Supreme Court Notice to Center and TS for Demerger of Institutions - Sakshi
Sakshi News home page

ఏపీ విభజన చట్టం: షెడ్యూల్ 9, 10 సంస్థలపై పిటిషన్‌.. కేంద్రం, టీఎస్‌కు నోటీసులు

Jan 9 2023 11:46 AM | Updated on Jan 9 2023 12:27 PM

Supreme Court Notice To Center And TS For Demerger Of Institutions - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. 

పిటిషన్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం.. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఈ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా ఉండగా.. దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని పేర్కొంది. లక్ష మందికిపైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సంస్థల విభజన ఆలస్యం కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపింది. తక్షణమే సంస్థల విభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement