमारी सर्वमान्य नेता हैं। आपका आदेश सिर माथे पे।…— Akash Anand (@AnandAkash_BSP) May 9, 2024 రాష్ట్రంలోని యువతను ఆకలితో ఉంచుతూ, పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. ఆకాశ్తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆకాశ్కు సంబంధించిన అన్ని ర్యాలీలను బీఎస్పీ రద్దు చేసింది.2023 డిసెంబరులో మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ లండన్లో ఎంబీఏ చదివారు. ఇక.. 2017లో బీఎస్పీలో చేరారు. అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
Akash Anand: మేనల్లుడికి షాకిచ్చిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత వివాదం బహిర్గతమయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రెండు కీలక పదవుల నుంచి తొలగించారు. గతంలో ఆమె ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా, జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆకాష్ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆకాష్ ఆనంద్ బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయి. ఇటీవల సీతాపూర్లో జరిగిన బహిరంగ సభలో ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే ఇది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం దేశ ప్రజలను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్లో ఆకాష్ ఆనంద్పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితోపాటు ఇటీవల ఆకాష్ ఆనంద్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసింది.బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలని ఆకాష్ ఆనంద్ను మాయావతి గత నెలలోనే హెచ్చరించారు. అయితే ఆయన దీనిని పట్టించుకోలేదు. ఈ దరిమిలా ఆకాష్ ఆనంద్ ప్రసంగాలపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ‘పార్టీలో శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా, నేషనల్ కోఆర్డినేటర్గా ప్రకటించాం. అయితే ఆయన పార్టీ చేపట్టిన ఉద్యమంలో పరిపక్వత సాధించే వరకు, అతనిని ఈ రెండు బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి పేర్కొన్నారు. -
‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
దేశంలో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే కనిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు జతకట్టి ఎన్నికల బరిలో దిగాయి. అయితే కాంగ్రెస్ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా తర్వాత, ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఇంతలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దేశ రాజధానిలోని ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారు.మీడియా నివేదికల ప్రకారం రాజధాని ఢిల్లీలో దాదాపు 20 శాతం ఎస్సీ ఓటర్లున్నారు. దీనితో పాటు యూపీకి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీఎస్పీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మే 25న ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షురాలు మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాంగ్రెస్, కొన్నిసార్లు బీజేపీ మమ్మల్ని ఉపయోగించుకున్నాయి. ఆ పార్టీలు మమ్మల్ని ‘బి’ టీమ్ అని పిలిచాయి. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏది బీ టీమ్ అనేదో తేలిపోనున్నదన్నారు.బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ పార్టీ తరపున ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అడ్వకేట్ అబ్దుల్ కలాం, దక్షిణ ఢిల్లీ నుంచి అబ్దుల్ బాసిత్, తూర్పు ఢిల్లీ నుండి న్యాయవాది రాజన్ పాల్ను ఎన్నికల బరిలోకి దించింది. అలాగే ఈశాన్య ఢిల్లీ నుంచి డాక్టర్ అశోక్ కుమార్ మైదాన్, న్యూఢిల్లీ నుంచి న్యాయవాది సత్యప్రకాశ్ గౌతమ్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి విజయ్ బౌధ్, పశ్చిమ ఢిల్లీ నుంచి విశాఖ ఆనంద్లకు టికెట్ ఇచ్చింది.దేశ రాజధాని ఢిల్లీలో బీఎస్పీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లోని 250 స్థానాలు, ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటుంది. 2008లో ఢిల్లీలో బీఎస్పీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 2009, 2014, 2019 సంవత్సరాల్లోనూ బీఎస్పీ ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఎప్పుడూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అయితే ఇప్పడు ఢిల్లీలో మారిన రాజకీయ సమీకరణలు తమకు కలిసివస్తాయని మాయావతి భావిస్తున్నారని సమాచారం. -
కూటమికి బీఎస్పీ పోటు!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ కోటను బద్దలు కొట్టాలన్న విపక్ష ఇండియా కూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లేలా కని్పస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాలఓల బీజేపీని నిలువరించేందుకు ఓట్ల సమీకరణకు కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. ఆ ప్రయత్నాలను వమ్ము చేసేలా బీఎస్పీ వ్యవహరిస్తోంది.ముఖ్యంగా యూపీలో ముస్లిం ఓట్ల సమీకరణతో బీజేపీ స్థానాలకు భారీగా గండి కొట్టాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్లను నిలువునా చీల్చేలా రాష్ట్రంలో బీఎస్పీ ముస్లింలకు ఎక్కువ టికెట్లిచ్చింది! అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన బీస్పీ లోక్సభ ఎన్నికల్లోనైనా ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇండియా కూటమికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. యూపీలో కూటమికి దెబ్బే! అత్యంత కీలకమైన యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సొంతంగానే 70 సీట్లపై గురిపెట్టింది. పొత్తులో భాగంగా కట్టిన కాంగ్రెస్ 13, ఎస్పీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో 21 శాతమున్న యాదవ ఓట్లకు 19 శాతం ముస్లిం ఓట్లు కలిస్తే భారీగా ఓట్లు రాలుతాయని ఆశ పడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 18 జిల్లాల పరిధిలోని పలు లోక్సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. వీటిలో పలు జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 30 శాతం పైగా ఉంది. వీరంతా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సంప్రదాయ ఓటు బ్యాంకే.దాంతో ముస్లింల ఓట్లను సంఘటితంగా తమవైపు సమీకరించుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ వారికి 11 సీట్లు కేటాయించాయి. మాయా నిర్ణయాలు వాటి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉన్నాయి. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో ముస్లింలకే టికెట్లిచ్చింది! దాంతో ముస్లిం ఓట్లకు గండిపడి ఎస్పీ/కాంగ్రెస్ అభ్యర్థుల అవకాశాలకు గండిపడేలా కని్పస్తోంది. ఇక దళిత ప్రాబల్య పశ్చిమ యూపీలో వాటి ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్/ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే అక్కడా బీఎస్పీ ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఇది వాటికి మరో తలనొప్పిగా మారింది. రాజస్థాన్లోనూ బీఎస్పీ ఆరుచోట్ల ముస్లింలకు టికెటిచ్చింది! మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలోనూ ఇదే పరిస్థితి! లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ప్రదర్శన ఎన్నికలు సీట్లు ఓట్ల శాతం 2004 19 5.33 2009 21 6.17 2014 0 4.19 2019 10 3.67 ప్రభావం తగ్గలేదు బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రంలో 21 శాతమున్న ఎస్సీల్లో సగానికి పైగా జాతవ్లే. ఆ కులం నుంచి వచ్చిన మాయావతికి వారిపై పట్టు ఉంది. కానీ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గడంతో మాయా ప్రభను కోల్పోయారు. 2017లో బీఎస్పీకి 19 సీట్లు రాగా 2022లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది! కాకపోతే ఆ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లు సాధించింది.ఇక 2004 లోక్సభ ఎన్నికల్లో 19, 2009లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ, 2014లో మాత్రం ఖాతాయే తెరవలేకపోయింది. 2019లో ఎస్పీ, రాష్ట్రయ లోక్దళ్తో పొత్తుల వల్ల 10 సీట్లు గెలుచుకుంది. కానీ వారిలో ఐదుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో మాయవతి ఒంటరిగా పోరాడుతున్నారు. యూపీలో 80 స్థానాలకు గానూ 64 చోట్ల అభ్యర్థులను నిలిపారు. అలాగే రాజస్థాన్లో 25, మధ్యప్రదేశ్లో 7, ఛత్తీస్గఢ్లో 8 స్థానాల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈసారి కూడా ముస్లిం దళిత ఫార్ములాతోనే ఆమె బరిలో దిగారు. ఆమె ప్రచార సభలకు జనం భారీగా వస్తున్నారు. దాంతో మాయా దెబ్బకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ తదితర విపక్షాలు భయపడుతున్నాయి. -
‘మేం గెలిస్తే ప్రత్యేక రాష్ట్రం’
లక్నో: తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చేందుకు తమ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ముజఫర్నగర్ లోక్సభ స్థానం బీఎస్పీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతికి మద్దతుగా మాయావతి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ బీజేపీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. "పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని మాయావతి చెప్పారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. ముజఫర్నగర్లో బీజేపీ నుంచి సంజీవ్ కుమార్ బల్యాన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తన ర్యాలీకి ముందు, మాయావతి సహరాన్పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్లలో మొత్తం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ముఖ్తార్ అన్సారీ మృతిపై విచారణ జరిపించాలి: మాయావతి
ఉత్తర ప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నేత 'ముఖ్తార్ అన్సారీ' గుండెపోటుతో గురువారం (మార్చి 28) సాయంత్రం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విచినట్లు అధికారులు చెబుతుంటే.. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు 'ఉమర్' ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ఈ విషయం మీద బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ముఖ్తార్ అన్సారీ మృతిపైన విచారణ జరిపించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసులో నిజానిజాలు ప్రజల ముందుకు రావాల్సి ఉందన్నారు. అన్సారీ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా డిమాండ్ చేశారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ అకాల మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు. అన్సారీ మౌ సదర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను 2005 నుంచి ఉత్తరప్రదేశ్, పంజాబ్లో జైలులో ఉన్నాడు. అతనిపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. సెప్టెంబరు 2022 నుంచి ఉత్తరప్రదేశ్లోని వివిధ న్యాయస్థానాలు అతనికి ఎనిమిది కేసుల్లో శిక్ష విధించాయి. पूर्व विधायक मुख्तार अंसारी जी का असामायिक निधन बेहद दुखद, मैं विनम्र श्रद्धांजलि अर्पित करता हूं। मेरी संवेदनाएं उनके परिजनों और समर्थकों के प्रति हैं, प्रकृति उन्हें यह असीम दुख सहने की शक्ति प्रदान करें। पूर्व में ही उन्होंने अपनी हत्या की आशंका व्यक्त की थी, मैं माननीय उच्च… — Chandra Shekhar Aazad (@BhimArmyChief) March 28, 2024 -
UP: సింగిల్గా పోటీ.. ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాలకు గాను తొలివిడతలో 16 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తు పుకార్లను కొట్టిపారేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేయాలని నిర్ణయించారు. బీఎస్పీ తొలి విడత జాబితాలో ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నౌర్, నగీనా, మురాదాబాద్, రాంపూర్, సంభాల్, అమ్రోహా, మీరట్, బాగ్పట్ స్థానాలతో సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సహరాన్పూర్ నుంచి మాజిద్ అలీ, కైరానా నుంచి శ్రీపాల్ సింగ్, ముజఫర్నగర్ నుంచి దారా సింగ్ ప్రజాపతి, బిజ్నోర్ నుంచి విజయేంద్ర సింగ్, నాగినా (ఎస్సీ స్థానం) నుంచి సురేంద్ర పాల్ సింగ్, మొరాదాబాద్ నుంచి మహ్మద్ ఇర్ఫాన్ సైఫీలను బరిలోకి దించింది. ఇక రాంపూర్ నుంచి జిషాన్ ఖాన్, సంభాల్ నుంచి షౌలత్ అలీ, అమ్రోహా నుంచి మొజాహిద్ హుస్సేన్, మీరట్ నుంచి దేవవ్రత్ త్యాగి, బాగ్పత్ నుంచి ప్రవీణ్ బన్సాల్లకు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాజేంద్ర సింగ్ సోలంకి, బులంద్షహర్ (ఎస్సీ స్థానం) నుంచి గిరీష్ చంద్ర జాతవ్, అయోన్లా నుంచి అబిద్ అలీ, పిలిభిత్ నుంచి అనిస్ అహ్మద్ ఖాన్ అలియాస్ ఫూల్ బాబు, షాజహాన్పూర్ (ఎస్సీ) నుంచి దోదరం వర్మ బరిలోకి దిగనున్నారు. -
అవన్నీ అసత్యాలే.. తేల్చి చెప్పేసిన మాయావతి
BSP Mayawati : రానున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి తేల్చి చెప్పేశారు. తమ పార్టీ పొత్తుతో వెళ్తుందని వస్తున్న వదంతులన్నీ అబద్ధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఈ మేరకు మాయావతి పోస్ట్ చేశారు. ‘రానున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో బీఎస్పీ తన సొంత బలంతో పోటీ చేస్తుంది. ఇందుకోసం పార్టీ పూర్తి సన్నద్ధత, బలంతో ఉంది. ఇటువంటి పరిస్థితిలో పొత్తులు, మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వస్తున్నవి తప్పుడు వార్తలు. ఇలాంటి వార్తలతో మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా గమనించాలి’ అని తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల ప్రణాళికల గురించి మాయావతి పేర్కొంటూ.. “ముఖ్యంగా యూపీలో బీఎస్పీ ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేస్తుండటంతో ఇతర పక్షాలు అసహనానికి గురవుతున్నాయి. అందుకే రోజూ రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే బీఎస్పీ నిర్ణయం దృఢమైనది" అన్నారు. -
లోక్సభ ఎన్నికల వేళ.. బీఎస్పీకి షాక్
లక్నో: బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) ఎంపీ రితేష్ పాండే బీఎస్పీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మామావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ రితేష్ పాండే.. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ నుంచి లోక్సభ బీఎస్పీ ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీఎస్పీ రాజీనామా చేయటంతో బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. बहुजन समाज पार्टी की प्राथमिक सदस्यता से त्यागपत्र pic.twitter.com/yUzVIBaDQ9 — Ritesh Pandey (@mpriteshpandey) February 25, 2024 ఉత్తరప్రదేశ్ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన బీఎస్పీ పార్టీ నేతలు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘చాలా కాలంగా నాకు పార్టీలో ఎటువంటి గుర్తింపు లభించటం లేదు. పార్టీ సమావేశాల్లో కూడా నాకు సీనియర్ నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అయనా.. నా నియోజకర్గం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉన్నా. ఇక పార్టీని నా సేవలు అవసరం లేదని భావిస్తున్నా. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని ఎంపీ రితేష్ పాండే తెలిపారు. మరోవైపు ఎంపీ రితేష్ పాండే బీజేపీ చేరుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన పాండే.. ఒక సోషల్ మీడియా పోస్ట్లో మోదీని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన రితేష్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్సీ)కి రాజీనామా చేసిన అంబేద్కర్ నగర్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ రితేష్ పాండే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు. -
2004 - 2024 : కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశలు
2004కు 2024కు లింకుందా? నాడు ఎన్డీయే వర్సెస్ యూపీఏ. నేడు ఎన్డీయే వర్సెస్ ‘ఇండియా’. నాటి ప్రత్యర్థులు వాజ్పేయి-సోనియా. నేటికీ సోనియా, ఆమె ప్రత్యర్థిగా నరేంద్ర మోదీ. ఇప్పుడు కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు ఎందుకు పెట్టుకుంది? మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న సోనియా గాంధీ ఆమె ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఒకసారి ఊహించండి. ఈ ఊహ 20 ఏళ్ల నాడు ఒక నమ్మలేని నిజం.. సోనియా ముభావి. ఎవరితోనూ కలవరు. కానీ ఆ రోజు మాయావతి ఇంటికి వెళ్లిన సోనియా గాంధీ ఆమెతో రెండు గంటల సేపు మాట్లాడారు. తర్వాత బయటికి వస్తూ.. ‘‘రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బహుజన పార్టీతో పొత్తు కుదుర్చుకోబోతున్నది’’ అని ప్రకటించారు. అయితే ఆ మర్నాడే మాయావతి అలాంటి పొత్తేమీ ఉండబోదని స్పష్టం చేశారు! అందుకు ప్రతిస్పందనగా.. ‘‘మాతో పొత్తు పెట్టుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని పార్టీల మీద ఒత్తిడి తెస్తోంది’’ అని సోనియా ఆరోపించారు. నాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్నట్లే ఎన్డీయే. నాడు ప్రధానిగా ఉన్నది అటల్ బిహారి వాజ్పేయి. బహుజన పార్టీతో పొత్తుకోసం ప్రయత్నించినట్లే సోనియా గాంధీ నమాజ్వాది పార్టీ పొత్తు కోసం చేయిచాచారు. సోనియా ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి అమర్సింగ్ హాజరు అయ్యారు కానీ, ములాయం సింగ్ యాదవ్ మాత్రం పొత్తు వద్దు, 1999లో మాదిరిగా ఒంటరి పోరాటమే మేలని అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా పొత్తుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయనపై కార్యకర్తల ఒత్తిడి కారణంగా కాంగ్రెస్తో చేయీచేయీ కలిపేందుకు బలవంతపు నవ్వులనే ఆనాడు ఆయన రువ్వారు. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం కాంగ్రెస్తో కలిసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు దగ్గరే ఆయన గీచిగీచి బేరం ఆడారు. లాలూ 6 స్థానాలు మాత్రమే ఇస్తాం అంటే కాంగ్రెస్ కనీసం 10 అయినా కావాలని కోరింది. ఇక డీఎంకేతో పొత్తు. అప్పటికి (2004 నాటికి) 24 ఏళ్లుగా కాంగ్రెస్కు దూరంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్తో కలిసి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చింది. అయితే లాలూ మాదిరిగానే కరుణానిధి కూడా 5 లేదా 6 సీట్లు ఇవ్వగలం అన్నారు. ఆయన తరఫున టి.బాలు సోనియాతో చర్చలు జరిపారు. అవి విఫలం అయ్యాయి. అలాగే.. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తేనే మీతో పొత్తుకు వస్తాం అని కేసీఆర్ తెగేసి చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గింది. జేఎంఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు కోరడంతో పొత్తుకు ముందుకు రాలేదు. ఏమైతేనేం ఆ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ యూపీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయేకు 181 సీట్లు రాగా, యూపీఏకు 218 సీట్లు లభించాయి. ఎన్నికల పొత్తుకు ముందుకు రాని పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాయి! బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాది పార్టీ, కేరళ కాంగ్రెస్, లెఫ్ట ఫ్రంట్లకు వచ్చిన సీట్లు కూడా కలుపుకుని 543 సభ్యుల లోక్సభలో సౌకర్యవంతమైన 335 సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. విశేషం ఏమిటంటే.. 2004లో ఎవరి మధ్యనైతే పోటీ ఉందో వారి మధ్యనే ఈ 2024లోనూ పోటీ ఉండబోవటం. నాడు, నేడు అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే. నాడు నేడు ప్రతిపక్షంగా ఉన్నది యూపీఏ కూటమే. అయితే యూపీఏ కాస్తా ‘ఇండియా’ కూటమి అయింది. నాడు స్వయంగా సోనియాజీ వెళ్లి పొత్తు కోసం ప్రయత్నించినా పొత్తుకు ముందుకు వచ్చిన పార్టీలు తక్కువ. నేడూ ఇంచుమించుగా అదే పరిస్థితి. పొత్తుకు వచ్చిన పార్టీలు ఎక్కువే అయినా ఎన్నికల వరకు అవి కాంగ్రెస్తో నిలబడి ఉంటాయా అన్నది సందేహం. ఆ సందేహం కలిగించిన మొదటి వ్యక్తి నితీష్ కుమార్. మూడు రోజుల క్రితమే ఆయన ‘ఇండియా’ కూటమిని వీడిపోయి ఎన్డీయేలో కలిశారు. మమతా బెనర్జీ కూడా తాము విడిగానే పోటీ చేస్తామని అంటున్నారు. ‘ఆప్’ కూడా ఆమె బాటలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. నితీశ్ కమార్ బయటికి వెళ్లకముందు వరకు ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ‘ఇండిపెండెంట్’ పార్టీతో కలిపి మొత్తం 28 పార్టీలు ఉండేవి. అవి: 1. కాంగ్రెస్, 2. డీఎంకే, 3. శివసేన (యు.బి.టి.), 4. సి.పి.ఐ (ఎం), 5. ఎన్.సి.పి., 6. ముస్లిం లీగ్, 7. నేషనల్ కాన్ఫరెన్స్, 8. సి.పి.ఐ., 9. ఆప్, 10. జె.ఎం.ఎం., 11. కేరళ కాంగ్రెస్, 12. కేరళ కాంగ్రెస్ (ఎం), 13. వీసీకె (విదుతలై చిరుతైగళ్ కచ్చి), 14. ఆర్.ఎస్.పి., 15. ఆర్.జె.డి., 16. ఆర్.ఎల్.డి., 17. డి.ఎం.కె., 18. సీపీఐ (ఎంఎల్) ఎల్., 19. అప్నా దళ్, 20. పీసెంట్స్ అండ్ 21. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, 22. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, 23. పి.డి.పి., 24. ఎం.ఎం.కె., 25. కె.ఎం.డి.కె., 26. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 27. ఇండిపెండెంట్, 28. జేడీయు. నాటి ఎన్నికల్లో వాజ్పేయి-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. నేటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా పార్టీలో దింపుడు కళ్లెం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయి. చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
ఇండియా కూటమికి షాక్.. మాయావతి కీలక ప్రకటన
లక్నో: బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతున్నట్టు మాయావతి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో రాజకీయాల్లో తన రిటైర్మెంట్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మాయావతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తు ఉండదు. ఎన్నికల అనంతరం పొత్తుల విషయంపై ఆలోచిస్తాం. అప్పుడు పొత్తులు ఉంటే ఉండొచ్చు. ఇప్పటి వరకు ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన సందర్భంలో బీఎస్పీకి చేదు అనుభం ఎదురైంది. పార్టీకి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటోంది. తమ ఓట్లు భాగస్వామ్యపక్షానికి బదిలీ అయినప్పటికీ.. అటు ఓట్లు మాత్రం ఇటు రావడం లేదు. కాబట్టి ఎన్నికల్లో పొత్తుల్లేకుండానే ఈ సారి ఎన్నికలకు వెళతాం’ అని స్పష్టం చేశారు. VIDEO | "I want to clarify that our party (BSP) will go solo in the upcoming (2024) Lok Sabha polls. With the backing of people from backward community, Dalits, tribals and Muslims, we had formed a full majority government in UP in 2007, and that's why we have decided to contest… pic.twitter.com/oatnx167db — Press Trust of India (@PTI_News) January 15, 2024 దీంతో, తాము ఇండియా కూటమిలో చేరడం లేదని మాయవతి క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలతో పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మాయావతి తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. తన తుదిశ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టంచేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. ఇదే సమయంలో రామమందిర ప్రాణప్రతిష్టకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే, పార్టీ కార్యక్రమాల దృష్ట్యా వెళ్లాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. తమది సెక్యూలర్ పార్టీ అని చెప్పుకొచ్చారు. -
‘మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. కూటమిలో చేరుతాం’
రాబోయే 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మాలూక్నగర్ డిమాండ్ చేశారు. తాము ఇండియాలో కూటమి చేరాలంటే బీఎస్పీ చీఫ్ మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని షరతు పెట్టారు. కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేను.. ప్రధానమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ.. మాయావతికి క్షమాపణ చెప్పాలన్నారు. అదేవిధంగా మాయావతిని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాలూక్నగర్. అలా అయితే ఇండియా కూటమి 2024లో బీజేపీని ఎదుర్కొగలదని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మాయావతికి ప్రత్యామ్నాయ వ్యక్తి ఎవరూ లేరని తెలిపారు. కాంగ్రెస్ తమ షరతులకు అంగీకరం తెలుపుతుందని మాయావతి సానుకూలంగా ఉందన్నారు. తమకు ఉత్తరప్రదేశ్లో 13.5 శాతం ఓట్ల షేరు ఉందని, అది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 60 కంటే ఎక్కువ ఎంపీ సీట్లను బీఎస్పీ గెలుచుకుంటుందని అన్నారు. బీఎస్పీకి, ఎస్పీకి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్న మాలూక్ నగర్ ఖండించారు. ఇండియా కూటమిలో మాయావతి చేరుతానంటే ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఎటువంటి అభ్యంతరం తెలపరని అన్నారు. మాయావతి పట్ల అఖిలేష్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట.. -
మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్ ఆనంద్
లక్నో: బహుజన సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి తన రాజకీయ వారుసుడిని ప్రకటించారు. ఆదివారం లక్నోలో బీఎస్పీ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మినహా మిగతా దేశంలో తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ రాజకీయ వారసుడిగా కొనసాగుతారని ప్రకటించారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్, ఫలితాలపై చర్చించారు. అదే విధంగా 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆకాశ్ ఆనంద్.. మాయావతి పాత్ర పోషించనున్నారు. గత ఏడాడి నుంచి ఆకాశ్ ఆనంద్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాయావతి చిన్న తమ్ముడి కుమారుడు. 2016లో పార్టీలో జాయన్ అయిన ఆనంద్.. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీలో స్టార్ క్యాంపేయినర్గా పని చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 2022లో ఆయన రాజస్థాన్లోని అల్వార్లో 13 కిలో మీటర్ల ‘స్వాభిమాన్ సంకల్ప్ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేశారు. 2018 రాజస్థాన్లో బీఎస్పీ గెలుచుకున్న 6 సీట్ల విజయం వెనకాల ఆనంద్.. కీలకమని పోల్ క్యాంపేయినింగ్ వ్యూహాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్గఢ్ సీఎం రేసులో వెనుకబడిన రమణ్ సింగ్! -
వారి వాగ్దానాలు నమ్మొద్దు
సాక్షి, పెద్దపల్లి: బీఆర్ అంబేడ్కర్కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని, కాన్షీరాం చనిపోతే కనీసం సంతాపదినం ప్రకటించని ఆ పార్టీని ఓడించాలని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే అణచివేతకు గురైన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పారు. మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని దేశవ్యాప్తంగా కాన్షీరాంఉద్యమం చేయడంతోనే ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు దక్కాయని గుర్తుచేశారు. గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన ఘీంకార బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని, దళితులను కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. వారిని ఓటు బ్యాంకుగానే గుర్తిస్తూ రాజకీయంగా అణచివేస్తోందని దుయ్యబట్టారు. 1989లో తాను తొలిసారి ఎంపీగా గెలిచాక నాటి వీపీ సింగ్ ప్రభుత్వం తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని చెప్పానని, మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలంటూ పట్టుబట్టి ప్రభుత్వం మెడలు వంచానన్నారు. దేశంలో బీఎస్పీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా పాలిస్తూ ప్రజల హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు కల్పించిన 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. దళితుల అణచివేతలో భాగంగానే ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడు పునీత్పై పోలీసులు అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ నాలుగుసార్లు అధికారంలోకి వచ్చి పేదలకు భూములు పంచి, లక్షలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. తెలంగాణలో కూడా బీఎస్పీ అధికారంలోకి వస్తే అలాంటి పథకాలు అమలు చేసి బహుజనుల రాజ్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ను ఓడించాలి: ప్రవీణ్ కుమార్ రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ను ఓడించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బహుజనుల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దపల్లి అభ్యర్థి దాసరి ఉష, రామగుండం అభ్యర్థి అంబటి నరేశ్యాదవ్, మంథని అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో అధికారంలోకి వస్తాం
సూర్యాపేట: తెలంగాణలో ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సూర్యాపేట మండలంలోని గాం«దీనగర్లో బహుజన రాజ్యాధికార సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. అన్నీ సంపన్న వర్గాల కోసం నడుస్తున్న పార్టీలని అన్నారు. కానీ బీఎస్పీ ఒక్కటే బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో పనిచేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకుని నడుస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు. దేశంలో మిగిలిన పార్టీలన్నీ ఓట్ల ముందు తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ఇది గమనించిన వట్టె జానయ్య యాదవ్ లాంటి వారు బహుజన జెండాను ఎత్తుకోవడం ఆహా్వనించదగిన పరిణామమని అన్నారు. వట్టె జానయ్యపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని.. అది బీఆర్ఎస్, కాంగ్రెస్లు జరిపించిన వ్యూహాత్మక దాడి అని ఆరోపించారు. ‘మేము తక్కువగా చెప్పి.. ఎక్కువగా పనిచేస్తాం’అని పేర్కొన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 1,300 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా కేసీఆర్కు తెలియకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో గడీల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సభలో సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్యయాదవ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
Rajasthan elections 2023: ఏం ‘మాయ’ చేయనుందో...!
రాజస్తాన్లో హోరాహోరీ తలపడుతున్న అధికార కాంగ్రెస్, బీజేపీ గెలుపోటములను మాయావతి సారథ్యంలోని బీఎస్పీ మరోసారి ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దాంతో పోలింగ్ మరో పది రోజుల్లోకి వచ్చిన వేళ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 30 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను బీఎస్పీ ప్రభావితం చేసింది. ఏకంగా 6 స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 60 స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సాక్షి, న్యూఢిల్లీ కుల సమీకరణలతో... ► రాజస్తాన్ ఓటర్లలో 18 శాతం మంది ఎస్సీలు, 9 శాతం మంది ముస్లింలున్నారు. దాంతో ఉత్తర్ప్రదేశ్లో మాదిరిగానే ఇక్కడ కూడా దళిత–ముస్లిం ఫార్ములానే బీఎస్పీ నమ్ముకుంది. ► గత ఎన్నికల్లో ఇదే ఫార్ములాతో బీఎస్పీ 6 అసెంబ్లీ స్థానాలు నెగ్గడమే గాక 4 శాతం ఓట్లు రాబట్టింది. ► బీఎస్పీ ప్రభావం చూపిన మరో 30 స్థానాల్లో బీజేపీ ఏకంగా 17 స్థానాలను అతి తక్కువ మెజారిటీతో కాంగ్రెస్కు కోల్పోయింది. ► మరో మూడింట స్వతంత్రులు గెలిచారు. ఈ దెబ్బకు బీజేపీ అధికారాన్నే కోల్పోవాల్సి వచి్చంది. ► ఆ 17 స్థానాల్లో బీజేపీ గెలుచుంటే ఆ పార్టీ బలం 73 నుంచి 90 స్థానాలకు పెరిగేది. ► 100 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ 83కు పరిమిత ► మయ్యేది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు మెరుగ్గా ఉండేవి. ఈసారి కూడా... ► ఈసారి కూడా రాష్ట్రంలో 200 సీట్లకు గాను ఏకంగా 183 చోట్ల బీఎస్పీ బరిలో దిగింది. మిషన్–60 లక్ష్యంతో దూసుకెళ్తోంది. ► ఆ 60 స్థానాల్లో బలమైన సోషల్ ఇంజనీరింగ్ చేసింది. ఈ విషయంలో పార్టీ నిపుణుడైన రామ్జీ గౌతమ్ వ్యూహాలను అమలు చేస్తోంది. ► ధోల్పూర్, భరత్పూర్, కరౌలీ, సవాయి మధోపూర్, దౌసా, ఆళ్వార్, సికర్, ఝుంఝును, ఛురు, హనుమాన్గఢ్, గంగానగర్, బార్మేర్, జాలోర్, నగౌర్, జైపూర్ రూరల్ జిల్లాల్లోని 60 నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రచారం చేస్తోంది. ► ఈ నెల 17 నుంచి 20 వరకు మాయావతి భరత్పూర్, అల్వార్, ఖేత్రి జిల్లాల్లో ఏకంగా 8 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ► దాంతో గాలి తమకు మరింత అనుకూలంగా మారుతుందని బీఎస్పీ అభ్యర్థులు అంటున్నారు. -
పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు
లక్నో: బహుజన్ సమాజ్వాది పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఈ లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని కలవబోవడంలేదని స్పష్టం చేశారు. వారితోనే కాదు మారె ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, ఇతర కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ యూపీలోనూ ఉత్తరాఖండ్లోనూ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మన సొంత బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూనే కార్యవర్గమంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ సభ్యులు అందరూ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫేక్ మెసేజులతో మన ప్రత్యర్ధులు రాజకీయ కుట్రలకు పాల్పడే అవకాశముందన్నారు. బీఎస్పీ వ్యతిరేక శక్తులు మన గెలుపును అడ్డుకునేందుకు ఏమి చేయడానికైనా వెనకాడవని ప్రతి దశలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, దీని కారణంగా మన ఎన్నికల ప్రణాళిక దెబ్బ తినకూడదని అన్నారు. అధికార బీజేపీ పార్టీ పరిపాలనపై స్పందిస్తూ.. వారి పాలనలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. ద్రవ్యోల్బణం,పేదరికం, నిరుద్యోగం, శాంతిభద్రతల లోపం, విద్య, వైద్యం వంటి సమస్యలతో సహా ఏదీ సరిగ్గా లేదని చెబుతూనే ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరు ఒకేలా ఉంటుందని పూర్తిగా ప్రజా వ్యతిరేక ధోరణిలో వారి వ్యవహారం ఉంటుందని అన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రిజర్వేషన్ను ప్రతిపాదికగా తీసుకోకూడదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న బుల్డోజర్ యాక్షన్లపై ఆమె స్పందిస్తూ ఒక వ్యక్తి దోషి అని నిరూపితం కాక ముందే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. పైగా ఆ వ్యక్తి చేసిన తప్పుకు ఆ కుటుంబాన్ని శిక్షిస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదని పూర్తి ప్రజా వ్యతిరేక విధానమని అన్నారు. 01-10-2023-BSP PRESS NOTE-UP MEETING pic.twitter.com/PVgb7KdhiA — Mayawati (@Mayawati) October 1, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన -
ముస్లింలను దళితులతో పోలిస్తే తప్పేంటి? రాహుల్కు మాయావతి మద్దతు
సాన్ ఫ్రాన్సిస్కోలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ట్విట్టర్లో మద్దతు తెలిపారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. అందుకు ప్రస్తుత, గత ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అందులో తప్పేంటి? అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన "మొహబ్బత్ కీ దుకాన్" కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రస్తుతం భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.1980ల్లో దళితుల పరిస్థితి ఎంత దీనంగా ఉండేదో అంతకంటే ఘోరమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం సమర్ధించారు. ట్వీట్ సారాంశమేమిటంటే... " అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చెప్పింది చేదు నిజం. కోట్లాది దళితులు, ముస్లింలు భారత దేశంలో దయనీయ స్థితిలో అభద్రతా భావంతో బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితికి గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల ప్రభుత్వాలే బాధ్యత వహించాలి." "యూపీలో కానివ్వండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి. ఇప్పటికీ పేద, అణగారిన వర్గాల పట్ల అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం మా హయాంలో మాత్రమే యూపీలో ప్రశాంతత నెలకొంది." కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్ధ రాజకీయ నాయకులు మతపరమైన అల్లర్లు, కులాల మధ్య కొట్లాటలను రెచ్చగొట్టి చరిత్రను ఎన్నో చీకటి అధ్యాయాలతో నింపేశారని రాశారు. చదవండి: ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఆయనే... కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు -
హైదరాబాద్లో అంబేడ్కర్ భారీ విగ్రహం.. మాయావతి ఫైర్
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ పేరుతో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్.. ఆ మహానుభావుడి విగ్రహాల సాకుతో అణగారిన వర్గాలను మరోసారి ఏమార్చేందుకు వస్తున్నారని విమర్శించారు. బీఎస్పీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో ‘తెలంగాణ భరోసా సభ’ జరిగింది. మాయవతి ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు భూమి లేని దళితులకు మూడెకరాల భూమిని ఉచితంగా ఇచ్చానని.. కేసీఆర్ ఆ పథకాన్ని కాపీకొట్టి ఎన్నికల హామీగా ఇచ్చారని మాయావతి చెప్పారు. కానీ కేసీఆర్ దళితులకు భూమి పంపిణీ చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం అవడంతో కేసీఆర్కు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు ఇబ్బంది కేసీఆర్ సర్కార్ తీరుతో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, ముస్లిం తదితర అణగారిన వర్గాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని మాయావతి ఆరోపించారు. బిహార్లో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్ను చంపిన హంతకుడిని అక్కడి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తే.. సీఎం కేసీఆర్ కనీసం కూడా ప్రశ్నించలేదేమని నిలదీశారు. అంబేడ్కర్, కాన్షీరాం స్ఫూర్తితో బీఎస్పీ అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని.. భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తే యూపీలో అమలుచేసిన సంక్షేమ పథకాలను ఇక్కడా అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలు, రైతులు, కూలీలు, నిరుద్యోగులు, మైనారిటీవర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదలకు కూడా బీఎస్పీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నాయని.. కానీ నిరుద్యోగులకు ఇవ్వాల్సింది భృతి కాదని, ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక్కడ అధికారంలోకి వస్తే ప్రవీణ్కుమారే సీఎం తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్కుమారే ముఖ్యమంత్రి అని మాయావతి ప్రకటించారు. ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పేదలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని.. అలాంటి వ్యక్తి సీఎం అయితే తెలంగాణ అభివృద్థి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం, లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకమని, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని మాయావతి గుర్తు చేశారు. బీఎస్పీకి భయపడే అంబేడ్కర్ విగ్రహం: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ప్రగతిభవన్ మీద నీలి జెండా ఎగరవేయడం ఖాయమని, తెలంగాణను దోపిడీ దొరల నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఏనాడూ అంబేడ్కర్ ఫోటోకు, విగ్రహానికి దండ వేయని కేసీఆర్.. బీఎస్పీకి భయపడే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. తాను బీఎస్పీలో చేరిన తర్వాతే దళిత బంధు పథకాన్ని తెచ్చారన్నారు. ‘దళితబంధు’లో ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయల చొప్పన కమీషన్లు తీసుకుంటున్నట్టు స్వయంగా చెప్పిన కేసీఆర్.. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేల పేర్లను ఏసీబీకి ఇవ్వాలని సవాల్ చేశారు. రైతులు పంట నష్టపోయి కష్టాలు పడుతుంటే.. కేసీఆర్ ప్రగతిభవన్లో మహారాష్ట్ర వాళ్లను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారని, తెలంగాణ ప్రజాధనాన్ని మహారాష్ట్ర వ్యక్తులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఒక్కో ఉద్యోగాన్ని రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతీ నెలా ఒకటో తేదీన జీతం తీసుకునే కేసీఆర్.. ఉద్యోగులకు మాత్రం 10వ తేదీన జీతాలు ఇస్తున్నాడని ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. పేద ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా కింద కేసులు పెట్టారని, నెలకు 4లక్షలకుపైగా జీతం తీసుకుంటున్న కేసీఆర్పై ఎస్మా ప్రయోగించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం నాడు తాము గజ్జె కట్టామని.. ఇప్పుడు అన్యాయం జరిగితే గల్లా పడతామని హెచ్చరించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. భూమి లేని వారికి ఎకరం భూమి ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, ఏపీ అధ్యక్షుడు పరంజ్యోతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్ చౌహాన్, అరుణ, సంజయ్ కుమార్, దాసరి ఉష తదితరులు పాల్గొన్నారు. -
అతిక్ సోదరుల దారుణ హత్య.. మాయవతి రియాక్షన్ ఇదే..
లక్నో: ఉత్తరప్రదేశ్లో రాజకీయనేత, గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వారిద్దరినీ ముగ్గురు యువకులు.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈఘటనపై తాజాగా బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. కాగా, మాయావతి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గుజరాత్ జైలు నుండి తీసుకువచ్చిన అతీక్ అహ్మద్, బరేలీ జైలు నుండి తీసుకువచ్చిన అతని సోదరుడు అష్రఫ్ను ప్రయాగ్రాజ్లో దారుణంగా కాల్చి చంపారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారికి చంపడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ఆందోళనకరమైన ఘటనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా బై లా’ కాకుండా ఎన్కౌంటర్ ప్రదేశ్గా మార్చడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసుల సమక్షంలో ఇలా హత్యలు జరిగితే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మరోవైపు.. ఈ ఘటనలో లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వీరిని విచారించగా.. ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్ను షూట్ చేసినట్లు వీరు పోలీసులకు తెలిపారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లలో వెళ్లి కాల్చి చంపినట్లు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ముగ్గురు యువకులు ఘటనా స్థలంలో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. -
‘మీ బుల్డోజర్లతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్’
ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ తీరుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్లో అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్లో.. తల్లికూతుళ్లు మరణించిన ఘటనను ప్రస్తావించారు బీఎస్పీ చీఫ్ మాయావతి. తాజాగా యూపీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కంటే.. తల్లీకూతుళ్ల మరణం ఘటనే వార్తల్లో హాట్ టాపిక్గా నిలిచిందంటూ మండిపడ్డారామె. బీజేపీ చేస్తున్న బుల్డోజర్ రాజకీయాలు అమాయకులైన పేదల ప్రాణాలు తీస్తున్నాయని, ఇది చాలా బాధకరమన్నారు. ఇలాంటి వాటివల్ల ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందంటూ.. సోషల్ మీడియా వేదికగా యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తూ హిందీలో ట్వీట్ చేశారు. కాగా, బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చడంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ యోగి 'బుల్డోజర్ బాబాగా' ప్రజల నోళ్లల్లో నానుతుండటం గమనార్హం. 1. देश व खासकर उत्तर प्रदेश जैसे गरीबी, बेरोजगारी, महंगाई व पिछड़ेपन आदि से त्रस्त विशाल राज्य में भाजपा सरकार की लोगों को अति-लाचार एवं आतंकित करने वाली बुल्डोजर राजनीति से अब निर्दोष गरीबों की जान भी जाने लगी हैं, जो अति-दुखद व निन्दनीय। सरकार अपना जनविरोधी रवैया बदले। 1/2 — Mayawati (@Mayawati) February 15, 2023 (చదవండి: ఎవరైనా సీన్ క్రియేట్ చేస్తే నడుములు విరిగిపోతాయ్!: మధ్యప్రదేశ్ మంత్రి వార్నింగ్) -
అఖిలేశ్, మాయవతిలకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం!
లఖ్నవూ: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తి చేసుకున్న యాత్ర త్వరలోనే ఉత్తర్ప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని బీజేపీయేతర పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించింది కాంగ్రెస్ పార్టీ. అందులో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బహజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. మరోవైపు.. లఖ్నవూ యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ ముఖ్యమంత్రి దినేశ్ శర్మను సైతం ఆహ్వానించింది. వచ్చే ఏడాది జనవరి 3న ఉత్తర్ప్రదేశ్లోకి ప్రవేశించనుంది భారత్ జోడో యాత్ర. గాజియాబాద్ జిల్లాలోని ’లోని’ ప్రాంతంలో ప్రారంభమై బాఘ్పత్, శామిలి జిల్లాల మీదుగా హరియాణాలోకి వెళ్తుంది. ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ రాష్ట్రంలోని ప్రముఖ విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. ప్రస్తుత సమయంలో ప్రజల మనసులను తెలుసుకునేందుకు యాత్ర ఒక్కటే మార్గమని సూచించారు. ప్రస్తుతం విపక్షం మొత్తం ఈ ప్రభుత్వంపై ఒకే ఆలోచన ధోరణిలో ఉందని, అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు -
వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి
లక్నో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆర్ఎస్ఎస్ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఆరోపించారు. లక్నోలో బీఎస్పీ పథాధికారులతో భేటీ సందర్భంగా మాయావతి ప్రసంగించారు. ‘ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, హింస నెలకొన్నాయి. ఈ అంశాలపై ఆర్ఎస్ఎస్ మౌనమునిగా మారింది. మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆర్ఎస్ఎస్ ముందువరసలో నిల్చుంటుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్ఎస్ఎస్ మరో కుట్రకు తెరతీసింది. మతమార్పిడి, అధిక జనాభా అంటూ కొత్త విషయాలకు ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలొచ్చినా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతుపలుకుతుంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కనీసం ఒక్కసారైనా ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ మౌనం విచారకరం, అంతేకాదు దేశానికి హానికరం ’ అని అన్నారు. మతమార్పిడి, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా అధిక జనాభా సమస్య తలెత్తుతోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాయావతి స్పందించారు. -
Khelo India Youth Games 2022: మాయావతికి కాంస్యం
పంచ్కుల (హరియాణా): ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్లో గురువారం తెలంగాణకు 2 కాంస్యాలు, ఆంధ్రప్రదేశ్కు ఒక కాంస్యం లభించాయి. బాలికల 200 మీటర్ల పరుగులో నకిరేకంటి మాయావతి కాంస్యం గెలుచుకుంది. 24.94 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో సుదేష్ణ (మహారాష్ట్ర–24.29 సె.), అవంతిక (మహారాష్ట్ర–24.75 సె.) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. బాలుర 200 మీటర్ల పరుగులో తెలంగాణకు చెందిన అనికేత్ చౌదరి (22.27 సె.) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఆర్యన్ కదమ్ (మహారాష్ట్ర–21.82 సె.), ఆర్యన్ ఎక్కా (ఒడిషా–22.10 సె.) మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. బాలికల వెయిట్లిఫ్టింగ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆర్. గాయత్రి కాంస్య పతకం గెలుచుకుంది. 81 ప్లస్ కేజీల కేటగిరీలో గాయత్రి 160 కిలోల బరువెత్తింది. ఈ విభాగంలో మార్టినా దేవి (మణిపూర్–186 కేజీలు), కె.ఒవియా (తమిళనాడు–164 కేజీలు) స్వర్ణం, రజతం సాధించారు. -
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేటుకుంది. అవినీతి సహా పలు ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్కు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మద్దతుగా నిలిచారు. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ సర్కారు ఆయనపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నాయని గురువారం విమర్శించారు. ఈ మేరకు వరుసగా ట్విటర్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘యూపీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై నిరంతర ద్వేషపూరిత, ఉగ్రదాడులకు పాల్పడుతూ సీనియర్ ఎమ్మెల్యే మహ్మద్ ఆజం ఖాన్ను రెండున్నరేళ్లపాటు జైల్లో ఉంచింది. ప్రజల దృష్టిలో ఇది న్యాయం గొంతు నొక్కడం కాకపోతే ఇంకేంటి?’ అని మాయావతి ప్రశ్నించారు. 88 కేసుల్లో బెయిల్ ఆజం ఖాన్ రెండేళ్లుగా సీతాపూర్ జైలులో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 కేసులు పెట్టగా 88 కేసుల్లో బెయిల్ లభించింది. శత్రువుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్న కేసులో బుధవారం అలహాబాద్ హైకోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చివరి కేసులో కూడా బెయిల్ మంజూరయ్యాకే జైలు నుంచి ఆజం ఖాన్ విడుదల కానున్నారు. (క్లిక్: అనూహ్యం.. డీజీపీని తప్పించిన సీఎం యోగి) కూల్చివేతలు కరెక్ట్ కాదు కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అధికారులు చేపట్టిన నిర్మాణాల కూల్చివేతలను మాయావతి తప్పుబట్టారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో దురుద్దేశపూరితంగా ఆక్రమణల తొలగింపు పేరుతో వలస కార్మికులు, శ్రామిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ వారి జీవనోపాధిని లాగేసుకుంటున్న తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తడంతోపాటు ఆందోళన కలిగిస్తోంద’ని ఆవేదన వ్యక్తం చేశారు. (క్లిక్: ‘అవార్డ్ వాపసీ’పై బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం) -
రాహుల్... సొంతిల్లు దిద్దుకో: మాయావతి
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇతర పార్టీల గురించి ఆందోళన చెందడం మాని సొంత పార్టీని చక్కదిద్దుకోవాలంటూ బీఎస్పీ చీఫ్ మాయావతి సలహా ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో మాయవతికి సీఎం పోస్ట్ ఇవ్వజూపినా పొత్తుకు ముందుకు రాలేదన్న రాహుల్ వ్యాఖ్యలపై ఆమె ఇలా స్పందించారు. ‘‘రాహుల్ వ్యాఖ్యన్నీ అబద్ధాలు. అవి కులతత్వ మనస్తత్వాన్ని, దళితుల పట్ల దుర్గార్మపు ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. పార్టీని దిద్దుకోలేక రాహుల్ మాపై వేలెత్తి చూపుతున్నారు’’ అని మండిపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీని సంప్రదించడం దానిపై మాయా మౌనం నిజమేనని కాంగ్రెస్ నేత ఖర్గే అన్నారు. చదవండి: (ప్రధాని మోదీ– జో బైడెన్ కీలక భేటీ) -
మాయావతికి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినా ఆమె స్పందించలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. సీబీఐ, ఈడీ, పెగసస్ల భయంతోనే ఆమె బీజేపీ విజయానికి బాటలు వేశారని పేర్కొన్నారు. సమృద్ధ్ భారత్ ఫౌండేషన్ ప్రచురించిన ‘ది దళిత్ ట్రూత్’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం రాహుల్ ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఒక ఆయుధమని కాంగ్రెస్ నేత రాహుల్ అభివర్ణించారు. ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హస్తగతం చేసుకుందని ఆరోపించారు. రాజ్యాంగంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.‘కేవలం అధికారం చేజిక్కించుకోవడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించే కొందరు రాజకీయ నేతల వంటి వాడిని కాదు. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది. అదేవిధంగా, తీవ్రంగా కొట్టి హింసింది. నేనింకా నేర్చుకోవాలని దేశం భావిస్తున్నట్లు దాని ద్వారా తెలుసుకున్నాను’అని అన్నారు. -
అధికార కేంద్రంలోనే పుట్టాను...కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: కేంద్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన్పటికీ తనకు అధికార పగ్గాల పై ఆసక్తి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ...ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ....."వారంతా అధికారం కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులు. అధికారాన్ని పొందడం గురించే ఆలోచిస్తారు. నేను అధికార కేంద్రంలోనే పుట్టాను కానీ నాకు నిజాయితీగా దానిపై ఆసక్తి లేదు . నేను నా దేశాన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రభావంతమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కీలక కాంగ్రెస్ నాయకుడు. ఆయన తాతయ్య, నానమ్మ, తండ్రి కూడా ప్రధానులుగా సేవలందించిన సంగతి తెలిసిందే. అలాగే రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రా కూడా భారత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నవారే. అంతేకాదు ఆ ప్రసంగంలో రాహుల్ గాంధీ యూపీ సీనియర్ రాజకీయ నాయకురాలు అయిన బీఎస్సీ అధినేత్రి మాయవతి పై విరుచుకుపడ్డారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఎలాంటి ఎఫర్ట్ పెట్టి పనిచేయలేదని ఆరోపించారు. ఈసారి ఆమె దళితుల కోసం పోరాడలేదని విమర్శలు గుప్పించారు. (చదవండి: ఆప్కు భారీ దెబ్బ.. బీజేపీలోకి కీలక చేరికలు! కేజ్రీవాల్ తీరువల్లే..) -
ఓటమికి కారణం ఇదే: మాయావతి
-
‘మాయావతి, ఒవైసీలకు.. పద్మవిభూషణ్, భారతరత్న’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో బీజేపీ రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీలకు పద్మవిభూషణ్ లేదా భారతరత్న పురస్కారాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ యూపీ వారి రాష్ట్రం. అఖిలేశ్ యాదవ్ సీట్లు 3 రెట్లు పెరిగాయి. 42 నుంచి 125కి పైగా స్థానాలు వచ్చాయి. మాయావతి, ఒవైసీలు.. బీజేపీ విజయానికి దోహదపడ్డారు. కాబట్టి వారికి పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాల’ని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. పంజాబ్లో ఎందుకు ఓడిపోయారు? నాలుగు రాష్ట్రాలలో బీజేపీ గెలిచినప్పటికీ.. పంజాబ్ ఓటర్లు కమలం పార్టీని పూర్తిగా తిరస్కరించారని చెప్పారు. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి సహా సీనియర్ నేతలంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా పంజాబ్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే.. పంజాబ్లో బీజేపీ దారుణంగా ఓడిపోయిందని వెల్లడించారు. బీజేపీ వంటి జాతీయ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం చెందడం ఆలోచించదగ్గ విషయని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, గోవాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. బీజేపీకి బీ టీమ్.. యూపీ ఎన్నికల్లో బీజేపీకి బీఎస్పీ, ఎంఐఎం బీ టీమ్ పనిచేశాయని ప్రత్యర్థి పార్టీలు బలంగా ఆరోపించాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఈ రెండు పార్టీలు పనిచేశాయని పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు తోసిపుచ్చాయి. తాము బీజేపీకి బీ టీమ్ అని తప్పుడు ప్రచారం చేయడం వల్లే దారుణంగా ఓడిపోయామని బీఎస్పీ అధినేత్రి మాయావతి వాపోయారు. బీజేపీని ఓడించే సత్తా తమ పార్టీకే ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె అన్నారు. ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నానని, ఉత్తరప్రదేశ్లోని మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. (చదవండి: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) -
‘మాయ’మైనట్టేనా?
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఆ పార్టీ కుదేలైంది. తొలినుంచి ఆయువుపట్టుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఆదరించకపోగా మాయా సొంత సామాజికవర్గం జాటవ్లు కూడా బీజేపీ వైపు మొగ్గారు. ఒక దశలో ప్రధాని అయ్యేంతగా వెలుగు వెలిగిన మాయావతి ప్రభ ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులంటున్నారు. మాయా లేదు..మంత్రం లేదు.. బహుజనుల నేతగా 1995, 1997, 2002, 2007ల్లో నాలుగుసార్లు యూపీ సీఎం పీఠమెక్కిన ఘన చరిత్ర 66 ఏళ్ల మాయావతిది. అలాంటిది బీఎస్పీ ఈసారి ఎన్నడూ లేనంతటి ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలిచిన పార్టీ ఈసారి నెగ్గింది ఒక్కటంటే ఒక్క సీటు! ఓట్ల శాతం కూడా 12.6 శాతానికి దిగజారింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ బీఎస్పీ కేవలం 19.3 శాతం ఓట్లతో 10 స్థానాలతో సరిపెట్టుకుంది. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాలను మాయా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో పార్టీలో క్రియాశీలంగా ఉండే బ్రాహ్మణవర్గం బీజేపీలోకి, ముస్లింలు సమాజ్వాదీలో చేరారు. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ పోటాపోటీ సభలు, రోడ్షోలు, ర్యాలీలకు దిగాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ 209 ర్యాలీలు, సభలు; బీజేపీ నుంచి యోగి 203 సభలు, ర్యాలీలు; ఎస్పీ అధినేత అఖిలేశ్ 139 ర్యాలీలు, సభలు జరిపితే మాయా కేవలం 18 మీటింగులతో ముగించారు. ఎస్సీలూ దూరమయ్యారు యూపీలో 21 శాతమున్న దళిత ఓటర్లు తొలినుంచీ బీఎస్పీకే దన్నుగా నిలిచారు. సుమారు 4.2 కోట్ల దళితుల్లో 2.25 కోట్లు మాయా సామాజికవర్గం జాటవ్కే చెందిన వారు. పాసీలు 70 నుంచి 80 లక్షల దాకా (16 శాతం)ఉంటారు. కోటికి పైగా మిగతా కులాల వారున్నారు. రాష్ట్రంలోని 84 ఎస్సీ స్థానాల్లో 2007లో బీఎస్పీ ఏకంగా 61 గెలుచుకోగా 2012లో 14కు పడిపోయింది. 2017 ఎన్నికల నాటికి ఎస్సీలు దాదాపుగా బీజేపీ వైపు మొగ్గారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాటవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో దళితులు బీఎస్పీకి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అదే ఫార్ములా వాడింది. దాంతో దళితులంతా మరోసారి బీజేపీవైపే నిలిచారు. గడిచిన ఎన్నికల్లో బీఎస్పీ సాధించిన సీట్లు, ఓట్లు ఎన్నికలు గెలిచిన ఓట్ల సీట్లు శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 2022 1 12.66 -
సీఎం చన్నీని పక్కన పెడతారు
చండీగఢ్: పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి విమర్శించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం దళిత ముఖ్యమంత్రిని వాడుకుంటోందని ధ్వజమెత్తారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు పెట్టుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మాయావతి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. పంజాబ్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగానే దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ అధికారాన్ని నిలబెట్టుకున్నా చరణ్జీత్ సింగ్ చన్నీని పక్కన పెడతారని జోస్యం చెప్పారు. హిమాచల్ గుడికి వెళ్లే బదులు సంత్ రవిదాస్ ఆశీస్సులు తీసుకోవడానికి సీఎం చన్నీ వెళితే బాగుండేదన్నారు. ఆయన ఆలయాన్ని సందర్శించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దళితులకు కూడా సానుకూల సందేశం పంపి ఉండాల్సిందని మాయావతి అభిప్రాయపడ్డారు. బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనిస్తోందని, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ అబద్దపు హామీలతో ఓటర్లకు గాలం వేస్తోందని ఆరోపించారు. (క్లిక్: పంజాబ్లో ఆప్ టెన్ పాయింట్ అజెండా) బీఎస్పీ-ఎస్ఏడీ కూటమికి ఓటు వేయాలని ఈ సందర్భంగా పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేస్తామని హామీయిచ్చారు. పంజాబ్లో బీఎస్పీ-ఎస్ఏడీ కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా సుఖ్బీర్ బాదల్ను ఎన్నుకుంటామని మాయావతి ప్రకటించారు. (క్లిక్: పంజాబ్లో మోదీ చరిష్మా పనిచేసేనా!) -
మాయ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు!
ఒకప్పుడు రాజసంతో యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దళిత బిడ్డ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నేడెందుకో మౌన ప్రేక్షకురాలి పాత్రకు పరిమితమయ్యారు. ఆ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఎవరి ఊహకి అందని విధంగా యూపీ ప్రజల్ని మాయ చేశారు. అగ్రవర్ణాలు, దళితులు అనే సోషల్ ఇంజనీరింగ్ వ్యూహంతో ఎన్నికల్లో కాకలు తీరిన యోధులకే కొత్త పాఠాలు నేర్పించారు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆమె ఆప్త మిత్రులనైనా పక్కన పడేయగలరు. ఆగర్భ శత్రువులతోనైనా చేయి కలపగలరు. సామాజిక కార్డుతోనే యూపీతో సహా దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అభిమానులు బెహన్జీ అని ఆప్యాయంగా పిలుచుకొనే మాయావతి శక్తిసామర్థ్యాలు ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి అన్నచందంగా మారింది. ప్రస్తుతం ఆమె ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉన్నారు. యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ మధ్య సాగుతూ ఎన్నికల కాక రగులుతూ ఉంటే మాయావతి వ్యూహాలేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాజకీయంగా అత్యంత అనుభవజ్ఞురాలు, అత్యంత శక్తిమంతమైన మహిళగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాయకురాలు, ఒకప్పుడు ప్రధాని పదవికి సైతం పోటీదారుగా నిలువాలని ఆశించిన మాయావతి.. ఈసారి మౌనం దాల్చడం వెనుక ఎలాంటి మాయ దాగుందోనన్న చర్చ జరుగుతోంది. ►ఢిల్లీలోని నిరుపేద దళిత కుటుంబంలో 1956 సంవత్సరం జనవరి 15న జన్మించారు. ►ఘజియాబాద్లోని ఢిల్లీ యూనివర్సిటీలో లా డిగ్రీ చేసిన మాయావతి ఐఏఎస్ కావాలని కలలు కన్నారు. ►1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో టీచర్గా చేశారు ►దళిత నాయకుడు కాన్షీరామ్తో 1977లో పరిచయం ఏర్పడింది ►కాన్షీరామ్ 1984లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి తీసుకున్నారు. ►రాజకీయ రంగప్రవేశంతో ఆమె జీవితమే మారిపోయింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ►మాయావతికి మొదట్లో అపజయాలే ఎదురయ్యాయి. 1985లో తొలిసారి లోక్సభకు పోటీపడినప్పుడు ఆమె ఓడిపోయారు. 1987లో మళ్లీ ఓటమిపాలయ్యారు. 1989లో యూపీ శాసనమండలికి ఎన్నికయ్యారు ►కాన్షీరామ్ అనారోగ్యం బారినపడడంతో 1995లో బీఎస్పీ పగ్గాలు చేపట్టారు. ►1998, 1999, 2004లో వరుసగా మూడుసార్లు లోక్సభకు, మరో మూడు పర్యాయాలు (1994–2012 మధ్య) రాజ్యసభకు ఎన్నికయ్యారు. ►తొలిసారిగా 1995 సంవత్సరం నాలుగు నెలల పాటు యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక దళిత మహిళ అత్యున్నత స్థాయి పదవిని అందుకోవడం అదే తొలిసారి. ►ఆ తర్వాత మరో రెండు సార్లు స్వల్పకాలం సీఎంగా కొనసాగారు. 1997లో ఆరు నెలలు, 2002–03లో 17 నెలలు సీఎం పదవిలో ఉన్నారు ►గురువు కాన్షీరామ్ 2006లో కన్నుమూసినప్పుడు మాయావతి స్వయంగా ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ►2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టి పూర్తిగా అయిదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు ►ఈ అయిదేళ్ల కాలంలో ఆమె ప్రభ మసకబారడం ప్రారంభించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు, అధికారాన్ని ఉపయోగించుకొని బల ప్రదర్శన, డజనుకు పైగా విమానాలు, హెలికాప్టర్లను ప్రచారానికి వినియోగించడం, తాజ్ హెరిటేజ్ కారిడార్లో అవకతవకలు వంటివెన్నో వివాదాస్పదమయ్యాయి. ►ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన విగ్రహాలు, పార్టీ చిహ్నం ఏనుగు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టించడం, పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేసుకోవడం, కార్యకర్తలు వేసే కరెన్సీ దండల్ని స్వీకరించడం, పాలనా వైఫల్యాలు వంటివన్నీ ఆమెపై తీవ్ర వ్యతిరేక భావాన్ని పెంచాయి. నిమ్నకులాలకి చేసిందేమిటన్న ప్రశ్నలు వచ్చాయి. ►2017 శాసనసభ ఎన్నికల్లో కేవలం 19 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ►2019 లోక్సభ ఎన్నికల్లో ఆగర్భ శత్రువైన ఎస్పీతో పొత్తు పెట్టుకొని బీఎస్పీ 10 స్థానాలు దక్కించుకోగలిగింది. ►ఈసారి ఎన్నికల్లో మాయావతి పార్టీ పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలోనూ, మ్యానిఫెస్టో విడుదలలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ ఎందులోనూ స్పీడ్ కనిపించడం లేదు. ►అయినప్పటికీ సంప్రదాయంగా తమకు వచ్చే 20% ఓటు బ్యాంకుపైనే మాయావతి ఆశలు పెట్టుకున్నట్టుగా బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. – నేషనల్ డెస్క్ సాక్షి -
Mayawati: ఆమె మౌనం.. ఎవరికి లాభం!
మాయావతి గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణం కావొచ్చు’’ ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో ఓ వైపు పార్టీల్లో చేరికలు, మరోవైపు నేతల మాటల యుధ్ధాలు, ఇంకోవైపును ప్రజలను ఆకట్టుకునేలా ప్రకటిస్తున్న హామీలతో ఎన్నికల కోలాహలం పెరిగినా.. బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఎక్కడా పెద్దగా కనబడకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిధ్దమవుతుండగా, పార్టీ ప్రచారాలకు మాయావతి గైర్హాజరు అవుతుండటం, పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా, ఆమె మౌనం వీడకపోవడం పార్టీ క్రియాశీలక నేతలకు అంతుపట్టకుండా మారుతోంది. మాయావతి మౌనం నేపథ్యంలో ఆమెకు తొలినుంచి అండగా ఉంటూ వస్తున్న దళితవర్గాలు బీజేపీ, ఎస్పీ వైపుకు చూస్తుండటం ఆ పార్టీల గెలుపోటములను నిర్దేశించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ‘మాయ’ పనిచేయట్లేదా! బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగుమార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గానూ 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 21 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టు ఉంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకుపోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓటినప్పటికీ ఆమె వచ్చిన 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు. 2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ కేవలం19.3 శాతం ఓట్లనే రాబట్టుకుంది. అప్పటినుంచి పార్టీ కార్య్రమాలపై పెద్దగా ఆసక్తి చూపని మాయావతి ట్విట్టర్ ద్వారా మాత్రమే రాజకీయ సమస్యలపై గొంతు విప్పుతూ వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో దళితులు కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే మాయావతి మాత్రం పంచాయతీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ వర్గాలన్నీ పక్క పార్టీలకు మళ్లాయి. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో బీఎస్పీకి దళితులు దూరమయ్యారు. ఇదీగాక మాయావతి సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ కులాల భద్రత, నివాసం, ఉపాధికి పెద్దగా చేసిందేమీ లేదని, దళితులపై జరిగిన అఘాయిత్యాలను ఆపడంలో విఫలమయ్యారని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఎస్సీ వర్గాల్లో మాయావతి ప్రభ తగ్గిందని, అదీగాక ఆమె గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: (రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి..) ఎవరికి కలిసొస్తుందో... ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ బలహీనంగా కనబడుతుండటంతో దళిత వర్గానికి చెందిన నేతలతో పాటు పార్టీలో పలుకుబడి గల నేతలను ఆకర్షించేందుకు బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి.ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ విభిన్న సంక్షేమ పథకాలను ముందుపెట్టి దళిత ఓట్లను ఆకర్షించడంతో పాటు వారిని హిందూత్వ గొడుగు కిందకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2017 ఎన్నికల్లో 84 ఎస్సీ నియోజకవర్గాలకు గానూ బీజేపీ ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. తిరిగి అదే స్థాయి సీట్లను రాబట్టుకునేందుకు దళిత కులాలన్నింటినీ కలుపుకుపోయే ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే 75 జిల్లాల్లో దళితుల అభ్యున్నతికై నిర్వహించిన ప్రత్యేక సమావేశాలు పార్టీకి అదనపు బలం చేకూర్చిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు తన ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయనని, ఎస్సీ మేధావుల సమావేశాల్లో సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఓటర్ల సమీకరణ కోసం దళిత నాయకులను స్వాతగించిన అఖిలేశ్, వారిని రిజర్వ్డ్ స్థానాల్లో నామినేట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ ప్రభుత్వోద్యోగులను సంతోషపెట్టడానికి తిరిగి అధికారంలోకి వస్తే, ఎస్సీ అధికారులే తన ప్రభుత్వాన్ని నడిపిస్తానని అనేకసార్లు ప్రైవేట్ సమావేశాలలో చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది బీఎస్పీ పార్టీ, ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు... ఎస్పీలో చేరిపోయారు. వారిలో ఇంద్రజీత్ సరోజ్ కౌశాంబి, డాక్టర్ కేకే గౌతమ్, మిథాయ్లాల్ భారతి, త్రిభువన్ దత్తా, మహేష్ ఆర్య, సర్వేశ్ అంబేద్కర్, వీర్ సింగ్ జాతవ్, తిలక్ చంద్ర అహిర్వార్, ఫెరాన్ లాల్ అహిర్వార్, అనిల్ అహిర్వార్, విద్యా చౌదరి, రమేష్ గౌతమ్, యోగేష్ వర్మ వంటి వారున్నారు. గడిచిన 4 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి వచ్చిన సీట్లు, ఓట్లు.. ఎన్నికలు గెలిచిన సీట్లు ఓట్ల శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 -
పోటీకి మాయావతి దూరం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి ఈసారి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగకపోయినా, మాయావతి తన సొంత పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని మిశ్రా వివరించారు. -
Under 23 Athletics Championships: సత్తా చాటుతున్న మన అమ్మాయిలు
న్యూఢిల్లీ: జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య గాంధె, నకిరేకంటి మాయావతి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన 100 మీటర్ల హీట్స్లో నిత్య 11.91 సెకన్లతో రెండో స్థానంలో, మాయావతి 12.40 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. రెండు హీట్స్లో అత్యుత్తమ సమయం నమోదు చేసిన ఎనిమిది మందికి ఫైనల్ బెర్త్ లభించింది. మహిళల 1500 మీటర్ల ఫైనల్లో తెలంగాణకు చెందిన భాగ్యలక్ష్మి ఆరో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో నక్కా రాజేశ్ (ఆంధ్రప్రదేశ్), 110 మీటర్ల హర్డిల్స్లో యశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) ఫైనల్ చేరారు. చదవండి: Vennam Jyothi Surekha: కెరీర్ బెస్ట్ ర్యాంక్లో జ్యోతి సురేఖ.. ఏకంగా -
‘మాఫియా లీడర్లకు, బాహుబలలకు టికెట్లు ఇవ్వం’
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాఫియా లీడర్లకు, బాహుబలులకు టికెట్లు ఇచ్చేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. మావు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశించిన గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి పార్టీ టికెట్ నిరాకరిస్తూ.. మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. మావు స్థానం నుంచి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్భర్ పేరు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. మావు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్సారీ ప్రస్తుతం బండాలోని జైలులో ఉన్నారు. అంతేకాక ఉత్తర ప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాల్లో 52 కేసులను ఎదుర్కొంటున్నారు. వీటిలో 15 కేసులు విచారణ దశలో ఉన్నాయని ఏఎన్ఐ నివేదించింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తాజాగా ప్రారంభించిన మాయావతి.. ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా శ్రద్ధ వహించాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు) 1. बीएसपी का अगामी यूपी विधानसभा आमचुनाव में प्रयास होगा कि किसी भी बाहुबली व माफिया आदि को पार्टी से चुनाव न लड़ाया जाए। इसके मद्देनजर ही आजमगढ़ मण्डल की मऊ विधानसभा सीट से अब मुख्तार अंसारी का नहीं बल्कि यूपी के बीएसपी स्टेट अध्यक्ष श्री भीम राजभर के नाम को फाइनल किया गया है। — Mayawati (@Mayawati) September 10, 2021 దీనిపై శుక్రవారం మాయావతి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి మాఫియా నేపథ్యం ఉన్నవారు బాహుబలులు ఎవరూ పోటీ చేయరు. దీనిని దృష్టిలో ఉంచుకుని మావు నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తొలగించి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్భర్ను ఖరారు చేశాం. ప్రజల అంచనాలను చేరుకోవాడానికి పార్టీ అందుకునే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేశాను. సమస్యలు లేకుండా ఇటువంటి అంశాలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చట్టం ద్వారా నిర్మితమైన చట్టబద్ధ పాలన కావాలని బీఎస్పీ సంకల్పిస్తోంది. యూపీ ప్రస్తుత చిత్రాన్ని మార్చడానికి బీఎస్పీ కృషి చేస్తుంది. బీఎస్పీ ఏం చెప్పినా చేసి చూపిస్తుంది. అదే మా పార్టీకి నిజమైన గుర్తింపు’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు. 2. जनता की कसौटी व उनकी उम्मीदों पर खरा उतरने के प्रयासों के तहत ही लिए गए इस निर्णय के फलस्वरूप पार्टी प्रभारियों से अपील है कि वे पार्टी उम्मीदवारों का चयन करते समय इस बात का खास ध्यान रखें ताकि सरकार बनने पर ऐसे तत्वों के विरूद्ध सख्त कार्रवाई करने में कोई भी दिक्कत न हो। — Mayawati (@Mayawati) September 10, 2021 చదవండి: బుజ్జగింపులో వింత కోణం -
ఈసారి అధికారంలోకి వస్తే విగ్రహాలు పెట్టం.. అభివృద్ధి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్ప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పలు మార్గాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా మంగళవారం లక్నోలో జరిగిన ప్రబుద్ధ్ వర్గ్ విచార్ సమ్మేళన్ కార్యక్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2007లో ఫలితాన్ని ఇచ్చిన దళితులు– బ్రాహ్మణుల ఫార్ములాతో 2022లో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మాయావతి ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణులు కేంద్రంగా ఉంటారని మాయావతి స్పష్టం చేశారు. వేదికపై నుంచి త్రిశూలాన్ని ఊపుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వెయ్యిమంది బ్రాహ్మణ కార్యకర్తలను పార్టీ తయారు చేస్తుందని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా విగ్రహాలు, స్మారకాల ఏర్పాటు కాకుండా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెడతానని మాయావతి పేర్కొన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్) ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మైనారిటీలను దత్తత తీసుకున్నట్లుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు పరిగణిస్తున్నాయని ఆమె విమర్శించారు. అదే సమయంలో తమ పార్టీ ఏ వర్గంపట్ల వివక్ష చూపదని ఆమె భరోసా ఇచ్చారు. 2022లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2007లో చేసిన విధంగా ‘సర్వజన్ హితయ్.. సర్వజన్ సుఖయ్’ అనే విధానాన్ని అమలు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. గతంలో తాము కేవలం దళితులు, వెనుకబడిన వారి ప్రయోజనాలను మాత్రమే చూడలేదని, అగ్రవర్ణాలకు సైతం సమప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. బీఎస్పీ ఒక కులం లేదా మతం కోసం పనిచేసే పార్టీ కాదని, ఇది సమాజంలోని అన్ని వర్గాల పార్టీ అని పునరుద్ఘాటించారు. కేబినెట్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం గత కొన్ని సంవత్సరాలుగా సమాజ్వాదీ పార్టీ, బీజేపీలు తమ ప్రభుత్వాల విధానాలతో పేదలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు, దళితులు, వెనుకబడిన వర్గాలను అణగదొక్కారని మాయావతి ఆరోపించారు. అంతేగాక బీజేపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ సమాజంలోని ప్రజలు చాలా వేధింపులకు గురయ్యారని, 2022లో ఏర్పడే కేబినెట్లో బ్రాహ్మణ సమాజంలోని వారికి గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే బ్రాహ్మణ సమాజ భద్రత, పూర్తి గౌరవం దక్కేలా చూసుకుంటామన్నారు. ఇప్పటికే బీఎస్పీతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలిపే ప్రణాళికల్లో భాగంగా మొదటి దశలో తమ పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా విజయవంతంగా పనిచేశారని మాయావతి తెలిపారు. ఇక రెండవ దశలో చిన్న పట్టణాలు, గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన బీఎస్పీతో అనుసంధానించే ప్రచారం జరుగుతుందని, ప్రతి సభలో బ్రాహ్మణ సమాజానికి చెందిన కనీసం వెయ్యిమంది కార్యకర్తలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అంతేగాక ఈసారి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సైతం పార్టీతో అనుసంధానం చేసే పని జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, 3 వ్యవసాయ చట్టాల ద్వారా రైతులను మరింత హింసించారని మాయావతి ఆరోపించారు. ఉత్తర్ప్రదేశ్లో 13% బ్రాహ్మణ ఓటర్లు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్ రాజకీయాలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జనాభాపరంగా రాష్ట్రంలో దాదాపు 13% మంది బ్రాహ్మణులు ఉన్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాలలో అయితే బ్రాహ్మణ ఓటర్లు 20% కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి రాజకీయపార్టీ బ్రాహ్మణ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి. మహారాజ్గంజ్, గోరఖ్పూర్, దేవరియా, జౌన్పూర్, అమేథి, వారణాసి, చందౌలి, కాన్పూర్, ప్రయాగరాజ్, బలరాంపూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్ల్లో బ్రాహ్మణ ఓట్లు 15% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి గెలుపోటముల్లో బ్రాహ్మణ ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. 2017లో బ్రాహ్మణ అభ్యర్థులు 56 సీట్లను గెలుచుకున్నారు. కాగా 2007లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ బ్రాహ్మణ, దళిత, ముస్లిం ఫార్ములాతో బరిలో నిలిచి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. 2007 ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ అభ్యర్థులకు 86 టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. -
బీఎస్పీ తదుపరి చీఫ్ దళిత వర్గం నుంచే..
లక్నో: ‘నేనిప్పుడు ఫిట్గానే ఉన్నాను. అన్ఫిట్గా మారడానికి ఇంకా చాలా సంవత్సాలు పడుతుంది. కాబట్టి నా తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తిని ఇప్పుడే ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు దళిత వర్గం నుంచే ఎంపిక ఉంటుంది’ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ సతీశ్ మిశ్రా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా కరోనా ఉన్నప్పటికీ తాను కరోనా బారిన పడలేదని ఆమె అన్నారు. ఆరోగ్యం సహకరించనప్పుడే పార్టీ పగ్గాలను వేరేవారికి అప్పగిస్తానని పేర్కొన్నారు. కష్ట సమయాల్లో పార్టీతో ఉన్న వారికే ఆ అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు. బీఎస్పీ స్థాపకుడు కాన్షీరాం కూడా తన ఆరోగ్యం క్షీణించాకే తదుపరి చీఫ్ను ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 24 పేజీల బుక్లెట్ గురించి ఆమె స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తమ ర్యాలీలకు, సమావేశాలకు డబ్బు, ఆహారం ఎరగా వేసి ప్రజలను రప్పిస్తుందని విమర్శించారు. ప్రజల మద్దతును కాంగ్రెస్ కోల్పోయిందన్నారు. ఉత్తరప్రదేశ్లో క్యాంపెయిన్కోసం పారిశ్రామి కవేత్తలపై ఆధారపడుతోందని, కానీ బీఎస్పీ మాత్రం ఆర్థికంగా స్థితిమంతులు కాని వారికి కూడా టికెట్లు ఇస్తోందని చెప్పారు. కాంగ్రెస్లా తమ పార్టీ పెట్టుబడిదారుల పార్టీ కాదని పేదలు, అణగారిన వారి పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ వ్యవహరించే రెండు నాల్కల ధోరణి వల్లే ఆ పార్టీకి ఈ గతి పట్టిందన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టినట్లు వ్యాఖ్యానించారు. -
ఉగ్రవాద కుట్ర నిజమైతే.. రాజకీయాలు చేయొద్దు: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు కుట్ర పన్నిన ఆల్ కాయిదా ఉగ్రవాదులు ఇద్దరిని యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం స్పందిస్తూ.. లక్నోలో ఉగ్రవాదుల కుట్ర జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం నిజమైతే తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. అదే విధంగా ఈ విషయంలో ఎటువంటి రాజకీయలు చేయవద్దని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు అనుమానాలకు తావిస్తాయని అన్నారు. ఒకవేళ నిజంగానే ఆ ఇద్దరిని ఉగ్రవాద కుట్రలో భాగంనే అదుపులోకి తీసుకుంటే.. ఇన్ని రోజులుగా పోలీసులు ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ప్రజలు కూడా అడుగుతారని, ప్రజల్లో అశాంతిని పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకోకూడదని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. యూపీ పోలీసులపై నమ్మకం లేదు: అఖిలేశ్ యాదవ్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుందన్నారు. తనకు యూపీ పోలీసులు, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై అస్సలు నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను లక్నోకు చెందిన మిన్హాజ్ అహ్మద్, మసీరుద్దీన్లుగా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. జనాలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వారు ప్రణాళిక రచించారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ మోసానికి చిరునామా! : మాయావతి
కాంగ్రెస్ మోసానికి చిరునామా! కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి చిరునామా అని బీఎస్పీ నేత మాయావతి తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో మాయావతి రహస్య ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో ఆమె కాంగ్రెస్పై మండిపడ్డారు. ‘బీఎస్పీలో బీ అంటే బీజేపీ’’ అని యూపీ కాంగ్రెస్ ఒక ట్వీట్లో విమర్శించింది. దీనిపై మాయావతి పలు ట్వీట్లతో మండిపడ్డారు. కాంగ్రెస్కు యూపీలో అడ్రస్ లేదని, కాంగ్రెస్ విమర్శలు అభ్యంతర కరమని, బీఎస్పీలో బీ అంటే బహుజనులని దుయ్యబట్టారు. కాంగ్రెస్లో సీ అంటేనే కన్నింగ్ అని విమర్శించారు. బహుజనుల ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనంతరం వారిని వదిలేసిన చరిత్ర కాంగ్రెస్దన్నారు. అయితే బీజేపీకి బీఎస్పీ బీటీమ్ అని రాష్ట్రంలో అందరికీ తెలుసని, ఇప్పటికైనా మాయావతి నిజాలను ఒప్పుకోవాలని యూపీ కాంగ్రెస్ నేత అశోక్ సింగ్ ఎద్దేవా చేశారు. బీజేపీ– శివ సేన శత్రువులు కావు! కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలున్నంత మాత్రాన తమ పార్టీ, తమ మాజీ నేస్తం శివసేన శత్రువులు కావని బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నావీస్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అది జరగవచ్చు, ఇది జరగకూడదని లేదన్నారు. భవిష్యత్లో ఇరువురూ మరలా కలుస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, సరైన సమయంలో, పరిస్థితులను బట్టి సరైన నిర్ణయాలుంటాయన్నారు. 2019 ఎన్నికల్లో తమతో కలిసే సేన పోటీ చేసిందని, కానీ ఫలితాల అనంతరం వేరేవారితో(ఎన్సీపీ, కాంగ్రెస్) చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. ఎవరిపైన పోటీ పడిందో వారితోనే సేన జట్టుకట్టిందని రాష్ట్ర అసెంబ్లీ సెషన్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో పలు కేసులను దర్యాప్తు చేస్తున్నాయని, వీటిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు. ఒవైసీ సవాలుకు మేము సిద్ధం: యోగి ఉత్తరప్రదేశ్లో మరోసారి బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయబోమంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనీ, దీనిపై ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు. ‘ఒవైసీ ప్రముఖ జాతీయ నేత. ఆయన దేశంలో ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. ఆయనకు సొంత ఆదరణ ఉంది. బీజేపీని ఆయన సవాల్ చేస్తే స్వీకరించేందుకు బీజేపీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం తప్పక ఏర్పాటు చేస్తుంది. దీనిపై సందేహమే లేదు’అని ఆయన అన్నారు. అంతకు ముందు ఒవైసీ ‘యూపీలో మరోసారి యోగి ఆదిత్యనాథ్ను సీఎం కానివ్వబోం. మేం కష్టపడితే, ప్రతి ఒక్కటీ సాధ్యమే. మా ప్రయత్నం సఫలమైతే యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు’అని అన్నట్లు వార్తలొచ్చాయి. రఫేల్ డీల్పై రాహుల్ విమర్శలు రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలంటూ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ..ఆదివారం మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించింది. జేపీసీ వేసేందుకు కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందంటూ ఆపార్టీ నేత రాహుల్ గాంధీ ఆన్లైన్లో సర్వే చేపట్టారు. ఈ ప్రశ్నకు రాహుల్ నాలుగు ఆప్షన్లు ఉంచారు. వాళ్లకు కమీషన్ అందలేదనే.. రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. భారత వైమానిక దళం బలం క్షీణించినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల అవసరాలకు అనుగుణంగా విమానాలను ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించింది. ఆశించినంత మేర కమీషన్ గాంధీ కుటుంబానికి అందకపోవడమే కారణమా? అని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర నిలదీశారు. -
BSP: మాయావతి కీలక నిర్ణయం
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయత్ ఎన్నికల్లో తాము పోటీచేయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నామని, అందుకే స్థానిక ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మాయావతి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నానన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ‘‘ఉత్తర్ప్రదేశ్ రక్షణే ధ్యేయం’’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గాలపై దృష్టి సారించి, కేడర్ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాయావతి వెల్లడించారు. నిజానికి, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే పోటీ చేసే విషయం గురించి ఆలోచించే వాళ్లమని, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా మాయావతి నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీకి సహకరించేందుకే మాయావతి పంచాయత్ ఎన్నికల బరిలో నిలవడం లేదని ఆరోపించింది. ఈ మేరకు... యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ ట్విటర్ వేదికగా... ‘‘బీజేపీకి ఎప్పుడు సాయం కావాలన్నా మాయావతి ఈ విధంగా ఎన్నికల నుంచి తప్పుకొంటూ ఉంటారు. జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయం అన్న ప్రకటన కూడా ఈ కోవకు చెందినదే’’ అని విమర్శించారు. ఇందుకు స్పందనగా... బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లా పంచాయతీ సభ్యులు చచ్చినట్లు తమ పార్టీలో చేరతారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి బదులిచ్చారు. కాగా జూలై 3న యూపీలో జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా... ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 3 వేల మంది సభ్యులు జిల్లా పంచాయతీ చీఫ్లను ఎన్నుకోనున్నారు. చదవండి: ఎంఐఎంతో పొత్తుండదని మాయావతి స్పష్టీకరణ -
యూపీలో ఒంటరిగానే పోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుండదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి ప్రకటించారు. అదేవిధంగా, యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతోనూ ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె పలు ట్వీట్లు చేశారు. ‘రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, అసదుద్దీన్కు చెందిన ఏఐఎంఐఎం పార్టీతో కలిసి పోటీ చేస్తుందంటూ ఓ టీవీ చానెల్లో నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత మాత్రం నిజం కాదు. వాస్తవాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. ఇందులో ఇసుమంత కూడా నిజం లేదు. బీఎస్పీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది’అని పేర్కొన్నారు. పంజాబ్ను మినహాయిస్తే, యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోము’అని మాయావతి స్పష్టం చేశారు. పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్తో ఇటీవల బీఎస్పీ జత్తు కట్టిన విషయం తెలిసిందే. యూపీలో 100 స్థానాల్లో పోటీ: ఎంఐఎం వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆలిండియా మజ్లిస్–ఇ– ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఓం ప్రకాశ్ రాజ్భర్ సారథ్యంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ), చిన్న పార్టీల కూటమి అయిన భాగీదారీ సంకల్ప్ మోర్చాతో కలిసి బరిలోకి దిగుతామన్నారు. ఎన్నికలకు సంబంధించి మరే ఇతర పార్టీలతోనూ తాము చర్చలు జరపలేదన్నారు. -
ఎంఐఎంతో పొత్తు.. అస్సలు ఉండదు
లక్నో: తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ ద్వారా తమ ఉనికిని చాటాలని ఎంఐఎం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమైంది. అయితే ఎంఐఎం.. బహుజన్ సమాజ్ పార్టీతో జంటగా బరిలోకి దిగబోతుందని కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ఎంఐఎంతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. (చదవండి: మాయావతిపై డర్టీ కామెంట్లు) ‘‘విధాన సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో పొత్తు ఉంటుందని కథనాలు ప్రసారం చేస్తున్నారు. అది నిరాధారమైన వార్త అది. నిజం కాదు. ఖండిస్తున్నాం’’ అని ట్విటర్ ద్వారా ప్రకటించారమె. అంతేకాదు ఉత్తర ప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే పంజాబ్లో మాత్రం అకాళీదల్తో పొత్తు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. పంజాబ్ తప్ప వేరే ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవు. ఇది ఫైనల్ అండ్ క్లియర్.. అని స్పష్టం చేశారామె. 1. मीडिया के एक न्यूज चैनल में कल से यह खबर प्रसारित की जा रही है कि यूपी में आगामी विधानसभा आमचुनाव औवेसी की पार्टी AIMIM व बीएसपी मिलकर लड़ेगी। यह खबर पूर्णतः गलत, भ्रामक व तथ्यहीन है। इसमें रत्तीभर भी सच्चाई नहीं है तथा बीएसपी इसका जोरदार खण्डन करती है। 1/2 — Mayawati (@Mayawati) June 27, 2021 తప్పుడు ప్రచారాలు ఆపండి.. బీఎస్పీ పార్టీపై వరుసగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా ఛానెళ్లపై యూపీ మాజీ సీఎం మాయావతి మండిపడ్డారు. ఎంఐఎంతో పొత్తు విషయంతో పాటు రాజ్యసభ ఎంపీ సతీష్ చంద్ర గురించి ఫేక్ కథనాలు ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలోనే తప్పుడు ప్రచారాలు ఆపండి అంటూ మీడియాను ఆమె కోరారు. ఏదైనా ప్రసారం చేసే ముందు బీఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని.. ఇలాంటివి రిపీట్ అయితే పరువు నష్టం దావా వేస్తానని ఆమె హెచ్చరించారు. చదవండి: ఇంకెన్నాళ్లు కాంగ్రెస్కు బానిసగా ఉంటారు -
ఎన్నికల వేళ: మాయావతికి ఎదురుదెబ్బ
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లో అపుడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీఎన్నికలకుముందు బీఎస్పీ అధినేత మాయావతికి భారీ ఎదురు దెబ్బ తగల నుందా? పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు పార్టీనుంచి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెబల్ ఎమ్మెల్యేలంతా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో లక్నోలో భేటీ పలు ఊహాగానాలకు తెర తీసింది. ఎమ్మెల్యేలు హకీమ్ లాల్ బింద్ (హండియా), వందన సింగ్ (సాగ్రి), రామ్వీర్ ఉపాధ్యాయ (సదాబాద్), అనిల్ కుమార్ సింగ్ (పూర్వా), అస్లాం రైనీ (భింగా), అస్లాం అలీ (ధోలానా), ముజ్తాబా సిద్దిఖీ (ప్రతాపూర్), హర్గోవింద్ భార్గవ సిధౌలి) సుష్మా పటేల్ (ముంగ్రా బాద్షాపూర్) అఖిలేష్లను కలిశారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. త్వరలోనే వీరంతా సమాజ్ వాదీ పార్టీకి మారవచ్చనే వాదనలు ఊపందుకున్నాయి. కాగా 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ19 సీట్లు గెలుచుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సిద్దమవుతోంది. గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఏడుగురు, లాల్జీ వర్మ, రామ్ అచల్ సహా మొత్తం 11మంది ఎమ్మెల్యేలను మాయావతి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 2019లో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో ఇపుడు 7 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. చదవండి: ట్విటర్కు మరోసారి నోటీసులు -
పంజాబ్లో కొత్త పొత్తు పొడిచింది
చండీగఢ్: పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్చంద్ర మిశ్రా శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్టు వెల్లడించారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్లో బీఎస్పీకి 20 స్థానాలు కేటాయించారు. మిగిలిన 97 స్థానాల్లో అకాలీదళ్ పోటీ చేస్తుంది. పంజాబ్ రాజకీయాల్లో ఇది చరిత్రాత్మకమైన రోజని ఈ సందర్భంగా సుఖ్బీర్సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహాలను రచించడానికి త్వరలోనే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇన్నాళ్లూ బీజేపీతో కలిసి ఉన్న శిరోమణి అకాలీదళ్ కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది ఎన్డీయేకి గుడ్బై కొట్టేసింది. పంజాబ్, హరియాణాకు చెందిన రైతులే ఎక్కువగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడంతో మోదీ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క అకాలీదళ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. ఎస్ఏడీతో పొత్తును బీఎస్పీ చీఫ్ మాయావతి సరికొత్త సామాజిక ముందడుగు అని అభివర్ణించారు. పొత్తుతో సమాఖ్య ప్రజాస్వామ్య విప్లవం ప్రారంభమవుతుందని ప్రకాశ్సింగ్ బాదల్ అన్నారు. దళిత ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 32 శాతం ఓట్లు దళితులవే కావడంతో వారి ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీఎస్పీతో అకాలీదళ్ చేతులు కలిపింది. జలంధర్, హోషియార్పూర్, నవాన్షహర్, కపుర్తలా జిల్లాల్లో దళితులు అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు. డోవుబా ప్రాంతంలో బీఎస్పీకి మంచి ఆదరణ ఉంది. వచ్చే ఎన్నికల్లో మాల్వా ప్రాంతంలో ఏడు సీట్లు, మాజాలో అయిదు, డోవుబాలో ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అకాలీదళ్, బీఎస్పీ కలిసి పోటీచేసి 13 ఎంపీ స్థానాలకు గాను 11 సీట్లను కొల్లగొట్టి తమ పొత్తుకి ఎదురులేదని నిరూపించాయి. అప్పట్లో మూడు స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ అన్నింట్లోనూ విజయం సాధించింది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఒక్కటైన ఆ పార్టీలు వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉన్నాయి. చదవండి: బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా.. ఇరకాటంలో చీఫ్ -
డర్టీ కామెంట్స్: చిక్కుల్లో రణ్దీప్ హుడా
ముంబై: కులాల్ని కించపరిచేలా కామెంట్లు చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. మున్మున్ దత్తా, యూవికా చౌదరి కామెంట్లపై రచ్చ.. ఆపై వాళ్లు దిగొచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్లో రణ్దీప్ హుడాను చేర్చారు నెటిజన్స్. బాలీవుడ్లో ఫైనెస్ట్ ఆర్టిస్ట్గా పేరున్న రణ్దీప్.. యూపీ మాజీ సీఎం మాయావతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు. అయితే రణ్దీప్ ఆ కామెంట్లు చేసి చాలా కాలం అవుతుండడం విశేషం. డర్టీ కామెంట్లు గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్దీప్ హుడా.. యూపీ మాజీ సీఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘మీకిప్పుడు ఒక డర్టీ జోక్ చెప్పబోతున్నా’.. అంటూ.. మాయావతి వేషధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. రణ్దీప్ హుడా వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు చెపాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒక మాజీ మహిళా సీఎం, ఆమె సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ రణ్దీప్పై మండిపడుతున్నారు. ఆడవాళ్ల పట్ల అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వదలకూడదని చెబుతూ.. #ArrrestRandeepHooda హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై రణ్దీప్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రణ్దీప్కు కులగజ్జి ఉందని, మానవత్వం లేనోడంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని సినిమాల్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై రణ్దీప్ రియాక్ట్ కావాల్సి ఉంది. ఇక 2012లో మాయావతిపై అభ్యంతరకర ట్వీట్ చేసిన స్టాండప్ కమెడియన్ అభిష్ మాథ్యూ.. రీసెంట్గా నెటిజన్స్ ఆగ్రహంతో క్షమాపణలు చెప్పాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
బీఎస్పీ సీటు దక్కలేదన్న మనస్తాపంతో..
లక్నో : బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) సీటు దక్క లేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాపూర్లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాపూర్కు చెందిన మున్ను ప్రసాద్ అనే వర్తకుడు గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీలో పని చేస్తున్నాడు. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే పార్టీ అధ్యక్షురాలు మాయావతి అతడి వద్దనుంచి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ( ఉగ్ర ఘాతుకం: బీజేపీ నేతల కాల్చివేత ) ఆమె అడిగిన మొత్తం ఇవ్వలేని స్థితిలో ఉన్న తనకు ఆత్మహత్యే శరణ్యమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీనిపై బీఎస్పీ కోఆర్డినేటర్ గుడ్డు రామ్ మాట్లాడుతూ.. మున్ను ప్రసాద్కు పార్టీతో సంబంధం లేదని, సూసైడ్ నోట్ పార్టీ పేరును దిగజార్చేలా ఉందని అన్నారు. అయితే మున్ను బీఎస్పీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని, తనకు మాయావతి కచ్చితంగా సీటు ఇస్తుందనే వాడని స్థానికులు చెబుతున్నారు. -
అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం: మాయావతి
లక్నో: త్వరలో ఉత్తరప్రదేశ్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ నాయకులును ఓడించడానికి కృషి చేస్తామని.. అందుకు అవసరమైతే బీజేపీకి కూడా ఓటు వేస్తామంటూ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సంచలన ప్రకటన చేశారు. గతేడాది సార్వత్రి ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న వీరు తర్వత బద్ధ శత్రువులుగా మారారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. ఈ క్రమంలోనే మాయావతి బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఇక 1995 జూన్ 2 కేసును విత్డ్రా చేసుకోవడం తన జీవితంలో పెద్ద తప్పిదంగా వర్ణించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. అవసరమైతే బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధం. లేదంటే మరో పార్టీకి. దీన్ని కచ్చితంగా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాం’ అంటూ మాయావతి సంచలన ప్రకటన చేశారు. (చదవండి: ప్రియాంకపై మాయావతి ఫైర్) 1995 జూన్ 2 కేసును తాము వెనక్కి తీసుకుని చాలా పెద్ద తప్పు చేశామని, వారితో చేతులు కలపకపోతే బాగుండేదని మాయావతి పేర్కొన్నారు. ఎస్పీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో దిగాలని డిసైడ్ అయినప్పటి నుంచి తమ పార్టీ కార్యకర్తలు విజయం కోసం తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఇలా చేతులు కలిపిన మొదటి రోజు నుంచే 1995 లో సమాజ్వాదీపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని నేతలు తమపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారని ఆమె వెల్లడించారు. ఆ కేసును వెనక్కి తీసుకొని తాము పెద్ద తప్పే చేశామని మాయావతి వ్యాఖ్యానించారు. (చదవండి: బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్బై! ) ఇక యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మాయావతి ఈ సచంలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసెంబ్లీలో తన బలం దృష్ట్యా బీఎస్పీ తన అభ్యర్థిగా రామ్జీ గౌతమ్ను రంగంలోకి దింపింది. ఆయన పేరును 10 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తేల్చిచెప్పారు. పార్టీ అధినేత మాయావతిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని వారు స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రిటర్నింగ్ అధికారిని కలిసిన కొద్దిసేపటికే వారంతా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను కలుసుకునేందుకు ఆయన పార్టీ కార్యాలయానికి నేరుగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాయావతి పై ప్రకటన చేశారు. -
బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్బై!
లక్నో: ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు ప్రతిపక్ష బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో మంటలు రాజేస్తున్నాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు ప్రారంభించారు. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరబోతున్నామంటూ సంకేతాలిచ్చారు. యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో తన బలం దృష్ట్యా బీఎస్పీ తన అభ్యర్థిగా రామ్జీ గౌతమ్ను రంగంలోకి దింపింది. ఆయన పేరును 10 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తేల్చిచెప్పారు. పార్టీ అధినేత మాయావతిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని వారు స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రకాశ్ బజాజ్ అనే పారిశ్రామికవేత్త స్వతంత్ర అభ్యర్థిగా చివరి నిమిషంలో పోటీకి దిగారని, ఆయనను గెలిపించేందుకు తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కొనేశారని బీఎస్పీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ ఆరోపించారు. -
యోగీ రాజీనామా చెయ్యి.. రాష్ట్రపతి పాలన పెట్టండి!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లో వరుస హత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలల్ని రగిలిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలో నేరస్థులు, మాఫియా, రేపిస్టులకు అడ్డూ అదుపూలేకుండా పోతోందన్నారు. 'జంగిల్రాజ్' యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నేరాలు, ముఖ్యంగా దళిత బాలికలపై నేరాలు పెరిగిపోతున్నాయంటూ యోగిపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. (నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు) రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోగీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్రాస్ బల్రాంపూర్ ఘటనలు తనను తీవ్రంగా కలిచి వేశాయని, నిర్భయ కేసును గుర్తుకు తెచ్చాయని మాయావతి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరగని రోజు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. తనకూ ఒక ఆడకూతురు ఉందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని, ఆడబిడ్డలను రక్షించ లేని యోగి వెంటనే రాజీనామా చేయాలని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వస్థలమైన గోరఖ్పూర్ మఠానికి యోగిని పంపించాలని మాయావతి వ్యాఖ్యానించారు. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) అలాగే హత్రాస్ హత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించకుండా, అర్ధరాత్రి దహనం చేసిన యూపీ పోలీసులపై మాయావతి మండిపడ్డారు. ఇది సిగ్గుచేటైన సంఘటన అని బీఎస్పీ చీఫ్ దుయ్యబట్టారు. ఇది జంగిల్రాజ్యం కాకపోతే, మరేంటి? అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబానికి అండగా నిలిచిన ప్రతిపక్షాలను ప్రశంసించిన మాయవతి తమ పార్టీ కూడా బాధిత కుటుంబం తరపున పోరాడు తుందన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ బలరాంపూర్, ఆజంగర్ వరుస దారుణాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా హత్రాస్ సంఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి బుధవారం తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్తో కూడిన ముగ్గురు సభ్యుల బృందంలో మహిళా సభ్యులతో పాటు దళిత వర్గానికి చెందిన సభ్యులు కూడా ఉంటారు ఈ బృందం ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనుందని, ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నామని తెలిపారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ .25 లక్షల ఎక్స్గ్రేషియా, ఇల్లు ఇస్తామని రాష్ట్రం ప్రకటించింది. వీడియోలింక్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ముస్లింలపై బీజేపీ వివక్ష: మాయావతి
లక్నో: యూపీలో బ్రాహ్మణులు, దళితులు, ముస్లిములను టార్గెట్ చేశారని(లక్ష్యంగా చేసుకోవడం) బీఎస్పీ(బహుజన్ సమాజ్ పార్టీ) అధినేత మాయావతి తెలిపారు. శుక్రవారం మాయావతి మీడియాతో మాట్లాడారు. యూపీలో బీజేపీ నేతృత్వంలోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం దళితుల పై తప్పుడు కేసులు బనాయించి వేదిస్తుందని విమర్శించారు. అయితే గతంలో పాలించిన ఎస్పీ(సమాజ్ వాదీ) ప్రభుత్వంలో బ్రాహ్మణులు, దళితులు వివక్షకు గురయ్యారని మండిపడ్డారు కాగా ఎస్పీ పాలనలో దిగ్గజ నాయకుల విగ్రహాలు ధ్వంసమయ్యావని, జిల్లాలు, సంస్థల పేర్లు (దళిత చిహ్నాలు) ఎస్పీ ప్రభుత్వం మార్చిందని మాయావతి ధ్వజమెత్తారు. మరోవైపు వారనాసి, జౌన్పూర్ ప్రాంతాలలో సంఘటనలను ఆమె విమర్శించారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. -
కేంద్రంపై మాయావతి ప్రశంసలు
లక్నో : అన్లాక్-4లో భాగంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇవి రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అతీతంగా ప్రజలందరికీ సర్వజన సమ్మతంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. 'కోవిడ్19 పోరులో భాగంగా అన్లాక్కు సంబంధించి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఏకీకృతంగా ఉన్నాయి. వాటిని స్వాగతిస్తున్నాం. బీఎస్పీ చాన్నాళ్లుగా ఈ డిమాండే చేస్తోంది. కరోనా ముసుగులో రాజకీయాలు చేయడం తగదని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. కేంద్రం తాజాగా విడుదల చేసిన గైడ్లైన్స్ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. దీని వల్ల ప్రజలకు మరిన్ని సౌకర్యాలు సైతం అందుతాయి' అంటూ మాయావతి పేర్కొన్నారు. (అందరూ స్వదేశీ యాప్లను వాడాలి: మోదీ) కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ అన్లాక్–4 మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి దశలవారీగా మెట్రో రైళ్లను నడపడానికి కేంద్రం అనుమతించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మాత్రం సెప్టెంబర్ 30వ తేదీ దాకా మూసే ఉంటాయని ప్రకటించింది. విద్యా సంస్థలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది. సెప్టెంబర్ 21 నుంచి 50 శాతం మించకుండా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది హాజరుకావొచ్చని, 9 నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులు స్వచ్ఛందంగా గైడెన్స్ కోసం హాజరుకావొచ్చని పేర్కొంది. (అన్లాక్ 4: 7 నుంచి మెట్రో..) -
‘యూపీ సర్కార్ రామరాజ్య సూత్రాలను పాటించడం లేదు’
లక్నో: యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రామరాజ్య సూత్రాలను పాటించడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయావతి శనివారం విమర్శించారు. మాయావతి మాట్లాడుతూ.. బీజేపీ కులతత్వ రాజకీయాల వల్ల బ్రాహ్మణులు బీఎస్పీలో చేరుతున్నారని తెలిపారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు 2022సంవత్సరంలో జరగనున్న విషయం తెలిసిందే. కాగా బ్రాహ్మణులను బీఎస్పీ పట్టించుకోవడం లేదని బీజేపీ ఆరోపించడంపై మాయావతి స్పందిస్తూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ప్రాముఖ్యత కలిగిన మంత్రిత్వ శాఖలను బీఎస్పీ కేటాయించిందని గుర్తు చేశారు. కాగా, బ్రాహ్మణ సమాజం అర్థం లేని ఆరోపణలను నమ్మరని తెలిపారు. కాగా మాయావతి 2007 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల గెలుపు వ్యూహాన్నే అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ వర్గాన్ని ఆకట్టుకొని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. యూపీలో 11శాతం బ్రాహ్మణుల జనాభా ఉంది. పార్టీల గెలుపోటమలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా 2017అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ హిందుత్వ నినాదంతో 403 అసెంబ్లీ స్థానాలకు గాను 312స్థానాలను కైవసం చేసుకున్నారని విశ్లేషకులు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం పది స్థానాలతో దారుణ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. చదవండి: ఇంటర్నెట్ సెలబ్రిటిగా సీఎం పెంపుడు కుక్క -
భూమిపూజ : రాష్ట్రపతి కోవింద్ను ఆహ్వానించాల్సింది
లక్నో : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్నూ పిలిచి ఉండాల్సిందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ఆగస్ట్ 5న జరిగిన మందిర శంకుస్ధాపనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్నూ ఆహ్వానించాల్సిందని, ఆయన హాజరు మంచి సందేశం పంపిఉండేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దళిత సాధువులు ఆసక్తి కనబరిచినా వారిని పూర్తిగా విస్మరించారని మాయావతి ఆరోపించారు. మరోవైపు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరుశురాముని విగ్రహ ఏర్పాటుకు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రతిపాదనను ఆమె దుయ్యబట్టారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఎస్పీ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. బీఎస్పీ హయాంలో వివిధ కులాలకు చెందిన ప్రముఖ సాధుసంతుల పేర్లతో పలు పథకాలు చేపట్టామని, ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల దృక్పథంతో వాటి పేర్లను మార్చారని విమర్శించారు. పరుశురాముడి విగ్రహం గురించి ఎస్పీ ఇప్పుడు మాట్లాడటం కంటే అధికారంలో ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని నిర్మించాల్సిందని చురకలు వేశారు. ఎస్పీ ప్రతిపాదిత విగ్రహం కంటే అధికంగా పరుశురాముడి భారీ విగ్రహాన్ని అయోధ్యలో నిర్మిస్తామని మాయావతి పేర్కొన్నారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 శాతం ఉన్న బ్రాహ్మణుల ఓట్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. చదవండి : అమెరికాలో 'అయోధ్య' సంబరాలు -
‘ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తోనే ఉన్నారు’
జైపూర్: బహుజన సమాజ్వాది పార్టీ(బీఎస్పీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చెందిన వారేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్నారయణ్ మీనా తెలిపారు. స్పీకర్ వారిని కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలుగా గుర్తించినట్లు చెప్పారు. ఎమ్మెల్యేల సభ్యత్వం గురించి మీనా మాట్లాడుతూ, ‘బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. నేను ఎలాగైతే ఎమ్మెల్యేనో వారు కూడా అంతే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు’ అని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి విప్ జారీ చేయడంపై ఆయన మాట్లాడుతూ, మాయావతి దళిత పార్టీ సమావేశాలకు హాజరుకారని, ఆమె కేవలం ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారని అని విమర్శించారు. ఆమె అసలు నాయకురాలు కాదని, కాన్షీరామ్ను ఆమెలో చూసుకోవడం కారణంగా నాయకురాలిగా మారారని ధ్వజమెత్తారు. రాజస్తాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్కు మద్దతుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకూడదని మాయావతి విప్ జారీ చేశారు. దీంతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. చదవండి: మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్కు షాక్ -
మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్కు షాక్
జైపూర్ : రాజస్తాన్లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపుతిరుగుతోంది. రాజస్తాన్ అసెంబ్లీలో అశోక్ గహ్లోత్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్పీ ఎమ్మెల్యేలను కోరుతూ పార్టీ అధినేత్రి మాయావతి జారీ చేసిన విప్ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ తరపున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలతో కూడిన ఆ పార్టీ శాసనసభాపక్షం 2019 సెప్టెంబర్లో కాంగ్రెస్లో విలీనమైంది. ఈ విలీనానికి రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదముద్ర వేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు లఖన్ సింగ్, దీప్ చంద్, ఆర్ గుడా, వాజిబ్ అలీ, జేఎస్ అవానా, సందీప్ కుమార్లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. విప్ను ధిక్కరిస్తే వారు అనర్హత వేటుకు గురవుతారని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా హెచ్చరించారు. బీఎస్పీ జాతీయ పార్టీ అని, జాతీయస్ధాయిలో బీఎస్పీ కాంగ్రెస్లో విలీనం అయితే మినహా రాష్ట్రస్ధాయిలో ఆరుగురు ఎమ్మెల్యేల విలీనం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. చదవండి : రాజస్తాన్ హైడ్రామా : స్పీకర్ పిటిషన్ వెనక్కి.. అందుకే రాష్ట్రస్ధాయిలో తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం కావడం చెల్లుబాటుకాదని వివరించారు. 2016లో పాలక టీఆర్ఎస్లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది పాలక పార్టీలో విలీనమైన కేసు తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే మిశ్రా వాదనను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు. వారు సాంకేతికంగా బీఎస్పీ ఎమ్మెల్యేలు కానందున వారికి విప్ వర్తించదని గహ్లోత్ శిబిరం వాదిస్తోంది. మరోవైపు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనానికి స్పీకర్ ఆమోదాన్ని సవాల్ చేస్తూ బీజేపీ, బీఎస్పీలు ఇప్పటికే న్యాయస్ధానాలను ఆశ్రయించాయి . ఇక సచిన్ పైలట్ తిరుగుబాటుతో 19 మంది ఎమ్మెల్యేలు దూరమవడంతో గహ్లాత్ సర్కార్ మైనారిటీలో పడిందని రెబల్ నేతలు చెబుతుండగా 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో తమకు 103 మంది ఎమ్మెల్యేల బలముందని గహ్లోత్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ 103 మందిలో బీఎస్పీ నుంచి చేరిన 6 ఎమ్మెల్యేలున్నారు. -
‘రాజస్తాన్లో రాష్ట్రపతి పాలన విధించాలి’
న్యూఢిల్లీ: ఆడియో టేపుల వ్యవహారం రాజస్తాన్ రాజకియాల్లో మరింత దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజస్తాన్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ కుట్రలు పన్నారని కాంగ్రెస్ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఫేక్ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపాలని డిమాండ్ చేశారు. (రాజస్తాన్ హైడ్రామా: పోలీసులకు బీజేపీ ఫిర్యాదు) ఇక దీనిపై మాయావతి స్పందిస్తూ.. రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ మొదట ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఆడియో టేపుల విషయంలో మరో చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాజస్తాన్లో రాష్ట్రపతి పాలనను గవర్నర్ సిఫార్సు చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, అస్థిరతను గవర్నర్ పూర్తిస్థాయిలో తెలుసుకొని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. (‘105 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టచ్లో ఉన్నారు’) -
వికాస్ దూబే మృతి : విచారణకు మాయావతి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : పోలీస్ ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ వికాస్ దూబే మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసుపై సర్వోన్నత న్యాయస్ధానం పర్యవేక్షణలో పూర్తిస్ధాయిలో విచారణ జరపాలని ఆమె కోరారు. కాన్పూర్లో ఎనిమిది మంది పోలీసులను గ్యాంగ్స్టర్ బృందం కాల్చిచంపిన క్రమంలో వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా మొత్తం వ్యవహారంపై ఉన్నతస్ధాయి విచారణ చేపట్టాలని మాయావతి డిమాండ్ చేశారు. సమగ్ర దర్యాప్తుతోనే పోలీసులు, నేరస్తులు, రాజకీయ నేతలు కుమ్మక్కైన తీరు బయటకువస్తుందని, దోషులకు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలతోనే యూపీ నేరరహిత రాష్ట్రంగా మారుతుందని ఆమె ట్వీట్ చేశారు.మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను శుక్రవారం ప్రత్యేక వాహనంలో కాన్పూర్కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. చదవండి : ‘వికాస్ దూబే హతం : మాకు పండుగ రోజే’ -
కేంద్రం జోక్యాన్ని కోరిన మాయావతి
లక్నో: ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని బహుజన సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి కోరారు. దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో ఢిల్లీయేతరులకు చికిత్స అందించకూడదని హస్తిన సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘దేశానికి ఢిల్లీ రాజధాని. ముఖ్యమైన పనుల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చిన వారు దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్యానికి గురైతే వారు ఢిల్లీవాసులు కాదన్న కారణంతో చికిత్స చేసేందుకు నిరాకరించడం సరైంది కాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల’ని మాయావతి ట్వీట్ చేశారు. (ఢిల్లీ ఆసుపత్రుల్లో 'ఇతరులకు' నో ఛాన్స్!) లాక్డౌన్ను సడలించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా, ఢిల్లీలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో పడకలు సరిపోవడం లేదని, 90 శాతం పడకలు స్థానికులకే కేటాయించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. (కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!) వివక్ష ఎందుకు?: సీఎం చౌహాన్ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆక్షేపించారు. ‘కేజ్రీవాల్ జీ పేరులో 'వాల్ (ఎల్)' ఉంది. అందుకని ఆయన దాన్ని నిర్మిస్తారా? అలాంటి వివక్ష ఎందుకు?’ అంటూ సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు. ఢిల్లీయేతరులకు చికిత్స నిరాకరించడం సిగ్గుచేటని హస్తిన బీజేపీ నాయకుడు మనోజ్ తివారి అంతకుముందు విమర్శించారు. కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిస్సహాయంగా మారిందని దుయ్యబట్టారు. -
జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై స్పందించిన మాయావతి
లక్నో: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతంపై అమెరికా అట్టుడుకుతోంది. పలుచోట్ల హింసాత్మక ఘటనలతో కూడిన ఆందోళనలు చెలరేగాయి. ఆరు రోజులుగా నడుస్తున్న ఈ ఆందోళన ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పోలీసులు వేల మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ ఘటనపై చెలరేగే ఆందోళనలు ప్రపంచంలో సామాన్యుడి జీవితానికి విలువ ఉందని తేలియజేసున్నాయని అన్నారు. అయితే భారత రాజ్యాంగం కూడా సామాన్య ప్రజలకు చాలా హామీలు ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు వాటిని ఏమాత్రం పాటించడం లేదని మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో దేశంలో వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె తెలిపారు. భారత రాజ్యాంగం ప్రజలకు స్వాతంత్య్రం, భద్రత, ఆత్మగౌవరం వంటి హామీలను ఇచ్చిందని వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. (ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి మార్పు) మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు.. చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. మెడపై మోకాలుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికీ పోలీసు అధికారి మాత్రం కనికరం చూపకుండా ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచాడు. దీంతో ప్రాణం పోతుందంటూ గిలగిల కొట్టుకున్న జార్జ్ పోలీసు మోకాలి కిందనే ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ఆగ్ర రాజ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. -
ప్రతిపక్షాల భేటీ: ‘హ్యాండిచ్చిన’ ఆ ముగ్గురు!
న్యూఢిల్లీ: వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ప్రతిపక్షాలు నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేశ్ యాదవ్ సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బహిష్కరించినట్లు తెలుస్తోంది. రాజకీయపరంగా కాంగ్రెస్ పార్టీతో తమకు ఉన్న విభేదాల నేపథ్యంలో వీరు ఈ మేరకు కాన్ఫరెన్స్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల వలస కూలీలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉన్నచోట ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్లే మార్గం తెలియక పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ వారి కష్టాలు తీరడం లేదు. (వలస కూలీలపై భారం మోపుతారా’) ఈ నేపథ్యంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు- పరిష్కారాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల నేతలు శుక్రవారం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో వివిధ పార్టీలకు చెందిన 20 మంది నేతలు పాల్గొననున్నట్లు సమాచారం. వలస కూలీల సమస్యలను పరిష్కరించే విషయంలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తుండడంపైనా చర్చించే అవకాశం ఉంది. కాగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు 17 ప్రతిపక్షాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా వామపక్ష నేతలు, యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు. -
ఔరాయ ప్రమాదానికి కారణం వారే: మాయావతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో శనివారం జరిగిన ఔరాయ ప్రమాదంపై బహుజన్ సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. యూపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆమె మండిపడ్డారు. వారి వల్లే ఔరాయ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని ఔరాయ వద్ద కొంత మంది వలసకూలీలు రాజస్థాన్ నుంచి గోరఖ్పూర్ ట్రక్లో వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ట్రక్ ఢీ కొని 24 మంది మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి) ఈ విషయం పై మాయావతి శనివారం మీడియాతో మాట్లాడుతూ ...‘రాష్ట్రంలోకి వచ్చే, వెళ్లే వారికి సంబంధించి అన్ని బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఈ విషయాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది’ అని ఆమె ఆరోపించారు. దీనికి కారణమైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్కి విజ్ఞప్తి చేశారు. అలాగే బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని కూడా మాయవతి కోరారు. దీంతోపాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలవాలని విన్నవించారు. అదేవిధంగా వలసకూలీలు ఎవరూ కాలినడకన రావొద్దని, రైల్వే స్టేషన్లకు వెళ్లి తమను ఇంటికి పంపే ఏర్పాట్లు చేయమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రభుత్వం పేదలందరికి రక్షణ కల్పించాలని, ఆహారం అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయాలని సూచించారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి పేదలకు సహాయాన్ని అందించాలని కోరారు. ('తినడానికి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు') -
‘కోట’ నుంచి విద్యార్థులను తీసుకొచ్చినట్టుగా..
లక్నో: లాక్డౌన్తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బహుజన సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి డిమాండ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్డౌన్తో ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. లక్షలాది మంది పేద వలస కార్మికులు మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. ఉపాధి కోల్పోయి తిండిలేక వలస కార్మికులు కష్టాలు పడుతున్నారు. రోజుకు ఒక్కపూట కూడా వారికి ఆహారం దొరకడం లేదు. వారంతా తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు. కేంద్రం సానుభూతితో వలస కార్మికుల సమస్యను అర్థం చేసుకుని వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. రాజస్థాన్లోని కోట ప్రాంతం నుంచి విద్యార్థులను సొంతూళ్లకు తరలించినట్టుగానే ప్రత్యేక బస్సుల్లో బడుగులను తరలించాలి. లేదంటే ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను పంపించాల’ని మాయావతి ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి దేశవాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మే 3 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ప్లాస్మా దానం చేయండి: తబ్లిగీ నేత -
లాక్డౌన్ కష్టాలు: మండిపడ్డ మాయావతి
లక్నో: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస జీవుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. కరోనా(కోవిడ్-19) మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో దళితులు, ఆదివాసీల పరిస్థితి దయనీయంగా మారిందని.. అయినా వారి పట్ల ప్రభుత్వ వైఖరి ఏమాత్రం మారలేదని మండిపడ్డారు. కరోనాను కట్టడి చేసేందు మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మాయావతి మాట్లాడుతూ... ప్రభుత్వాలు వలస జీవులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.(ఆ విషయాన్ని రేపు ప్రధాని వెల్లడిస్తారు: జవదేకర్) ‘‘పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో 90 శాతం మంది దళితులు, ఆదివాసీలే... 10 శాతం పేదలు ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో స్వస్థలాలకు పయనమైన వారికి యజమానులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు... కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు. వారిని ఆపడం లేదు. కనీసం నిత్యావసరాలు తీర్చే చర్యలు చేపట్టడం లేదు. వారిని సొంత ఊళ్లకు చేర్చే మార్గాలు అన్వేషించడం లేదు. అందుకే కాలినడకన స్వస్థలాలకు పయనమై ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నామ మాత్రంగా కొన్ని బస్సులు, ట్రక్కులు ఏర్పాటు చేసి వారిని తరలిస్తున్నారు. కొన్నిచోట్ల వెనక్కి పంపిస్తున్నారు. ఒకవేళ వారిలో ఎవరికైనా మహమ్మారి సోకి ఉంటే పరిస్థితి ఏంటి’’అని మాయావతి ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు) -
ప్రియాంకపై మాయావతి ఫైర్
లక్నో : సామాజికవేత్త, కవి రవిదాస్ను అధికారంలో ఉండగా కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ గౌరవించలేదని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆలయ సందర్శనలను మాయావతి ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.తాము అధికారంలో ఉన్న సమయంలో రవిదాస్కు తాము అత్యంత గౌరవం ఇచ్చామని మాయావతి చెప్పుకొచ్చారు. తమ పార్టీ యూపీలో అధికారంలోకి వస్తే బదోహి జిల్లాను తిరిగి సంత్ రవిదాస్ నగర్ జిల్లాగా మార్చుతామని స్పష్టం చేశారు. ఎస్పీ ప్రభుత్వం గతంలో కుల కోణంలోనే రవిదాస్ నగర్ జిల్లా పేరును తొలగించిందని ఆమె మండిపడ్డారు. 1994లో వారణాసి జిల్లా నుంచి వేరుపరుస్తూ బీఎస్పీ హయాంలో సంత్ రవిదాస్ నగర్ జిల్లా ఏర్పడగా 2014లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఆ జిల్లా పేరును బదోహిగా మార్చింది. కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలు అధికారంలో ఉండగా సంత్ గురు రవిదాస్ను పట్టించుకోకుండా, విపక్షంలో ఉన్నప్పుడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయాలు, ఇతర ప్రాంతాలను సందర్శిస్తున్నాయని మాయావతి ట్వీట్ చేశారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు వారణాసిలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్న క్రమంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి : మాయావతి ప్రకటనపై మందకృష్ణ ఆవేదన -
జేఎన్యూపై ‘నాజీ’ తరహా దాడి..!
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో చోటుచేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు క్యాంపస్లో చోటుచేసుకున్న హింసాత్మక దాడులను ఖండిస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ దేశంలో పెరిగిపోతున్న అసహనానికి ఈ దాడులు నిదర్శనమని పేర్కొన్నారు. ‘విద్యార్థులపై జరిగిన భీకరమైన దాడి.. అసహనానికి నిదర్శనం. జేఎన్యూ క్యాంపస్లో విద్యార్థులు, టీచర్లపై ‘నాజీ స్టైల్’లో దాడి జరిగింది. దేశంలో హింస, అశాంతి సృష్టించాలనుకునేవాళ్లే ఇలాంటి దాడులు చేస్తారు’ అని పినరయి ట్విటర్లో పేర్కొన్నారు. ‘క్యాంపస్లో రక్తపాతాలు సృష్టించే ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడటాన్ని సంఘ్ పరివార్ శక్తులు ఇప్పటికైనా ఆపాలి. విద్యార్థుల గొంతు.. ఈ దేశ గొంతుగా వారు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’ అని అన్నారు. జేఎన్యూ క్యాంపస్లో దాడుల నేపథ్యంలో క్యాంపస్ విద్యార్థులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు సాహసోపేతంగా వ్యవహరిస్తూ.. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నందుకే వారిని ‘శిక్షించేందుకు’ ఈ క్రూరమైన దాడులు జరిగాయని ఒవైసీ ఆరోపించారు. కేంద్ర మంత్రులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారని, పోలీసులు ఎందుకు గూండాలకు రక్షణగా ఉన్నారో మోదీ సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు. జేఎన్యూలో దాడులను బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించారు. ఈ దాడులను కేంద్రం సీరియస్గా తీసుకోవాలని, దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపితే మంచిదని ఆమె సూచించారు. -
సిగ్గుచేటు.. పాశవిక చర్య: మాయావతి
లక్నో : జేఎన్యూలో జరిగిన దాడిపై న్యాయ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)అధినేత మాయావతి విఙ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలో దుండగుల దాడిని ఖండించిన మాయావతి సోమవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘జేఎన్యూలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి సిగ్గుచేటు. తీవ్రంగా ఖండించదగినది. ఈ పాశవిక చర్యకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి.. దాడిపై న్యాయ విచారణ జరిపితే మంచిది’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.(జేఎన్యూలో దాడిని ఖండించిన బాలీవుడ్ తారలు) జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోకి ఆదివారం రాత్రి చొరబడిన దుండగులు విద్యార్థులపై కర్రలతో, రాడ్లతో దాడిగి తెగబడిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. ముసుగు దాడిలో గాయపడ్డ విద్యార్థులు, జేఎన్యూఎస్ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ ప్రస్తుతం ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనను ఖండించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ తక్షణమే యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. కాగా ఏబీవీపీకి సంబంధించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. చదవండి. ‘తలపై పదే పదే కాలితో తన్నాడు’ JNU में छात्रों व शिक्षकों के साथ हुई हिंसा अति-निन्दनीय व शर्मनाक। केन्द्र सरकार को इस घटना को अति-गम्भीरता से लेना चाहिये। साथ ही इस घटना की न्यायिक जाँच हो जाये तो यह बेहतर होगा। — Mayawati (@Mayawati) January 6, 2020 -
ఇప్పుడు కూడా ఆయనను కౌగిలించుకుంటారా?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో సిక్కులపై రాళ్ల దాడిని బీజేపీ నేత, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఖండించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పాకిస్తాన్లోని నంకానా గురుద్వారా సాహిబ్ వద్ద శుక్రవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. సిక్కు యువతి జగ్జీత్కౌర్ను అపహరించి, మతమార్పిడికి పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయంపై స్పందించిన మీనాక్షి లేఖి.. కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టారు. ‘ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా నవజ్యోత్ సింగ్ ఐఎస్ఐ చీఫ్ను ఆలింగనం చేసుకుంటారా? ఈ విషయం గురించి కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు. సిద్ధు అన్నయ్య ఎక్కడికి పారిపోయారో తెలియడం లేదు’ అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాగా గతేడాది పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సమయంలో నవజ్యోత్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ను ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశపు ఆర్మీ చీఫ్ను ఎలా కౌగిలించుకుంటారంటూ సిద్ధుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం జోక్యం చేసుకోవాలి: మాయావతి సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ జన్మస్థానమైన నంకానా సాహిబ్ వద్ద సిక్కులపై రాళ్ల దాడిని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు...‘ గురునానక్ దేవ్ జీ జన్మస్థానం వద్ద శుక్రవారం జరిగిన మూకదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ఘటనల గురించి మన దేశం సహజంగానే స్పందిస్తుంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని ట్విటర్ వేదికగా విఙ్ఞప్తి చేశారు. -
మాయావతి అనూహ్య విమర్శలు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ కోటాలో 100మందికిపైగా చిన్నారులు మృతి చెందిన ఉదంతంలో ప్రియాంకగాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కోటాలో చిన్నారుల మరణాలపై రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం అశోక్ గెహ్లాట్ మొద్దు నిద్ర నటిస్తోందని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాయావతి ట్విటర్లో మండిపడ్డారు. ఇది తీవ్ర ఖండనార్హమని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ అధినాయకత్వం, ముఖ్యంగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ఈ విషయమై మౌనంగా ఉండటం మరింత ఖండనీయమైన అంశమన్నారు. యూపీలో సీఏఏ అల్లర్లలో బాధితుల కుటుంబసభ్యులను కలుస్తున్న మాదిరిగానే కోటాలో పిల్లలను కోల్పోయిన నిరుపేద తల్లులను కలిస్తే బాగుండేది’ అని ఆమె ట్విటర్లో అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే కోటాలో చిన్నారులు చనిపోయారని ఆమె ఆరోపించారు. కోటాలోని బాధితులను కూడా ప్రియాంకగాంధీ పరామర్శించి ఉంటే.. యూపీలో ఆమె పరామర్శ యాత్రలను రాజకీయ అవసరంగా పరిగణించి ఉండేవారు కాదని ఆమె పేర్కొన్నారు. కోటాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గత కొద్దిరోజుల్లో 100దాకా నవజాత శిశువులు చనిపోయారని కథనాలు వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక, ప్రియాంక నాయకత్వంలో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ బలపడితే.. అది తన ఓటుబ్యాంకును దెబ్బతీసే అవకాశముందనే భయంతోనే మాయావతి ఇటీవలికాలంలో ప్రియాంకను తీవ్రంగా విమర్శిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
వాళ్ల దోస్తీ ఎలాంటిదో చెప్పాలి : మాయావతి
లక్నో : కాంగ్రెస్ పార్టీ దంద్వ వైఖరిపై బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతునిచ్చిన శివసేనతో కాంగ్రెస్ దోస్తీ ఎలాంటిదో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్తో కలిసి అధికారం పంచుకుంటూనే రాహుల్ వీర సావర్కర్ వ్యాఖ్యలను శివసేన తప్పుబట్టడుతోందని అన్నారు. కాగా, ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో శనివారం జరిగిన ‘భారత్ బచోవో ర్యాలీ’లో రాహుల్ గాంధీ ‘నేను రాహుల్ సావర్కర్ను కాదు’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. భరత జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన సావర్కర్ను అందరూ గౌరవించాలని స్పష్టం చేసింది. ‘కాంగ్రెస్ వ్యతిరేకించిన పౌరసత్వ సవరణ బిల్లుకు శివసేన మద్దతు పలికింది. ఇప్పుడు అదే శివసేన రాహుల్ గాంధీ సావర్కర్ వ్యాఖ్యలను తప్పుబడుతోంది. మళ్లీ మహారాష్ట్రలో రెండు పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ దంద్వ విధానాలకు నిదర్శనం’ అని మాయావతి ట్విటర్లో విమర్శలు గుప్పించారు. అసలు కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ తన బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు నాటుకాలు ఆడుతోందని ప్రజలు భావిస్తారని అన్నారు. -
మాయావతి ప్రకటనపై మందకృష్ణ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ దుర్గటనలో నలుగురిని ఎన్కౌంట్ చేయడాన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సమర్థించడం దురదృష్టకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించడానికి జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ క్యాంపస్ దూరవిద్యాకేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ అధ్యక్షతన సభలో మంద కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా మౌనం వహించిన మాయావతి కేవలం ‘దిశ’ నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని సమర్థించడం దురదృష్టకరమన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కేవలం అగ్రకుల మహిళలపై దుర్గటనలు జరిగితేనే అగ్రకుల నేతలు ఆందోళన చేసి, పార్లమెంట్ వరకు చర్చించడం పాలక వర్గాలలో పక్షపాత ధోరణులకు నిదర్శనమని వివరించారు. ‘దిశ’ ఘటనకు ముందు టేకు లక్ష్మి, సుద్దాల శైలజ, కల్పన, ఇంకా అనేక మంది దళిత, బహుజన మహిళలు, బాలికలు అత్యాచారానికి గురై హత్య చేసినా ఇంత వరకు వారి కుటుంబాలను ఏ ఒక్క నేతా పలకరించలేదని, సత్వర న్యాయం కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులను శిక్షించలేదన్నారు. తప్పు ఎవరు చేసినా చట్టబద్ధమైన కఠిన శిక్షలు విధించాలని, జీవించే హక్కును వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు హరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్గౌడ్, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజియాదవ్, డీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నలిగంటి శరత్, వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు సలీంపాషా, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రంజిత్, నాగరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు లక్ష్మణ్, టీడీవీఎస్ రాష్ట్ర నాయకులు భూపెల్లి నారాయణ తదితరులు ప్రసంగించారు. -
ఉన్నావ్: యోగి సర్కారుపై మాయావతి ఫైర్
లక్నో : ఉన్నావ్ బాధితురాలు మరణంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత మాయావతి స్పందించారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. గురువారం కోర్టు విచారణకు వెళ్తున్న ఉన్నావో బాధితురాలిని రైల్వేస్టేషన్ సమీపంలో నిందితులు అడ్డుకొని పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసందే. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై మాయావతి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా లేరని వ్యాఖ్యానించారు. యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ కూడా ఒక మహిళేనని, మరో మహిళ బాధలను ఆమె అర్థం చేసుకోగలరని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాయావతి మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా మహిళలపై దాడులు జరగకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉన్నావ్లో బాధితురాలు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. మరో వైపు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టారు. ఇక యువతికి నిప్పంటించిన కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. -
‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి’
సాక్షి, న్యూఢిల్లీ: దిశ అత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. మహిళలపై దాడులను అరికట్టాలంటే పోలీసు వ్యవస్థ ఇలాంటి చర్యలకు ఉపక్రమించక తప్పదని మాయావతి పేర్కొన్నారు. కాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్య కేసుపై అనేక వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. దిశను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన కామాందులకు ఉరిశిక్ష పడాలని యావద్దేశం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. అయితే విచారణ నిమిత్తం శుక్రవారం తెల్లవారుజామున క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చిచంపారు. చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు -
మాయావతి మాజీ కార్యదర్శికి ఐటీ షాక్
సాక్షి, ముంబై: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మయావతికి మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేత్రామ్కు ఐటీ విభాగం షాకిచ్చింది. అక్రమ ఆస్తులకు సంబంధించి ఆదాయ పన్నుఅధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నోయిడా, కోల్కతా, ముంబైతోపాటు మొత్తం 19 స్థిరాస్తులను ఆదాయపు పన్ను శాఖ ఎటాచ్ చేసింది. నేత్రకు చెందిన మొత్తం 230 కోట్ల రూపాయల విలువైన 'బినామి' ఆస్తులను ఎటాచ్ చేసినట్టుగా అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. 1988 బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం సెక్షన్ 24 (3) కింద, వివిధ వాణిజ్య, నివాస ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. జప్తుచేసిన వాటిలో వాణిజ్య, నివాస సముదాయాలుతోపాటు రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన ‘మాంట్ బ్లాంక్' కలాలు, నాలుగు విలాసవంతమైన ఎస్యూవీ కార్లు ఉన్నాయి. బీఎస్పీ అధినేత మాయావతి ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వివిధ ఉన్నత పదవుల్లో పనిచేసిన నేత్రామ్ నివాసం, కార్యాలయాలపై ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.300 కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. యూపీలో బీఎస్పీ పాలనలో షుగర్ మిల్లుల పెట్టుబడుల కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలకు సంబంధించి సీబీఐ కూడా ఆయనను విచారిస్తోంది. కాగా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడు సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష, బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
మాయావతికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు!
జైపూర్ : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. రాజస్తాన్లో ఆ పార్టీకి ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్తో సంప్రదింపులు జరిపిన తర్వాత తాము అధికార పార్టీలో చేరుతున్నట్లు రాజేంద్ర గడ్, జోగేంద్ర సింగ్ అవానా, వాజిబ్ అలీ, లఖన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, దీప్చంద్ ఖేరియా....శాసనసభ స్పీకర్ సీపీ జోషికి లేఖ రాశారు. ఈ సందర్భంగా రాజేంద్ర గడ్ మాట్లాడుతూ...‘మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండటంలో... రాష్ట్రాభివృద్ధిలో మా వంతు పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నాం. అశోక్ జీ అత్యుత్తమ ముఖ్యమంత్రి. రాజస్తాన్ను ఆయన కంటే గొప్పగా పాలించే సీఎం మరెవరూ లేరు. బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు తెలిపే బదులు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అని పేర్కొన్నారు.(చదవండి : కశ్మీర్ పర్యటన; కాంగ్రెస్పై మాయావతి ఫైర్!) కాగా రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరుగురు బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక గతేడాది మార్చిలో 12 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలపడింది. కాగా జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనను సమర్థిస్తూ నరేంద్ర మోదీ సర్కారు తెచ్చిన బిల్లును మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ సమర్థించిన విషయం విదితమే. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్షాల బృందం కశ్మీర్ పర్యటనకు వెళ్లడాన్ని మాయావతి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమెకు షాకిచ్చారు. కాగా ఈ అనూహ్య పరిమాణంపై మాయావతి ట్విటర్లో స్పందిస్తూ.. మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మరోసారి విశ్వాసఘాతక పార్టీగా నిరూపించుకుందని మండిపడ్డారు. రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బేషరతుగా మద్దతు తెలిపిన మా పార్టీని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీలపై గెలిచేందుకు సమర్థంగా పనిచేయాల్సింది పోయి.. మద్దతిచ్చిన వారికి హాని కలిగించడంపైనే కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. -
ఉత్తరాన పొత్తు కుదిరింది!
చండీగఢ్: సార్వత్రిక ఎన్నికలు ముగిసి దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి తగ్గినా.. ఉత్తర భారతంలోని హర్యానాలో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల జరుగనున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారమే హర్యానాలో పర్యటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు పొత్తులపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. దీనిలో భాగంగానే బీఎస్పీతో పొత్తుకు ముందడుగేసింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా ఆదివారం బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనపై ఇరువురు చర్చించారు. దీనికి మాయావతి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే పొత్తును హర్యానాలో కూడా కొనసాగించాలని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే దీనిపై బహిరంగ ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం పది ఎంపీ స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
కశ్మీర్ పర్యటన; కాంగ్రెస్పై మాయావతి ఫైర్!
లక్నో : కశ్మీర్ పర్యటనకు వెళ్లిన విపక్ష బృందంపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే కొంతసమయం వేచి చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేసేందుకు బీజేపీ, కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు మీరే అవకాశం ఇచ్చారంటూ విరుచుకుపడ్డారు. కశ్మీర్కు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించాల్సిందని హితవు పలికారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ గవర్నర్ వాటిని ఖండిస్తూ అవసరమైతే ఇక్కడికి వచ్చి చూడవచ్చని ప్రతిపక్ష నాయకులకు సూచించారు. అయితే అక్కడి అధికారులు మాత్రం వీరికి అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నేతలు శనివారం కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో వారిని శ్రీనగర్ ఎయిర్పోర్టులోనే అడ్డుకున్న అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. చదవండి: ‘వారి కష్టాలకు రాళ్లు కూడా కన్నీరు కారుస్తాయి’ ఈ విషయంపై స్పందించిన మాయావతి...‘ సమానత్వం, ఐకమత్యం, సౌభాతృత్వం, దేశ సార్వభౌమత పట్ల బాబా సాహెబ్ అంబేద్కర్ విశ్వాసం కలిగి ఉండేవారు. అందుకే జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370కి ఆయన వ్యతిరేకం. ఈ కారణంగానే ఆ అధికరణ రద్దుకు బీఎస్పీ పార్లమెంటులో మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత 69 ఏళ్ల అనంతరం దేశ రాజ్యాంగం ఇప్పుడే కశ్మీర్లో కూడా అమల్లోకి వచ్చింది. కాబట్టి అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే కొంత సమయం పడుతుంది. కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల నేతలు అనుమతి లేకుండా కశ్మీర్కు వెళ్లారు. కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి, అక్కడి గవర్నర్కు అవకాశం ఇచ్చింది మీరు కాదా? అక్కడికి వెళ్లేముందు కనీసం ఒక్కసారైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది’ అని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. కాగా బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసే మాయావతి.. ఆర్టికల్ 370 రద్దు విషయంలో మాత్రం కేంద్రానికి పూర్తి మద్దతు పలికిన విషయం తెలిసిందే. 3. ऐसे में अभी हाल ही में बिना अनुमति के कांग्रेस व अन्य पार्टियों के नेताओं का कश्मीर जाना क्या केन्द्र व वहां के गवर्नर को राजनीति करने का मौका देने जैसा इनका यह कदम नहीं है? वहाँ पर जाने से पहले इस पर भी थोड़ा विचार कर लिया जाता, तो यह उचित होता। — Mayawati (@Mayawati) August 26, 2019 -
మందిర్ పునర్నిర్మాణానికి డిమాండ్
ఢిల్లీ : దేశ రాజధానిలో రవిదాస్ మందిర్ కూల్చివేతకు నిరసనగా తుగ్లకాబాద్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 10న ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) అధికారులు రవిదాస్ మందిర్ను కూలగొట్టిన విషయం తెలిసిందే. వేలాది దళితులు మందిర్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని అంబెద్కర్ భవన్ నుంచి రామ్లీలా మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. కూల్చివేతకు నిరసనగా బుధవారం ఆందోళనకారులు నిరసనల హోరు కొనసాగించారు. తమ జాతికి అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారుభీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర పాల్ గౌతం సహా పలువురు మత పెద్దలు పాల్గొన్నారు. వీరితో పాటు మరో 50మంది ఆందోళనకారులు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనకారులకు, ప్రజలకు గాయాలయ్యానన్న వార్తలను పోలీసులు కొట్టి పారేశారు. ఈ ఘటన గురించి డీసీపీ చిన్మయ్ బిస్వల్ మాట్లాడుతూ రాత్రి 7.30ప్రాంతంలో రవిదాస్ మందిర్వైపు ఆందోళనకారులు సమూహంగా ఎర్పడ్డారు. కొద్ది సేపటికే నిరసనకారులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించారని డీసీపీ వెల్లడించారు. ఈ ఆందోళనలో వివిధ రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. నగరంలో పలు ప్రదేశాలలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిరసనకారులకు పలు రకాలుగా సూచించినా వినకపోవడంతో అదుపులోకి తేవడానికి లాఠీచార్జ్ చేశారని అన్నారు. గాయాలకు పాల్పడినవారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు కొన్ని వాహనాలను, రెండు మోటార్ సైకిళ్లను ద్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. కులతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని యూపీ మాజీ సీఎం మాయావతి విరుచుకుపడ్డారు. అయితే, మాయావతి ఆరోపణలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఈ అంశంలో తమ ప్రభుత్వం ఏమి చేయలేదని అన్నారు. కేంద్రమే సరియైన నిర్ణయం తీసుకొని వేరే ప్రదేశంలో మందిర్ను నిర్మించడానికి చొరవ చూపాలని పట్టణశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. -
డబ్బులిస్తేనే టికెట్ ఇచ్చారు: ఎమ్మెల్యే
జైపూర్: రాజస్తాన్ బీఎస్పీ ఎమ్మెల్యే రాజేంద్ర గుదా ఆ పార్టీ చీఫ్ మాయావతిపై సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వడానికి మాయావతి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. తన కంటే ఎక్కువ మొత్తం ఇంకా ఎవరైనా ఇచ్చిఉంటే టికెట్ తనకు కాకుండా వేరే వాళ్లకు దక్కేదంటూ విమర్శించారు. శుక్రవారం జైపూర్లో జరిగిన ఓ సమావేశంలో రాజేంద్ర మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే.. టికెట్లు వారికే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాగా మాయావతిపై ఇంతకుముందు ఇదే విధంగా పలువురు నేతలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై బీఎస్పీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’
సాక్షి, బెంగళూరు : కర్ణాకటకలో 14 నెలల పాటు కొనసాగిన కుమారస్వామి ప్రభుత్వం.. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కుమారస్వామి ప్రవేశ పెట్టిన తీర్మాణానికి 99 మంది అనుకూలంగా మద్దతు ఇవ్వగా.. 105 మంది వ్యతిరేకించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ హాజరుకాలేదు. కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించనా.. ఓటింగ్లో పాల్గొనకపోవడం పట్ల పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేశారు. (చదవండి : కుమార ‘మంగళం’) మాయావతి నిర్ణయంపై ఎమ్మెల్యే మహేశ్ స్పందింస్తూ.. తనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో అర్థం కావడంలేదన్నారు. తాను ఓటింగ్లో పాల్గొనడంలేదని ముందే చెప్పానని, అయినప్పటికీ ఎందుకు బహిష్కరించారో తెలియడం లేదన్నారు. మయావతి ట్వీట్ గురించి తనకు తెలియదని, ఈ విషయంపై తర్వాత మాట్లాడతానని తెలిపారు. కాగా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పినా.. పార్టీ నియమామలను ఉల్లంఘిస్తూ మహేశ్ సభకు హాజరుకాలేదని అందుకే అతన్ని బహిష్కరిస్తున్నాని మాయావతి ట్వీట్ చేశారు. (చదవండి : కూలిన కుమార సర్కార్ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు) 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్.. 2018 అక్టోబర్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
కూలిన కుమార సర్కార్ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్ను ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా బీఎస్పీ అధ్యక్షురాలు మయావతి ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినా కూడా మహేశ్ ఓటింగ్కు గైర్హాజరు కావడంతో అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మయావతి ప్రకటించారు. ‘కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొనాలనే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహేశ్ మంగళవారం రోజున సభకు హాజరుకాలేదు. దీనిని పార్టీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. తక్షణమే మహేశ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాన’ని మయావతి ట్విటర్లో వెల్లడించారు. అయితే 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్.. 2018 అక్టోబర్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. कर्नाटक में कुमारस्वामी सरकार के समर्थन में वोट देने के पार्टी हाईकमान के निर्देश का उल्लंघन करके बीएसपी विधायक एन महेश आज विश्वास मत में अनुपस्थित रहे जो अनुशासनहीनता है जिसे पार्टी ने अति गंभीरता से लिया है और इसलिए श्री महेश को तत्काल प्रभाव से पार्टी से निष्कासित कर दिया गया। — Mayawati (@Mayawati) July 23, 2019 చదవండి : కుమార ‘మంగళం’ -
మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన ప్లాట్ను ఆదాయపన్ను శాఖ(ఐటీ) అటాచ్ చేసింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోని నొయిడాలో ఏడెకరాల్లో బినామీ పేరుతో ఉన్న ఈ స్థలం అసలు యజమాని మాయా సోదరుడు ఆనంద్ కుమార్, అతని భార్యకు చెందినట్లుగా ఐటీ అనుమానిస్తోంది. కాగా, కుమార్ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మాయావతి ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐటీకి చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్(బీపీయూ) ఈ మేరకు ఈ నెల 16వ తేదీన అటాచ్మెంట్ ఉత్తర్వులు వెలువరించింది. నోయిడాలోని సెక్టర్ 94లో 28వేలకు పైగా చదరపు మీటర్లు అంటే సుమారు ఏడెకరాల వాణిజ్య భూమిలో ఫైవ్స్టార్ హోటల్, ఇతర నిర్మాణాలు చేపట్టాలని ఆనంద్కుమార్, అతని భార్య విచితర్ లత ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇది వారి పేరు బదులు మరొకరి పేరుతో ఉంది. మార్కెట్లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూమి కొనుగోలు కోసం ఆరు బినామీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా అక్రమ సంపాదనను హవాలా మార్గంలో మళ్లించినట్లు ఐటీ విభాగం అనుమానిస్తోంది. బినామీ చట్టం–1988ని మోదీ ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తోంది. ఈ చట్టం కింద దోషిగా తేలిన వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు సదరు ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం మేర జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఐటీ చట్టం–1961 ప్రకారం కూడా విచారించే వీలుంటుంది. దేశంలో బినామీ ప్రొహిబిషన్ చట్టం అమలు అధికారం ఐటీ విభాగానికి ఉంది. -
మాయావతికి ఎదురుదెబ్బ
లక్నో: బీఎస్పీ చీఫ్ మాయావతికి ఎదురుదెబ్బ తగిలింది. మాయావతి సోదరుడు, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్కుమార్, అతని భార్యకు చెందిన 400 కోట్ల రూపాయల ఆస్తులను ఆదాయ పన్నుశాఖ ఢిల్లీ విభాగం ఎటాచ్ చేసింది. బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం, 1988 ప్రకారం జులై 16న తాత్కాలిక నోటీసులు జారీ చేశామని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. నోయిడాలో ఏడు ఎకరాల్లో విస్తరించిన వున్న ప్లాట్ను బినామీ ఆస్తిగా పరిగణించిన ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని విలువ సుమారు రూ. 400 కోట్లు. కాగా బినామీ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి ఏడు సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష లేదా బినామి ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
ఆ ధోరణి ప్రమాదకరం : మాయావతి
లక్నో : మతపరమైన నినాదాలు చేయాలని ఒత్తిడి తెచ్చే ప్రమాదకర ధోరణి యూపీ సహా పలు రాష్ట్రాల్లో పెరిగిపోయిందని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలపై కేంద్రం, యూపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అభివృద్ధితో రాజీపడకుండా, సమాజంలో సోదరభావం, సామరస్యం పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా ఘటనలపై తీవ్రంగా స్పందించాలని మాయావతి ట్వీట్ చేశారు. యూపీలో నేరాల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె గతంలో ఆరోపించారు. మూక హత్యలపై బీజేపీ ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. దళితులకు వ్యతిరేకంగా జరిగే నేరాల్లో యూపీ ముందువరుసలో నిలిచిందని ఆరోపించారు. మాయావతి ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఎన్నికల్లో ఘోర వైఫల్యాలతో బీఎస్పీ చీఫ్ నిస్ప్రహలో ఉన్నారని పేర్కొంది. -
ఇక నుంచి ఒంటరి పోరే
లక్నో: ఇక ముందు జరిగే ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయావతి స్పష్టం చేశారు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలు చిన్నవైనా, పెద్దవైనా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సోమవారం లక్నోలో ఆమె ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలు కలిసి పోటీ చేశాయి. అయితే, అనుకున్న మేరకు ఫలితాలు దక్కలేదు. దాంతో వీరి పొత్తు కొనసాగే విషయం చర్చనీయాంశమైంది. మాయావతి తాజా ప్రకటనతో ఎస్పీతో పొత్తు ఉండదని తేలిపోయింది. ‘2012 నుంచి 2017 వరకు అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ బీఎస్పీకి వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా పదోన్నతుల్లో రిజర్వేషన్ల వంటి పలు నిర్ణయాలు తీసుకుంది. ఎస్పీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. వాటినన్నిటినీ మరిచి దేశప్రయోజనాల కోసం సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నాం. అయితే, ఎన్నికల తర్వాత ఎస్పీ వైఖరి మమ్మల్ని ఆలోచించుకునేలా చేసింది. ఈ పొత్తుతో భవిష్యత్తులో బీజేపీని ఓడించడం సాధ్యం కాదనిపిస్తోంది. అందుకే ఇకపై పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది’ అని మాయావతి హిందీలో ట్వీట్ చేశారు. దళితులు సమాజ్వాదీ పార్టీకి, ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్కు చేరువవుతున్నారన్న కోపంతోనే మాయావతి తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎస్పీ నేత రామ్శంకర్ అన్నారు. మాయవతి నిర్ణయంతో తమకేసంబంధం లేదని గఠ్బంధన్లో మరో భాగస్వామి రాష్ట్రీయ లోక్దళ్ పేర్కొంది. మాయావతి తీరింతే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న మాయావతి ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎప్పుడు తెగతెంపులు చేసుకుంటారో అర్థం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన మూడ్ను బట్టి ఆమె నిర్ణయాలు తీసుకుంటారని వారన్నారు. 1993లో ఆమె మొదటిసారి ఎస్పీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. రెండేళ్ల తర్వాత కటీఫ్ చెప్పారు. 1995లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత 4నెలలకే దానికి టాటా చెప్పేశారు. 1996లో కాంగ్రెస్తో జట్టు కట్టారు. 1997లో బీజేపీతో కలిసి పోటీ చేసి సీఎం అయ్యారు. 2002లో బీజేపీతో జతకట్టారు. మూడునెలల్లోపే పొత్తును విచ్ఛిన్నం చేశారు. 2018 ఉప ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని లాభం పొందారు. 2019లో ఆ పొత్తు కొనసాగించారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ కంటే బీఎస్పీ ఎక్కువ లాభపడింది. అయినాసరే ఇప్పుడు ఎస్పీతో పొత్తును తెంచేసుకున్నారు. -
ఎస్పీతో పొత్తుకు స్వస్తి పలికామని బీఎస్పీ
-
ఇక ఒంటరి పోరే..
లక్నో : ఎస్పీతో పొత్తుకు స్వస్తి పలికామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. ఇక ఎలాంటి ఎన్నికల్లో అయినా తమ పార్టీ సొంతగానే పోటీచేస్తుందని ఆమె పేర్కొన్నారు. గతంలో అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వం దళితులు, యాదవేతరుల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని అదే సార్వత్రిక ఎన్నికల్లో తమ వైఫల్యానికి కారణమైందని మాయావతి ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల అనంతరం ఎస్పీ తీరును గమనించిన తర్వాత ఆ పార్టీతో పొత్తు ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవడం సాధ్యం కాదని అవగతమైందని చెప్పారు. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం రానున్న ఏ ఎన్నికల్లోనైనా ఒంటరి పోరుకే సిద్ధం కావాలని పార్టీ నిర్ణయం తీసుకుందని మాయావతి ట్వీట్ చేశారు. -
మాయావతి కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిత్యం మాట్లాడే బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీలో కీలక పదవులను తన సోదరుడు ఆనంద్ కుమార్, మేనల్లుడు ఆకాష్ ఆనంద్లకు కట్టబెట్టారు. మాయావతి తన సోదరడు కుమార్ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు. లక్నోలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. లోక్సభలో పార్టీ నేతగా అమ్రోహ ఎంపీ దానిష్ అలీని నియమించారు. కాగా మాయావతి తన వారసుడిగా సోదరుడి కుమారుడు ఆకాష్ను ప్రోత్సహిస్తున్నారని బీఎస్పీ వర్గాలు పేర్కొన్నాయి. పలు పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొంటుండటం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. కాగా మాయావతి 2007-2014ల మధ్య యూపీ సీఎంగా వ్యవహరించిన సమయంలో ఆనంద్ కుమార్ ఆస్తులు గణనీయంగా పెరిగాయనే విమర్శల నేపథ్యంలో కొంతకాలం కుమార్ను పక్కనపెట్టిన మాయావతి తిరిగి ఆయన కుమారుడు, తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను ప్రోత్సహిస్తుండటం గమనార్హం. -
అఙ్ఞాతం వీడి కోర్టులో లొంగిపోయిన ఎంపీ!
లక్నో : అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్ శనివారం లొంగిపోయారు. అతుల్ రాయ్ మద్దతుదారులు, పార్టీ శ్రేణులు వెంటరాగా పోలీసులు ఆయనను వారణాసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా అతుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ కాలేజీ విద్యార్థిని ఆయనపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఘోసి నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ సంపాదించిన ఆయన మే1 నుంచి కనిపించకుండా పోయారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరుకున్న దశలో ఇలాంటి పరిణామం ఎదురుకావడంతో అతుల్ తరఫున పార్టీ శ్రేణులే ప్రచారం నిర్వహించాయి. ఇందులో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా ఆయనను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. బీజేపీ పన్నిన కుట్రలో అతుల్ ఇరుక్కున్నారని, ఆయనకు కచ్చితంగా ఓటు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో మే 23న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అతుల్ రాయ్ విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి కూడా అఙ్ఞాతంలో గడిపారు. అతుల్ మలేషియాలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఆయన అరెస్టుకై పోలీసులు కోర్టు అనుమతి కోరారు. అయితే తాను కోర్టులో ఎదుటే లొంగిపోతానంటూ అతుల్ విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ఎంపీగా ఎన్నికైన ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే లొంగిపోవడం గమనార్హం. -
‘ఈవీఎంలపై భేటీ అయితే ఓకే’
లక్నో : ఈవీఎంలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము తప్పక హాజరయ్యేవారమని బీఎస్పీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. పేదరికం వంటి మౌలిక సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెస్తోందని ఆరోపించారు. జమిలి ఎన్నికలతో పాటు మహాత్మ గాంధీ 150వ జయంతోత్సవ వేడుకలు వంటి పలు అంశాలపై చర్చించేందుకు బుధవారం ప్రధాని అధ్యక్షతన పలు రాజకీయ పార్టీల అధినేతలతో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలతో పూర్తిగా కనుమరుగైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాలెట్ పత్రాలతో కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అసలైన ముప్పుగా మాయావతి అభివర్ణించారు. ఈవీఎంల వంటి కీలక అంశంపై నేటి సమావేశం ఏర్పాటు చేస్తే తాను తప్పక హాజరయ్యేదాన్నని ఆమె స్పష్టం చేశారు. కాగా ఈ భేటీకి కాంగ్రెస్, ఆప్, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు గైర్హాజరయ్యాయి. -
గెలిచిన తర్వాత కరెంట్ షాక్లా..?
లక్నో : గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాలన్న యూపీ ప్రభుత్వ ప్రతిపాదన పట్ల బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయవతి మండిపడ్డారు. గృహ వినియోగదారులకు విద్యుత్ టారిఫ్లను పెంచేందుకు పవర్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలు దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారిపైనా విద్యుత్ చార్జీల భారం మోపాలన్న యూపీ ప్రభుత్వ ప్రతిపాదనను అందరూ ఖండించాలని అన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం యూపీలో 20 కోట్ల మందిపై విద్యుత్ భారాలను మోపాలని బీజేపీ భావిస్తోందా అని మాయావతి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, శాంతి భద్రతల పరిస్ధితి దారుణంగా తయారైందని ఆమె ఆరోపించారు. మహిళలకు భద్రత కరవైందని ఆందోళన వ్యక్తం చేసిన మాయావతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. -
కనుమరుగవుతున్న విపక్షాల కూటమి!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీల మధ్య లోక్సభ ఎన్నికలకు ముందున్న ఆ కాస్త ఐక్యత ఫలితాల అనంతరం క్రమంగా కనుమరుగవుతోంది. ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు రానున్న 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేస్తుండడం, ఈ విషయాన్ని బీఎస్పీ నాయకురాలు మాయావతి పత్రికా ముఖ్యంగా మరీ ప్రకటించడం తెల్సిందే. కలిసికట్టుగా పోటీ చేసినా అత్యధిక సీట్లను బీజేపీ తన్నుకుపోవడం నుంచి వచ్చిన నైరాశ్యంతో మాయావతి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. తెలంగాణాలో మళ్లీ బలపడే అవకాశం ఉందన్న కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుండడం, 18 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలకుగాను 12 మంది తమ పక్షాన్ని టీఆర్ఎస్లో చేర్చుకోవాల్సిందిగా కోరడం ప్రతిపక్షాలకు బాధాకరమైన పరిణామమే. బీజేపీ అధికారంకి రాకుండా ఉంచేందుకు కర్ణాటకలో ఏకమై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా పోయింది. తమ పక్షం నుంచి ఎప్పుడు ఎవరు జారుకుంటారో, ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అన్న ఆందోళన ఆ పార్టీల నాయకులను పట్టి పీడిస్తోంది. సాధారణ కేబినెట్ విస్తరణ చేయడానికే వారు భయపడి పోవడం, అప్పుడే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాల్సిందిగా పార్టీ కార్యకర్తలను స్వయాన ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పిలుపునివ్వడం పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రతిపక్షానికి సుదీర్ఘకాల వ్యూహం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని అర్థం అవుతోంది. ఎన్నికల ముందు తాత్కాలికంగా ఒక్కటై పోటీ చేయడం వల్ల తాత్కాలిక ఫలితాలు ఉండొచ్చేమోగానీ ఆశించిన ఫలితాలు మాత్రం ఎప్పటికీ రావు. అవి రావాలంటే ముందు, ఆ తర్వాత బలమైన ఐక్యతనే ప్రదర్శించాలి. అందుకు బలమైన సాక్ష్యం కూడా మొన్నటి తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక సీట్లను గెలుచుకోవడం. ఎన్నికల అనంతం కూడా డీఎంకే మిత్రపక్షాలు గట్టి ఐక్యతను చాటాయి. హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దవద్దని గట్టిగా నినదించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్’ వల్ల తమ రాష్ట్రం విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విషయంలో కూడా వారు ఐక్యతా బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు మొదట్లో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాడి పడేయకుండా బీజేపీకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టడానికి ప్రతిపక్షాలను ఎల్లప్పుడు ఏకతాటిపైకి తీసుకురావాలి, అందుకు ఎప్పుడూ కృషి చేయాల్సిందే. లేకపోతే ఆ పార్టీకి మనుగడే ఉండదు. -
మాయ, అఖిలేష్ల ఫెయిల్యూర్ స్టోరీ
సాక్షి, న్యూఢిల్లీ : మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఘట్బంధన్ విఫలమై విడిపోవడానికి కూడా అనన్ని కారణాలు ఉన్నాయి. 1. మాయావతి, అఖిలేష్ యాదవ్లు తమను తాము అధిక అంచనా వేసుకున్నారు. తమ పిలుపుమేరకు ఇరు పార్టీల కార్యకర్తలు కలసికట్టుగా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తమకే ఓటే వేస్తారని భావించారు. ఆ అంచనాలు తప్పాయి. పైగా కేంద్రంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ అభ్యర్థినవుతానని మాయావతి కలలుకనగా, అఖేలేష్ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చక్రం తిప్పొచ్చని భ్రమపడ్డారు. 2. యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ కార్యకర్తల ఓట్లు మాయావతి నాయకత్వంలోని బీఎస్పీకీ పడ్డాయి. అందుకే ఆమె పార్టీకి 10 సీట్లు వచ్చాయి. బీఎస్పీ సీట్లు ఎస్సీకి పడలేదు. అందుకే ఐదు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి 42.85 శాతం ఓట్లు వచ్చాయి. అవే ఓట్లు ఈసారి వచ్చినట్లయితే ఈ కూటమికి 41 నుంచి 43 సీట్లు రావాలి. ఈసారి ఓట్లు 38.92 శాతం ఓట్లు మాత్రమే రావడంతో కూటమి 15 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 3. బీఎస్పీ, ఎస్పీ కార్యకర్తలు కలిసికట్టుగా ఎన్నికల ర్యాలీలను నిర్వహించినా క్షేత్రస్థాయిలో వారు నిజంగా కలిసిపోలేదు. అందుకు యాదవులు, దళితుల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న వైషమ్యాలే కారణం. భూమి కోసం వీరి మధ్య వైరుధ్యాలు కొనసాగడమే కాకుండా సాంస్కతికంగా కూడా వీరు పడదు. 4. దళితులు బీజేపీకే ఓటు వేశారు. ఎస్పీ అభ్యర్థి పోటీ చేసిన చోటల్లా ఎక్కువ మంది దళితులు బీజేపీకి ఓటు వేశారు. 5. ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కూడా కూటమి ఓటమికి కారణమయ్యారు. ఆయన బీజేపీ మద్దతుతో ఈ ఎన్నికల్లో ఎస్పీకి వ్యతిరేకంగా పనిచేశారు. 6. ఫలితాల అనంతరం మాయావతి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫలితాలపై సమీక్ష జరిపారు. ఒంటరిగా వెళ్లి ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పార్టీ నాయకులు సూచించారు. అందుకు ముందు ప్రయోగాత్మకంగా రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి చూడాలని నిర్ణయానికి వచ్చారు. ఘట్బంధన్తో తాత్కాలికంగా తెగతెంపులు చేసుకుంటున్నామని ఆమె మీడియా ముఖంగా ప్రకటించారు. -
కొన్నిసార్లు అంతే.. !!
లక్నో: లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి ఘోరంగా విఫలమవ్వడంతో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. మిత్రపక్షమైన ఎస్పీకి కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నట్టు మాయావతి మంగళవారం ప్రకటించారు. అంతేకాకుండా యూపీలో త్వరలో 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించి.. అఖిలేశ్ యాదవ్కు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఏఎన్ఐ వార్తాసంస్థతో ముచ్చటించారు. యూపీలో పొత్తులు ఎందుకు వికటించాయో ఆయన విశ్లేషించారు. కొన్నిసార్లు ప్రయోగాలు విజయవంతం కాకపోయినప్పటికీ.. వాటి వల్ల మన బలహీనతలు ఏమిటో తెలుస్తాయని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. మాయావతి అంటే ఇప్పటికీ తనకు ఎనలేని గౌరవముందని తెలిపారు. పొత్తులు, ఎన్నికల్లో పోటీ అనేవి రాజకీయ అంశాలని, వీటిలో అందరికీ అన్ని మార్గాలు ఉంటాయని విశ్లేషించారు. ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే విషయమై పార్టీ నేతలతో చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. -
‘కాలం చెల్లిన పార్టీలవి.. ఇవే చివరి ఎన్నికలు’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఎస్పీ, బీఎస్పీలు కూటమి కట్టాయని, ఎన్నికలు ముగియడంతో కూటమి విచ్చిన్నమైందని లోక్జనశక్తి చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. 2020లోపు ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ పార్టీలు తలుపులు మూసుకోక తప్పదని, ఆ పార్టీలకు కాలం చెల్లిపోయిందని అభిప్రాయపడ్డారు. కుమ్ములాట కోసమే వారు కూటమి కట్టినట్లుందని, ప్రజాసంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు. యూపీ, బిహార్తో పాటు దేశ వ్యాప్తంగా కూడా విపక్షాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయని పాశ్వాన్ అన్నారు. ఆ పార్టీలకు ఇవే చివరి ఎన్నికలను జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్లో ఏర్పడిన ‘మహాఘఠ్ బంధన్’ చీలిపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికారం బీజేపీ ఎస్పీ,బీఎస్పీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. ఓట్ల కోసమే భూటకపు కూటమి కట్టారని ఆరోపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. యూపీ ఉప ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఒంటరిగా పోటీ చేయాలనుకున్నట్లు వెల్లడించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఎస్పీ,బీఎస్పీ కూటమికి బీటలు
-
ఒంటరి పోరు చేటెవరికి?
బీజేపీని, ప్రధాని మోదీని ఓడించాలన్న విపక్షాల ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో యూపీలో ఏర్పడిన ‘మహాగఠ్ బంధన్’లో లుకలుకలు మొదలయ్యాయి. ఆ కూటమి నేతలు ఇప్పుడు తలోదారి వెతుక్కునే పనిలో పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి మొత్తం 80 స్థానాలకు గాను 75 చోట్ల పోటీ చేసి కేవలం 15 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగాయి. దీంతో కూటమిలో ఉంటే అసలుకే ఎసరు వచ్చేలా ఉందని వెంటనే గ్రహించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తెగదెంపులకు సిద్ధపడగా ఎస్పీ కూడా సరేనంది. దీంతో త్వరలో యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు ఎవరికి వారుగానే బరిలో దిగడం ఖాయమైంది. ఎస్పీ–బీఎస్పీల మధ్య విభేదాలు లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై ఎస్పీ, బీఎస్పీ పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. ఎస్పీకి సంప్రదాయంగా మద్దతునిచ్చే యాదవులు, ముస్లింలు బీఎస్పీ అభ్యర్థులకు ఓటు వేశారని, కానీ బీఎస్పీకి పట్టున్న జాటవ్ సామాజికవర్గం ఓట్లు తమకు పడలేదని ఎస్పీ శిబిరం అంటోంది. ఎస్సీల్లో ఒక వర్గమైన జాటవ్లు ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసే శక్తి కలిగిన సామాజిక వర్గం. అయితే ఎస్పీ నిందిస్తున్నట్టుగా జరగలేదని ఆ పార్టీకి పట్టున్న కనోజ్, బదౌన్, ఫిరోజాబాద్లలో ఎస్పీ ఎందుకు ఓడిపోయిందని బీఎస్పీ ప్రశ్నిస్తోంది. జాటవ్ ఓట్లన్నీ ఎస్పీకి పడినా, యాదవులు, ముస్లిం ఓట్లు తమకు కాకుండా బీజేపీకే పోయాయని బీఎస్పీ వాదిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎస్పీ అసమ్మతి నేత, అఖిలేశ్ చిన్నాన్న శివపాల్ ఎస్పీకి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని బరిలోకి దింపడంతో బీజేపీకి లాభించిందని అనుమానిస్తున్నారు. మాయావతి వ్యూహం ఏమిటి? కూటమితో తీవ్రంగా నష్టపోయినట్టుగా భావిస్తున్న మాయావతి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం భాయ్చారా కమిటీలు (సౌభ్రాతృత్వ కమిటీలు) పునరుద్ధరించనున్నారు. వచ్చే ఉప ఎన్నికలతో పాటుగా, 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఎస్పీ కంటే బీఎస్పీకే సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా పెరిగింది. దీన్ని బట్టి బీఎస్పీ ఓట్లేవీ ఎస్పీకి పడలేదని అర్థం అవుతోంది. ఎస్పీ, ఆర్ఎల్డీ వంటి పార్టీలు యూపీకే ఎక్కువగా పరిమితం కాగా బీఎస్పీ పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బలంగా కూడా ఉంది. క్లిష్ట సమయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే రాజకీయ నాయకురాలైన మాయావతి కూటమికి ముందే గుడ్బై చెప్పారు. బీజేపీకి ఎంతవరకు లాభం? యూపీలో రాజకీయ పరిణామాలన్నీ అంతిమంగా బీజేపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయి. బీఎస్పీ, ఎస్పీ వంటి బలమైన ప్రాంతీయ పక్షాలు, చిరకాల ప్రత్యర్థులు చేతులు కలిపినా పై చేయి సాధించకపోవడానికి ఆ పార్టీల్లో అంతర్గత కలహాలే కారణమని భావిస్తున్నారు. ఎస్పీ కుటుంబ కలహాలతో చితికిపోయింది. ఎస్పీ, బీఎస్పీలది అవకాశవాద పొత్తు అంటూ బీజేపీ చేసిన ప్రచారం లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి చేకూరిస్తే, వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగితే అగ్రవర్ణాలు, యాదవేతర బీసీలు, జాటవేతర దళితులు ఒక బలమైన శక్తిగా రూపొందుతారు. దీంతో సమీప భవిష్యత్లో బీజేపీకి ఎదురు ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. -
మేము కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం : అఖిలేష్
లక్నో : రానున్న ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఒంటరిగా పోటీ చేస్తే.. తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి ఘోర విఫలమైన విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ ఆదేశాలను ఎస్పీ కేడర్ పాటించలేదని, ఆ పార్టీ నేతలు బీఎస్పీకి ఓట్లేయలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు బదిలీ కాలేదని తెలిపారు.మాయవతి ఆరోపణలపై అఖిలేష్ స్పందిస్తూ.. మహా గఠ్ బంధన్ విడిపోతే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్ చీఫ్ అఖిలేశ్యాదవ్ తెలిపారు. -
ఇది శాశ్వతంగా వీడిపోవడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నిమిత్తం ఉత్తరప్రదేశ్లో ఏర్పాటైన మహాకూటమికి గుడ్బై చెప్పినట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. రానున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని ఆమె వెల్లడించారు. సమాజ్వాదీ పార్టీ తమ సొంత ఓటు బ్యాంకును కూడా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో దక్కించుకోలేకపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు బదిలీ కాలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు ఒంటరిగా పోటీచేయడమే మంచిదని, సోమవారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సమాజ్వాదీ పార్టీ ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు పడలేదని ఆమె విశ్లేషించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది శాశ్వతంగా విడిపోవడం కాదని, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్తో రాజకీయాలకు అతీతంగా సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని వెల్లడించారు. అఖిలేష్, డింపుల్ దంపతులు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని, వారిని తన కుటుంబ సభ్యులుగా భావించానని చెప్పారు. -
అఖిలేశ్ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!
న్యూఢిల్లీ: త్వరలో యూపీలో జరగనున్న ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కూటమిలో ఉంటే గెలుస్తామనుకోవద్దని, ముందుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలిపారు. ఢిల్లీలో పార్టీ నేతలతో ఆమె మాట్లాడారు. ఇటీవలి ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ– ఆర్ఎల్డీ ‘మహా గఠ్ బంధన్’ సీట్లు సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాయా వ్యాఖ్యలతో మహాగఠ్బంధన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ‘ఎమ్మెల్యేలు, పార్టీ పదవుల్లో ఉన్న వారు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. కూటమితో పనిలేకుండా ఒంటరిగానే బరిలో నిలుస్తాం. రాష్ట్రంలో బీఎస్పీ సంప్రదాయ ఓటుబ్యాంకు ఉన్న 10 సీట్లను బీఎస్పీ గెలుచుకుంది. ఎస్పీ ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు’ అని వివరించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 9 మంది, బీఎస్పీ, ఎస్పీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు లోక్సభకు ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక అవసరమైంది. ములాయం కుటుంబీకులే గెలవలేదు యూపీలో బీఎస్పీ–ఎస్పీ– ఆర్ఎల్డీతో ఏర్పాటైన మహాగఠ్బంధన్ వృథాయేనని మాయావతి అన్నారు. ‘యాదవుల ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు. మన పార్టీ ఓట్లు వాళ్లకు పడ్డాయి. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గాల్లో ఎస్పీ గెలిచింది. యాదవుల ఓట్లు అఖిలేశ్ యాదవ్ కుటుంబీకులకు కూడా పడలేదు’ అని తెలిపారు. కూటమి లేకున్నా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్తో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎందుకంటే అతడు తండ్రి(ములాయం సింగ్ యాదవ్)లాంటి వాడు కాదు’ అని మాయ పేర్కొన్నారు. ‘అఖిలేశ్తో విభేదించిన అతడి బాబాయి శివ్పాల్యాదవ్, కాంగ్రెస్ కారణంగానే యాదవుల ఓట్లు చీలాయి. అఖిలేశ్ భార్య డింపుల్ను కూడా గెలిపించుకోలేకపోయాడు. అతని ఇద్దరు సోదరులూ ఓడారు. మనం ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేద్దాం’ అని తెలిపారు. సామాజిక న్యాయం కోసం కలిసి పోరాడతాం: అఖిలేశ్ సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్ చీఫ్ అఖిలేశ్యాదవ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు జరిగిన తీరు వేరేగా ఉందని, అది తనకు కూడా అర్థం కాలేదని తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో ఫెరారీ, సైకిల్ (ఎస్పీ ఎన్నికల గుర్తు) మధ్య పోటీ. ఫెరారీయే గెలుస్తుందని అందరికీ తెలుసు. అంశాల ప్రాతిపదికన కాకుండా వేరే రకంగా ఎన్నికలు జరిగాయి. టీవీలు, సెల్ఫోన్ల ద్వారా ప్రజలతో వాళ్లు(బీజేపీ)మైండ్ గేమ్ ఆడారు. అది నాకూ అర్థం కాలేదు’ అని పేర్కొన్నారు. ఆ యుద్ధ తంత్రం అర్థమైన రోజున తాము విజేతలుగా నిలుస్తామన్నారు. -
యూపీలో కూటమికి బీటలు..?
లక్నో : బీజేపీని ఓడించడం కోసం ఉత్తరప్రదేశ్లో ఎస్పీ - బీఎస్పీ మహా కూటమిగా ఏర్పడినా ఫలితాలు మాత్రం నిరాశ పర్చాయి. ఈ క్రమంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వల్లే ఇంత దారుణంగా ఓడిపోయామని విమర్శించారు. ఈ క్రమంలో మాయావతి కూటిమి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితాల అనంతరం పార్టీ నాయకులతో కలిసి.. సోమవారం ఓటమిపై సమీక్ష జరిపారు మాయావతి. ఈ ఓటమిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులకు యాదవుల ఓట్లు ఎక్కువగా పడలేదని ఆమె అభిప్రాయపడ్డారు. యాదవుల ఓట్లను ఆకర్షించడంలో అఖిలేశ్ దారుణంగా విఫలమయ్యారని.. ఆఖరికి ఆయన భార్య డింపుల్ యాదవ్ను కూడా గెలిపించుకోలేకపోయారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని మాయావతి తన పార్టీ నాయకుల ముందు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమిలో చేరకపోతే.. బీఎస్పీ మరో 5 సీట్లు ఎక్కువ గెలుచుకునేదని ఆమె అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో రానున్న ఎమ్మెల్యే ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి 15 స్థానాల్లో విజయం సాధించగా.. వీటిలో బీఎస్పీ 10 స్థానాల్లో గెలుపొందింది. -
బాబు ప్రయాణం.. మాయావతి టూ గవర్నర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో చక్రం తిప్పుతానని దేశరాజధానిలో తెగహల్చల్ చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. సొంత రాష్ట్రంలో ఘోర ఓటమిని చవిచూశారు. అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనానికి కొట్టుకుపోయిన టీడీపీ.. లోక్సభలో అయితే ఖాతా తెరిచే పరిస్థితి కూడా లేదు. 25 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే ఒకటి గెలిచిన వైఎస్సార్సీపీ మరో 24 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో కేంద్రంలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబుకు పార్లమెంట్లో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు బీజేపీయేతర పార్టీలను ఏకతాటికి తెస్తానని పలు ప్రాంతీయ పార్టీల ఇళ్ల చుట్టు ప్రదిక్షణలు చేసిన చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే గట్టి షాక్ తగిలింది. దీంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు నాయుడి ప్రయాణం మాయావతి సమావేశంతో ప్రారంభమై.. సోనియాగాంధీ, దేవగౌడ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇళ్ల మీదుగా.. చివరకు ఈ రోజు సాయంత్రం గవర్నర్తో సమావేశంలో రాజీనామా లేఖ సమర్పించడంతో ముగిసిందని సెటైరిక్గా ట్వీట్ చేస్తున్నారు. మహా కూటమికి మహా ఓటమి అనే మీమ్స్ను ట్రెండ్ చేస్తున్నారు. At first Chandrababu Naidu met Mayawati, Then Sonia Gandhi, Deve Gowda, Mamata Banerjee, Arvind Kejriwal Today evening, he'll finally meet the Governor And submit his resignation The story ends here — Chowkidar~S.K.J (@sidjswl) May 23, 2019 -
ఎగ్జిట్ పోల్స్ ,మారుతున్న రాజకీయ పరిణామాలు
-
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్; లక్నోలోనే మాయావతి
న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో విపక్షాలు డీలాపడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడితో హస్తినలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలతో నేడు ఢిల్లీలో జరగాల్సిన భేటిని బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు. మాయావతి ఈరోజు ఢిల్లీకి రావడం లేదని, లక్నోలోనే ఉంటారని బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా తెలిపారు. మరోవైపు శనివారం లక్నోలో మాయావతితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. ఈరోజు కూడా ఢిల్లీలో మాయావతిని ఆయన కలవనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే మాయావతి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడంతో చంద్రబాబు హస్తిన పర్యటన కూడా సందిగ్ధంలో పడినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి గరిష్టంగా 57 స్థానాల వరకు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహాకూటమికి 40 సీట్లు దాకా వచ్చే అవకాశముందని తెలిపాయి. కాంగ్రెస్కు రెండు సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అత్యాచార కేసు; ఆయనను గెలిపించాల్సిందే!
లక్నో : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో బీఎస్పీకి చెందిన ఎంపీ అభ్యర్థి అతుల్ రాయ్ మిస్సయ్యారు. తనపై అత్యాచార కేసు నమోదైన నాటి నుంచి ఆయన అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలే ఆయన తరఫున ప్రచార సభలు నిర్వహిస్తూ.. అతుల్ రాయ్ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యూపీలో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ కూటమి సీట్ల పంపకంలో భాగంగా ఘోసి నియోకవర్గ ఎంపీ టికెట్ను బీఎస్పీ నేత అతుల్ రాయ్ దక్కించుకున్నారు. అయితే అతుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ కాలేజీ విద్యార్థిని ఆయనపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మే1 నుంచి అతుల్ కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో అతుల్ తరఫున పార్టీ శ్రేణులే ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నాటి కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. అతుల్ రాయ్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కార్యకర్తకు ఉందన్నారు. బీజేపీ పన్నిన కుట్రలో అతుల్ ఇరుక్కున్నారని, ఆయనకు కచ్చితంగా ఓటు వేయాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. కాగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అతుల్ మలేషియాకు పారిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక మే 23 వరకు అతుల్ అరెస్టును వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అతడి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మే 17న అతుల్ అభ్యర్థనపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది. కాగా సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్లో భాగంగా ఘోసిలో మే 19న ఎన్నికలు జరుగున్ను సంగతి తెలిసిందే. -
ప్రధానిగా మోదీ అనర్హుడు
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీపై బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. తాను యూపీ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోలేదని, మోదీ హయాంలో మాత్రం నిత్యం హింస చెలరేగుతోందని ఆరోపించారు. ప్రధాని పదవిలో కొనసాగేందుకు మోదీ ఏమాత్రం అర్హుడు కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా వ్యవహరించిన సమయంలో చోటుచేసుకున్న ఘటనలు బీజేపీకి, దేశానికి మాయని మచ్చ వంటివని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం దీటుగా వ్యవహరించిందని, అదే సమయంలో నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా, గుజరాత్ సీఎంగా అసమర్ధ వైఖరితో వ్యవహరించారని ఆరోపించారు. మోదీ హయామంతా హింస చెలరేగిందని, ఆయన అత్యున్నత పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని మాయావతి మండిపడ్డారు. కాషాయపార్టీ అవినీతి నేతలతో నిండిపోయిందని దుయ్యబట్టారు. కాగా, మాయావతి యూపీ ముఖ్యమంత్రిగా 1995-97 మధ్య తిరిగి 2002-03, 2007-12 వరకూ నాలుగు సార్లు పనిచేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికల తుదివిడత పోరులో భాగంగా యూపీలోని మిగిలిన 13 స్ధానాలకు ఈనెల 19న పోలింగ్ జరగనుంది. ఏడు దశల పోలింగ్ అనంతరం ఈనెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. -
భార్యను వదిలేసినోడు.. చెల్లెళ్లను గౌరవిస్తాడా?
గోరఖ్పూర్: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అమాయకురాలైన భార్య జశోదాబెన్ను మోదీ వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీలోని మహిళా నేతలు కూడా మోదీలా తమ భర్తలు తమను వదిలేస్తారేమో అని కలవరపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సెకనుకో కులం మార్చుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాబట్టి మోదీలాంటి వ్యక్తికి ఓటేయవద్దని దేశంలోని మహిళలందరికీ విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాయావతి ప్రధానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ మహిళా నేతలకు భయం రాజస్తాన్లోని ఆళ్వార్లో దళిత మహిళపై అత్యాచారం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న మోదీ డిమాండ్పై మాయావతి స్పందిస్తూ.. ‘ఈ విషయంలో మోదీ నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత భార్యనే వదిలేసిన వ్యక్తి ఇతరుల చెల్లెళ్లు, భార్యలను ఎలా గౌరవిస్తాడు? ఇటీవల నాకు ఓ కొత్త విషయం తెలిసింది. తమ భర్తలు మోదీకి సమీపంగా ఉండటం చూసి బీజేపీ మహిళా నేతలే ఆందోళనకు గురవుతున్నారట! వాళ్లంతా మోదీలాగే తమను వదిలేస్తారని భయపడుతున్నారట. మోదీ హయాంలో గుజరాత్లో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై తీవ్రమైన దాడులు జరిగాయి. కాబట్టి ఆళ్వార్ ఘటనపై మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదు’ అని స్పష్టం చేశారు. మోదీని తప్పించేవరకూ ఎస్పీ–బీఎస్పీ పొత్తు దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు. మాయావతి క్షమాపణ చెప్పాలి: బీజేపీ మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన మాయావతి క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాయావతి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల వివరాలను సీతారామన్ మీడియా ముందు ప్రదర్శించారు. ‘దళిత హక్కుల సాధన కోసం బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి.. దళిత్ బేటీ(దళిత కులం యువతి) స్థాయి నుంచి దౌలత్కీ బేటీ(ధనికురాలైన మహిళ)గా మారారు’ అని దుయ్యబట్టారు. మోదీపై విమర్శలతో మాయావతి తన స్థాయిని దిగజార్చుకున్నారనీ, ఆమె ప్రజాజీవితానికి అనర్హురాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. -
మాయావతిపై విరుచుకుపడ్డ అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నా రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాయావతి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగిన మాయావతి ప్రజా జీవితానికి అనర్హురాలని జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు జైట్లీ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా మోదీని చూసి బీజేపీ మహిళా నేతలు వణుకుతున్నారంటూ మాయావతి విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తన భార్యకు దూరంగా ఉంటున్న ప్రధాని మోదీ...తమ భర్తల నుంచి ఎక్కడ దూరం చేస్తారేమోనని అని బీజేపీ మహిళా నేతలు భయపడుతున్నారని మోదీపై ఆమె వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం విదితమే. కాగా దళిత మహిళకు జరిగిన అన్యాయంపై స్పందించని మోదీ.. పార్టీలోని మహిళా నేతలకు ఎలా గౌరవం ఇస్తారని మాయావతి ప్రశ్నలు సంధించారు. మోదీ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలు చేస్తుందని, రాజకీయాల్లో లబ్ధి పొందేందుకే అల్వార్ ఘటనపై మోదీ స్పందించడం లేదని మాయావతి పేర్కొన్నారు. మరోవైపు నరేంద్ర మోదీ కూడా మాయవతిపై విరుచుకుపడ్డారు. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాయావతి మద్దతు ఉపసంహరించుకోవాలని ప్రధాని సవాల్ విసిరారు. ఇక అల్వార్ గ్యాంగ్రేప్ ఘటనపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాజస్తాన్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ, అత్యాచార ఘటనను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనకు కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని అన్నారు. కాగా భర్తతో కలిసి ప్రయాణం చేస్తున్న ఓ దళిత మహిళపై గత నెల 26న అయిదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి...దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. -
మోదీపై మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో విమర్శలు ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. నాయకులు రాజకీయ విమర్శలు దాటి.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో పార్టీలన్ని ఒక దాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో బీఎస్పీ అధ్యక్షురాలు.. మాయావతి ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం మోదీ తన భార్యను వదిలేశాడు.. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న మహిళా నేతలు తమకు కూడా ఇదే గతి పడుతుందేమేనని భయపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్వార్ గ్యాంగ్రేప్ సంఘటనపై మోదీ ఇంతవరకూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో మాయావతి మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ‘బీజేపీలో ఉన్న మహిళా నేతలు.. మోదీ, తమ భర్తలను కలవకూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాల కోసం మోదీ తన భార్యను వదిలేశాడు. అలాంటి వ్యక్తి తమ భర్తలను కలిస్తే.. వారికి కూడా అదే సలహా ఇస్తాడేమో అని పాపం వారంతా భయపడుతున్నారు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘ఆల్వార్ గ్యాంగ్ రేప్ సంఘటనపై మోదీ ఇంతవరకూ స్పందించలేదు. ఈ విషయంలో ఆయన చెత్త రాజకీయాలు చేసి.. ప్రయోజనం పొందాలని భావిస్తున్నారు. అయినా భార్యను వదిలేసిన వ్యక్తి ఇతరుల అక్కాచెల్లళ్లను, భార్యలను ఎలా గౌరవిస్తాడ’ని ఆమె ప్రశ్నించారు. అంతేకాక ఈ ఎన్నికల్లో దళితుల ఓట్లు కోసం.. మోదీ వారిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మాయావతి ఆరోపించారు. కానీ దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన దాడులను వారు మర్చిపోరన్నారు. వేముల రోహిత్, షహరాన్పూర్ సంఘటనను దళితులు మర్చిపోరు.. మోదీని క్షమించరని మాయావతి స్పష్టం చేశారు. అయితే మాయావతి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఒడిషా పూరి బీజేపీ అభ్యర్థి సంబీత్ పాత్ర మాట్లాడుతూ.. ‘మాయావతి వ్యాఖ్యలను టీవీల్లో చూశాను. మోదీని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆమె మనస్తత్వం ఎలాంటిదో అర్థం కావడం లేదు. ఎందుకంటే మోదీ తన కుటుంబాన్ని సైతం కాదనుకుని.. దేశాన్నే తన ఇల్లుగా భావిస్తున్నారు. మాయావతి జీ.. మీకు మీ సోదరుడే ఎక్కువ కావచ్చు.. కానీ మోదీకి దేశమే ఎక్కువ’ అంటూ మండిపడ్డారు. -
మోదీ, మాయా మాటల యుద్ధం
కుషీనగర్/డియోరియా/లక్నో (యూపీ)/ఖాండ్వా (మధ్యప్రదేశ్): రాజస్తాన్లోని అల్వార్లో గ్యాంగ్రేప్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య ఆదివారం మాటల తూటాలు పేలాయి. మాయా మొసలికన్నీరు కారుస్తున్నారని మోదీ విమర్శిస్తే, చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధానిపై మాయావతి విరుచుకుపడ్డారు. ఈ విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజస్తాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని మోదీ సవాల్ విసిరితే.. దళితులపై గతంలో జరిగిన అత్యాచారాలకు నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. రాజస్తాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఏప్రిల్ 26న మోటార్సైకిల్పై వెళ్తున్న దంపతుల్ని అటకాయించిన దుండగులు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి భర్తను కొట్టి అతని కళ్ల ముందే భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణంపై ఆలస్యంగా ఈ నెల 2న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దళిత మహిళ భర్త ఆరోపించాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతివ్వకండి ఈ నేపథ్యంలో ఆదివారం ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్, డియోరియాల్లో ఎన్నికల సభల్లో మాట్లాడిన మోదీ.. బీఎస్పీ అధినేత్రిపై, రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దళిత మహిళకు జరిగిన అన్యాయంపై ‘అయ్యిందేదో అయ్యింది..’ అన్నట్టుగా పార్టీ తీరు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసును నీరుగార్చాలని చూస్తోందని అన్నారు. ‘ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ల కల్తీ కూటమి ఎలా పని చేస్తోందో చెప్పడానికి రాజస్తాన్ ఒక ఉదాహరణ, లక్నో గెస్ట్హౌస్ ఘటన (1995లో మాయావతిపై ఎస్పీ కార్యకర్తల దాడి) జరిగినప్పుడు యావత్ దేశం బాధపడింది. ఇప్పుడు మీకలాంటి బాధ కలగకపోవడాని కారణమేంటి? ఇప్పుడొక దళిత మహిళ లైంగిక దాడికి గురైంది. ఆడపడుచుల ఆత్మగౌరవంపై మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తూ రాజస్తాన్ గవర్నర్కు లేఖ రాయండి..’ అని విపక్షాలను డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనల జారీకే పరిమితమవుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. కానీ అవినీతి, ధరల పెరుగుదల, సిక్కుల ఊచకోత ఏదైనా సరే జరిగిందేదో జరిగింది అన్నట్టుగా కాంగ్రెస్ తీరు ఉందని దుయ్యబట్టారు. ప్రజలు సమర్ధవంతమైన, నిజాయితీ ప్రభుత్వానికి ఓట్లు వేస్తున్నారని, ఈ ఎన్నికల్లో విపక్షాలు మట్టి కరవడం ఖాయమని మోదీ అన్నారు. మోదీ రాజీనామా చేయాలి: మాయా దళిత మహిళ గ్యాంగ్రేప్ ఘటన నేపథ్యంలో ప్రధాని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాయావతి విమర్శించారు. ఈ కేసులో కఠినమైన, చట్టపరంగా సరైన చర్యలు తీసుకోనిపక్షంలో త్వరలోనే తగిన రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు బీఎస్పీ సిద్ధమని తెలిపారు. ఈ మేరకు లక్నోలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఊన, రోహిత్ వేముల వంటి దళితులపై గతంలో జరిగిన అనేక దాడులు, అత్యాచారాలను ప్రస్తావిస్తూ.. వీటికి మోదీ నైతిక బాధ్యత వహించాలని, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం బాధిత మహిళ కుటుంబాన్ని భయపెట్టి అక్కడ ఎన్నికలు పూర్తయ్యే వరకు విషయం వెలుగులోకి రాకుండా చూసిందని మాయావతి శనివారం ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత మహిళకుతగిన న్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సుప్రీంకోర్టును కోరుతున్నామన్నారు. -
మాయావతికి మోదీ చురకలు..!
లక్నో : బీఎస్పీ చీఫ్ మాయావతికి ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటించారు. ఆళ్వార్ గ్యాంగ్రేప్పై మాయావతి మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, మహిళలకు రక్షణ లేదంటూ స్పీచ్లు దంచికొడుతున్న బీఎస్పీ అధినేత రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ఓ పక్క అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి మద్దతునిస్తూ.. మరోపక్క కాంగ్రెస్పై విమర్శలు చేయడం మాయావతికే చెల్లిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని కుశినగర్, డియోరాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ చీఫ్ తరచూ న్యాయ్, న్యాయ్, న్యాయ్ అంటూ స్మరిస్తారని, మరి పట్టపగలే మహిళపై అత్యాచారం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జరిగిందేదో జరిగిపోయిందనే తీరుగా రాజస్తాన్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. (చదవండి : భర్త కళ్లెదుటే దారుణం..!) కాగా, గత నెల 26న భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న ఓ దళిత మహిళపై ఐదుగురు కామాందులు దాడి చేసి అకృత్యానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులను బెదిరింపులకు గురిచేస్తోందని మాయావతి శనివారం విమర్శించారు. ఆళ్వార్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగనుండటంతో నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దళితులు అయినందునే న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కలగజేసుకుని కేసును విచారించాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
నాది పేదల కులం
సోనెభద్ర: దేశంలోని నిరుపేద ప్రజలందరిది ఏ కులమో అదే తన కులమని ప్రధాని మోదీ తెలిపారు. నిఘా వ్యవస్థలను బలహీన పరిచే దుష్ట కూటమి సంకీర్ణ ప్రభుత్వాలకు అధికారం ఇవ్వరాదని ఆయన కోరారు. శనివారం ప్రధాని ఉత్తరప్రదేశ్లోని సోనెభద్ర, ఘాజీపూర్లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ కులస్తుడంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేయడంపై ఈ సందర్భంగా మోదీ స్పందించారు. ‘వారంతా కొత్తగా నా కులం విషయం తెరపైకి తెచ్చారు. పేదలందరిదీ ఏ కులమో, మోదీది కూడా అదే కులమని వారికి చెప్పాలనుకుంటున్నా’అని అంటూ పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వివరించారు. దుష్ట కూటమితో దేశం బలహీనం గతంలో సమాజ్వాదీ పార్టీతో కూడిన సంకీర్ణం హయాంలో నిఘా వ్యవస్థలు నష్టపోయాయన్న ప్రధాని..‘దుష్టకూటమి ప్రభుత్వ హయాంలో దేశ భద్రత ప్రమాదంలో పడింది. నిఘా వ్యవస్థలు బలహీనపడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వాల తప్పిదాలను సరిదిద్దే చర్యల్లో భాగంగా బీజేపీ నేతృత్వంలోని వాజ్పేయి ప్రభుత్వం 1998లో సరిగ్గా ఇదే రోజు పోఖ్రాన్లో విజయవంతంగా అణు పరీక్ష జరిపింది’అని గుర్తు చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని మన్మోహన్ సర్కారును బలహీన, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రభుత్వం వల్ల దేశానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. ఇలాంటి దుష్టకూటమి ప్రభుత్వాలకు మద్దతు పలకవద్దని ఆయన ప్రజలను కోరారు. వారంతా కలిసి గతంలో ఉత్తరప్రదేశ్ను ధ్వంసం చేశారు. ఇప్పుడు తమను తాము నాశనం కాకుండా కాపాడుకునేందుకు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఏకమయ్యాయి’అని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో వైమానిక బలగాలు సరిహద్దులు దాటి బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపాయని తెలిపారు. కాంగ్రెస్ది అహంకారం కాంగ్రెస్ హయాంలో 1984లో సిక్కుల ఊచకోతపై ఆ పార్టీ నేత శామ్ పిట్రోడా ‘అప్పుడు అలా జరిగింది, అయితే ఏంటి?’ అనడంపై ప్రధాని స్పందిస్తూ...‘ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిని, మనస్తత్వాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఎన్ని కుంభకోణాలు జరిగినా వారిలో పశ్చాత్తాపం లేదు. కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణికి ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు. దళిత మహిళకు కాంగ్రెస్ ‘అన్యాయం’ రాజస్తాన్లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరగ్గా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విషయం బయటకు పొక్కకుండా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెడుతోందని ప్రధాని ఆరోపించారు. ఏప్రిల్ 26వ తేదీన ఈ ఘటన జరిగిందంటూ 30వ తేదీన బాధితురాలి భర్త ఫిర్యాదు చేసినప్పటికీ తీరిగ్గా మే 7వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్నందునే ఇంత జాప్యం చేశారని విమర్శించారు. అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం అమలు చేస్తామంటూ కాంగ్రెస్ చెప్పుకుంటుండగా..అక్కడి ఆ పార్టీ ప్రభుత్వం మాత్రం దళిత మహిళకు అన్యాయం చేసిందని ఆరోపించారు. -
ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుందా..!
లక్నో : రాజస్థాన్లోని ఆళ్వార్ జిల్లాలో ఏప్రిల్ 26న దళిత మహిళపై జరిగిన అత్యాచార ఘటనను అణచివేసేందుకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. ఐదుగురు కీచకులు ఓ మహిళపై అకృత్యానికి పాల్పడితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధిత కుంటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ నిందితులను వెనకేసుకొస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధితురాలికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, ఘటన వివరాలను సుమోటాగా స్వీకరించి సుప్రీం కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. (చదవండి : భర్త కళ్లెదుటే దారుణం..!) ఇక రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికలు జరుగుతుండగా.. మరోపక్క పట్టపగలే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. ఎన్నికల కమిషన్కు ఇవేవీ కనిపించవా అని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం ఈసీని ప్రశ్నించారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా అసభ్యంగా మాట్లాడే పొలిటీషన్స్ వ్యాఖ్యల్ని సుమోటాగా స్వీకరించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అంబేద్కర్ పేరుతో పుట్టుకొచ్చిన కొన్ని సేవా సంస్థలు కాంగ్రెస్, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని, అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని బీఎస్పీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. -
‘ఆ వ్యాఖ్యలు హాస్యాస్పదం..అవివేకం’
లక్నో : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు ఉపయోగిస్తున్న భాష చూస్తుంటే వారికి ఓటమి భయం పట్టుకున్న విషయం అర్థమవుతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఓడిపోతామని తెలిసే అర్థం పర్థంలేని ఆరోపణలు చేసి నవ్వులపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. రెండోసారి ప్రధాని కావాలనుకుంటున్న నరేంద్ర మోదీ కలలు ఎప్పటికీ నెరవేరవని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఒకప్పుడు బద్ధ శత్రువులైన ఎస్పీ-బీఎస్పీ ఈ లోక్సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమి కులప్రాతిపదికన ఏర్పడినది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ విమర్శలపై మాయావతి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ మా కూటమి కులం ఆధారంగా ఏర్పడిందనటం, కుల రాజకీయాలు చేస్తుందనడం హాస్యాస్పదం. అవివేకం. అపరిపక్వతకు నిదర్శనం. పుట్టుకతోనే నరేంద్ర మోదీ వెనుకబడిన కులానికి చెందిన వారు కాదు. కులం పేరిట జరిగే ఏ బాధను ఆయన అనుభవించలేదు. అలాంటి వ్యక్తి మా కూటమి గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఒకవేళ మోదీ నిజంగా వెనుకబడిన కులానికి చెందిన వారే అయితే ఆరెస్సెస్ ఆయనను ప్రధాని కానివ్వకపోయేది. కళ్యాణ్ సింగ్ వంటి నేతలను ఆరెస్సెస్ ఏం చేసిందో మనందరికీ తెలిసిందే కదా’ అని పేర్కొన్నారు. ఇలాంటి అనవసరపు విమర్శలు చేసే బదులు తన సొంత రాష్ట్రం గుజరాత్లో దళితుల పరిస్థితి ఎలా ఉందో ఓసారి తెలుసుకుంటే మంచిదని మోదీకి హితవు పలికారు. గుజరాత్లో దళితులపై అత్యాచారాలు పెచ్చుమీరాయని.. వీటి గురించి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. -
కేజ్రీవాల్కు మద్దతుగా మాయా, అఖిలేష్
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో కూటమిగా పోటీచేస్తున్న ఎస్పీ-బీఎస్పీ పార్టీలు జాతీయ స్థాయిలో కూడా తమ ఓటు బ్యాంక్ను చీలకుండా పథకాలు రచిస్తున్నాయి. కొన్ని స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తూ.. మరికొన్ని చోట్ల భావసారూప్యత కలిగిన పార్టీలకు మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలో రెండు చోట్ల అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. మిగతా స్థానాల్లో బీఎస్పీకి తాము మద్దతు ఇవ్వనున్నట్టు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాము బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు ఎస్పీ ఢిల్లీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ యాదవ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి విజయం కోసం ఉమ్మడిగా పనిచేస్తామని తెలిపారు. న్యూఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ స్థానాల్లో మేము ఆప్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని యాదవ్ తెలిపారు. అక్కడ బీఎస్పీ అభ్యర్థులను పోటీలో ఉంచకూడదని ఆ పార్టీ నిర్ణయించినందున ఆప్ గెలుపుకోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. బీఎస్పీ తరపున సంజయ్ గెహ్లాట్ (ఈస్ట్ ఢిల్లీ), రాజ్వీర్ సింగ్ (నార్త్ ఈస్ట్ ఢిల్లీ), సీతా శరణ్ (వెస్ట్ ఢిల్లీ), షాహీద్ అలీ (చాందినీ చౌక్), సిద్ధాంత గౌతమ్ (సౌత్ ఢిల్లీ) పోటీచేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని మొదటి నుంచి వార్తలు వినిపించినా.. చివరుకు రెండు పార్టీలు ఒంటరిగానే బరిలో నిలవాలని నిర్ణయించాయి. విపక్షాలు విడివిడిగా పోటీకి దిగడంతో విజయంపై బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్నాథ్ సింగ్
-
మమల్ని ఎవరూ విడదీయలేరు: మాయావతి
లక్నో: ఐదో విడత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేవలం అధికారం కోసమే చిరకాల ప్రత్యర్థులపై ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తున్నాయని, మహాకల్తీ కూటమి త్వరలో చీలిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై బీఎస్పీ సుప్రీం మాయావతి అదేరీతిలో స్పందించారు. యూపీలో తమ కూటమిని ఎవ్వరూ విడదీయలేరని, మతతత్వ బీజేపీని ఓడించడమే తమ అంతిమ లక్ష్యమని తేల్చిచెప్పారు. తమ కూటమికి యూపీ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, మే 23 తరువాత మోదీ పదవి నుంచి దిగిపోవడం తప్పదని మాయావతి జోస్యం చెప్పారు. ఎన్నికల్లో గెలవడం కోసం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోందని మాయా ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని బస్తి, ప్రతాప్గఢ్, బిహార్లోని వాల్మీకినగర్లో శనివారం మోదీ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎనిమిది సీట్లకు పోటీ చేస్తున్నవారు కూడా ప్రధానిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారని మోదీ వ్యంగ్యంగా విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా సమష్టి పోరాటం చేస్తున్న మహాకల్తీ కూటమి బంధం ఎంతోకాలం సాగదని మోదీ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. మహా కూటమి మహా అవినీతిని పెంచి పోషిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ‘ఓటు కాట్వా’(ఓట్ల కోత) స్థాయికి దిగజారిపోయిందని, త్వరలోనే అది తన పతనాన్ని చూస్తుందని అన్నారు. ఒకపక్క కాంగ్రెస్తో ఎస్పీ మెతగ్గా వ్యవహరిస్తుంటే మరోపక్క బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్పై దాడి చేయడం గమనార్హమన్నారు. -
అఖిలేశ్తో బూట్లు విప్పించారు!
లక్నో: ‘ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమిలో అఖిలేశ్ యాదవ్కు తగిన ప్రాధాన్యమే లేదు. కూటమి అధిపతిగా మొత్తం మాయావతే చక్రం తిప్పుతున్నారు. వేదిక మీద కలిసి కూర్చునే సమయంలోనూ మాయవతికి పెద్ద కూర్చీ వేస్తుండగా అఖిలేశ్ను చిన్న కూర్చీలో కూర్చోబెడుతున్నారు. ఇక, మాయావతిని కలిసేందుకు వెళితే.. బూట్లూ విప్పాకే లోపలికి రావాలంటూ అఖిలేశ్కు చెప్తున్నారు. ఇది కూటమిలో ఆయన పోజిషన్’ అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ చేతులు కలిపి కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కూటమిలో అఖిలేశ్కు తగిన పట్టు లేదని, చివరికీ మాయావతిని కలిసేందుకు వెళ్లినా.. ఆయనతో బూట్లు విపిస్తున్నారని తాజాగా ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన యోగి విమర్శించారు. కూటమిలో సీట్ల పంపకాల విషయంలోనూ ఎస్పీ సుప్రీం ములాయంసింగ్ యాదవ్ కూడా అసంతృప్తితో ఉన్న విషయాన్ని యోగి ప్రస్తావించారు. బీఎస్పీ కన్నా ఎస్పీకి ఎక్కువ సీట్లు దక్కాల్సి ఉండేదని, కానీ, సీట్ల పంపకాల్లో తన కొడుకుకు మాయావతి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ములాయం మండిపడుతున్నారని యోగి చెప్పుకొచ్చారు. -
మసూద్నూ వదలరా..?
సాక్షి,న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించిన నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు ఈ చర్యను స్వాగతిస్తుండగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఈ అంశాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రచార అస్త్రంగా మలుచుకున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో బీజేపీ ప్రభుత్వం మసూద్ అజర్ను విడుదల చేసి అతిధి మర్యాదలతో విదేశాల్లో అప్పగించిందని, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మసూద్ పేరును వాడుకుంటోందని దుయ్యబట్టారు. కాషాయపార్టీ తీరు తీవ్ర అభ్యంతరకరమని మాయావతి ఆక్షేపించారు. కాగా, కాందహార్లో ఎయిర్ఇండియా విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన క్రమంలో వారి డిమాండ్కు తలొగ్గిన అప్పటి అటల్ బిహారి వాజ్పేయి ప్రభుత్వం మసూద్ అజర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మసూద్ అజర్ను విడుదల చేయడాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా విపక్షాలు ఇటీవల విమర్శలు గుప్పించారు. అప్పటి అటల్ బిహారి వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి ఫలితంగానే పుల్వామా దాడి సహా జైషే మహ్మద్ ఉగ్ర మూకలు చెలరేగుతున్నాయని విపక్షాలు వ్యాఖ్యానించాయి. -
‘నమో’ జపానికి ఈ ఎన్నికలే ఆఖరు
కన్నౌజ్: ‘నమో నమో’అని జపించే వారికి ఇవే ఆఖరి ఎన్నికలని, ఈ లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో మోదీ పేరు వినపడదని బహుజన సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ ఎన్నికల్లో తమ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్తో కలిసి కన్నౌజ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి అఖిలేష్ సతీమణి డింపుల్ ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. డింపుల్ను తన కోడలిగా సంబోధించిన మాయావతి.. ఆమెను మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఉత్తరప్రదేశ్లో తమ కూటమి దేశానికి కొత్త ప్రధానిని అందిస్తుందని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశాలు అంటే బీజేపీకి భయమని.. అందుకే మోదీసహా ఆ పార్టీ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరుకాకుండా పారిపోతున్నారన్నారు. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వారు ఇలా తప్పించుకు తిరుగుతారని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ పేరును ‘భాగ్తీ జనతా పార్టీ’గా మార్చాలని తెలుపుతూ ట్వీట్ చేశారు. మాయావతి సభ ముందు ఎద్దు వెంటపడటంతో తప్పించుకోబోయి పడిపోయిన పోలీస్ -
‘దేశానికి ప్రధానిని అందిస్తాం’
లక్నో : లోక్సభ ఎన్నికల అనంతరం ఎస్పీ-బీఎస్పీ కూటమి దేశానికి తదుపరి ప్రధానిని అందిస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెప్పారు. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు తాము బీఎస్పీతో జట్టుకట్టామని వెల్లడించారు. యూపీలోని కన్నౌజ్లో గురువారం జరిగిన ప్రచార ర్యాలీలో బీఎస్పీ చీఫ్ మాయావతితో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు. కాగా ఇదే వేదికపై నుంచి మాయావతి ప్రసంగించేందుకు ముందు అఖిలేష్ భార్య, కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్న డింపుల్ యాదవ్ మాయావతి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కాగా ఏప్రిల్ 29న సహరన్పూర్, ఖేరి, హర్దోయ్, మిశ్రిఖ్, ఉన్నావ్, ఫరక్కాబాద్, ఇటావా, కాన్పూర్, అక్బర్పూర్, జలన్, ఝాన్సీ, హమీర్పూర్ స్ధానాలతో పాటు కన్నౌజ్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కీలకమైన యూపీలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకునేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమి, బీజేపీలు పోటీపడుతుండగా, ప్రియాంక ఎంట్రీతో తమ విజయావకాశాలు మెరుగయ్యాయని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
బీఎస్పీ ‘రైజింగ్ స్టార్’..
ఉత్తరప్రదేశ్లో ‘ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ మద్దతుదారులందరూ చేతులు కలిపి మహాగఠ్ బంధన్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి. మాయావతి ప్రచారంపై ఎన్నికల సంఘం విధించిన నిషేధానికి ఇదే ‘తగిన స్పందన’ అవుతుంది’ అంటూ మాయావతి పార్టీలో ‘రైజింగ్ స్టార్’ ఆకాష్ ఆనంద్ ఇటీవల ఆగ్రా ఎన్నికల ప్రచారసభలో తొలి ప్రసంగం చేశారు. ఆయన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత మాయావతికి స్యయానా మేనల్లుడు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కొడుకు. కొన్నేళ్ల క్రితం తన రాజకీయ వారసుడని చెప్పకుండానే ఆనంద్కుమార్ను మాయావతి బీఎస్పీ ఉపాధ్యక్షునిగా నియమించారు. తర్వాత ఆయన సామర్ధ్యంపై అనుమానాలతో పాటు నియామకంపై విమర్శలు రావడంతో తమ్ముడిని కొద్ది రోజులకే పదవి నుంచి తొలగించారు. తర్వాత అక్క చాటున ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆనంద్ ఇల్లు, సంస్థలపై ఆదాయపన్ను శాఖతో దాడులు చేయించింది. బీఎస్పీలో ఆయన పాత్ర లేకుండా పోయింది. కొన్నేళ్లకు హఠాత్తుగా ఆయన కొడుకు ఆకాష్ ఆనంద్ను రాజకీయ వారసుడిని చేసే పనికి మాయావతి శ్రీకారం చుట్టారు. మాయావతి ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించిన నేపథ్యంలో.. దీనిని తన మేనల్లుడి రాజకీయ రంగ ప్రవేశానికి చక్కగా వాడుకున్నారు. ఆమె స్థానంలో ఆకాష్ ఎన్నికల ప్రచారాన్ని ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్తో కలిసి కొనసాగించారు. బ్రిటిష్ వర్సిటీలో చదువు.. బ్రిటన్లోని ఓ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడైన ఆకాష్ వయసు 24 ఏళ్లు. సరైన సమయంలోనే ఆకాష్ను రాజకీయాల్లోకి తెచ్చిన మేనత్త.. తన రాజకీయ వారసునిగా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై ఊహాగానాలను మీడియాకే వదిలేశారు. ఆగ్రా ఎన్నికల సభలో వేదికపై ఒకవైపు అఖిలేశ్ కూర్చోగా, మధ్యలో ఆకాష్, రెండో చివర బీఎస్పీ సీనియర్ బ్రాహ్మణ నేత సతీష్చంద్ర మిశ్రా కూర్చున్నారు. మేనత్త మాయావతి మాదిరిగానే ఆకాష్ కూడా రాసుకొచ్చిన ప్రసంగాన్ని చదివారు. ఆగ్రాలో మాయావతి కులస్తులైన జాటవులు (చర్మకారులు) పెద్దసంఖ్యలో ఉన్నారు. ఐదేళ్ల క్రితం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికయ్యాక మాయావతి ఓ ఆశ్చర్యకర విషయం ప్రకటించారు. తన రాజకీయ వారసుడు తన వర్గమైన జాటవుల నుంచే వస్తాడనీ, అయితే తన కుటుంబం నుంచి కాదని మాయావతి చెప్పారు. కొన్నాళ్లకు తమ్ముడు ఆనంద్కుమార్ను పార్టీ ఉపాధ్యక్షునిగా నియమిస్తున్నట్టు ప్రకటించా రు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయరని, పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనే దృష్టి పెడతారని తెలిపారు. ఇది నచ్చని సీనియర్ నేతలు స్వామి ప్రసాద్ మౌర్య, నసీముద్దీన్ సిద్దిఖీ బీఎస్పీ నుంచి వైదొలిగారు. తర్వాత పదవికి తగిన అర్హతలు లేని ఆనంద్ నెమ్మదిగా పార్టీ వ్యవహారాల నుంచి తప్పుకున్నారు. ఆజాద్కు పోటీగా..? పశ్చిమ యూపీలో జాటవులను ఆకట్టుకుంటున్న దళిత నేత భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ‘రావణ్’ దూకుడుకు పగ్గాలు వేయడానికి మయావతి ఆకాష్ను రంగంలోకి దింపారు. ఎస్పీతో సీట్ల పంపిణీ చర్చల్లో తొలిసారి ఆకాష్ చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల ఈసీ నిషేధం నేపథ్యం లో మాయావతి తన మేనల్లుడిని ఆర్భాటం లేకుం డా రాజకీయ రంగ ప్రవేశం చేయించారు. -
‘యూపీ మీ పతనాన్ని శాసిస్తుంది’
సాక్షి, న్యూఢిల్లీ : గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఉత్తర్ ప్రదేశ్ 2019లో మోదీ సర్కార్ పతనానికి నాందిపలుకుతుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ప్రజలను మోసగిస్తూ వారి విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. నరేంద్ర మోదీని ప్రధానిని చేసిన యూపీ ప్రజలు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల అనంతరం ఆయనను ప్రధాని పదవి నుంచి సాగనంపాలని నిర్ణయించుకున్నారని వరుస ట్వీట్లలో మాయావతి పేర్కొన్నారు. మోదీ దేశమంతటా తిరుగుతూ తనను ప్రధానిగా చేసింది యూపీ అని చెబుతుంటారని, ఇది నూటికి నూరు పాళ్లు నిజం కాగా ఇప్పుడు అదే యూపీ ప్రజలు ఆయనను వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. యూపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన మోదీ వారి విశ్వాసాన్ని కోల్పోయారని ట్వీట్ చేశారు. తాను వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తినని ప్రధాని చెప్పుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ, ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే మోదీ ఇలా చెబుతుంటారని, వాస్తవంగా బీసీల అభివృద్ధి కోసమే ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్డీలు జట్టుకట్టాయని తెలిపారు. కాగా, ఎస్పీ వ్యవస్ధాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఒక్కరే దేశంలో బీసీల అభివృద్ధికి పనిచేస్తున్న ఏకైక నాయకుడని ఇటీవల ఆమె ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ నేతగా మాయావతి వ్యాఖ్యానించారు. -
24 ఏళ్లకు ఒకే వేదికపై..
మైన్పురి / న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో శుక్రవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. గత 24 ఏళ్లుగా ఉప్పు–నిప్పుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఒకే వేదికను పంచుకున్నారు. ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. యూపీలోని మైన్పురిలో క్రిస్టియన్ కాలేజీ గ్రౌండ్ ఇందుకు వేదికైంది. ఎస్పీ కంచుకోట అయిన మైన్పురిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ములాయం, బీఎస్పీ చీఫ్ మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, మద్దతుదారులను ఉద్దేశించి ములాయం మాట్లాడుతూ.. ‘చాన్నాళ్లకు మేమిద్దరం ఒకే వేదికపై మాట్లాడుతున్నాం. మాయావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు మద్దతివ్వాలని ఆమెను కోరుతున్నా’ అని అన్నారు. ప్రధాని మోదీ నకిలీ బీసీ: మాయావతి ములాయం అనంతరం మాయావతి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘గెస్ట్ హౌస్ ఘటన తర్వాత కూడా నేను ములాయం జీ తరఫున ప్రచారం కోసం ఇక్కడికి ఎందుకు వచ్చానని చాలామంది ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. కొన్నికొన్ని సార్లు ప్రజా, దేశ, పార్టీ ప్రయోజనాల రీత్యా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ములాయం జీ సమాజంలోని అన్నివర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకున్న మోదీ, తన అగ్రకులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. కానీ ప్రధాని మోదీలా ములాయం నకిలీ వ్యక్తి, అబద్ధాలకోరు కాదు. ఆయన వెనుకబడ్డ కులంలోనే జన్మించారు. ములాయం నిజమైన నేత’ అని ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా యూపీలోని 80 లోక్సభ సీట్లకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో కలిసి పోటీచేస్తున్నాయి. రాయ్బరేలీ(సోనియాగాంధీ), అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం ఈ ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థులను నిలబెట్టలేదు. ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీ పొత్తు: బీజేపీ ములాయం–మాయావతి కలిసి మైన్పురి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై బీజేపీ మండిపడింది. ఈ విషయమై బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ, తుపాను లాంటి మోదీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఎద్దేవా చేశారు. యూపీలో ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీలు చేతులు కలిపాయని దుయ్యబట్టారు. ఇందుకోసం తన జీవితంలో జరిగిన అతిపెద్ద అవమానాన్ని(గెస్ట్హౌస్ ఘటన) మాయావతి దిగమింగారన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావగా తయారైందని చతుర్వేదినుద్దేశించి అన్నారు. పాతికేళ్లనాటి పంచాయితీ! ములాయం, మాయావతి బద్ధ విరోధులుగా మారడానికి కారణమైన గెస్ట్హౌస్ ఘటన 1995 జూన్లో జరిగింది. ములాయం నేతృత్వంలోని ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వం యూపీలో కొనసాగుతోంది. కొత్త సర్కార్ కొలువుదీని అప్పటికి ఏడాదిన్నర. అంతలోనే బీఎస్పీ అధినేత కాన్షీరాం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తారని ములాయంకు జూన్ 1న సమాచారం అందింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే బీఎస్పీని చీల్చాలనీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయాలని కొంతమంది ఎస్పీ నేతలు భావించారు. అదేసమయంలో అప్పటి బీఎస్పీ ప్రధాన కార్యదర్శి మాయావతి రాష్ట్రప్రభుత్వ గెస్ట్హౌస్లో జూన్ 2న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఎస్పీ ఎమ్మెల్యేలు, జిల్లాల నేతలు అనుచరులతో కలిసి ఆయుధాలతో గెస్ట్హౌస్పై దాడిచేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను చితక్కొట్టారు. గదిలో దాక్కోవడంతో మామావతి తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఎస్పీ సర్కారుకు బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకోవడం, బీజేపీ, జనతాదళ్ పార్టీల బయటినుంచి మద్దతు ఇవ్వడంతో మాయావతి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. -
పొరపాటున ఓటేసి.. వేలు కోసుకున్నాడు
అభిమానానికి అవధుల్లేనట్టే, వ్యతిరేకతలోనూ విపరీతం ఉంటుందని ఉత్తరప్రదేశ్లోని బులందర్షా పార్లమెంటు స్థానంలో జరిగిన ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. ఉత్తరప్రదేశ్లోని బులందర్షా పార్లమెంటు స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతి మద్దతుదారుడు పవన్ కుమార్ తాను ఓటు వేయాలనుకున్న బీఎస్పీ అభ్యర్థి యోగేష్ వర్మ గుర్తు ఏనుగుపై కాకుండా, పొరపాటున బీజేపీ కమలం గుర్తున్న మీటపై నొక్కాడు. అది కాస్తా బీజేపీ íసిట్టింగ్ అభ్యర్థి భోలాసింగ్కి పడింది. దీంతో తను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా భావించాడేమో పవన్ కుమార్ తను ఓటు వేసిన వేలిని బ్లేడుతో కసిగా కోసుకున్నాడు. పైగా ఈ వ్యవహారాన్నంతటినీ తాపీగా వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. కట్టుకట్టిన చూపుడువేలితో కుర్చీలో కూర్చుని నింపాదిగా విషయాన్ని వివరిస్తోన్న సదరు ఓటరు పవన్కుమార్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈవీఎం మెషీన్లో బీజేపీ మీట నొక్కాలని ఎవరైనా బలవంతం చేశారా అన్న ప్రశ్నకు ఆయన కాదని సమాధానం చెప్పాడు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అజిత్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బులందర్షా నియోజకవర్గం నుంచి యోగేష్ వర్మ పోటీచేస్తున్నారు. సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో భాగంగా బులందర్ షా సహా అలీఘర్, హాత్రస్, ఫతేపూర్ సిక్రీ, నగీనా, అమ్రోహ, మథుర, ఆగ్రాల్లో గురువారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
24 ఏళ్ల తర్వాత మళ్లీ వాళ్లిద్దరూ ...
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ ... 24 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి వేదికను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ మణిపూరిలో శుక్రవారం జరిగిన ర్యాలీలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. వీరిద్దరితో పాటు ఎస్పీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్ తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న బీఎస్పీ చీఫ్ మాయావతి ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. వెనుకబడిన వర్గాలకు ములాయం రియల్ హీరో అని, అంతేకాకుండా మొయిన్పురిలో ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. దేశ భవిష్యత్ కోసమే విభేదాలు పక్కనపెట్టి ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయని మాయావతి తెలిపారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాటకాలు, అబద్దాలు పని చేయవన్నారు. ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాలకు మోదీ చేసిందేమీ లేదని మాయావతి విమర్శలు గుప్పించారు. వెనుకబడిన వర్గాల కోసమే ఎస్పీ, బీఎస్పీ ఆలోచిస్తాయని, తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాలు, పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆమె హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని అన్నారు. ఇక ములాయం సింగ్కు సరైన వారసుడు అఖిలేష్ యాదవే అని మాయావతి పేర్కొన్నారు. మరోవైపు మాయావతి తనకు మద్దతుగా ప్రచారం చేయడంపై ములాయం సింగ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ మాయావతిని గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మళ్లీ మాయావతితో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన ఎస్పీ - బీఎస్పీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఉత్తర్ప్రదేశ్లో ఒకనాటి ప్రత్యర్థి పక్షాలు సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు చేతులు కలిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని దూరంపెట్టి ఈ రెండు పార్టీలు యూపీలోని 80 సీట్లకుగాను చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. -
ఈసీ దళిత వ్యతిరేకి
గోపాల్గంజ్: తన ప్రచారంపై ఎన్నికల కమిషన్ (ఈసీ) విధించిన 48 గంటల నిషేధం ముగిసిన వెంటనే బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ దళిత వ్యతిరేకి అయినందునే ఉత్తర భారత్లో దళితుల రాజధానిగా భావించే ఆగ్రాలో తనను ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించిందని ఆరోపించారు. బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయుధ దళాల ప్రస్తావనను తీసుకొచ్చి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినప్పటికీ ఈసీ మౌనం పాటించిందని ఆమె వ్యాఖ్యానించారు. గురువారమిక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన ‘న్యాయ్’పథకంపై కూడా విమర్శలు చేశారు. ‘ఆ పథకం ఒక గారడీ. కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయం నెలకు రూ.6,000 హామీపై మాకు నమ్మకం లేదు’అని స్పష్టం చేశారు. -
యోగి టెంపుల్ విజిట్పై మాయావతి ఫైర్
లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ తనపై ఈసీ విధించిన నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారని బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఆరోపించారు. ఆలయాలను సందర్శించడం, దళితుల ఇళ్లలో ఆహారం స్వీకరించడం వంటి చర్యలతో యోగి ఆదిత్యానాధ్ ఈసీ ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయన డ్రామాలు చేస్తూ వాటిని మీడియాలో ప్రసారం చేసేలా వ్యవహరిస్తున్నారని మాయావతి మండిపడ్డారు. యూపీ సీఎం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఈసీ చూసీచూడనట్టు వదిలేస్తోందని ఆమె ఆరోపించారు. ఈసీ బీజేపీ నేతల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. బీజేపీ నేతల చర్యలను ఈసీ పట్టించుకోకుంటే ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించడం అసాధ్యమని చెప్పారు. కాగా, మాయావతి ఆరోపణలను యూపీ సీఎం మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ తోసిపుచ్చారు. వ్యక్తిగత హోదాలో ప్రార్థనలు చేసుకునేందుకు ఆలయాలను సందర్శించడం, ఎవరైనా పిలిచినప్పుడు వారి ఇంటికి వెళ్లి భోజనం చేయడం ఈసీ ఉత్తర్వులను ఉల్లంఘించడం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. మామావతి రాసిచ్చిన స్ర్కిప్టులను మాత్రమే కాకుండా, ఈసీ ఆర్డర్ కాపీని కూడా చదవాలని ఆయన బీఎస్పీ అధినేత్రికి చురకలు వేశారు. -
సుప్రీంకోర్టులో మాయావతికి చుక్కెదురు
-
నోరు మూయించిన ఈసీ
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగిఆదిత్యనాథ్, బీజేపీ నేత మేనకాగాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్పై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్రజేసింది. యోగి, మేనక, మాయ మతవిద్వేష వ్యాఖ్యలు చేయగా, బీజేపీ నేత జయప్రద వ్యక్తిత్వాన్ని అవమానించేలా ఆజంఖాన్ మాట్లాడారు. విద్వేష వ్యాఖ్యల అంశంలో ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యోగి, ఆజంఖాన్లు 72 గంటలపాటు (3 రోజులు), మేనక, మాయ 48 గంటలపాటు (2 రోజులు) ఏ విధమైన ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు వారికి ఈసీ చీవాట్లు పెట్టింది. యోగి, ఆజంఖాన్లు గతంలోనూ ఇలాంటి మత విద్వేష వ్యాఖ్యలు చేయడంతో వారిని ఈసీ హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో వారిద్దరిపై 72 గంటల నిషేధం విధించామని ఎన్నికల సంఘం అధికారి వెల్లడించారు. అదే మాయ, మేనకలు తొలిసారి విద్వేష వ్యాఖ్యలు చేసినందున వారిపై 48 గంటల నిషేధమే విధించామన్నారు. ఈ నిషేధం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఈసీ అధికారి చెప్పారు. ఈ ఎన్నికలు అలీకి, బజరంగ్ బలికి మధ్య జరిగే యుద్ధమని మీరట్లో యోగి అన్నారు. ముస్లింలు కాంగ్రెస్కు ఓటు వేయకూడదని దేవబండ్లో మాయావతి కోరారు. ముస్లింలు తనకు ఓటు వేయకపోతే తర్వాత వారు ఏదైనా పనికోసం తన వద్దకు వచ్చినప్పుడు వారికి సాయం చేయాలని తనకు అనిపించదని మేనక పేర్కొన్నారు. ఇక జయప్రదకు ఆరెస్సెస్తో ఉన్న సంబంధాలపై ఆజంఖాన్ మాట్లాడుతూ జయప్రద ఖాకీ నిక్కర్ వేసుకుంటుందని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలోనూ మత విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఎస్పీ నేత ఆజం ఖాన్లపై ఈసీ నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలోనే.. విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఈసీ ఏ చర్యలూ తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు బెంచ్ తొలుత ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధగంటలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తమ ముందు ఉండాలని కూడా ఓ సందర్భంలో హెచ్చరించింది. -
మాయావతికు, యోగి ఆదిత్యనాథ్కు ఈసీ ఝలక్
-
యూపీ సీఎంకు, మాయావతికి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతికిఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ ఎన్నికల ప్రచారం నుంచి కొంత సమయం పాటు బ్యాన్ చేసింది. మతపరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం యోగిని మూడు రోజులు (72 గంటల పాటు), మాయావతిని రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారంనుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా యోగి, మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రసంగాలనుఉదహరిస్తూ సోమవారం సుప్రీకోర్టు ఈసీపై విమర్శలు గుప్పించింది. ఎంతుకు ఉదాసీనంగా ఉంటున్నారని చురకలంటించింది. దీంతో రెండవ దశ ఎన్నికల బరిలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న నేతలిద్దరికీభారీ ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యూపీ ఎన్నికల బరిలో యోగి మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించకుండా ఈసీ కట్టడి చేయడం రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన బీఎస్పీ, బీజేపీకి పెద్ద షాకే. -
అందుకే ఆమె కాళ్లు మొక్కా: పవన్ కల్యాణ్
సాక్షి, అమలాపురం : వీధికో గూండా ఉండే ఉత్తరప్రదేశ్లాంటి రాష్ట్రంలో దళిత మహిళ అయిన మాయావతిని అక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని, అందుకే ఆమె కాళ్లు మొక్కినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. సోమవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత తోట త్రిమూర్తులుపై విరుచుకుపడ్డారు. ‘తోట త్రిమూర్తులను నేను ఎప్పుడూ పార్టీలోకి రమ్మని అడగలేదు. 2014లో మేము మద్దతు ఇస్తేనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తులను చెంచాలు అంటారు. త్రిమూర్తులు జాతి గౌరవం కాపాడు. నేను నా అన్న చిరంజీవి మాటే వినను. నీ మాట ఎలా వింటాను. తెలుగుదేశం నాయకులు బానిస బతులుకు బ్రతుకుతున్నారు. టీడీపీ, జనసేన ఒకటే అంటూ అవగాహన లేని మాటలు మాట్లాడకండి’ అంటూ ధ్వజమెత్తారు. కాగా ఏపీలో బీఎస్పీతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చిన సందర్భంగా పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కారు. -
మాయావతి వ్యాఖ్యలపై ఈసీ ఆరా
సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతి వివాదంలో చిక్కుకున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్కు ఓటు వేయవద్దని కోరుతూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఈసీ పరిశీలిస్తోంది. యూపీలోని దియోబంద్లో ఆదివారం జరిగిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ ర్యాలీలో మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాయావతి ప్రసంగంపై నివేదిక పంపాలని సంబంధిత అధికారులను యూపీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. మహాకూటమిని ఓడించేందుకు ముస్లిం ఓట్లలో చీలికకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాయావతి ఆరోపిస్తూ ఆ పార్టీకి ముస్లింలు ఓటు వేయవద్దని కోరారు. బీజేపీని ఓడించాలని భావించే ముస్లింలు యూపీలో మహాకూటమివైపే నిలవాలని సూచించారు. మాయావతి ఇంకా ఏమన్నారంటే..‘ బీజేపీని ఓడించే సామర్ధ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు..మహాకూటమితోనే కాషాయ పార్టీని నిలువరించడం సాధ్యం..కాంగ్రెస్కు మాత్రం ఓటేయకండి..ఆ పార్టీ మహాకూటమి ఓటమిని కోరుకుంటోంద’ని మాయావతి అన్నారు. మాయావతి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఆమె వ్యాఖ్యలపై పూర్తి నివేదిక పంపాలని స్ధానిక అధికారులను కోరింది. -
‘ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవదు’
లక్నో: లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి పరాభావం తప్పదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ఫలితాలే మరోసారి పునరావృత్తం అవుతాయని, అధికారం కోసమే అఖిలేష్, మాయావతి జట్టుకట్టారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం యూపీలో జరిగిన బహిరంగ సభలో యోగి ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఒక్క సీటు కూడా రాదని, గత ఎన్నికల్లో విజయ సాధించిన ఐదే స్థానాల్లోనే ఎస్పీ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. బీఎస్పీ, ఎస్పీ హయాంలో జరిగిన మత ఘర్షణలపై బహిరంగంగా మాట్లాడే ధైర్యం వారికి లేదని మండిపడ్డారు. అఖిలేష్కు ముజఫర్నగర్ అల్లర్ల గురించి చర్చంచే దమ్ముందా అని యోగి సవాల్ విసిరారు. గడిచిన 55 ఏళ్ల అభివృద్ధి ఏంటో.. తమ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లకాలంలో జరిగిన అభివృద్ధి ఏంటో చూడాలని అన్నారు. రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 23 లక్షల గృహాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని యోగి వెల్లడించారు. దేశ ప్రజలంతా ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరోసారి కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కాగా యూపీలో మహాకూటమి విజయాన్ని కాంక్షిస్తూ.. ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ పార్టీల నేతలు ఆదివారం భారీ ర్యాలీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి భయంతో వణికిపోతోందని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పదన్న మాయావతి విమర్శలపై యోగి ఈ విధంగా స్పధించారు.. -
బీజేపీకి ఓటమి భయం
దియోబంద్(సహరాన్పూర్): బీజేపీకి భయంతో వణికిపోతోందని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పదని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. తమ కూటమి గెలవడం ఇష్టంలేని కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్వేష పూరిత విధానాలు, ముఖ్యంగా చౌకీదార్(మోదీ) ప్రచారం తీరుతో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఎస్పీ– బీఎస్పీ– ఆర్ఎల్డీ పార్టీల మహాకూటమి తొలి ఎన్నికల సభలో మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ ప్రసంగించారు. న్యాయ్ సరైన పరిష్కారం కాదు ఈ సందర్భంగా మాయావతి.. ‘రోడ్డు షోలు, గంగ, యమున నదుల్లో పవిత్ర స్నానాలు, సినీ తారలకు టికెట్లు.. వంటివి కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే సత్తా కాంగ్రెస్కు లేదు. మహాకూటమి మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదు. గతంలో ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన కోసమంటూ పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఫలితం చూపిందా? పేదరికాన్ని రూపుమాపడానికి న్యాయ్ సరైన పరిష్కారం కాదు’ అని తెలిపారు. చౌకీదార్లను తొలగిస్తాం: ‘కోట్ల ఉద్యోగాలు ఇస్తామన చాయ్వాలా(టీ కొట్టు వ్యాపారి)ను 2014లో నమ్మాం. ఇప్పుడు చౌకీదార్ను నమ్మమంటున్నారు. ఈ చౌకీదార్ల(వాచ్మెన్)ను వాళ్ల చౌకీ(కాపలా పోస్ట్)ల నుంచి తొలగిస్తాం’ అని ర్యాలీలో అఖిలేశ్ ప్రకటించారు. తమ గఠ్ బంధన్(కూటమి) అవినీతిపరుల కూటమి కాదు, మహాపరివర్తన్(పూర్తిమార్పు) అని తెలిపారు. తనను తాను ఫకీర్(సన్యాసి)అని మోదీ చెప్పుకుంటుంటారు. హామీల అమల్లో విఫలమైతే నేను ఫకీర్ను వెళ్లిపోతున్నా అంటారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఉంచుదామా? వెళ్లగొడదామా? అని అఖిలేశ్ ప్రశ్నించారు. అచ్చేదిన్ (మంచి రోజు) అంటే మోదీ ఉద్దేశం తన గురించే తప్ప, ప్రజలకు వచ్చే మంచి రోజుల గురించి కాదని అజిత్ సింగ్ ఎద్దేవా చేశారు. -
ముస్లింలకు మాయావతి ఓపెన్ అప్పీల్!
సాక్షి, దియోబంద్ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఉత్తరప్రదేశ్లోని ముస్లింలకు బహిరంగంగా అప్పీల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి.. ముస్లిం ఓట్ల చీలికకు కారణం కావొద్దని, బీజేపీని ఎస్పీ, బీఎస్పీ నేతృత్వంలోని మహాకూటమి మాత్రమే ఓడించగలదని, కాబట్టి మహాకూటమికే ముస్లింలు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. దియోబంద్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి ఉమ్మడిగా నిర్వహించిన ర్యాలీలో మాయావతి ఈ మేరకు ముస్లింలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీలో మాయావతితోపాటు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆరెల్డీ చీఫ్ అజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ‘ముస్లింలకు నేను బహిరంగంగా పిలుపునిస్తున్నాను. బీజేపీని కాంగ్రెస్ కాదు మహాకూటమి మాత్రమే ఓడించగలదు. మహాకూటమి గెలువకూడదని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సహకరించేందుకు ప్రయత్నిస్తోంది’ అని మాయావతి మండిపడ్డారు. సహరాన్పూర్లో కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘మొదట సహరాన్పూర్లో మేం ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాం. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ముస్లిం అభ్యర్థినే నిలబెట్టింది. మా కూటమికే వచ్చే ఓట్లను తగ్గించడానికే కాంగ్రెస్ ఇలా చేస్తోంది’ అని ఆమె మండిపడ్డారు. -
రాజకీయ తెరపై పవన్ కల్యాణ్ కామెడీ...
జాతీయ పార్టీలకు గులాంగిరీ చేయకండి.. బానిసత్వంతో నడుం వంగిపోయాలా మోకాళ్ల దండాలు పెట్టకండి.. రాష్ట్ర ప్రజల మనోభవాలను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి..సముద్రం ఒకరి కాళ్ళ వద్ద కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు..ఆత్మగౌరవం ఉన్న ఏ తెలుగోడూ జీ హుజూర్.. జీహూజూర్... అని గులాంగిరీ చేయడు.. కట్ చేస్తే.. అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు అభిశంసించిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి కాళ్లకు మొక్కడం..ఒక్కసారి కాదు.. ఎయిర్పోర్ట్లో కారు ఎక్కేటప్పుడు.. కారు దిగిన తర్వాత.. బహిరంగసభలు పెట్టిన ప్రతిచోటా వంగివంగి దండాలు పెట్టడం.. ఈ ట్రాక్ రికార్డంతా ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించే.. ఆయన నిలకడ లేని మనస్తత్వం.. రెండుమూడేళ్ళకు మారిపోయే మాటల సంగతి ప్రస్తావిస్తే.. ఇప్పుడు చాంతాడంత అవుతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే చివరికి ఆయన పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అంతే గందరగోళంగా ఉన్నాయి. ఏమాత్రం పొంతన లేకుండా.. స్థానిక సమస్యలపై కనీస అవగాహన లేకుండా ఇచ్చిన, ఇస్తున్న హామీలు చూసి గాజువాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. గాజువాక ప్రజకే 2 లక్షల ఉద్యోగాలు ఎలా వచ్చేస్తాయి. అలాగైతే ఎన్ని కంపెనీలు పెట్టాలి. అగనంపూడి రెవిన్యూ డివిజన్ ఎలా సాధ్యం. అభాసుపాలవుతున్న అజ్ఞాతవాసి హామీలు . ఆ ప్రాంత సమస్యలపై అవగాహన లేకుండా సినిమాలు డైలాగుల మాదిరి హామీలు. ఆ హామీల సంగతి ఏమిటో చూద్దాం రండి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నాకు కొద్దిగా తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది.. గబ్బర్ సింగ్ సినిమాలోని ఈ డైలాగ్.. ఇప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానుల్లో నానుతూనే ఉంటుంది. ఇప్పుడు గాజువాకలో ఆయన ఇచ్చిన హామీలు చూస్తే సరిగ్గా ఆ డైలాగ్ను తిప్పి చదువుకోవాల్సిందే. ఏమాత్రం లెక్క లేకుండా... నియోజకవర్గ సమస్యలపై కనీస అవగాహన లేకుండా ఆయనిచ్చిన హామీలు నవ్వులు పూయిస్తున్నాయి. వెండితెరపై డైలాగులతో ఈలులు వేయించిన పవన్కల్యాణ్.. రాజకీయ తెరపై మాత్రం కామెడీని పండిస్తున్నారనే విమర్శలకు ఆయన గాజువాకకు ఇచ్చిన హామీలు ఊతమిస్తాయి. గాజువాకకు సంబంధించి ఆయన ఇప్పటికే లెక్కలేనన్ని.. మళ్ళీ గట్టిగా ఆయన్ను అడిగినా కూడా చెప్పలేనన్ని వాగ్దానాలు చేసేశారు. వాటన్నిటి గురించి వదిలేసి ఒకటి రెండు ప్రధానమైన వాగ్దానాలనే తీసుకుందాం. గాజువాక ప్రజలకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పవన్ పదే పదే చెప్పుకొస్తున్నారు. గాజువాకలోని పరిశ్రమల్లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటే.. కనీసం దానికైనా అర్ధం ఉంటుంది. కానీ ఏకంగా 2 లక్షలమంది గాజువాక ప్రజలకే ఉద్యోగాలు ఇచ్చేస్తానని పవన్ ఊదరగొట్టేస్తున్నారు. అసలు.. ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్నే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. గాజువాకలో ఓటర్లు మూడు లక్షలు కాగా.. జనాభా మొత్తంగా మూడున్నర లక్షలమంది. ఇందులో ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య .. సంఘటిత, అసంఘటిత రంగాలను కలిపితే లక్షన్నర మందికిపైగానే ఉంది. మిగిలిన వారిలో వృద్ధులు, పిల్లలు, గృహిణులు ఉంటారు. మరి ఈ లెక్కన గాజువాకలో రెండులక్షల ఉద్యోగాలు ఎవరికిస్తారు.. అది ఎలా సాధ్యం అన్న ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవంగా లెక్క వేస్తే రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ప్లాంట్లోనే 11వేలమంది పర్మినెంట్ ఉద్యోగులుండగా, 15వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఈ లెక్కన పవన్ చెబుతున్న 2లక్షల ఉద్యోగాలు రావాలంటే స్టీల్ప్లాంట్ వంటి పరిశ్రమలు ఎన్ని పెట్టాలో.. వాటికి ఎన్నేళ్లు పడుతుందోనన్న వాదనలు బయలుదేరాయి. సొంత గనులు, నీటి సరఫరా వంటి సమస్యలతో స్టీల్ప్లాంట్ ఉనికే ప్రశ్నార్ధకమైన పరిస్థితుల్లో ఏనాడూ ఆ సమస్యలపై స్పందించకుండా.. ప్రస్తుత పరిశ్రమల్లో ఉన్న సమస్యలపై కనీస అవగాహన లేకుండా.. రెండులక్షల ఉద్యోగాలు తెచ్చేస్తాను.. అన్న పవన్ ప్రకటనపై ఉద్యోగసంఘ నేతల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగనంపూడి రెవెన్యూ డివిజన్ ఎలా సాధ్యం పవన్ కల్యాణ్ ప్రకటించిన మరో అంశం.. అగనంపూడి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానన్న హామీ. రెవెన్యూ డివిజన్ అంటే పది నుంచి పదిహేను మండలాలకు కేంద్రంగా అందుబాటులో ఉండే పెద్ద ప్రాంతాన్ని ఆ మండలాలకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది. అగనంపూడి పరంగా చూసుకుంటే.. ఈ ప్రాంతం విశాఖ రెవెన్యూ డివిజన్లో ఉంది. పైగా ఇదంతా మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో అంతర్భాగం. దీనికి తోడు సమీపంలో పరిపాలనపరంగా ఇబ్బంది పడుతున్న మండలాలు కూడా లేవు. ఆ పక్కన చూస్తే.. 20 కి.మీ. దూరంలోనే అనకాపల్లి డివిజన్ కేంద్రం ఉంది. ఈ రెండింటి మధ్యలోనూ మండలాలు లేవు. అలాంటప్పుడు అగనంపూడి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యం?.. పోనీ దీనికి సంబంధి ప్రతిపాదనలు గానీ.. ప్రజల నుంచి డిమాండ్లు గానీ ఉన్నాయా.. అంటే అవీ లేవు. మరి ఏం ఆలోచించి తలాతోకా లేని అగనంపూడి రెవెన్యూ డివిజన్ అంశాన్ని పవన్ తన ప్రణాళికలో ఎలా చేర్చేశారో?.. ఇందులో ఆయన లెక్కేమిటో??.. ఆయనకే తెలియాలి. -
‘అద్భుతం జరిగితే తప్ప ఆయన ప్రధాని కాలేడు’
సాక్షి, న్యూఢిల్లీ : ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని కేంద్ర మంత్రి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశానికి ప్రధాని కాలేరని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేయడంపై స్పందిస్తూ.. ఏ వ్యక్తి అయినా ఎన్నికల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ప్రచారం గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రచారం వల్ల మా పార్టీపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపారు. మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు గతంలో వరుసగా ఫిలిబిత్, సుల్తాన్పూర్ల నుంచి పోటీ చేయగా.. ఈ సారి వారి స్ధానాలను పరస్పరం మార్పు చేశారు.ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త సంజయ్ గాంధీ రెండు సార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో నా కుమారుడు వరుణ్ గాంధీ కూడా విజయం సాధించారు. ఇక ఈ సారి నా వంతు. నేను కూడా తప్పక విజయం సాధిస్తాన’ని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సుల్తాన్పూర్ టికెట్ను అమ్ముకున్నారనే అంశంపై స్పందిస్తూ.. ‘ఆమె టికెట్లు అమ్ముకుంటారనే విషయం అందరికి తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో సుల్తాన్పూర్ టికెట్ను ఆమె రూ. 15 కోట్లకు అమ్ముకుంది. అయితే గతంలో ఇలాంటి అంశాల గురించి మాట్లాడాలంటే భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నాతో పాటు ప్రజలకు కూడా ధైర్యం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి వారి గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారని’ పేర్కొన్నారు. రాయ్బరేలీ, అమేథీలో ప్రచారం చేయమని పార్టీ తనను కోరలేదని తెలిపారు. ఒకవేళ అలా అడిగితే.. తప్పకుండా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.