ప్రధాన వార్తలు

తెలంగాణ కాంగ్రెస్లో పదేళ్ల లొల్లి!
తెలంగాణకు పదేళ్లు తానే ముఖ్యమంత్రినంటూ ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సహజంగానే కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. చర్చోపచర్చలకు దారితీసింది. అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని కూడా అన్నారు. ఇది కాస్తా తెలంగాణ అధికార పార్టీ రాజకీయాలలో కొత్త వివాదానికి తెరదీసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ '2034 వరకు అంటే.. పదేళ్లపాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడు. కేసీఆర్.. ఈ విషయాన్ని డైరీలోనో.. నీ గుండెలపైనో రాసుకో" అని సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలకు, ఒక ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పడం వరకు ఓకే. వచ్చే తొమ్మిదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పడం తనపై తనకు ఉన్న నమ్మకం కావచ్చు. కానీ కాంగ్రెస్లో అలా బహిరంగంగా చెప్పడానికి పార్టీ అధిష్టానం కాని, ఇతర నేతలు కాని ఇష్టపడరు. రాజగోపాలరెడ్డి అభిప్రాయం కూడా అదే. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సీఎంను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్లో ఈ విధానం ఉన్న మాట నిజమే కాని, కేంద్రంలో అధికారం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా సీఎంల మార్పుపై సంచలన నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా కనబడదు. కర్ణాటక వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చాలని, తనను సీఎంను చేయాలని ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్ కోరుకుంటున్నారు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు ఇందుకు సాహసించడం లేదు. పైగా ఈ ఐదేళ్లు సిద్దరామయ్య కొనసాగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి అక్కడ ఉండే రాజకీయ, సామాజిక అంశాలు కారణాలు కావచ్చు. అయితే.. సిద్దరామయ్య కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అని చెప్పుకోవడం లేదు. కానీ రేవంత్ ధైర్యంగా 2028 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తిరిగి తానే సీఎం అవుతానని చెబుతున్నారు. తన వర్గంలో విశ్వాసం పెంచడానికి ఇది ఉపయోగపడవచ్చు కానీ, పార్టీలోని ఇతర వర్గాలలో ఇది అసహనానికి కారణం అవుతుంది. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అభ్యర్ధులు ఎక్కువే. 2014లో అయితే డజను మంది తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విలీనం కాకుండా అడ్డుపడ్డారు. కేసీఆర్ తనకు సీఎం పదవి ఇస్తే విలీనం చేస్తానని కండిషన్ పెట్టారు. చివరికి ఒంటరిగా పోటీచేసి విజయం సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లు ఆ పరిస్థితి కొనసాగడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికలకు కొద్దికాలం ముందు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. తదుపరి వర్కింగ్ అధ్యక్షుడుగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమి పాలైనా, మల్కాజిగిరి ఎంపీగా గెలవడం ఆయనకు కలిసి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు తొలుత రేవంత్ నాయకత్వానికి సుముఖత చూపలేదు. తప్పని స్థితిలో ఒప్పుకున్నారు. రేవంత్ నియామకంపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటివారు గట్టి విమర్శలే చేసేవారు. ఆయన సోదరుడు రాజగోపాల రెడ్డితో కలిసి తమకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధిస్తామని చెప్పినా అధిష్టానం వారివైపు మొగ్గు చూపలేదు. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్య తీసుకోవడం లేదంటూ రాజగోపాల రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవి కూడా వదలుకున్నారు. తదుపరి ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్లీ 2023 జనరల్ ఎన్నికలు వచ్చేసరికి తిరిగి కాంగ్రెస్లో చేరిపోయి మునుగోడు నుంచే పోటీచసి విజయం సాధించారు. ఈయన సోదరుడు, సీనియర్ నేత వెంకట రెడ్డి నల్గొండ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. రాజగోపాలరెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అధిష్టానం కూడా ఆయనను బుజ్జగించే యత్నం చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారన్న భావనతో ఆయనకే సీఎం పదవి అప్పగించింది. మల్లు భట్టి సీఎం రేసులో నిలిచినా ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకోక తప్పలేదు. అలాగే ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట రెడ్డి తదితర ఆశావహులు కూడా రాజీపడి రేవంత్ కేబినెట్లో మంత్రులుగా చేరిపోయారు. అయినా వీరిలో కొందరు రేవంత్ పై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేసే తప్పులను, వచ్చే ఆరోపణలను తెలియ చేస్తున్నారట. రేవంత్ కూడా అంతకన్నా తెలివిగా అధిష్టానంతో సంబంధాలు కొనసాగిస్తున్నందున ఇప్పటికైతే ఆయనను కదలించే శక్తి ఇతర కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లు కనిపించదు. కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అది వేరే సంగతి. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఉమ్మడి ఏపీలో పూర్తి టర్మ్ పదవి కాలంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కావడం విశేషం. 2004లో ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొందరు ఇతర నేతలు సీఎం పదవి కోసం పోటీ పడకపోలేదు. కానీ అధిష్టానం వైఎస్ నాయకత్వానికి అంగీకరించక తప్పలేదు. అలాగే 2009లో రెండోసారి గెలిచిన పిమ్మట అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తనకు సీఎం పదవి కావాలని ప్రకటన చేశారు. అయినా వైఎస్సార్కే సీఎం సీటు తిరిగి దక్కింది. 1956 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి దాదాపు మూడేళ్ల తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్లారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో నీలం సంజీవరెడ్డి మళ్లీ సీఎం అయ్యారు కాని పూర్తి టర్మ్ ఉండలేదు. 1964లో ముఖ్యమంత్రైన కాసు బ్రహ్మానందరెడ్డి 1967 ఎన్నికల తర్వాత తిరిగి ఆ పదవి చేపట్టినా, పూర్తి కాలం కొనసాగలేకపోయారు. తరువాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆయన 1972లో పదవి వదలు కోవల్సి వచ్చింది. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత సీఎం అయిన జలగం వెంగళరావు 1978 వరకు కొనసాగారు. ఆ తరుణంలో పార్టీలో వచ్చిన చీలికలో 1978లో మర్రి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన సీఎం అయ్యారు. 1978-83 మధ్య చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డిలు సీఎం పదవులు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించినన టీడీపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి 1989లో కాంగ్రెస్ గెలుపొందడంతో 1989-94 మధ్య చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఓటమి పాలైన కాంగ్రెస్ మళ్లీ 2004లో అధికారంలోకి వచ్చాక వై ఎస్ సీఎం అయ్యారు. 2009లో తిరిగి ఆయన ముఖ్యమంత్రయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే వైఎస్సార్ తప్ప ఏ ఒక్క కాంగ్రెస్ సీఎం కూడా పూర్తి టర్మ్ పాలించలేదన్నమాట. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినిపోగా, తెలంగాణలో పదేళ్లపాటు అధికాంలోకి రాలేదు. 2023లో రేవంత్ సీఎం అయిన తర్వాత కొంత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడపడానికి యత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి అవడంతో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు రేవంత్ను ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడుగానే చూస్తుంటారు. ఆయన కూడా అప్పడప్పుడు చంద్రబాబును ప్రశంసించినట్లు మాట్లాడుతుంటారు. నాగర్ కర్నూల్ సభలోనూ చంద్రబాబు ప్రస్తావన తెచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. అప్పుడప్పుడూ వైఎస్ పేరును ప్రస్తావిస్తున్నా, కాంగ్రెస్ వర్గాలకు అంత సంతృప్తి కలిగించే రీతిలో మాట్లాడడం లేదన్న భావన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన వ్యాఖ్యలో నిఖార్సైన కాంగ్రెస్ నేతలు సీఎం చేసిన వ్యాఖ్యలను అంగీకరించరని అన్నారు. సాధారణంగా.. జాతీయ పార్టీలలో హై కమాండ్ దే తుది నిర్ణయం అనే సంగతి తెలిసిందే. అయితే ఇది పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి, ఆయా వ్యక్తుల బలాబలాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. రేవంత్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తనకు ఎక్కువ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అందువల్ల అధిష్టానం కూడా తొందరపడే పరిస్థితి ఉండదు. ఆ ధైర్యంతోనే రేవంత్ భవిష్యత్తులో కూడా తానే సీఎం అని చెప్పుకుని ఉండవచ్చు. రేవంత్ పై అసహనం వ్యక్తం చేయడం మినహా, అసమ్మతి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్లెస్ ఫెలో
సాక్షి, విజయవాడ : కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదస్తులో తెలియజేసేలా రోజుకో వీడియో బయటకు వస్తోంది. మంత్రి నారాయణ తన నోటికి పని చెప్పారు. అమరావతి రాజధాని పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమరావతి పనులను మంత్రి నారాయణ తాజాగా పర్యవేక్షించారు. ఆ సమయంలో పనులు సరిగ్గా జరగడం లేదంటూ కాంట్రాక్టు సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సివిల్ ఇంజనీర్లు చెప్పే వాస్తవ పరిస్థితి వివరిస్తున్నా వినకుండా తన ఫ్రస్టేషన్ ప్రదర్శించారు. హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్లెస్ ఫెలో అంటూ అందరి ముందు ఇంజనీరింగ్ అధికారులపై చిందులు తొక్కారు.కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదగా వ్యవహరిస్తున్నారో తెలిసిందే. జేసీ ప్రభాకరరెడ్డి, గాలి భానుప్రకాశ్, బొలిశెట్టి శ్రీనివాస్, ఇలా ఇప్పుడు ఈ లిస్టులో నారాయణ కూడా వచ్చి చేరారు.

ఉప రాష్ట్రపతి రేసు.. శశిథరూర్, నితీశ్ సహా మరో ముగ్గురు సీనియర్లు?
ఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ధన్ఖడ్ రాజీనామా నేపథ్యంలో ఇప్పుడు తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు అనే కొత్త చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మనోజ్ సిన్హా, వీకే సక్సేనా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయణ్ సింగ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేరు కూడా తెరపైకి వచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనను బీజేపీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా వ్యవహారం బీజేపీ కుట్రగా బీహార్లో ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపించింది. బీహార్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనుండగా బీజేపీ ఈ కుట్రకు తెరతీసిందని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా అప్రాధాన్యమైన ఉపరాష్ట్రపతి వంటి పోస్టులో సీఎం నితీశ్ కుమార్ను కూర్చోబెట్టాలనేదే బీజేపీ అసలు ఉద్దేశమంటున్నారు. నితీశ్ కుమార్ను తప్పించి, బీహార్లో తమ పార్టీ సీఎంను కూర్చోబెట్టాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి ఖరారని భావిస్తున్న బీజేపీ హఠాత్తుగా ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించింది. అయితే, గతంలో పలుమార్లు నితీశ్ ఉపరాష్ట్రపతి పదవి చేపట్టనున్నారంటూ వచ్చిన వార్తలు విధితమే.శశిథరూర్కు ఆఫర్?ఇటీవలి కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్కు క్రమంగా దూరమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే హస్తానికి గుడ్బై చెప్పి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి శశిథరూర్ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజా రేసులో శశిథరూర్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను పార్టీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.లిస్టులో వారిద్దరూ.. ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఢిల్లీ, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనే ప్రచారం కూడా జరుగుతోంది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. బీజేపీ సీనియర్ నేత అయిన సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్లో సభ్యుడిగా వ్యవహరించారు. మోదీ తొలి కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. ఆర్టికల్ 370 రద్దు అయిన ఏడాది తర్వాత జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సిన్హా.. ఈ కేంద్ర పాలిత ప్రాంతం పాలనలో తనదైన ముద్ర వేశారు. విమర్శలు, వివాదాలతో అనేక సార్లు వార్తల్లో నిలిచారు. దీంతో, ఆయన పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత మూడేళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో.. నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఎల్జీతో వివాదం కూడా ఓ కారణమైంది. దీంతో ఆయన కేంద్రం దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గుచూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎవరు అనే ఉత్కంఠ నడుస్తోంది.

‘సమితి’లో పాక్ బండారం బయటపెట్టిన భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తీరుతెన్నులను భారత్ ఎండగట్టింది. భారతదేశం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుండగా, పాకిస్తాన్ ఒకవైపు మతతత్వం, మరోవైపు ఉగ్రవాదంలో మునిగిపోయి, భారీ రుణగ్రహీతగా మారిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.ఐక్యరాజ్యసమితిలో ‘అంతర్జాతీయ శాంతి- భద్రతను ప్రోత్సహించడం’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, భారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశమని, పురోగతి, శ్రేయస్సు, అభివృద్ధి నమూనాలలో ఎదుగుతున్నదని పేర్కొన్నారు. పొరుగుదేశం ఇందుకు భిన్నంగా ఉన్నదని ఆరోపించారు. భారత్ ఐక్యరాజ్యసమితి లక్ష్యంలో భాగస్వామ్యం వహిస్తూ, మరింత శాంతియుత, సంపన్నమైన,ప్రపంచం కోసం సమిష్టిగా కృషి చేయడంలో చురుకుగా, నిర్మాణాత్మకంగా పాల్గొంటున్నదని అన్నారు.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతుండగా, అదే సమయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల నుండి రుణాలు తీసుకోవడంలో బిజీగా ఉందని హరీష్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ, ఈ ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్ పేర్కొన్నారు. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసిందన్నారు.

డివిలియర్స్ విధ్వంసం.. ఇండియా చాంపియన్స్కు షాక్
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)సీజన్ను ఇండియా చాంపియన్స్ ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా చాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సేన 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. నార్తాంప్టన్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా చాంపియన్స్ తొలుత బౌలింగ్ చేసింది.డివిలియర్స్ విధ్వంసంఈ క్రమంలో ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (22), జాక్వెస్ రుడాల్ఫ్ (24) సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. వన్డౌన్ బ్యాటర్ సరేల్ ఎర్వీ (15) నిరాశపరచగా.. ఏబీ డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. రీఎంట్రీలో నాలుగో స్థానంలో బరిలో దిగిన ఈ లెజెండరీ బ్యాటర్ అజేయ అర్ధ శతకం సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు.Ball by ball highlights of AB de Villiers' 63*(30) vs India legends. Still got it.🐐pic.twitter.com/8S1sty9lKU— . (@ABDszn17) July 22, 2025 భారీ స్కోరుమిగతావాళ్లలో స్మట్స్ (17 బంతుల్లో 30), వాన్ విక్ (5 బంతుల్లో 18) ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా చాంపియన్స్ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఇండియా చాంపియన్స్ బౌలర్లలో పీయూశ్ చావ్లా, యూసఫ్ పఠాన్ రెండేసి వికెట్లు తీయగా.. అభిమన్యు మిథున్కు ఒక వికెట్ దక్కింది. ఇక లక్ష్య ఛేదనలో ఇండియా చాంపియన్స్ చేతులెత్తేసింది. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (2), శిఖర్ ధావన్ (1) పూర్తిగా విఫలం కాగా.. సురేశ్ రైనా (16), అంబటి రాయుడు (0) నిరాశపరిచారు.బిన్నీ ఒక్కడే.. యువీ గాయం వల్లఈ క్రమంలో స్టువర్ట్ బిన్నీ (39 బంతుల్లో 37 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో యూసఫ్ పఠాన్ (5) విఫలం కాగా.. ఇర్ఫాన్ పఠాన్ (10), పీయూశ్ చావ్లా (9), పవన్ నేగి (0), వినయ్ కుమార్ (13) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరోవైపు.. కెప్టెన్ యువరాజ్ సింగ్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ఇండియా చాంపియన్స్ 111 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో డీఎల్ఎస్ పద్ధతిలో సౌతాఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో రెండో విజయం నమోదు చేసి నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.చివరన యువీ సేనమరోవైపు.. ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్తో ఆడాల్సిన తొలి మ్యాచ్ను రద్దు చేసుకోగా ఒక పాయింట్ వచ్చింది. తాజా మ్యాచ్లో ఓటమి కారణంగా ఆరుజట్ల టోర్నీలో యువీ సేన ప్రస్తుతం ఆఖరి స్థానంలో ఉంది. కాగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో కూడిన జట్లతో.. ఇంగ్లండ్లో జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగింది. తొలి సీజన్లో యువీ సేన ఫైనల్లో పాక్ను ఓడించి గెలుపొందిన విషయం తెలిసిందే.చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్కు ఇదెలా సాధ్యమైందంటే?

బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

సూర్య కొత్త సినిమా టీజర్ రిలీజ్
'కంగువ'తో ఓ రేంజులో దెబ్బతిన్న సూర్య.. 'రెట్రో'తో కొంతమేర పర్వాలేదనిపించుకున్నాడు. ఎందుకంటే తమిళంలో మోస్తరుగా ఆడిన ఈ చిత్రం.. తెలుగులో మాత్రం ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కరుప్పు' మూవీతో వస్తున్నాడు. బుధవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం. మరి దర్శకనిర్మాతలు ఏం ఆలోచించారో ఏమోగానీ అదే టైటిల్ని యధాతథంగా ఉంచేశారు. టీజర్ చూస్తుంటే కూడా తమిళ ఫ్లేవర్ ఎక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే మాస్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్గా చేస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకుడు.(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన)

కుల్లాకర్ రైస్ : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఫలిస్తున్న కలలు
సంతాన భాగ్యానికి, ఆరోగ్య భాగ్యానికి చిరునామాగా నిలుస్తోంది అరుదైన హెరిటేజ్ రైస్ ‘కుల్లాకర్’ (Kullakar Rice). ఈ అపురూపమైన రెడ్ రైస్ పుట్టిల్లు తమిళనాడు అయినా దేశవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. దేశీ వరి వంగడాల్లో పోషకాలు, విశిష్ట ఔషధ గుణాలు కలిగిన ఒకానొక అపురూప వంగడం ఇది. గర్భ ధారణలో సమస్యలను అధిగమించాలన్నా.. లేకుండా సహజ రీతిలో సుఖప్రసవం కావాలన్నా.. ప్రసవానంతరం తల్లీ బిడ్డా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా.. అన్నిటికీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కుల్లాకర్ తదితర దేశీ వరి బియ్యాన్ని ఆశ్రయించాల్సిందేనా? దేశీ ఆవు పాలు, నెయ్యిని మెనూలో జోడించాల్సిందేనా?? అంటే.. ముమ్మాటికీ అవును అంటున్నారు ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, సుభాష్ పాలేకర్ కృషి (ఎస్పికె) సాధకులు, దేశీ విత్తన పరిరక్షకులు ఎం. విజయ్రామ్. ఆరోగ్యవంతమైన కుటుంబ జీవనానికి కుల్లాకర్ ఆరోగ్య బాటలు వేస్తోందని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ముడి కుల్లాకర్ బియ్యాన్ని అనేక గ్రామాల్లో, హైదరాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా పలువురితో తినిపించారు. వారి అనుభవాల సారాన్ని ఆయన ఎలుగెత్తి చాటుతున్నారు. కేవలం కుల్లాకర్ బియ్యం తినటం మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన సమృద్ధ జీవనానికి దోహదం చేసే ‘దేశీ ఆహారంతో కూడిన ఒక సమగ్ర జీవన విధానాన్ని ఆయన సూచిస్తున్నారు. ఇంతకీ దొడ్డు/ముతక రకం కుల్లాకర్ బియ్యం చుట్టూ అల్లుకున్న విశేషాలేమిటి? వాడిన/వాడుతున్న కుటుంబాల సుసంపన్న అనుభవాలేమిటి?? ఆలస్యం ఎందుకు.. చదవండి!మొదట సిజేరియన్.. రెండో కాన్పు నార్మల్!అప్పుడు బెంగళూరులో ఉండేవాళ్లం. మొదట కాన్పులో బాబు పుట్టినప్పుడు సిజేరియన్ ఆపరేషన్ అయ్యింది. హైదరాబాద్ వచ్చిన రోజే రెండో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. సాధారణ వైట్రైస్ తినకుండా ఉండలేకపోయేదాన్ని. కేర్లెస్గా జంక్ఫుడ్ తినేదాన్ని. ప్రీడయాబెటిక్ స్టేజ్కి వెళ్లా. రెండో కాన్పు కూడా ఆపరేషన్ తప్పదనుకున్నాం. అయితే, గర్భం దాల్చిన నాలుగు నెలల తర్వాత, విజయరామ్ గారి వీడియోలు చూసి సుఖప్రసవానికి, ఆరోగ్యానికి కుల్లాకర్ బియ్యం ఉపయోగపడతాయని తెలుసుకున్నా. అప్పటి నంచి 4–5 నెలల పాటు కులాకర్ బియ్యాన్ని మట్టిపాత్రలో వండుకొని తినటం, దేశీ ఆవు నెయ్యి, పాలు వాడటం శ్రద్ధగా చేశా. నార్మల్ డెలివరీ అయ్యింది. బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 21వ రోజే తల నిలిపాడు. స్థిమితంగా, నెమ్మదిగా ఉంటాడు. ఆకలైతేనో, నిద్ర వస్తేనో ఏడుస్తాడు. మా ఇద్దరి పిల్లలకు ఈ విషయంలో తేడా గమనించాను. డెలివరీ తర్వాత బహురూపి, నారాయణ కామిని, ఇంద్రాణి వంటి దేశీ బియ్యం తింటున్నాం. నల్లబియ్యం, ఎర్రబియ్యం దోసెలకు వాడుతున్నాం. మా ఇంట్లో రెండు వైపులా పెద్దవాళ్లకు సుగర్ ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కూర్చొని చేసే ఉద్యోగం, పైగా పని వత్తిడి. అయినా, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశీ ఆహారం తింటున్నాం కాబట్టి ఆ భయం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాం. ఆహారాన్ని ఇలా మార్చుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్, పిసిఓఎస్, పీరియడ్స్ సమస్యలు పోతాయి. మళ్లీ రావు. ఆలస్యం కాకముందే కళ్లు తెరిచి మీరేమి తింటున్నారో తెలుసుకోమని యువతకు స్వానుభవంతో ఘంటాపథంగా చెబుతున్నా. -రామవరపు సింధుకుమారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొండాపూర్, హైదరాబాద్ 3 నెలల్లోనే ఫలించిన కల పెళ్లయిన ఐదేళ్లకు తొలి కాన్పులో బాబు అనారోగ్యంతో పుట్టి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 50 రోజులకు చనిపోయాడు. ఆ తర్వాత మళ్లీ గర్భం రాలేదు. ఆ దశలో కులాకర్ బియ్యం మధ్యాహ్నం, రాత్రి వండుకొని తినటం ప్రారంభించిన మూడు నెలల్లోనే, ఎటువంటి మందులు వాడకుండానే, నా భార్య సింధూరి గర్భం దాల్చింది. తర్వాత కూడా ఏ సమస్యలూ రాలేదు. ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించింది. కులాకర్ బియ్యం గర్భం దాల్చటానికి దోహదపడుతున్నట్లు యూట్యూబ్లో విజయరామ్ వీడియో చూసి రెండేళ్ల క్రితం సేవ్ సంస్థ కార్యాలయానికి వెళ్లి కలిశాం. అప్పటి నుంచి కుల్లాకర్, బహురూపి, గోవింద భోగ్, నవార బియ్యం, దేశీ ఆవు నెయ్యి పాలు ఉపయోగిస్తున్నందు వల్లనే మా కల నెరవేరింది. ఇంట్లో అందరికీ ఆరోగ్యం చేకూరిందని నూరు శాతం నమ్ముతున్నాం. ఇవన్నీ తింటుంటే ఎగతాళి చేసిన మా అక్క ఇప్పుడు రసాయనాల్లేని దేశీ బియ్యం, దేశీ ఆవు ఉత్పత్తుల ప్రభావాన్ని గుర్తించింది. మా అత్తగారి (కడప జిల్లా వేంపల్లె) ఊళ్లో 3 ఎకరాల భూమి కొన్నా. నాకు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించబోతున్నాం. – సి. క్రాంతికుమార్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, హైదరాబాద్20 మంది కలలు పండాయి! వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగసముందర్ గ్రామంలో సంతానం కావాలనుకునే 30 మంది మహిళలకు 18 నెలల పాటు కుల్లాకర్ బియ్యాన్ని ఇచ్చి వాడించాం. అదే విధంగా, కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరు లంక గ్రామంలో 18 నెలల పాటు 20 మందికి ఈ బియ్యాన్ని తినిపించాం. వీళ్లందరూ గర్భదాల్చారు. ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టారు. పిల్లల బరువు 2.5 కేజీల నుంచి 3 కేజీల మధ్యన వుంది. పుట్టిన పిల్లలు చలాకీగా వున్నారు. వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా వుంది. ఒక సంవత్సరం లోపు పిల్లలు ఇతరుల దగ్గర వున్నప్పుడు చికాకుతో ఏడవట్లేదు. పాలు అవసరమైనప్పుడు మాత్రమే తల్లి కోసం ఏడుస్తున్నారు. మధ్యలో తల్లి కనిపిస్తూ వుంటే ఇతరులతో స్థిమితంగా వుండ గలుగుతున్నారు. తల్లుల ఆరోగ్యం బాగుంది. పిల్లలకు సరిపడా పాలు వున్నాయి. ఈ పద్ధతిని పాటించిన ఒక ప్రవాస భారతీయురాలు కుల్లాకర్ బియ్యాన్ని వాడి బిడ్డకు సరిపడా పాలు ఇవ్వడమే కాకుండా తల్లి పాల బ్యాంకుకు తన పాలను దానం చేయగలిగింది. చాలా మంది గర్భవతులకు సహజ సిద్ధంగా సులభ ప్రసవం జరిగింది. 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేని తల్లి ఈ బియ్యాన్ని వాడి 40 రోజుల్లోనే గర్భవతి అయ్యింది. అంతకు మునుపు అబార్షనై, పిసిఓడితో బాధపడే ఒకామె ఈ బియ్యాన్ని 6 నెలలు వాడి పండంటి బిడ్డను కన్నారు. ప్రైవసీ కోసం వారందరి పేర్లు బహిరంగంగా ఇవ్వలేకపోతున్నాం. ఆసక్తి గల ఎవరైనా హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ రోడ్డులోని ‘సేవ్’ ఆఫీసు(సుంకర వెంకట రమణ: 63091 11427) ను సంప్రదించి, వారితో ఫోనులో మాట్లాడొచ్చు. తర్వాత నేరుగా కలవొచ్చు కూడా!– ఎం. విజయ్ రామ్, దేశీ విత్తన పరిరక్షకులు, సుభాష్ పాలేకర్ కృషి (ఎస్పికె) సేద్య విధాన సాధకులు, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు కుల్లాకర్లో పోషకాలేమిటి?సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే దేశీ వరి బియ్యంలో అద్భుతమైన పోషక / ఔషధ విలువలు చెక్కు చెదరలేదన్న విషయం మనకు బోధపడుతుంది. అపారమైన దేశీ వరి జీవవైవిధ్యం చాలా వరకు కాలగర్భంలో కలసిపోయింది. అయితే, కొద్ది మంది ముందుచూపున్న రైతులు ఇప్పటికీ అనేక వందల అలనాటి వరి వంగడాలను ఏటేటా సాగు చేస్తూనే ఉన్నారు. వీటిని అపురూపంగా పరిరక్షించుకుంటున్నారు. ఇంతకీ, ఏ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఏయే దేశీ వరి బియ్యం ఉపయోగపడతాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు! అందుకే ఈ ఆహారమే ‘దివ్యౌషధం’ అయ్యింది!! చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్స్ సిస్టమ్స్ (సిఐకెస్) అనే స్వచ్ఛంద సంస్థ ‘ట్రెడిషినల్ రైస్ వెరైటీస్ ఆఫ్ తమిళనాడు: ఏ సోర్స్ బుక్’ అనే సంకలనాన్ని 2019లో ప్రచురించింది. దీని ప్రకారం.. సేంద్రియంగా పండించిన కుల్లాకర్ బాయిల్డ్ (ఉప్పుడు) బియ్యంలో వివిధపోషకాలు మెండుగా ఉన్నాయి. గ్లైసెమిక్ ఇండెక్స్(జిఐ) తక్కువ. ఐరన్, కాల్షియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

మిగ్-21.. ‘రష్యన్’ యుద్ధ విమానానికి వీడ్కోలు!
మిగ్-21 యుద్ధ విమానాలు.. ఇవి రష్యన్ ఫైటర్ జెట్స్. ఒకప్పుడు యుద్ధాల్లో భారత్ విజయానికి బాటలు పరిచిన మిగ్స్.. పిట్టల్లా నేల కూలి, ఎందరో పైలట్ల ప్రాణాలు తీసి ‘ఎగిరే శవపేటికలు’ గానూ అపకీర్తి మూటగట్టుకున్నాయి. 60 ఏళ్లపాటు మనల్ని కంటికి రెప్పలా కాపాడిన మిగ్-21 విమానాలు ఇక భారత నేలను ముద్దాడి ఈ మట్టిపైనే శాశ్వత విశ్రాంతి తీసుకోబోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు కల్లా మిగ్-21 యుద్ధ విమానాలను విడతలవారీగా సేవల నుంచి తప్పించాలని, దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ మార్క్-1ఎ’ను వాటి స్థానంలో మోహరించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) భావిస్తోంది.భారత్ వద్ద ప్రస్తుతం 36 మిగ్-21లు ఉన్నాయి. వీటిలో చివరి వేరియంట్ అయిన ‘బైసన్’ను ఇప్పుడు సేవల నుంచి తొలగించనున్నారు. మనకు మిగ్-21 సేవలు 1963లో తొలిసారి ప్రయోగాత్మకంగా మొదలయ్యాయి. అప్పటినుంచి రష్యన్ సుఖోయ్ ఎస్యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు భారత్ చేతికి అందే వరకు కొన్ని దశాబ్దాల పాటు భారత వైమానిక దళానికి మిగ్-21 వెన్నెముకగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఇటు రక్షణ పరంగానూ, అటు ప్రత్యర్థులపై దాడుల పరంగానూ మన వైమానిక దళానికి గగనతలంలో స్పష్టమైన ఆధిపత్యం కట్టబెట్టింది ఈ యుద్ధ విమానమే.సోవియట్ కాలంలో తయారీ!సోవియట్ యూనియన్ హయాంలో మికోయాన్-గురెవిచ్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన మిగ్-21 ఫైటర్ జెట్ తొలిసారిగా రెక్కలు విప్పుకుని 70 ఏళ్ల క్రితం 1955లో ఆకాశంలో రివ్వున ఎగిరింది. శక్తిమంతమైన ‘తుమన్ స్కై ఆర్-25’ టర్బోజెట్ ఇంజిన్ సాయంతో ఈ విమానం ధ్వని వేగానికి రెండు రెట్ల పైబడిన వేగం అందుకుంటుంది. ఒకప్పుడు మన దేశంలో 900 దాకా మిగ్-21 ఫైటర్ జెట్స్ ఉండేవి. వాటిలో 660 విమానాలను నాటి ఒప్పందం మేరకు ఇండియాలోనే హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారుచేశారు.1965, 1971 సంవత్సరాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాల్లో, 1999లో కార్గిల్ యుద్ధంలో మిగ్-21 తనదైన ముద్ర వేసింది. 2019లో బాలాకోట్ (పాక్)లోని ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన దాడుల్లోనూ కీలక పాత్ర పోషించింది. మిగ్-21లో మూడో తరానికి చెందిన ‘మిగ్-21 బిస్’ను 1976లో మన వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఇక రాడార్, ఏవియానిక్స్, ఆయుధ వ్యవస్థల పరంగా మరింత అధునాతనమైన ‘మిగ్-21 బైసన్’ వేరియంట్ వీటిలో చివరిది.మిగ్-21 బైసన్.. అరివీర ‘డాగ్ ఫైటర్’!నరాలు తెగే ఉత్కంఠ పుట్టించేలా రెండు యుద్ధ విమానాలు గగనతలంలో ఊహకందని విన్యాసాలతో అతి సమీపంగా ఒకదానికొకటి భీకరంగా తలపడుతూ రెండో దానిపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తే అది... ‘డాగ్ ఫైట్’! క్షిపణుల వంటి ఆధునిక ఆయుధాలు లేని తొలినాళ్లలో యుద్ధ విమానాలకు మెషీన్ గన్స్ ఉండేవి. శత్రు యుద్ధ విమానాన్ని కూల్చడం కోసం కాల్పులు జరపడానికి రెండో విమానం మొదటి దానికి బాగా దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది.ఇలా రెండు విమానాలూ మెరుపు వేగంతో పైకీ, కిందికీ కదులుతూ, హఠాత్తుగా మలుపులు తీసుకుంటూ, ఒకదానికి మరొకటి చిక్కకుండా గిరికీలు కొడుతూ హోరాహోరీగా ‘డాగ్ ఫైట్’లో పాల్గొనేవి. మిగ్-21 బైసన్ గొప్ప ‘డాగ్ ఫైటర్. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఆర్-73 క్షిపణులను దానికి అమర్చారు. ఆరితేరిన సుశిక్షిత పైలట్ దొరకాలే గానీ.. ప్రత్యర్థిపై మిగ్-21 బైసన్ వీరోచితంగా విరుచుకుపడుతుందనడంలో కించిత్ అతిశయోక్తి లేదు! 2004లో ‘కోప్ ఇండియా’ పేరిట భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అతి సమీప యుద్ధ విన్యాసాల సందర్భంగా అమెరికన్ ఎఫ్-15 ఫైటర్ జెట్స్ కంటే మిగ్-21 బైసన్ విమానాలు మెరుగ్గా రాణించి ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి.కూలిన మిగ్స్ 400... 200 మంది పైలట్ల మృతి!చారిత్రకంగా భారత వైమానిక దళానికి ఎన్ని సేవలందించినా, ఎన్ని విజయాలు సాధించిపెట్టినా, దేశ భౌగోళిక ప్రాంతాన్ని ఎంత గొప్పగా పరిరక్షించినా మిగ్-21లకు ‘ఎగిరే శవపేటికలు’గా, ‘వితంతువుల సృష్టికర్త’ (Widow Maker)గా చెడ్డ పేరు మాత్రం తప్పలేదు. మన దేశంలో గత 60 ఏళ్లలో మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయిన సంఘటనలు 400 దాకా ఉన్నాయి. 200 మందికి పైగా ఐఏఎఫ్ పైలట్లు, 60 మందికి పైగా పౌరులు ఆయా దుర్ఘటనల్లో మరణించారు. ఉద్దేశిత కాలం కంటే సుదీర్ఘ కాలంపాటు ఈ యుద్ధ విమానాలను సర్వీసులో ఉంచడంతో ఇటు భారీగా ప్రాణనష్టం సంభవించగా అటు జెట్స్ నిర్వహణ ఖర్చూ పెరిగిపోయింది.2023 మే మాసంలో ఓ మిగ్-21 విమానం బహ్లాల్ నగర్ (రాజస్థాన్) వద్ద సాంకేతిక లోపంతో కూలిపోవడంతో ముగ్గురు గ్రామస్థులు మరణించారు. ఆ దుర్ఘటనతో మన వైమానిక దళం మిగ్-21 శ్రేణి విమానాలన్నిటినీ గ్రౌండ్ చేసింది. ఇక వీడ్కోలు యాత్రలో భాగంగా స్క్వాడ్రన్-4కు చెందిన మిగ్-21 బైసన్ విమానం చివరిసారిగా 2023 అక్టోబరులో రాజస్థాన్ పట్టణమైన బార్మర్ గగనవీధుల్లో చక్కర్లు కొట్టింది. యూరప్ ఖండంలో చివరి మిగ్-21 గత ఏడాది క్రొయేషియాలో రిటైరైంది. మరో రెండు నెలల్లో మన దేశంలోనూ మిగ్-21 అధ్యాయం ముగియబోతుంది. మిగ్-29 యుద్ధ విమానాలకు కూడా 2027 నాటికి స్వస్తి పలకాలని ఐఏఎఫ్ భావిస్తోంది. - జమ్ముల శ్రీకాంత్.

ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే.. ఆంధ్రాను అమ్మాలి
ఎన్నికలకు ముందు చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక మహా శక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ.. ఒక్కొక్కరికీ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం. – 2024 మార్చి 13న టీడీపీ ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్లో పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చంద్రబాబుఏరుదాటాక.. అచ్చెన్న ఆడవాళ్లకు నెలకు రూ.1,500 హామీని అమలు చేయాలంటే, ఆంధ్రానే అమ్మాలి. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి? పథకం ఎలా అమలు చేయాలి? అని ఆలోచన చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. – విజయనగరం జిల్లా సభలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు‘ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాం. ఎలా అమలు చేయాలో తెలుసుకున్నాకే హామీ ఇచ్చాం. సూపర్ సిక్స్ వెరీ క్లియర్. ఇది మా ఎష్యూరెన్స్. పూర్తి చేస్తామని చెబుతున్నా. కెమేరాలు ఉన్నాయి. రికార్డు చేసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. చేయకపోతే ప్రజలకు కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా ఉంటుంది. –2023 డిసెంబరులో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో నారా లోకేశ్‘వైఎస్సార్సీపీ నాయకులు అడుగుతున్నారు హామీలు ఎలా నిలబెట్టుకుంటారని...? అలాంటి వారందరికీ మీ లోకేశ్ ఒకటే సమాధానం ఇస్తున్నాడు. జగన్ అప్పుల అప్పారావు అయితే, మా చంద్రన్న సంపద సృష్టికర్త. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి మా చంద్రన్న మహాశక్తి ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా నాలుగు ప్రకటనలు ఉన్నాయి. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 వాళ్ల ఖాతాలో వేస్తున్నాం. సంవత్సరానికి రూ.18 వేలు. ఐదేళ్లు రూ.90 వేలను తెలుగింటి ఆడపచుల అకౌంట్లలో మన చంద్రన్న వేయబోతున్నాడు’ –2023లో ఓ బహిరంగ సభలో నారా లోకేశ్‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ... రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం’–ప్రజాగళం పేరుతో 2024 ఏప్రిల్ 30న చంద్రబాబుతో కలిసి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా అందులో పేర్కొన్న హామీల అమలుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.‘చంద్రబాబు–పవన్కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ‘19–59 సంవత్సరాల వరకు’ అన్నది కూడా లేకుండా, భవిష్యత్కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి ‘18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500’ అంటూ ప్రత్యేక కరపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ పంచుతూ ప్రచారం చేశారు’.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని ఇంటింటా బాండ్లు పంపిణీ చేసి.. తీరా గద్దెనెక్కాక చంద్రబాబు, కూటమి నేతలు మాట తప్పారు. సూపర్ సిక్స్ కింద మేనిఫెస్టోలో కూడా చేర్చి ఆ హామీ అమలు చేయకుండా మోసం చేశారు. తొలి ఏడాది రూ.32,400 కోట్లు ఎగ్గొట్టి అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ‘ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేం’ అని చేతులెత్తేశారు. ప్రభుత్వ మోసం కారణంగా ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో మహిళలు గడిచిన 13 నెలల్లో ఏకంగా రూ.35,100 కోట్లు కోల్పోయారు. అధికారమే పరమావధిగా హామీల వర్షం కురిపించి.. ప్రజలను నమ్మించి.. గద్దెనెక్కాక వారిని నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు చాటుకున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీకి చెందిన చిన్న, పెద్ద నాయకుల వరకు ప్రజల ఇళ్లకు వెళ్లి తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చేలా పథకం అమలు చేస్తారని ఊదరగొట్టారు. ‘గ్యారంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. తీరా 13 నెలల పాటు పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి.. ఇప్పుడేమో ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రాన్నే అమ్మాల్సి ఉంటుందంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం కూటమి మోసాలకు పరాకాష్టగా నిలిచింది. ఎగవేతపై 2 నెలల కిందటే బాబు సంకేతాలు⇒ ఆడ బిడ్డ నిధి హామీ అమలుపై సీఎం చంద్రబాబు పూర్తిగా చేతులేత్తేసినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి రెండు నెలల కిందటే కర్నూలు బహిరంగ సభలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఆయన మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో పి–4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికీ పేదలు మిగిలితే అడ్డబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు పి–4కు అనుసంధానం చేసి మహిళల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తానంటూ కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.⇒ అంటే 2029 వరకు ఈ పథకం అమలు ఉండదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి... ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం అనే ఉద్దేశం తప్ప... ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లేదని వివరిస్తున్నారు. ఇందులోభాగంగానే హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు సాకులు మీద సాకులు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు.మహిళలు నష్టపోయిన మొత్తం రూ.35,100 కోట్లు⇒ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీరంతా 18 ఏళ్లు దాటినవారే. ఈ నేపథ్యంలో... టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు చెప్పిన హామీ ప్రకారం మొత్తం 2.10 కోట్ల మందికి ప్రభుత్వం ప్రతి నెల రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన దాదాపు 30 లక్షల మంది పెన్షనర్లను తీసేసినా రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. వారికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున 13 నెలల కాలంలో మొత్తం రూ.35,100 కోట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.⇒ ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటినుంచి అమలవుతుందా? అని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 13 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్క నెల ఆలస్యం అయ్యేకొద్దీ వారు కోల్పోతున్న మొత్తం పెరుగుతోంది. ఇలా గత 13 నెలల్లో రాష్ట్రంలోని పేద మహిళలందరూ నెలకు ఏకంగా రూ.2,700 కోట్ల చొప్పున ఇప్పటికి రూ.35,100 కోట్ల లబ్ధిని కోల్పోయారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్కోవిడ్ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కుతగ్గని వైనంమేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంత పవిత్రంగా భావించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేస్తామని నిరూపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారులు, అనుకోని విపత్తులు వచ్చినా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కుతగ్గలేదు.2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును అపలేదు. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న పథకాలను చూపిస్తూ.. ‘రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందోంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దుష్ప్రచారం చేసింది. తీరా సరిగ్గా ఎన్నికల సమయానికి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు కూటమి హామీల వరద పారించింది. అధికారం దక్కాక మాత్రం వాటిని ఒక్కోటిగా పక్కనపెడుతోంది.కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా..! కూటమి ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను నట్టేట ముంచారు. ఆడబిడ్డ నిధి, బీసీ మహిళలకు 50 ఏళ్ల మహిళలకే పెన్షన్ ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని, రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ మంత్రులతో చెప్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా? – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం ఇది మంచి ప్రభుత్వమా? ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం–సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయలేమని వ్యాఖ్యలు చేయడం మీకు తగునా అచ్చెన్నాయుడు? ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ? – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం ముందుగా తెలియదా? కూటమి పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చాయని మరోమారు తేటతెల్లమైంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి హామీలు అమలు చేయగలమా లేదా అనేది ముందుగా తెలియదా? చేయలేమని తెలిసీ ఎందుకు హామీలు ఇచ్చారు? – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంమహిళలను నిలువునా మోసం చేశారు.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలనడం మహిళలను ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసేందుకు కుట్రలు పన్నుతుందో తెలుస్తోంది. మొదటి ఏడాది ఎగ్గొట్టినా రెండో ఏడాది నుంచి అయినా ఇస్తారని చూస్తున్న మహిళల నోట్లో కూటమి మన్ను కొట్టింది. అధికార దాహంతో హామీలు గుప్పించారు. అమలు చేయలేక చేతకాని మాటలు మాట్లాడటం మహిళలను నిట్టనిలువునా మోసం చేయడమే. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్అబద్ధపు హామీలిచ్చారా? చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు కళ్లు మూసుకుపోయిన అబద్ధపు హామీలు ఇచ్చారా? మీ మాటలు నమ్మి ఆడబిడ్డలు ఓట్లు వేశారు. వారిని మోసం చేసేందుకు చంద్రబాబే అచ్చెన్నాయుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తే కాని తీర్చలేని హామీలు మీకు ఎవరు ఇమ్మన్నారు? – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్సంపద సృష్టిస్తానని చేతులెత్తేశారు! ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు చీతొలి అడుగుచీ అంటూ టీడీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తా.. పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడేమో మంత్రి అచ్చెన్నాయడు చీఆడబిడ్డ నిధిచీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలంటున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – విడదల రజిని, మాజీ మంత్రి అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేస్తారా? సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలా? అలా మాట్లాడడానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడు? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? – ఆర్కే రోజా, మాజీ మంత్రి చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అని అచ్చెన్నాయుడు అనడం దారుణం. ఈ విషయం ఎన్నికలప్పుడు చంద్రబాబుకు తెలియదా? అమలు చేయలేని హామీలివ్వడం అంటే ప్రజలను మోసం చేయటమే కాదా? హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసి మంత్రులతో ఇలా నిస్సిగ్గుగా మాట్లాడించడంతో చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిఘంటువులో కొత్త పదం వెతకాలి. ఆడబిడ్డ నిధి అమలుకు రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని మంత్రి మాట్లాడటం మహిళలను అవమానపరచడమే. వాగ్దానాలు ఇచ్చినప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి సంతకానికి ఉన్న విలువ ఇదేనా? కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఆశలపై వెన్నుపోటు పొడిచారు. అచ్చెన్నాయుడు నోట మాట వచ్చిందంటే అది చంద్రబాబు మాటే. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామంటూ వివిధ నూతన విధానాల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. కూటమి దగాకోరు మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. – డాక్టర్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రిఅచ్చెన్నాయుడూ.. సిగ్గుండాలి రాష్ట్రాన్ని ఇప్పటికే అమ్మేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా ఏదో ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యలు చేయడానికి అచ్చెన్నాయుడుకి సిగ్గుండాలి. ఏరు దాటాక తెడ్డు తగలేసే వైఖరి కూటమిది. ఆడబిడ్డలకు ఇస్తానన్న పథకాలను అమలు చేయకపోగా సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్రాన్ని అమ్మాలని అనటం సబబు కాదు. మహిళలను వంచిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి హామీలు ఎందుకిచ్చారు? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేస్తోంది. ఆడబిడ్డలకు ఈ ప్రభుత్వ అబద్ధపు హామీలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇచ్చారో కూటమి నేతలు చెప్పాలి. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి నమ్మించి.. నయ వంచన.. ‘ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశాను. ఆ కష్టాల నుంచి బయట పడేయడానికి ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చాం’ అని ఎన్నికల ముందు ప్రతి సభలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి నెలా రూ.1,500లు చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నయవంచన చేశారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ ప్రజలను దగా చేసింది.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గు చేటు. అలవికాని హామీలిచ్చి టీడీపీ ప్రజలను నిలువుగా దగా చేసింది. ఓటు వేసినందుకు ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. – పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ పథకాలకు ఎగనామం పెట్టేందుకే .. ఆడబిడ్డ నిధి సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఏపీనే తాకట్టు పెట్టాలని టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు అనడం ఆశ్చర్యకరంగా ఉంది. సంక్షేమ పథకాల హామీలకు ఎగనామం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. సూపర్ సిక్స్తో పాటు 143 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. – కేకే రాజు, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ మెడలు వంచుతాం అలవిగాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారు. ఏడాదిలోనే రూ.1,87,000 కోట్ల అప్పులు చేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబు జీవితమంతా మోసపూరితం, కుట్రలే. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా పోరాటం చేస్తాం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రజలు ప్రభుత్వ భరతం పడతారుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందనే కనీస పరిజ్ఞానం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని అమ్మినా చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయలేరు. బాబు ష్యూరీటీ, మోసం గ్యారెంటీ అని తేలిపోయింది. ప్రజలంతా ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాటపై నిలబడే ప్రభుత్వం కాదిది కూటమిది మాటపై నిలబడే ప్రభుత్వం కాదని తెలిసిపోయింది. మేనిఫెస్టోను అమలు చేయలేమని వారికి కూడా తెలుసు. అయినా ఎన్నికల్లో నీకు రూ.18వేలు, నీకు రూ.18వేలు అని మహిళందరికీ చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేసే కార్యక్రమంలో భాగంగానే అచ్చెన్నాయుడితో మాట్లాడించారు. – పి.రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు మహిళలను మోసగించే ఎత్తుగడ మహిళలకు రూ.1,500 ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలా? మంత్రి అచ్చెన్నాయుడి మాటలు మహిళలను మోసగించే ఎత్తుగడ అని స్పష్టమవుతుంది. చంద్రబాబు జీవితమంతా ప్రజలను మోసగించడమే. అమలుకాని హామీలు ఇవ్వడం ఆ తరువాత వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు దమననీతికి నిదర్శనం. పథకం అమలుకు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటు. ఆడబిడ్డనిధిని అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి పాలన దగా కోరుకు నిదర్శనం. – శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
‘37 లక్షల కుక్క కాట్లతో రేబిస్ నిర్మూలన సాధ్యమా?’: కార్తీ చిదంబరం
‘అభ్యంతరకరమైన పదాలు వాడాడు’.. గిల్ స్ట్రాంగ్ కౌంటర్!
కుల్లాకర్ రైస్ : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఫలిస్తున్న కలలు
తెలంగాణ కాంగ్రెస్లో పదేళ్ల లొల్లి!
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
సూర్య కొత్త సినిమా టీజర్ రిలీజ్
‘డబ్బా ట్రేడింగ్’ చట్ట విరుద్ధం
హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్లెస్ ఫెలో
డివిలియర్స్ విధ్వంసం.. ఇండియా చాంపియన్స్కు షాక్
జీసీసీల నిర్వహణకు కోవాసెంట్ ‘ఎనేబ్లర్’ సేవలు
'ఫిష్ వెంకట్'కు ఎందుకు సాయం చేయాలి: నట్టి కుమార్
తల్లి సమాధి దగ్గర మంచు లక్ష్మి.. వీడియో
‘డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు దుబాయ్ వెళ్లింది’
వలసదారులకు గుడ్ న్యూస్.. ఇక ఊపిరి పీల్చుకోండి..!
మీరు మమ్మల్ని రష్యా మీదికి ఉసిగొల్పారా? లేక రష్యాను మా మీదికి ఉసిగొల్పారా అని ఉక్రెయిన్ అంటోంది సార్!
రష్యాతో శాంతి చర్చలకు సిద్ధం - ఉక్రెయిన్
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఇండియా కూటమికి ఆప్ గుడ్ బై
చట్టాలు చేసే వారికి సదుపాయాలు ఇవ్వాలి కదా!: ఏసీబీ కోర్టు
శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?
ప్రతి తప్పు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది: తమన్నా
బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ‘విఫా’.. ఏపీలో భారీ వర్షాలు
భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏంటంటే?
భాగ్యనగరంలో వైభవంగా బోనాల ఉత్సవాలు (ఫొటోలు)
ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభం
రోజూ ఆ అరెస్టు వీడియోను చూస్తేకానీ నిద్రపోరు!
వృత్తిపరంగా ఇబ్బందుల్లో ఉన్నా.. యాంకర్ రష్మీ పోస్ట్
ఓటీటీలో 'మార్గన్'.. ట్విస్ట్ ఇస్తూ ప్రకటన
ఏయ్ బాబూ, ఫోన్ తీయ్.. హీరో వార్నింగ్.. వీడియో వైరల్
‘37 లక్షల కుక్క కాట్లతో రేబిస్ నిర్మూలన సాధ్యమా?’: కార్తీ చిదంబరం
‘అభ్యంతరకరమైన పదాలు వాడాడు’.. గిల్ స్ట్రాంగ్ కౌంటర్!
కుల్లాకర్ రైస్ : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఫలిస్తున్న కలలు
తెలంగాణ కాంగ్రెస్లో పదేళ్ల లొల్లి!
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
సూర్య కొత్త సినిమా టీజర్ రిలీజ్
‘డబ్బా ట్రేడింగ్’ చట్ట విరుద్ధం
హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్లెస్ ఫెలో
డివిలియర్స్ విధ్వంసం.. ఇండియా చాంపియన్స్కు షాక్
జీసీసీల నిర్వహణకు కోవాసెంట్ ‘ఎనేబ్లర్’ సేవలు
'ఫిష్ వెంకట్'కు ఎందుకు సాయం చేయాలి: నట్టి కుమార్
తల్లి సమాధి దగ్గర మంచు లక్ష్మి.. వీడియో
‘డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు దుబాయ్ వెళ్లింది’
మీరు మమ్మల్ని రష్యా మీదికి ఉసిగొల్పారా? లేక రష్యాను మా మీదికి ఉసిగొల్పారా అని ఉక్రెయిన్ అంటోంది సార్!
రష్యాతో శాంతి చర్చలకు సిద్ధం - ఉక్రెయిన్
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఇండియా కూటమికి ఆప్ గుడ్ బై
చట్టాలు చేసే వారికి సదుపాయాలు ఇవ్వాలి కదా!: ఏసీబీ కోర్టు
బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ‘విఫా’.. ఏపీలో భారీ వర్షాలు
ప్రతి తప్పు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది: తమన్నా
శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?
భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏంటంటే?
ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభం
వృత్తిపరంగా ఇబ్బందుల్లో ఉన్నా.. యాంకర్ రష్మీ పోస్ట్
రోజూ ఆ అరెస్టు వీడియోను చూస్తేకానీ నిద్రపోరు!
ఓటీటీలో 'మార్గన్'.. ట్విస్ట్ ఇస్తూ ప్రకటన
ఏయ్ బాబూ, ఫోన్ తీయ్.. హీరో వార్నింగ్.. వీడియో వైరల్
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు
'వీరమల్లు' నిర్మాతకు కీలక పదవి.. ప్రకటించిన పవన్ కల్యాణ్
సినిమా

అద్భుత పోరాటం
హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ‘వార్ 2’ ఆరవ చిత్రంగా రాబోతోంది.ఈ సినిమా ట్రైలర్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ల పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన ఎన్టీఆర్–హృతిక్ రోషన్ తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.ఇదొక లైఫ్ టైమ్ మూమెంట్. ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ నెల 25న ‘వార్ 2’ ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటమే ఈ సినిమా. జూలై 25ని మీ క్యాలెండర్లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి’’ అని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పేర్కొంది.

చిన్న విరామం
హీరో మహేశ్బాబు సినిమా షూటింగ్కు చిన్న విరామం ఇచ్చారు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’(వర్కింగ్ టైటిల్) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కేఎల్ నారాయణ నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ పడింది. వెకేషన్లో భాగంగా ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లారు మహేశ్బాబు. మరోవైపు బహమాస్ తీరంలో సేద తీరుతున్నారు ప్రియాంకా చోప్రా. ఇంకోవైపు ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులపై రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. ఇలా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ఆగస్టులో ప్రారంభమవుతుందని తెలిసింది.ఈ చిత్రం గత షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో జరిగింది. ఆగస్టులో మొదలుకానున్న కొత్త షెడ్యూల్ విదేశాల్లో మొదలవుతుందా? లేక హైదరాబాద్ శివార్లలో వేసిన వారణాసి సెట్లో ప్రారంభం అవుతుందా? ఈ విషయంపై స్పష్టత రావాలి.

పవన్ వ్యాఖ్యలు.. ట్రెండింగ్లో #BoycottHHVM
పవన్ కల్యాణ్ ప్రవర్తన వింతగా ఉంటుంది. సినిమాలు వేరు రాజకీయాలు వేరని ఆయనే చెబుతాడు. మళ్లీ ఆయనే సినిమా వేదికపై రాజకీయాలు, రాజకీయ వేదికలపై సినిమా విషయాలు మాట్లాడుతాడు. పవన్ ప్రవర్తనే ఇప్పుడు ఆయన సినిమాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఆయన హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమాకు ఇప్పుడు నిరసన సెగ తగిలింది. పవన్ వ్యాఖ్యలతో విసుగెత్తిపోయిన వైఎస్సార్సీసీ అభిమానులకు తోడు అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా హరిహర వీరమల్లు సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో #BoycottHHVM ట్యాగ్ ఇప్పుడు ట్విటర్లో ట్రెండింగ్గా మారింది.ఏం జరిగిదంటే..తాజాగా జరిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ రాజకీయాలు మాట్లాడారు. సినిమా గురించి చెప్పడం మరచి.. ‘గతంలో భీమ్లా నాయక్ సినిమా టికెట్ రూ.10-15 పెట్టిన నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. మన సత్తా ఏంటో చూపిద్దాం’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. దీనికి ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఇప్పుడు ఇదే నిరసనకు దారి తీసింది. వైఎస్సార్సీపీ అభిమానులు పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సినిమాను బాయ్కాట్ చేస్తున్నారు. మేమే కాదు ..మాతో పాటు మరో 20-30 మందిని కూడా సినిమాను చూడనియ్యబోమంటూ #BoycottHHVM హ్యాష్ట్యాగ్తో ట్వీట్స్ చేస్తున్నారు.స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా..అభిమానం ఉంటే ఆ హీరో సినిమాలు చూడాలే తప్ప ఇతర హీరోల సినిమాలను నాశనం చేయకూడదు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఏ హీరోకైనా కాస్త పేరొస్తే చాలు.. ఆయన సినిమాను తొక్కేయాలని చూస్తారనే టాక్ టాలీవుడ్లో ఉంది. గతంలో బన్నీ, మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలపై ట్రోల్స్ చేశారు. పుష్ప 2 రిలీజ్ అప్పుడు అయితే అల్లు అర్జున్పై దారుణమైన కామెంట్స్ చేస్తూ.. సినిమాను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఇతర హీరోల ఫ్యాన్స్ అన్నట్లు అందరి హీరోల సినిమాలను ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా పవన్ సినిమాపై పగ బట్టారు. తాము హరిహర వీరమల్లు సినిమాను చూడబోం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ..తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్సీపీ అభిమానులు, మరోవైపు స్టార్ హీరోల ప్యాన్స్ దెబ్బకి #BoycottHHVM హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది.అనవసరం గా కెలుక్కున్నారు రా సైనిక్స్..మీకు ర్యాంప్ ఆడిస్తున్నారు AA Army 🔥🔥🔥😂😂🔥🔥 #AAArmy #BoycottHHVM pic.twitter.com/JbrppHXqqk— నల్లపరెడ్డి 🔥🔥🔥 (@naveenk23021806) July 21, 2025Get ready to face trolls #HHVMమూవీస్ లో రాజకీయం చేయకండి రా అంటే వినరు అనుభవిస్తారు ఇప్పుడు చూస్తాం ఎలా ఆ మూవీ హిట్ అవుతుందో.....✊🏿✊🏿 గతం లో జరిగినది మర్చిపోయినట్టు ఉన్నారు ఈ సారి బాగా గుర్తుండిపోతుంది..... #BoycottHHVM#BoycottHHVM pic.twitter.com/SH7yvXWHFI— Aji (@AJAY83527762580) July 21, 2025ముందు నూయ్ వెనక గుయ్ అన్నటుంది చాలా రిస్క్లో పడ్డాడు @PawanKalyan 🫣🤭NTR FANS MINGUTHARU :::..🔥🔥MH & AA FANS THANTARU:::🔥🔥YSRCP FANS KINDA KOSTARU :::::ఎటు చూసినా కింద మీద వాయిస్తున్నారు 🔥🔥#BoycottHHVM #BoycottHHVM pic.twitter.com/2JXfcONayv— Aji (@AJAY83527762580) July 21, 2025#BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #pk🐕 pic.twitter.com/X2WNe3EFY0— Tony (@Youth4YSRCP) July 22, 2025Hero Evaru..............?Hero Name Cheppandi Ra Ayya .....?Hero Brahmanandam Antunnaru ..?Nijamena..........? 🤣🤣#BoycottHHVM pic.twitter.com/8VGiub64Ag— Lakshmi Reddy (@Lakshmired7313) July 22, 2025నిన్న మొన్నటి నుండి #BoycottHHVM అని మా వాళ్ళు అంటుంటే సరే అని లైట్ తీసుకున్న కానీ ఈరోజు కొంతమంది గాంజ నా కొడుకులు నా అన్న @ysjagan గురించి తప్పుగా మాట్లాడారు 🔥చూస్కుందాం బారాబర్ చూస్కుందాం 🔥🔥సినిమాని చూడాలి అనుకునేవాళ్ళను కూడా మీ అతితో నాశనం చేసుకుంటున్నారు 🤙#BoycottHHVM pic.twitter.com/uZTQOwhmoT— jagan__fan__kurnool (@darvesh_md25012) July 22, 2025సినిమా వాళ్ళు ఇంకా మారారా ??#HariHaraVeeraMallu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు !!#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం !! pic.twitter.com/qAJzYhjj6f— cinee worldd (@Cinee_Worldd) July 21, 2025సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడతారా.. ముందు ముందు ఉంది రా మీకు జాతర..YCP boys.. HHVM is a disaster movie #BoycottHHVMpic.twitter.com/U2d1IoQjeb— 𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳 (@JustAsking2_0) July 21, 2025నా దగ్గర డబ్బులు లేవు అని బీద అరుపులు అరిచి, వాడికున్న అలాగా ఫాన్స్ దగ్గర నుండి ఓపెనింగ్స్ రాబెట్టుకొని(తల్లి చెల్లి పెళ్ళాం దగ్గర పుస్తులు తాకట్టు పెట్టి మరీ కొంటారు పిచ్చి నా) నెక్స్ట్ మూవీకి ఎక్సట్రా పేమెంట్ అడుగుతాడు.ఇది బుర్ర తక్కువ వెధవలికి అర్ధం కాదు🤣😂.#BoycottHHVM pic.twitter.com/Rxs0Wfd1xh— గంగ పుత్రుడు (@bheesmudu) July 22, 2025సినిమా టికెట్ ధర పెంచి గర్వంగా చెప్పుకోవడం కాదు...💦💦💦దమ్మూ ధైర్యం ఉంటే రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి గర్వంగా చెప్పుకోండి... #BoycottHHVM pic.twitter.com/IZ3Oa93n6j— Ayyapa Reddy (@YSJaganMarkGove) July 22, 2025Get ready to face trolls #HHVMమూవీస్ లో రాజకీయం చేయకండి రా అంటే వినరు అనుభవిస్తారు ఇప్పుడు చూస్తాం ఎలా ఆ మూవీ హిట్ అవుతుందో.....✊🏿✊🏿 గతం లో జరిగినది మర్చిపోయినట్టు ఉన్నారు ఈ సారి బాగా గుర్తుండిపోతుంది..... #BoycottHHVM#BoycottHHVM pic.twitter.com/SH7yvXWHFI— Aji (@AJAY83527762580) July 21, 2025

ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా?.. చాహల్ ప్రియురాలి పోస్ట్ వైరల్!
గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఆర్జే మహ్వశ్. ఆమె టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఒక్కసారిగా పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ చాహల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ మరిన్ని కథనాలు వెలువడ్డాయి.తాజాగా ఇంగ్లాండ్లో ఈ జంట సందడి చేశారు. ఓకే లోకేషన్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో మరోసారి మహ్వశ్-చాహల్ డేటింగ్పై వార్తలొచ్చాయి. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ సైతం ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఈ ప్రేమజంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ నెల అంటే జూలై 31 తన పెళ్లి జరగనుందని ఓ ఛానెల్లో వార్తలొచ్చాయి. ఈ ఫోటోలు కూడా నా పెళ్లికి సంబంధించినవే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కొడుకు పారిపోయాడు.. మరి ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఫన్నీగా పోస్ట్ చేసింది. తాజాగా తీసుకున్న ఫోటోషూట్ పిక్స్ను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. అయితే తన క్యాప్షన్లో జూలై 31 బదులు జూన్ 31 అని రాయడం మరింత నవ్వులు తెప్పిస్తోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

జాతీయ క్రీడా నియమావళి పరిధిలోకి బీసీసీఐ!
న్యూఢిల్లీ: త్వరలోనే భారత ప్రభుత్వం కొత్త క్రీడా బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇది వరకే జాతీయ క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్) ఉంది. దీనికి కొన్ని సవరణలు, మార్పు–చేర్పులతో తాజాగా స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఇన్నేళ్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్వతంత్ర క్రీడా సమాఖ్యగా చక్రం తిప్పింది. ఇప్పుడు కొత్త బిల్లు ప్రకారం క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ గవర్నెన్స్ గొడుగు కిందకే రానుంది. ఇదే విషయమై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. ‘దేశంలో ఉన్న అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల మాదిరే బీసీసీఐ కూడా కొత్త గవర్నెన్స్ బిల్లు పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు, గ్రాంట్లు పొందిన, పొందకపోయినా పార్లమెంటులో చట్టం అయ్యాక క్రికెట్ బోర్డు కూడా స్పోర్ట్స్ కోడ్ కిందకే వస్తుంది’ అని క్రీడాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. క్రీడా సమఖ్యల లాగే క్రికెట్ బోర్డుకు ఉన్న స్వయంప్రతిపత్తికి ఎలాంటి విఘాతం కలుగదని, అయితే వివాదాలు, ఇతరాత్ర సమస్యలు ఎదురైతే మాత్రం జాతీయ క్రీడా నియమావళి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్–2028లో క్రికెట్ క్రీడాంశం ఉండటంతోనే బోర్డు ఒలింపిక్ సంఘం పరిధిలోకి వచ్చినట్లయ్యింది. జాతీయ క్రీడాసమాఖ్యల్లో నిర్లిప్తతను దూరం చేసి జవాబుదారితనాన్ని మరింత పెంచేందుకు, సకాలంలో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు, పారదర్శక పరిపాలన, అర్హులైన క్రీడాకారుల సంక్షేమం, ప్రమాణాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును తీసుకొస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఒలింపిక్ చార్టర్ ప్రకారం నడుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ బిల్లు తెలియజేస్తుంది. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన మోదీ సర్కారు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు సిద్ధమైంది. ఇది వరకటి స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 70 ఏళ్ల వయసుకు చేరిన ఏ కార్యవర్గ సభ్యుడైనా పదవికి రాజీనామా చేయాల్సివుండగా... ఈ గరిష్ట వయోపరిమితి ఇక మీదట 75కు చేరే అవకాశముంది. బిల్లు పాసయితే... కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అపెక్స్ కమిటీ రూపుదిద్దుకుంటుంది. ఈ కమిటీలో కేబినెట్ కార్యదర్శి హోదా ఉన్న అధికారి లేదంటే క్రీడా శాఖ కార్యదర్శి, స్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ చైర్ పర్సన్ అవుతారు. క్రీడలకు సేవలిందించిన దిగ్గజ క్రీడాకారులు, కోచ్లు సభ్యులుగా ఉంటారు. వీరు తప్పనిసరిగా ద్రోణాచార్య, ఖేల్రత్న, అర్జున అవార్డీలై ఉండాలి. జాతీయ క్రీడా సమాఖ్యలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులకు ఈ కమిటీలో చోటుంటుంది. ముఖ్యంగా తరచూ వివాదాస్పదమవుతున్న అంశాలపై మరింత జవాబుదారీతనంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది. ఎంపికల ప్రక్రియ, ఆటగాళ్ల నిషేధం ఇతరాత్ర సమస్యల్ని ఈ కమిటీ పారదర్శక విధానంతో పరిష్కరిస్తుంది.

అమెరికా క్రికెట్ జట్టుకు ఐసీసీ అవార్డు
సింగపూర్: గతేడాది జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 ప్రపంచకప్లో సత్తా చాటిన అమెరికా జట్టుకు అవార్డు దక్కింది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన అమెరికా జట్టు... ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్తాన్ను ఇంటిబాట పట్టించడంతో పాటు కెనడాపై ఘనవిజయం సాధించి ‘సూపర్–8’ దశకు చేరింది. ఈ ప్రదర్శనతో అమెరికాలో క్రికెట్కు ఆదరణ పెరగగా... తాజాగా దీనికి ‘ఐసీసీ అసోసియేట్ మెంబర్స్ పురుషుల టీమ్ పెర్ఫార్మెన్స్’ అవార్డు దక్కింది. ఐసీసీ చైర్మన్ జై షా చేతుల మీదుగా యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) క్రికెట్ చైర్మన్ వేణు కుమార్ రెడ్డి పిసికె, సీఈఓ జొనాథన్ అట్కిన్సన్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. నల్లగొండకు చెందిన వేణు పిసికె 1998లో ఐటీ నిపుణుడిగా అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు అమెరికాలో క్రికెట్ ఆటకు ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. గత ఆరేళ్లుగా అమెరికాలో క్రికెట్ను మరింత విస్తృతం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఇక అమెరికాతోపాటు 2024లో ఆయా అసోసియేట్ జట్లు కనబరిచిన ప్రదర్శన ఆధారంగా మొత్తం 8 దేశాలకు ఐసీసీ అవార్డులు ప్రకటించింది. అమెరికాతో పాటు... భూటాన్, నేపాల్, ఇండోనేసియా, నమీబియా, స్కాట్లాండ్, టాంజానియా, వనూతు ఉన్నాయి. మొదట 15 దేశాలను పురస్కారాల కోసం షార్ట్లిస్ట్ చేయగా... వాటిలో ఎనిమిది దేశాలు అవార్డులు గెలుచుకున్నాయి. నమీబియాలో క్రికెట్ వృద్ధికి గానూ ఆ దేశ బోర్డుకు ‘ఐసీసీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం లభించింది. మహిళల విభాగంలో ఈ అవార్డును రెండు దేశాలు పంచుకున్నాయి. భూటాన్ క్రికెట్ కౌన్సిల్, వనూతు క్రికెట్ సంఘానికి ఉమ్మడిగా ఈ పురస్కారం దక్కింది. నేపాల్ క్రికెట్ సంఘానికి ‘ఐసీసీ డిజిటల్ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల్లో ఆటకు మరింత ప్రచారం చేస్తున్నందుకు గానూ ఈ పురస్కారం దక్కింది. ‘ఐసీసీ డెవలప్మెంట్ అవార్డులు ప్రకటించడం ఆనందంగా ఉంది. క్రికెట్ను విశ్వవ్యాప్తం చేయడంలో పురస్కార విజేతలు విశేష కృషి చేశారు’ అని ఐసీసీ అధ్యక్షుడు జై షా వెల్లడించారు.

IND vs ENG 4th Test: ‘సమం’ చేసే లక్ష్యంతో...
భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ సిరీస్లో జరిగిన మూడు టెస్టులూ ఆసక్తికరంగా సాగాయి. మొత్తం 15 సెషన్ల పాటు కూడా ఆట నడిచింది. టీమిండియా కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఎక్కడా తగ్గకపోయినా కొన్ని కీలక సందర్భాల్లో తమకు వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంది. ఫలితంగా ఇప్పుడు సిరీస్లో వెనుకబడింది. అయితే ఆటతీరులో, పోరాటంలో ఆతిథ్య జట్టుతో సమానంగా ఉన్న గిల్ బృందం కోలుకొని సిరీస్ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్లో విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో పోరుకు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై గత నాలుగు టెస్టు సిరీస్లను కూడా కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నేటి నుంచి జరిగే నాలుగో టెస్టులో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇక్కడా ఓడితే సిరీస్ భారత్ చేజారుతుంది. అయితే రెండో టెస్టు తరహాలో సత్తా చాటి పైచేయి సాధిస్తే సిరీస్ ఫలితం చివరి మ్యాచ్కు చేరుతుంది. ఇంగ్లండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, బౌలర్ల గాయాలు గిల్ బృందానికి సమస్యగా మారాయి. ఈ గ్రౌండ్లో పేలవ రికార్డు (0–4) ఉన్నా... స్థాయికి తగినట్లుగా చెలరేగితే భారత్ గత రికార్డులు మార్చివేయగలదు. అన్షుల్ అరంగేట్రం! ఆటగాళ్లు గాయపడటంతో భారత తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. గత రెండు టెస్టుల్లో అనుసరించిన వ్యూహాన్ని కూడా జట్టు మార్చుకోనుంది. లార్డ్స్లో ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్దీప్ ఈ మ్యాచ్కు దూరమయ్యారు. బుమ్రా, సిరాజ్లతో పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండగా ఆకాశ్దీప్ స్థానంలో అదే తరహా బౌలింగ్ శైలి ఉన్న కొత్త పేసర్ అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కెప్టెన్ గిల్ చెప్పినట్లుగా మూడో పేసర్గా అన్షుల్తో పాటు ప్రసిధ్ కూడా పోటీలో ఉన్నాడు. ఇక్కడి పిచ్ స్పిన్కు పెద్దగా అనుకూలించే అవకాశం లేకపోవడంతో సుందర్ స్థానంలో శార్దుల్ను ఆడించే విషయాన్ని జట్టు పరిశీలిస్తోంది. ఇక టాప్–6 బ్యాటింగ్ విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. నితీశ్ స్థానంలో రెగ్యులర్ బ్యాటర్ సాయి సుదర్శన్కు అవకాశం దక్కనుంది. వరుసగా విఫలమవుతున్నా... టీమ్ మేనేజ్మెంట్ కరుణ్ నాయర్కు మరో అవకాశం ఇస్తోంది. అతను తన రెగ్యులర్ స్థానమైన ఆరులో బ్యాటింగ్కు రానున్నాడు.యశస్వి, రాహుల్ మరోసారి శుభారంభం అందించాల్సి ఉంది. సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన గిల్ గత మ్యాచ్ వైఫల్యాన్ని మరచి చెలరేగితే భారీ స్కోరు ఖాయం. లార్డ్స్లో పంత్ రనౌట్ మ్యాచ్ గమనాన్ని మార్చింది. అతను ఈ సారి అలాంటి తప్పులు చేయకుండా ఆడాలని జట్టు కోరుకుంటోంది. పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు కాబట్టి కీపింగ్ కూడా చేస్తాడని గిల్ ఇప్పటికే స్పష్టం చేశాడు. నాలుగు వరుస హాఫ్ సెంచరీలతో జడేజా ఫామ్లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. డాసన్ ఎనిమిదేళ్ల తర్వాత... ఇంగ్లండ్ ఎప్పటిలాగే రెండు రోజుల ముందే తమ తుది జట్టును ప్రకటించింది. భారత్తో పోలిస్తే ఇంగ్లండ్ బ్యాటింగ్ బలహీనంగానే కనిపిస్తోంది. టాప్–3 ఆశించిన ప్రభావం చూపలేకపోతున్నా క్రాలీ, డకెట్, పోప్లపై మేనేజ్మెంట్ ఇంకా నమ్మకముంచింది. 57 టెస్టుల తర్వాత కూడా 30 సగటుతో క్రాలీ ఇంకా జట్టులో కొనసాగడం ఆశ్చర్యకరం! దాంతో ప్రధాన బ్యాటర్లయిన రూట్, బ్రూక్పై బ్యాటింగ్ భారం పడుతోంది. కీపర్ స్మిత్ రూపంలో ఇంగ్లండ్తో సమర్థుడైన బ్యాటర్ లభించాడు. అసాధారణ బౌలింగ్తో పాటు నాయకుడిగా కూడా అద్భుతంగా నడిపిస్తున్న స్టోక్స్ బ్యాటింగ్ మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఆరు ఇన్నింగ్స్లలో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇక్కడైనా స్టోక్స్ రాణించడం అవసరం. లెఫ్టార్మ్ స్పిన్నర్ డాసన్ ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 18 సెంచరీలు ఉన్న అతని బ్యాటింగ్ జట్టుకు అదనపు బలం. వోక్స్, కార్స్, ఆర్చర్లతో పేస్ దళం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా ఆర్చర్ లార్డ్స్ భారత్ను ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యాడు.04 ఇంగ్లండ్లో ఇతర మైదానాలతో పోలిస్తే ఓల్డ్ట్రఫోర్డ్లో భారత్ తక్కువ మ్యాచ్లు ఆడింది. 1936–2014 మధ్య 9 టెస్టులు ఆడగా ఒక్కటీ గెలవలేదు. 4 ఓడి మరో 5 డ్రా చేసుకుంది. పిచ్, వాతావరణంగత మూడు టెస్టులతో పోలిస్తే ఇది వేగవంతమైన పిచ్. చక్కటి బౌన్స్ ఉంది. గత వారం రోజులుగా వానలు కురుస్తున్నాయి. తేమ కారణంగా తొలి రోజు పేస్ బౌలింగ్కు అనుకూలించవచ్చు. మ్యాచ్ జరిగే రోజుల్లోనూ వర్ష సూచన ఉంది.తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, పంత్, కరుణ్ నాయర్, జడేజా, సుందర్/ శార్దుల్, సిరాజ్, ప్రసిధ్/ కంబోజ్ ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, డాసన్, వోక్స్, కార్స్, ఆర్చర్.

విధ్వంసం సృష్టించిన టీమిండియా కెప్టెన్.. వన్డేల్లో రెండో వేగవంతమైన శతకం
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (జులై 22) జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చెలరేగిపోయింది. ఈ మ్యాచ్లో హర్మన్ కేవలం 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, భారత్ తరఫున వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసింది. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఈ మ్యాచ్లో మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 14 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటైంది. హర్మన్తో పాటు భారత ఇన్నింగ్స్లో జెమీమా రోడ్రిగెజ్ (50), స్మృతి మంధన (45), హర్లీన్ డియోల్ (45), రిచా ఘోష్ (38 నాటౌట్), ప్రతిక రావల్ (26) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్లో ఇంగ్లీష్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సోఫీ ఎక్లెస్టోన్ (10-2-28-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లారెన్ బెల్ 10 ఓవర్లలో 82, లారెన్ ఫైలర్ 10 ఓవర్లలో 64, చార్లోట్ డీన్ 10 ఓవర్లలో 69, లిన్సే స్మిత్ 10 ఓవర్లలో 74 పరుగులు సమర్పించుకొని తలో వికెట్ తీశారు.భారత్ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీలు..70 స్మృతి మంధన vs ఐర్లాండ్ రాజ్కోట్ 202582 హర్మన్ప్రీత్ కౌర్ vs ఇంగ్లాండ్ చెస్టర్-లీ-స్ట్రీట్ 202585 హర్మన్ప్రీత్ కౌర్ vs దక్షిణాఫ్రికా బెంగళూరు 202489 జెమిమా రోడ్రిగ్స్ vs దక్షిణాఫ్రికా కొలంబో RPS 2025ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమవుతుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగగా, భారత్ 3-2 తేడాతో ఆ సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది.
బిజినెస్

రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలా
దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో రూ.కోటిలోపు ధర కలిగిన అపార్ట్మెంట్ల (ఫ్లాట్లు) అమ్మకాలు 32 శాతం తగ్గిపోయాయి. ఇదే కాలంలో ప్రీమియం అపార్ట్మెంట్లలో అమ్మకాలు 5 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 1,34,776 అపార్ట్మెంట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గాయి.రూ.కోటి ధరలోపు అపార్ట్మెంట్ల విక్రయాలు మాత్రం 32 శాతం తగ్గి 51,804 యూనిట్లుగా ఉన్నాయి. రూ.కోటికి పైన ధర శ్రేణిలోని అపార్ట్మెంట్ల అమ్మకాలు 6 శాతం పెరిగి 82,972 యూనిట్లుగా నమోదయ్యాయి. హైదరాబాద్తోపాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో అమ్మకాలపై జేఎల్ఎల్ ఇండియా నివేదిక విడుదల చేసింది. అపార్ట్మెంట్ల గణాంకాలు మినహా విల్లాలు, రోహౌస్లు ఇతర ఇళ్ల విక్రయాలు ఇందులో లేవు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం అపార్ట్మెంట్ల అమ్మకాల్లో రూ.కోటికి పైన ధరలోనివి (ప్రీమియం) 62 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి అమ్మకాలు మొత్తం విక్రయాల్లో 51 శాతంగా ఉన్నాయి. రూ.కోటిలోపు ఇళ్ల విక్రయాల వాటా 49 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: భద్రత తక్కువ.. ప్రచారం ఎక్కువపెరుగుతున్న కొనుగోలు సామర్థ్యం.. ‘లగ్జరీ ఇళ్ల అమ్మకాలు స్థిరంగా వృద్ధి చెందడం కొనుగోలు పెరుగుతున్న సామర్థ్యం, మెరుగైన జీవన ఆకాంక్షలకు నిదర్శనం. ప్రీమియం ప్రాపర్టీల పట్ల పెరుగుతున్న దృష్టి మాస్ హౌసింగ్ విభాగంలో కార్యకలాపాలకు ప్రాధాన్యం తగ్గుతోంది’ అని జేఎల్ఎల్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సమంతక్ దాస్ తెలిపారు.

భద్రత తక్కువ.. ప్రచారం ఎక్కువ
దేశీయంగా చాలా మటుకు విమానయాన సంస్థలు భద్రత కన్నా ప్రచారంపైనే ఎక్కువగా వెచ్చి స్తున్నాయని అత్యధిక శాతం విమాన ప్రయాణికులు భావిస్తున్నారు. ఈ విషయంపై లోకల్సర్కిల్స్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 76 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో కనీసం ఒక్కసారైనా టేకాఫ్ సమయంలోనో, ల్యాండింగ్లోనో లేదా విమానంలోనో ఏదో ఒక సమస్య ఎదుర్కొన్నట్లు 64 శాతం మంది తెలిపారు. దేశవ్యాప్తంగా 322 జిల్లాల నుంచి 44,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.‘భారత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎయిర్లైన్స్, భద్రత కన్నా పబ్లిసిటీకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయని భావిస్తున్నారా’ అనే ప్రశ్నకు స్పందించిన 26,696 మంది ప్రయాణికుల్లో 43% మంది ‘అవును. అన్ని సంస్థలు అలాగే ఉన్నాయి’ అని, 33% మంది ‘అవును. కొన్ని సంస్థలే అలా ఉన్నాయి’ అని, 11% మంది ‘ఏ కంపెనీ కూడా అలా లేదు’ అని చెప్పారు. 13 శాతం మంది మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.సూ్థలంగా చెప్పాలంటే చాలా మటుకు ఎయిర్లైన్స్ భద్రత కన్నా ప్రచారంపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయని చాలా మంది ప్రయాణికులు భావిస్తున్నట్లు వెల్లడైందని లోకల్సర్కిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 63% మంది పురుషులు కాగా, 37% మంది మహిళలు. వీరిలో 46% మంది ప్రథమ శ్రేణి నగరాలకు చెందినవారు. 25% మంది ద్వితీయ శ్రేణి నగరాలకు, మిగతా 29% మంది తృతీయ, చతుర్థ శ్రేణి.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. పెరుగుతున్న ఉదంతాలు..ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం గత నెల టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడంతో, 241 మంది ప్రయాణికులు, ఇతరత్రా 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రాష్పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విచారణ జరిపి, ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చింది.మరోవైపు, సోమవారం నాడు కొచ్చి–ముంబై ఎయిరిండియా ఫ్లయిట్, ల్యాండింగ్ సమయంలో రన్వే మీద నుంచి పక్కకు జారిపోయిన ఘటనలో ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదే రోజున సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ–కోల్కతా విమానాన్ని ఎయిరిండియా ఆఖరు నిమిషంలో రద్దు చేసింది. ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా గోవా నుంచి బయలుదేరిన ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.

ఉద్యోగాలకు టాప్.. టాటా గ్రూప్
న్యూఢిల్లీ: దేశీయంగా ఉద్యోగాలకు అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్లుగా టాటా గ్రూప్, గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్ నిలిచాయి. ర్యాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2025 నివేదికలో టాప్ 3 స్థానాలను దక్కించుకున్నాయి. దీని ప్రకారం భారత్లో ఉద్యోగులు వర్క్–లైఫ్ సమతుల్యత, సమానత్వం, ఆకర్షణీయమైన జీతభత్యాలను కోరుకుంటున్నారు. అలాంటి కంపెనీలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరి్థక ఆరోగ్యం, కెరియర్ పురోగతి అవకాశాలు, ప్రతిష్ట అంశాల్లో టాటా గ్రూప్ అత్యధిక స్కోరుతో అగ్రస్థానం దక్కించుకుంది.గూగుల్ ఇండియా రెండో స్థానంలో, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. ఇక అత్యంత ఆకర్షణీయమైన టాప్ 10 ఎంప్లాయర్ బ్రాండ్స్ 2025 జాబితాలో శాంసంగ్ ఇండియా (4), జేపీమోర్గాన్ చేజ్ (5), ఐబీఎం (6), విప్రో (7), రిలయన్స్ ఇండస్ట్రీస్ (8), డెల్ టెక్నాలజీస్ (9), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (10) సంస్థలు ఉన్నాయి. జాబితాలో ఎస్బీఐ ఏకైక భారతీయ బహుళజాతి ప్రభుత్వ రంగ బ్యాంకు కావడం గమనార్హం. ‘సంప్రదాయ ఉద్యోగాలతో నేటి ఉద్యోగులు సంతృప్తిపడటం లేదని 2025 నివేదికతో తేటతెల్లమైంది. వారు నిర్దిష్ట లక్ష్యం, సమానత్వం, అర్థవంతమైన వృద్ధి, వర్క్–లైఫ్ మధ్య సమతుల్యతను కోరుకుంటున్నారు’ అని ర్యాండ్స్టాడ్ ఇండియా ఎండీ విశ్వనాథ్ పీఎస్ తెలిపారు. ఉద్యోగాలు మారిపోవాలనే ధోరణి కూడా యువ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తుండటమనేది కంపెనీలకు మేల్కొలుపులాంటిదని ఆయన చెప్పారు.నివేదికలో మరిన్ని విశేషాలు.. ⇒ 34 మార్కెట్లలో 1,70,000 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 3,500 మంది భారత్కి చెందిన వారు ఉన్నారు. ⇒ జీతానికి మించిన ప్రయోజనాలను ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిగతంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా కంపెనీల్లో వాతావరణం ఉండాలని ఆశిస్తున్నారు. ⇒ 2025 ప్రథమార్ధంలో 47% మంది భారతీయ ఉద్యోగులు, ఉద్యోగం మారాలని ప్రణాళికలు వేసుకున్నారు. జెన్ జెడ్ (51%), మిలీనియల్స్లో (50%) ఈ ఆలోచన బలంగా ఉంది. ⇒ ఏఐ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయ ఉద్యోగుల్లో 61 శాతం మంది దీన్ని తరచుగా ఉపయోగిస్తున్నారు. మిలీనియల్స్ అత్యంత యాక్టివ్ యూజర్లుగా ఉంటున్నారు. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య 13 శాతం పెరిగింది. ఏఐ ప్రభావాలపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కృత్రిమ మేథ తమ పనిపై గణనీయంగా ప్రభావం చూపుతోందని 38 శాతం మంది ఉద్యోగుల్లో అభిప్రాయం నెలకొంది.

పసిడి.. మళ్లీ రూ.లక్ష పైకి!
న్యూఢిల్లీ: పుత్తడి మరోసారి జిగేల్మంది. కొనుగోళ్ల మద్దతుతో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మంగళవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 లాభపడి రూ.1,00,020 స్థాయికి చేరింది. స్టాకిస్టుల నుంచి బలమైన కొనుగోళ్లు జరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,000 పెరిగి రూ.99,550 స్థాయిని చేరుకుంది.అటు వెండిలోనూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో రూ.3,000 లాభపడి కిలోకి రూ.1,14,000 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో (కామెక్స్ ఫ్యూచర్స్) ఔన్స్ బంగారం 35 డాలర్లకు పైగా లాభంతో 3,440 డాలర్ల స్థాయిని చేరుకుంది. వెండి ధర ఔన్స్కు 39.50 డాలర్ల వద్ద ఉంది. పరపతి విధానంపై యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచి చూస్తున్నట్టు అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.చైనా లోన్ ప్రైమ్ రేటుపై నిర్ణయం, యూఎస్ ఆర్థిక డేటా (పీఎం, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు), వడ్డీ రేట్లపై నిర్ణయాలు అంతర్జాతీయంగా బంగారంలో తదుపరి ర్యాలీని నిర్ణయిస్తాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ అభిప్రాయపడ్డారు.
ఫ్యామిలీ

మరో స్వదేశీ స్టోర్ వచ్చేస్తోంది : కుమార్తె, కోడళ్లతో నీతా అంబానీ ప్రత్యేక పూజ
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ఫౌండర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, నీతా అంబానీ ముంబైలో మరో స్వదేశీ స్టోర్ను లాంచ్ చేయనున్నారు. మేడ్ ఇన్ ఇండియా స్పూర్తితోపాటు, హస్తకళలను ఆదరించడం, హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే తొలిసారి అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్ను హైదరాబాద్ ఏర్పాటు చేసిన నీతా అంబానీ తాజాగా ముంబైలోని ఈరోస్లో స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ కుమార్తె ఇషా, కోడళ్లు శ్లోక, రాధికలతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.స్వదేశ్ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈవేడుక నిర్వహించారు. దేశీయ అనాది సంప్రదాయాలు, తరతరాలుగా అందివస్తున్న చేతివృత్తుల నైపుణ్యానికి శాశ్వత వారసత్వానికి నివాళిగా ఈ వేడుకను నిర్వహించారు.భారతీయ కళలను, సంప్రదాయాలను గౌరవించడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు. తాజాగా మరో అద్భుతమైన చీరలో రాజసం ఉట్టిపడేలా కనిపించారు. రాజ్శృందర్ రాజ్కోట్ 10 నెలలకు పైగా చేతితో నేసిన అద్భుతమైన మధురై కాటన్ ఘర్చోలా చీరను ధరించారు. ఈ చీరకు ప్రముఖ డిజైనర్ మనీష్మల్హోత్రా అందమైన జాకెట్టును నీతా ఎంపిక చేసుకున్నారు. యాంటిక్ గోల్డ్ వరల్డ్ ఎంబ్రాయిడరీతో ఫిరోజీ సిల్క్ కాంచాలి బ్లౌజ్తో స్టైల్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) తాత ముత్తాల నాటి మహిళా కళాకారులకు నివాళిగా నీతా తనకు వారసత్వంగా వచ్చిన బంగారు బాజుబంద్ను ధరించారు. ఇది నీతా తల్లి ముత్తాత నుండి లభించిన ఆర్మ్లెట్. తన వివాహం సందర్భంగా కూడా దీన్ని ధరించడం విశేషం. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, వారసత్వం, ప్రేమ , ఒక తరం మహిళల నుండి మరొక తరం వరకు ప్రవహించే శాశ్వత శక్తికి చిహ్నం . పెద్దల కరుణ, జ్ఞానం ఆశీర్వాదాలతో నిండిన ఈ ఆర్మ్లెట్ అంబానీ నుంచి , ఆమె కుమార్తె ఇషా కుమార్తె, మనవరాలికి వారసత్వంగా లభిచనుంది.ఇక నీతా అంబానీ జ్యుయల్లరీ గురించి చెప్పాలంటే స్వదేశ్ నుండి వచ్చిన అద్భుతమైన నెక్లెస్తో తన లుక్ను మరింత వన్నె తెచ్చారు. ప్రతి ప్యానెల్ వైట్ గోల్డ్తో శ్రీనాథుడి జీవితంలోని దైవిక క్షణాలను చిత్రీకరించేలా చేతితో చేసిన కళాసృష్టి ఇది. కళాత్మకతను ఆధ్యాత్మికతతో మిళితం చేస్తుంది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online)

56 ఏళ్ల తర్వాత స్కూల్కి వెళ్తే..! ఈ పెద్దాళ్లు కాస్తా..
పెళ్లి, పిల్లలు, కెరీర్ సెటిల్మెంట్తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు అందరు. కాసేపు మన బాల్యపు స్మృతుల్లోకి వెళ్దామన్నా..ఆలోచన కూడా రాదు. కానీ ఒక్కసారి నాటి స్నేహితులను, నాటి చిలిపి పనులు గుర్తొస్తేనే..కళ్ల నుంచి నీళ్లు అప్రయత్నంగా జాలువారతాయి. ఆ స్వీట్మెమొరీస్ ఎవ్వరికుండవు చెప్పండి. కాకపోతే..ఉరుకుల పరుగుల జీవన విధానంలో కాసేపు ఆగి వెనక్కి చూసే అవకాశం చిక్కకపోవడమే తప్ప. నాటి స్నేహితులను కలిసినా..టచ్లో ఉన్నా..కళ్లముందు ఆ మధుర జ్ఞాపకాలు మెదిలాడుతూనే ఉంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే అలాంటి భావోద్వేగపు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు ఈ ఐదుగురు ఆంటీలు.ఒక మహిళ తన నలుగురు స్నేహితులతో కలసి తాము చదువుకున్న పాఠశాల కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ MAMCని సందర్శిస్తారు. అదికూడా దాదాపు 40 ఏళ్ల అనంతరం తమ చిన్ని నాటి జ్ఞాపకాలను వెదుకుతూ..వచ్చారు ఆ ఐదుగురు 50 ఏళ్ల మహిళలు. ఆ పాఠశాల ఆవరణం, తరగతి గదులు చూస్తూ..నాటి మధుర స్మృతుల్లోకి జారిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఐదుగురు ఆంటీల్లో ఒకామె తాము సరిగ్గా 40 ఏళ్ల తర్వాత మా స్వీట్మెమొరీస్ వెతుక్కుంటూ ఈ స్కూల్కి వచ్చాం. తాము 56 ఏళ్ల చిన్నారులమని నవ్వుతూ చెబుతున్నారు ఆ వీడియోలో. ఇక్కడ మా కలలు కనిపిస్తాయి. మేం చేసిన చిలిపి అల్లర్లు గుర్తుకొస్తాయి. ఈ పాఠశాల కలియ తిరుగుతుంటే..మా కాలు తడబడదు..భావోద్వేగంతో ఉబ్బితబ్బిబవుతుందంటున్నారు వారంతా. ఆ మహళలంతా చీరలు ధరించి అలనాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ ఆ పాఠశాల చుట్టూ కలియతిరిగారు. తాము ఆ పాఠశాలో 1987 బ్యాచ్కి చెందినవాళ్లమని చెప్పుకొచ్చారు కూడా. ఈ మధురానుభూతి వెలకట్టలేనిది, మాటలకందనిది అంటున్నారు ఆ మహిళా స్నేహితులు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక అంతా తమ బాల్యపు స్మతుల్లోకి వెళ్లిపోయారు. ఎవ్వరికైనా.. స్కూల్ చదువు ఓ అద్భుత వరం..అది ఎవ్వరికైనా మధురానుభూతులను పంచే గొప్ప భావోద్వేగపు అనుభూతి కదా..!. View this post on Instagram A post shared by Kakali Biswas (@phoenix_stories) (చదవండి: ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు! ఈ జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు)

కొంపముంచుతున్న ఆన్లైన్ పరిచయాలు..!
తెలంగాణ ఉమ్మడిక కరీనంగర్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన బాలిక రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయంతో బాలిక ఇంట్లో చెప్పకుండానే రాయలసీమకు పారిపోయింది. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఇంటికి తిరిగి వచ్చింది. తొమ్మిదో తరగతి చదివే తన కూతురు మారాం చేస్తోందని తండ్రి స్మార్ట్ఫోన్ కొనిచ్చాడు. ఆ ఫోన్తో ఆమె తన స్నేహితులతో కాలక్షేపం చేయడం ప్రారంభించింది. ఇదేసమయంలో వివిధ వెబ్సైట్లు ఓపెన్చేసి సంబంధం లేని అనేక అంశాలకు ఆకర్షితురాలైంది. చివరకు చదవడం పక్కన పెట్టేసింది. ఫోన్ చేతిలో లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది.ఓ గ్రామంలో బాలిక(16), యువకుడు(20) ఏకాంతంగా ఉండడాన్ని గమనించిన యువకులు.. వారిని పట్టుకుని కొలువుదీరిన కుల సంఘం వద్దకు తీసుకెళ్లారు. కుల పెద్దలు పంచాయితీ పెట్టగా.. తాము ఏడాదిగా ప్రేమించుకుంటున్నామని బాలిక, యువకుడు చెప్పేశారు. మైనార్టీ తీరిన వెంటనే పెళ్లి చేయాలని పంచాయితీ పెద్దలు నిశ్చయించారు. రామగుండానికి చెందిన ఓ యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. హాస్టల్లో వసతి పొందుతోంది. కార్యాలయం నుంచి తీసుకొచ్చే ర్యాపిడో డ్రైవర్తో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు వారించినా వినకుండా డ్రైవర్ను పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమోగానీ యువకుడు వేధించగా తాళలేక సఖి కేంద్రాన్ని ఆశ్రయించింది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక, సోషల్మీడియా ప్రభావంతో టీనేజ్ యువత ఇలా దారితప్పుతోంది. ఎదిగీఎదగని వయసు.. తెలిసీ తెలియని మనసు.. ఆకర్షణ.. ఆపై తప్పటడుగులు.. వెరసి టీనేజ్ను ట్రాక్ తప్పేలా చేస్తోంది. మరోవైపు.. సామాజిక మాధ్యమాలు కౌమరంపై విషం చిమ్ముతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, వాట్సప్, ఓటీటీలు, సీరియల్స్, రీల్స్ విషబీజాలు నాటుతున్నాయి. ప్రేమ పేరిట కొందరు, పరిచయం పేరిట మరికొందరు యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. స్మార్ట్గా వల విసిరి చాటింగ్తో మొదలుపెట్టి.. ముగ్గులోకి దింపుతున్నారు.. అవసరం తీరాక ముఖం చాటేస్తున్నారు. ఇలా చోటుచేసుకునే దారుణం గురించి తెలియక బాలికలు, యువతులు మోసపోతున్నారు. తల్లిదండ్రుల అతిగారాబమో, అతి నమ్మకమో, నిర్లక్ష్యమో తెలియదు గానీ.. యూత్ ట్రాక్ తప్పుతోంది. చివరకు ఠాణా మెట్లెక్కి బోరున విలపించడం తప్ప చేసేదేమీలేక చూస్తూ ఉంటోంది. ఇలా ఒకటికాదు రెండు కాదు.. నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక పరువుపోతుందని మిన్నకుండిన వారు వేలల్లో ఉంటున్నారు. కొంతకాలంగా తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వస్తున్న ‘టీనేజ్ లవ్’లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక.. పిల్లలు అల్లరి చేస్తున్నారని, ఫోన్ ఇస్తే వారిపనివారు చేసుకుంటారని కొందరు, ఉపాధి కోసం భర్త లేదా భార్య విదేశాలకు వెళ్తూ పిల్లలను పెద్దల వద్ద ఉంచుతున్నారు. వృద్ధాప్యంలోని తమ తల్లిదండ్రులు పిల్లల కదలికలను ఏ మేరకు గమనిస్తున్నారోననే విషయం గమనించక ముందే ప్రమాదం జరిగిపోతోంది. మితిమీరిన స్వేచ్ఛ, చేతిలో అవసరానికి సరిపడా సొమ్ము ఉండడంతో హైస్కూల్ వయసు నుంచే ప్రేమ అనే ఆకర్షణ వైపు టీనేజ్ను నడిపిస్తున్నది. ఉపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పదు. కానీ అదే సమయంలో పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. మరోపక్క.. సామాజిక మాధ్యమాల ద్వారానూ అనేక మోసాలు జరుగుతున్నాయి. కొందరు యువకులు యువతుల్లా నటిస్తూ అవతలి యువతుల ఫొటోలు సేకరిస్తారు. వాటిని ఆ యుతులకే పంపించి బెదిరిస్తున్నారు. ఇంకొందరైతే అమ్మాయిల పేరిట ఖాతాలు సృష్టించి ఫ్రెండ్స్ రిక్వెస్టులు పంపించి ఆకట్టుకునేందుకు యతి్నస్తారు. ఆ వల వల విసిరి నమ్మించి మోసం చేస్తారు. ఒక్కోసారి ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో కొన్నిమార్పు వస్తుంటాయి. అందుకే.. స్మార్ట్ఫోన్పాటు సోషల్ మీడియా అకౌంట్లను తరచూ పరిశీలించాలి. ఎన్ని పనులు ఉన్నా వారి ప్రవర్తనను నిశితంగా గమయనించాలి. ట్రాక్తప్పిన వారు తమను సంప్రదిస్తే కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామని సీడబ్ల్యూసీ అధికారులు అంటున్నారు.పర్యవేక్షణ తప్పనిసరి తల్లితండ్రులు తమ పిల్లలపై అనేక ఆశలు పెట్టుకుంటారు. బాగా చదివిస్తుంటారు. కానీ, వారి పర్యవేక్షణ కూడా చాలాఅవసరం. ప్రస్తుతం మొబైల్ఫోన్ చాలాకీలకం. పిల్లలకు చదువులకు ఉపయోగపడుతోంది. కానీ... ఇందులోని సోషల్ మీడియా, సినిమాల ప్రభావం, ఆ దశలో వచ్చే మార్పు పిల్లలపై బాగా పడుతోంది. తల్లిదండ్రులిద్దరూ సంపాదనపై దృష్టిపెట్టి పిల్లలను పట్టించుకోకపోతే ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లే.. – డాక్టర్ రవివర్మ, సైకియాట్రిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్

ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు!
మనిషి శరీరంలో మెదడు అద్భుత శక్తివంతమైన భాగం. ప్రశాంతతకు, మన భవితను నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవడంలో మెదడుపాత్ర అత్యంత కీలకం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో మనిషి మెదడుకు మరింత పదును పెట్టాలి్సన పరిస్థితి. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు రోజుకు 12 గంటలు కంప్యూటర్లకే అతుక్కుని పోతుండగా.. ఏ పనీపాట లేనివారు రోజుకు 18 గంటలు సెల్ఫోన్లో గడుపుతున్నారు. మెదడు ఒత్తిడికి గురై న్యూరో సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్, డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా జూలై 22న జాతీయ మెదడు దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా కథనం.. ‘గతం గురించి ఆలోచించను. భవిష్యత్తుపై బెంగపెట్టుకోను. వర్తమానంలోనే జీవిస్తా. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తా. ఫలితం కంటే ప్రక్రియపై దృష్టిసారిస్తా. ప్రక్రియ ఉప ఉత్పత్తే ఫలితం’ అని అంటాడు మహేంద్రసింగ్ ధోని. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మెదడుకు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. బ్రెయిన్కు వచ్చే ప్రమాదకర వ్యాధులలో బ్రెయిన్ ట్యూమర్ల కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తే, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటే ఇవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. మెదడుపై ఒత్తిడి పెరగడం వల్ల ఇటీవల పక్షవాతం, పార్కిన్సన్ వంటి వ్యాధులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధులు మెల్లమెల్లగా మనిషి శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.తేలికగా తీసుకోవద్దు...మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి అయినప్పటికీ మెదడు ఆరోగ్యాన్ని తేలికగా తీసుకుంటారు. దీంతో న్యూరో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మెదడు సంబంధ వ్యాధులతో పోరాడుతున్న ఏ వయసు వారికైనా ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని వైద్యులు చెబుతున్నారు.ఆదిలోనే గుర్తిస్తే..శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే ఏపనినైనా చురుగ్గా చేసుకోగలం. అదే ప్రతికూల ఆలోచనలు మనసులోకి చేరితే ఒత్తిడిని ఎదుర్కొనటమే కాదు.. ఏపనిపైనా ఏకాగ్రత పెట్టలేం. అందుకే అలాంటి మానసిక సమస్యలను ఆదిలోనే గుర్తించాలంటున్నారు నిపుణులు. చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవటంతో పాటు సరైన సమయంలో గుర్తించలేకపోతున్నారని.. తద్వారా అది క్రమంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే స్థితికి దారితీస్తుందంటున్నారు. ఒత్తిడి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే మేలని సూచిస్తున్నారు.ఏటా సుమారు 30 వేల మంది..ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 30 వేల మంది మానసిక ఒత్తిళ్లతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. వీరిలో చాలామంది ఒత్తిడికి గురయ్యాక ధూమపానం, మద్యం సేవనం, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసై, తమ జీవితాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజం నిర్లక్ష్యంగా ఉండటం, అవగాహన లోపించడం దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. జయిద్దామిలా..ఎప్పుడు ఒత్తిడికి గురవుతున్నామో ఒకచోట నమోదు చేసుకోవాలి.ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి పద్ధతులు అవలంబించాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటంతో పాటు కంటి నిండా నిద్రపోవాలి.కెఫిన్ ఎక్కువగా ఉండే కాపీ, శీతల పానీయాలు తాగటం మానేయాలి.ప్రతికూల ఆలోచనలను మొగ్గ దశలోనే తుంచేయాలి.ఒత్తిడికి గురైనప్పుడు.. దాని నుంచి బయ టపడటానికి కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవాలి.మెదడు వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దుమెదడుకు సంబంధించి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు. వయస్సుతో సంబంధం లేకుండా ఫిట్స్, పక్షవాతం, బ్రెయిన్ ట్యూమర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధులకు మానసిక ఒత్తిడే కారణం. ముఖ్యంగా పిల్లల్లో సెల్ఫోన్ వాడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు ఈ విషయంపై జాగ్రత్త వహించాలి. ప్రతీ ఒక్కరికి 8 గంటలు నిద్ర తప్పనిసరిగా అవసరం. – డాక్టర్ రాజీవ్రెడ్డి, న్యూరోసర్జన్, మెడికవర్ (చదవండి: నేచర్లో' నేర్చుకో..! ఆరుబయట అభ్యాసం..అరుదైన అనుభవం..)
ఫొటోలు
అంతర్జాతీయం

‘భారత్-పాక్ మధ్యవర్తిత్వంలో ట్రంప్ కీలకం’: వైట్ హౌస్ వంతపాట..
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న అశాంతిని చల్లార్చడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని యూఎస్ఏ అధికార కార్యాలయం వైట్హౌస్ పునరుద్ఘాటించింది. ట్రంప్ అధికార యంత్రాంగంలోని పలువురు అధికారులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారని, అలాగే రష్యా- ఉక్రెయిన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం వహించారని వైట్హైస్ మరోమారు వాదనకు దిగింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్.. గాజాలో శాంతి ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అతని ప్రయత్నాల కారణంగా పలువురు బందీలు విడుదలయ్యారని అన్నారు. ట్రంప్ ఆదేశాల దరిమిలా ఇరాన్లోని అణు సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.‘మేము చాలా యుద్ధాలను ఆపాం. భారత్- పాకిస్తాన్లు అణ్వాయుధ దేశాలు. ఇవి పరస్పరం ఘర్షణపడుతున్నాయి. ఈ దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని నిలువరించాం. ఇటీవల ఇరాన్లో మేము ఏమి చేసామో అందరూ చూశారు. ఆ దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని ధ్వంసం చేశాం. భారత్- పాక్ మధ్య జరిగే యుద్ధాన్ని వాణిజ్యం ద్వారా పరిష్కరించామని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. అయితే భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడవ పక్షం ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పులు
గాజా/లండన్: గాజాలోని అన్నార్తుల పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని ఐరాస తీవ్రంగా ఖండించింది. ఆహార కేంద్రాల వద్దకు వచ్చే వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పుల జరుపుతోందంటూ మండిపడింది. ఆదివారం ఒక్క రోజే 80 మంది ఉసురుతీయడాన్ని ప్రస్తావించిన ఐరాస ఆహార విభాగం(డబ్ల్యూఎఫ్పీ)..పాలస్తీనియన్ల పాలిట భయంకరమైన రోజుల్లో ఒకటని అభివర్ణించింది. ఆదివారం ఆహార పదార్థాలతో గాజానగరంలోకి ప్రవేశించిన ట్రక్కుల దిశగా వెళ్తున్న వారిపైకి ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారీ సంఖ్యలో జనం చనిపోవడం తెల్సిందే. కాగా, డబ్ల్యూఎఫ్పీ ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇలా ఉండగా, ఆదివారం రాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగించిన వైమానిక దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు.సెంట్రల్ గాజాలోని నెట్జరిమ్ కారిడార్ వద్ద గుంపుగా చేరిన పాలస్తీనియన్లపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. హమాస్ శ్రేణులు లక్ష్యంగా 21 నెలలుగా యథేచ్ఛగా ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడుల్లో మరణాలు 59 వేలు దాటాయని గాజా ఆరోగ్య విభాగం సోమవారం తెలిపింది. 2023 అక్టోబర్ 7 నుంచి సాగిస్తున్న దాడుల్లో క్షతగాత్రుల సంఖ్య 1,42,135కు చేరుకుందని వివరించింది.తక్షణమే హింస ఆగిపోవాలి గాజాపై సాగిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని యూకే, ఫ్రాన్స్ తదితర 23 దేశాలు ఇజ్రాయెల్ను కోరాయి. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను గౌరవించాలని హితవు పలికాయి. ఇందులో 20 యూరప్ దేశాలతోపాటు ఆ్రస్టేలియా, కెనడా, జపాన్ ఉన్నాయి. ఆయా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గాజా పౌరుల అవస్థలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి. నీరు, ఆహారం వంటి కనీస అవసరాలను తీర్చాలని కోరుతున్న పాలస్తీనా పౌరులు, ముఖ్యంగా చిన్నారులను అమానవీయంగా చంపడం ఆపాలని వారు కోరారు.

స్కూల్పై కూలిన జెట్
ఢాకా: ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ తరగతి గదిలో ప్రశాంతంగా కూర్చున్న విద్యార్థులపై అకస్మాత్తుగా ఆకాశం నుంచి మృత్యువు యుద్ధవిమానం రూపంలో దూసుకొచ్చింది. చైనా తయారీ ఎఫ్–7బీజీఐ శిక్షణ యుద్ధవిమానం ఉన్నపళంగా పాఠశాలపై కుప్పకూలడంతో పాఠశాల విద్యార్థులుసహా 20 మంది సజీవదహ నమయ్యారు. వీరిలో 16 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పైలట్ ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ ఘోర విమానప్రమాదం సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు సంభవించింది. కాలినగాయాలతో రక్తమోడుతున్న మరో 171మందిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఢాకా నగరంలోని ఉట్టారా పరిధిలోని డియాబరీ ప్రాంతంలోని మైల్స్టోన్ స్కూల్, కాలేజీ క్యాంపస్పై ఈ శిక్షణవిమానం కుప్పకూలిందని బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ విభాగ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ జహీద్ కమల్ చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడంతో అది అదుపుతప్పి ఇలా పాఠశాలపై పడిపోయిందని తెలుస్తోంది. ఒక్కసారిగా పాఠశాల మంటల్లో చిక్కుకుపోవడంతో స్థానికులు హుటాహుటిన వచ్చి రక్తసిక్తమైన చిన్నారులను రిక్షాలు, ఆటోల్లో దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ‘‘కుర్మిటోలాలోని ఏకే ఖాన్దాకర్ వైమానిక స్థావరం నుంచి సోమవారం ఉదయం ఒంటిగంట ఆరు నిమిషాలకు బయల్దేరిన శిక్షణవిమానం కొద్దిసేపటికే అదుపుతప్పింది. పరిస్థితి సెకన్లలో పసిగట్టిన పైలట్ తౌకిర్ విమానాన్ని జనావాస ప్రాంతం మీద నుంచి దూరంగా తీసుకెళ్లేందుకు మళ్లించే ప్రయత్నంచేశారు. కానీ ఆలోపే విమానం వేగంగా కిందకు పడిపోయింది’’ అని బంగ్లాదేశ్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సమీ ఉద్ దౌలా చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటుచేశామని దౌలా అన్నారు.మిన్నంటిన రోదనలువిగతజీవులుగా మారిన చిన్నారులను చూసి పిల్లల తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. కూలిన భవనం, చెల్లాచెదురుగా పడిన విద్యార్థుల మృతదేహాలు, తల్లిదండ్రుల ఆక్రందనలు, సహాయక చర్యలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. క్షతగాత్రులను తరలించేందుకు డజన్లకొద్దీ అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. విమానం సృష్టించిన బీభత్సం ధాటికి నేలమట్టమైన పాఠశాల శిథిలాల కింద నుంచి 20 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రి, ఢాకా మెడికల్ బోధ నాస్పత్రి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ(ఎన్ఐబీపీఎస్)లో పలువురికి చికిత్స నందిస్తున్నారు. మా ఆస్పత్రికి తీసుకొస్తున్న క్షతగా త్రుల సంఖ్య పెరుగుతోందని ఎన్ఐబీపీఎస్ వైద్యు డొకరు మీడియాతో చెప్పారు. విమానాన్ని నడిపిన పైలట్ లెఫ్టినెంట్ మొహమ్మద్ తౌకిర్ ఇస్లామ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఎఫ్–7బీజీఐ విమానం భారీ పేలుడుతో నాలుగంతస్తుల పాఠశాల భవనంపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రక్తసి క్తమైన మృతదేహాలను ఒకటి నుంచి ఏడో తరగతి క్లాసుల్లో వరుసగా పేర్చారని అక్కడి ఒక ఉపాధ్యా యుడు చెప్పారు. ‘‘ చిన్నపిల్లల క్లాసులు అయిపో యాయి. ఫైనల్ బెల్ కొట్టాం. ఆనందంగా పిల్లలు బ్యాగులు సర్దుకుని లైన్లలో నిల్చుని బయటకు వెళ్తున్నప్పుడే విమానం కూలింది. చుట్టూతా మంటలే. ఆ మంటలు, దట్టమైన పొగలో అసలేం కనిపించలేదు. నా రెండు చేతులు కాలిపోయాయి. ఊపిరాడలేదు’’ అని ఒక ఉపాధ్యాయురాలు ఆ భ యానక దృశ్యాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో క్లాసులు జరు గుతున్నాయి. హఠాత్తుగా విమానం నా కళ్లెదుటే కుప్పకూలింది. నాకు కేవలం 10 అడుగుల దూరంలో అది కూలడం చూశా. ప్రైమరీ స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పే రెండంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ఫ్లోర్ను విమానం ఢీకొట్టింది’’ అని ప్రాంగణంలో 11వ గ్రేడ్ చదువుతున్న ఫహీమ్ హుస్సేన్ అనే విద్యార్థి భయపడుతూ చెప్పాడు. Bangladesh Air Force China Made FT-7BGI (training) aircraft, tail no. 701, crashes in Uttara near Milestone College. 1:06pm and crashed into the college campus soon after.Casualties : at least 6-7 min. pic.twitter.com/0vg4bvjD86— (((Bharat)))🚨™️🕉🚩🔱 🇮🇳 🇮🇱🇷🇺🇺🇸🎗 (@Topi1465795) July 21, 2025

ఇస్కాన్ రెస్టారెంట్లోకి చికెన్ తెచ్చిన యువకుడు.. తీవ్ర విమర్శలు
ఇస్కాన్ ఆలయాలను కృష్ణ భక్తులు ఎంతో పరిత్రమైనవిగా భావిస్తారు. ఇక్కడ నిత్యం పూజలు, భజనలు జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చేవారు ఆలయంలోని వాతావరణానికి ముగ్ధులువుతుంటారు. ప్రశాంతతకు ఇస్కాన్ ఆలయం చిరునామా అని చెబుతుంటారు. అయితే తాజాగా ఒక ఇస్కాన్ ఆలయంలో ప్రశాంతతను భంగపరిచే ఉదంతం చోటుచేసుంది. అది వైరల్గా మారింది.లండన్లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక యువకుడు కేఎఫ్సీ చికెన్ బాక్స్తో ప్రాంగణంలోకి ప్రవేశించి, దానిని తినడం మొదలుపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఇదొక రెచ్చగొట్టే చర్యగా, ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా అభివర్ణించారు. వైరల్గా మారిన ఆ వీడియోలో గోవింద రెస్టారెంట్కు చికెన్ తీసుకువచ్చిన ఆ యువకుడు అక్కడి సిబ్బందితో ‘మాంసాహారం ఉందా?’ అని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ రెస్టారెంట్లో శాఖాహార వంటకాలు మాత్రమే ఉంటాయని తెలియగానే, ఆ యువకుడు కేఎఫ్సీ అతను కేఎఫ్సీ బాక్స్ నుండి చికెన్ను తీసి, కౌంటర్ దగ్గరే తినడం ప్రారంభిస్తాడు. SHOCKING NEWS 🚨 African-British man forcibly eats chicken at ISKCON Govinda’s restaurant in London.MAN (Enters): Only veg food here?STAFF: Yes, only vegetarian food. What would you like?Then he pulled out KFC chicken and began eating it inside 😳He even offered the… pic.twitter.com/ISWyTwwBf0— Times Algebra (@TimesAlgebraIND) July 20, 2025తరువాత అతను తన దగ్గరునున్న చికెన్ను అక్కడున్న అందరికీ చూపిస్తాడు. ఇంతలో అక్కడి సిబ్బంది అతనిని వారించగా, అతను వారితో వాగ్వాదానికి దిగుతాడు. దీంతో వారు సెక్యూరిటీ సాయంతో అతనిని ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పంపిస్తారు. ఇస్కాన్లోకి చికెన్ తెచ్చిన యువకునిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు అతనిపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. మరికొందరు దీనిని జాతివివక్ష చర్యగా పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేసివుంటారని ఆశిస్తున్నానని ఒక యూజర్ పేర్కొన్నారు. హిందువులు ప్రతీకారం తీర్చుకోరని భావించిన అతను ఈ పనికి పాల్పడి ఉంటాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జాతీయం

రాజీపడలేకే.. రాజీనామా?
న్యూఢిల్లీ: గుండె సంబంధ యాంజియోప్లాస్టీ, అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం జగదీప్ ధన్ఖడ్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన నిజంగానే అంత అనారోగ్యంగా ఉన్నారా? లేదంటే మోదీ సర్కార్పై మరింత అసహనంతో రగిలిపోయారా?. ఆయనకు కోపం తెప్పించిన విషయమేంటి?. అందుకు స్పందనగా మోదీ సర్కార్ ఏం చేసింది? ఇలాంటి వరుస ప్రశ్నల పరంపర సోమవారం మొదలై గంటలు గడుస్తున్నకొద్దీ సందేహాలు, విశ్లేషణలు మరింత ఎక్కువయ్యాయి.కాలిన కరెన్సీ కట్టల ఉదంతంలో అభిశంసనను ఎదుర్కోబోతున్న అలహాబాద్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పరోక్షంగా ధన్ఖడ్ పదవికి ఎసరుపెట్టారని మెజారిటీ విపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. సాధారణంగానే న్యాయవ్యవస్థపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించే ధన్ఖడ్ అరుదుగా వచ్చే జడ్జీల అభిశంసన అవకాశాన్ని తన హయాంలో విజయవంతంగా పూర్తిచేయాలన్న అత్యుత్సాహం చివరకు కేంద్రప్రభుత్వానికి కోపం తెప్పించిందని తెలుస్తోంది.మీ ఏకపక్ష నిర్ణయంపై తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని తెలియజేప్పేందుకే పార్లమెంట్ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) భేటీకి రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజులు రాలేదని తెలుస్తోంది. దీనిపై ధన్ఖడ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారని విశ్లేషణలు వెలువడ్డాయి. అన్ని విషయాల్లో ప్రభుత్వానికి మద్దతు పలికే తనను ఇలా కేంద్రప్రభుత్వం ఒకే ఒక్క అంశాన్ని సాకుగా చూపి అవమానించిందనే తీవ్ర అసహనంతో వెంటనే ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 4.30 మధ్యలోనే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4.30 గంటల మధ్యలోనే ప్రభుత్వానికి, ఉపరాష్ట్రపతికి మధ్య సఖ్యత ఒక్కసారిగా, పూర్తిగా చెడిందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘కీలక అంశాలపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ధన్ఖడ్ సారథ్యంలో బీఏసీ భేటీ జరిగింది. ఈ భేటీకి నడ్డా, రిజిజు హాజరయ్యారు. మళ్లీ 4.30 గంటలకు సమావేశమవుదామని ధన్ఖడ్ చెప్పారు. ఆ సమయంలో భేటీకి నడ్డా, రిజిజు రాలేదు. కనీసం రావట్లేదని ధన్ఖడ్ సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయనకు పరువు పోయినంత పనైంది. దాంతో చేసేదిలేక భేటీని మంగళవారం మధ్యాహా్ననికి వాయిదావేసి ఆయన నిరుత్సాహంగా వెళ్లిపోయారు’’అని జైరాం వెల్లడించారు.ఖర్గేకు అవకాశం ఇవ్వడమూ మరో కారణమా? సోమవారం ఉదయం సభలో ప్రశ్నోత్తరాల గంట ముగిశాక రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు ధన్ఖడ్ అనుమతించారు. దీంతో ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై కేంద్రప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఖర్గే ప్రసంగించారు. ఆపరేషన్సిందూర్పై వారం తర్వాత చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఖర్గేకు ముందే ఆ అంశంపై అవకాశమిచ్చి తమపై విమర్శలు గుప్పించే అవకాశం అనవసరంగా ఇచ్చారని ధన్ఖడ్పై మోదీ సర్కార్ గుర్రుగా ఉందని కొందరు బీజేపీ పార్లమెంట్ సభ్యులే చెప్పడం గమనార్హం.పుండుమీద కారం చల్లినట్లుగా ఖర్గే ప్రసంగించిన వెంటనే జడ్జి వర్మపై అభిశంసనకు సంబంధించి రాజ్యసభలో కేవలం విపక్ష సభ్యుల నోటీస్ను ధన్ఖడ్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నోటీస్పై అధికారకూటమి ఎంపీల సంతకాలు లేవు. అయినాసరే దానికి ధన్ఖడ్ ఆమోదముద్రవేయడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇదే అంశంపై లోక్సభలో జడ్జిపై అభిశంసన తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సమయంలోనే ఆ నోటీస్కు రాజ్యసభ చైర్మన్ హోదాలో ధన్ఖడ్ ఆమోదం తెలపడాన్ని మోదీ సర్కార్ తీవ్ర అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. విపక్షాల నోటీస్ ఆమోదంతో ఇకపై జరిగే అభిశంసన ప్రక్రియ మొత్తం విజయమంతా విపక్షాల ఖాతాలో పడిపోతుందన్న అక్కసు అధికారపక్షంలో పెరిగింది. దీని తర్వాతనే ఖర్గే, రిజిజులు బీఏసీ భేటీకి డుమ్మా కొట్టడం, ధన్ఖడ్ అసహనం వ్యక్తంచేయడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. అవమానించిన నడ్డా! రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా నడ్డా ఉద్దేశపూర్వకంగా కల్పించుకున్నారు. అధ్యక్షస్థానంలో కూర్చున్న ధన్ఖడ్కు వేలు చూపిస్తూ.. ‘‘ఇక్కడ ఖర్గే మాట్లాడింది ఏదీ రికార్డింగ్లోకి వెళ్లదు. నేను ఏం మాట్లాడితే అది మాత్రమే రికార్డుల్లోకి వెళ్తుంది’’అని అన్నారు. ‘‘ఖర్గే ప్రసంగంవేళ నిష్పాక్షికంగా ధన్ఖడ్ సభ నడుపుతుంటే నడ్డా కల్పించుకున్నారు. అలా అవమానించడం ఆయన తట్టుకోలేకపోయారు.ఇది ఆకస్మిక నిర్ణయమేరాజీనామా లేఖలో పేర్కొన్న ‘అనారోగ్యం’కారణం కానేకాదని ఉపరాష్ట్రపతి సచివాలయం సైతం పరోక్షంగా ధ్రువీకరిస్తోంది. ఉపరాష్ట్రపతి జూలై 23వ తేదీన జైపూర్లో ఒకరోజు పర్యటన తాజాగా ఖరారైంది’’అని సోమవారం మధ్యాహ్నం 3.53 గంటలకు ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరికొన్ని గంటల్లో సొంత రా ష్ట్రపర్యటనకు సంసిద్ధమైన వ్యక్తి మదిలో రాజీనామా ఆలోచన ఉండదని, సోమ వా రం జరిగిన అనూహ్య పరిణామాలే ఆ యనను రాజీనామాకు ఉసిగొల్పాయని తెలుస్తోంది.ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా: మోదీన్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి సోమవారం రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ జగదీప్ ధన్ఖడ్జీకి భారత ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో మన దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు.

‘ధర్మస్థళ’పై ఉష్ గప్చుప్!
ధర్మస్థళ వివాదం ముదిరి పాకాన పడుతోంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో 20 ఏళ్ల అవధిలో తాను వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని, కొందరి బలవంతం వల్ల తాను అలా చేయాల్సి వచ్చిందని మంజునాథ దేవస్థానపు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు చేసిన ప్రకటనతో వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వివాదం కాస్తా మంగళవారం మరో మలుపు తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ధర్మస్థళ మారణహోమం కేసుపై బెంగళూరు కోర్టు మంగళవారం గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. శ్రీ మంజునాథ ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ డి. దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా న్యాయస్థానం ఈ ఆదేశాలను ఇచ్చింది.వివిధ సోషల్మీడియా ప్లాట్ఫామ్స్లో ధర్మస్థళ ఉదంతానికి సంబంధించి ఉన్న 8,842 లింక్లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. మా పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలకు సంబం«ధించిన కవరేజీకి సంబంధించిన లింకులు తొలగించాలని, డీ–ఇండెక్స్ చేయాలని కోరిన హర్షేంద్ర తన పిటిషన్లో ‘ఎక్స్’, ఫేస్బుక్ పోస్టులు, థ్రెడ్లను ప్రస్తావించారు. ఈ వివాదంపై యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాల్లో ప్రచురించడం, ప్రసారం చేయడం, ఫార్వార్డ్ చేయడం, అప్లోడ్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.బెంగళూరులోని పదో అదనపు సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో హర్షేంద్ర దాఖలు చేసిన పిటిషన్లో గ్యాగ్ ఆర్డర్తో పాటు జాన్ డో ఆర్డర్ను పొందారు. హర్షేంద్ర తన పిటిషన్లో 338 సంస్థలు, వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. 4,140 యూట్యూబ్ వీడియోలు, 932 ఫేస్బుక్ పోస్ట్లు, 3,584 ఇన్స్ట్రాగామ్ పోస్ట్లు, 108 న్యూస్ లింక్లు, 37 రెడ్డిట్ పోస్ట్లతో పాటు 41 ’ఎక్స్’ పోస్టులతో కలిసి 8,842 లింక్లను తన పిటిషన్లో పొందుపరిచారు.వీటిలో ’లెట్ మీ ఎక్స్ప్లెయిన్’ ఎపిసోడ్లు, ది న్యూస్ మినిట్లోని వీడియోలు ఉన్నాయి. ప్రతివాదులుగా జాబితా వార్తలు, కంటెంట్, వీడియోలు ఉంచిన థర్డ్ ఐ, ధూత, సమీర్, ది న్యూస్ మినిట్, డెక్కన్ హెరాల్డ్, ది హిందూ, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ప్రజావాణి, కన్నడ ప్రభ, హోస దిగంత, బెంగుళూరు మిర్రర్, ఉదయవాణి, దినమణి, దిన తంతి, దినకరన్, సంయుక్త కర్ణాటక, విజయవాణి, విశ్వవాణి, కేరళ, న్యూస్ కా18 తదతరాలను చేర్చారు.గ్యాగ్ ఆర్డర్ కేవలం పిటిషన్లో ప్రస్తావించిన వాటిని మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హర్షేంద్ర జాన్ డో ఆర్డర్ కోసం న్యాయమూర్తికి విన్నవించారు. ఈ మేరకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో పిటిషన్లో పేరు లేని సంస్థలు, వ్యక్తులు, పార్టీలను ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ ఆదేశాల జారీ సందర్భంగా న్యాయమూర్తి విజయ కుమార్ రాయ్ ‘ప్రతి పౌరుడికి ప్రతిష్ట అనే చాలా ముఖ్యమైంది. సంస్థ, దేవాలయంపై ఆరోపణ వచ్చినప్పుడు అవి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. పరువు నష్టం కలిగించే ఒక ప్రచురణ కూడా సంస్థల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వు తమ భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని, దానిని రద్దు చేయాలని కోరుతూ యూట్యూబ్ పోర్టల్ థర్డ్ ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. – శ్రీరంగం కామేష్

ఎయిరిండియా విమానంలో మంటలు
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం. ఎయిరిండియా విమానంలో మంటలు వ్యాపించాయి. మంగళవారం (జూలై 22) హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315 ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ జరిగిన కొద్ది సేపటికే విమానం ఏపీయూలో (Auxiliary Power Unit)లో మంటలు చెలరేగాయి.ప్రమాదంతో అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఏపీయూ అనేది విమానాల్లో తోక భాగంలో గ్యాస్ టర్బైన్ ఇంజిన్లా పనిచేస్తుంది. విమానంలో లైట్లు, కంప్యూటర్లు, నావిగేషన్ వ్యవస్థలు మొదలైనవి ఈ ఏపీయూ వ్యవస్థ ద్వారా పని చేస్తాయి. విమానం ఇంజిన్ ప్రారంభం కావాలంటే తగినంత గాలి కావాలి. ఆ గాలిని ఈ ఏపీయూ అందిస్తోంది. అంతేకాదు కేబిన్లో ప్రయాణికులకు చల్లటి గాలిని అందించడంలో సహాయపడుతుంది. విమానానికి ఉన్న మెయిన్ ఇంజిన్ విఫలమైతే ఏపీయూ ద్వారా గాలి,కరెంట్ ఉత్పత్తి అవుతుంది.

కాంగ్రెస్కు బిగ్ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. 2018-2019 సంవత్సరానికి గానూ రూ.199.5 కోట్ల ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ను ఆశ్రయించింది. ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యూనల్ కాంగ్రెస్ విజ్ఞప్తిని తిరస్కరించింది. పన్ను మినహాయింపు ఇవ్వడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 13ఏను ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అందుకు గల కారణాల్ని ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యూనల్ ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ తన ఆదాయపు పన్ను రిటర్న్ను 2019 ఫిబ్రవరి 2న ఫైలింగ్ చేసింది. ఇది 2018 డిసెంబర్ 31 చివరి తేదీ లోపు చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 139(1) ప్రకారం డ్యూ డేట్ కింద రాకపోవడం వల్ల, సెక్షన్ 13A ప్రకారం మినహాయింపు పొందలేకపోయింది.దీనికి తోడు పార్టీ ఇన్ కమ్ ట్యాక్స్ నియమాలకు విరుద్ధంగా నగదు విరాళాలు సేకరించింది. పార్టీ సేకరించిన రూ.14.49 లక్షల నగదులో విరాళాలు అందించిన దాత రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో సమర్పించారు. తద్వారా సెక్షన్ 13A(డీ) నిబంధనలను ఉల్లంఘించింది.రాజకీయ పార్టీలు మినహాయింపులు పొందాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలి. చారిటబుల్ ట్రస్టులుకి ఉన్న వెసులుబాటు రాజకీయ పార్టీలకు వర్తించదు. దీంతో తాజా ట్యాక్స్ ట్రిబ్యూనల్ నిర్ణయం కాంగ్రెస్కు ఎదుదెబ్బ తగిలినట్లైంది.
ఎన్ఆర్ఐ

నిమిషా ప్రియను క్షమించలేం
సనా: తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని దారుణంగా హత్య చేసిన కేరళ నర్స్ నిమిషా ప్రియను క్షమించలేమని అబ్దెల్ ఫతాహ్ మెహదీ తేల్చిచెప్పారు. ఆమె నుంచి క్షమాపణ గానీ, నష్టపరిహారం(బ్లడ్ మనీ) గానీ తాము కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు. యెమెన్లో నిమిష తల్లి ప్రేమకుమారియెమెన్లో మాజీ వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీని 2017లో విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు నిమిషా ప్రియకు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆమెకు బుధ వారం శిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమి షంలో వాయిదా పడింది. బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫతాహ్ మెహదీ బీబీసీ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఖిసాస్’ తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదని చెప్పారు. షరియా చట్టం ప్రకారం తమకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సోదరుడిని చంపినందుకు నిమిషా ప్రియను ఉరి తీయాల్సిందేనని, అంతకుమించి ఇంకేదీ అక్కర్లే దని వెల్లడించారు.

నిమిష మరణశిక్ష వాయిదా
యెమెన్లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం.నిమిష శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్లో ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ సభ్యుడు శ్యామూల్ జోరెమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయితే.. బాధిత కుటుంబం బ్లడ్మనీ(పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని అంటున్నారాయన.కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం. మరోవైపు.. నిమిషా ప్రియ విషయంలో భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఈఏ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హౌతీ నియంత్రణలోని యెమెన్తో భారతకు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. ఈ తరుణంలో తామ చేయగలిగినదంతా చేశామని, ఇంతకు మించి చేయలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే.. నిమిష కేసును బాధాకరంగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అనధికారిక మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చినా.. కేంద్రం యెమెన్ న్యాయవిభాగానికి విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భర్తతో నిమిషఇంకోవైపు క్షమాభిక్షపైగానీ, బ్లడ్మనీపైగానీ చర్చించేందుకు సైతం తలాల్ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే తాజా భేటీలో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి పాల్గొన్నట్లు తెలస్తోంది. ఈ పురోగతితో నిమిష శిక్ష రద్దయ్యే అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి.

Dallas: డాలస్లో ఘనంగా “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం
డాలస్లో ఆదివారం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్య్వర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం కన్నుల పండుగగా జరిగింది.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ కూచిపూడి నాట్య రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నాట్య గురు, శ్రీకాకుళం జిల్లాలో నెలకొనిఉన్న ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ డైరెక్టర్ అయిన స్వాతి సోమనాథ్ తన శిష్యులైన కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన వివిధ నృత్య ప్రదర్శనలు రెండు గంటలపాటు ఆహుతులను అలరించాయి అన్నారు.స్వాతి సోమనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనలమేరకు శ్రీకాకుళం జిల్లాలో 11 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొల్పబడిన ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ ప్రపచంలోనే తొలి కూచిపూడి గురుకులం అని, వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది విద్యార్ధినీ, విద్యార్ధులు శ్రద్ధాసక్తులతో నాట్యం నేర్చుకుంటూ కూచిపూడి నాట్యంలో డిగ్రీలు సంపాదించుకుని, దేశ విదేశాలలో తమ ప్రతిభా పాటవాలను చూపుతున్నారని, ఇటీవల డిట్రాయిట్ లో జరిగిన తానా మహా సభలకు ఆహ్వానం అందుకుని తొలిసారి అమెరికాలో అడుగుపెట్టిన పిల్లలకు డాలస్ నగరంలో డా. ప్రసాద్ తోటకూర, వారి బృందం చూపిన ఆదరణ ఎన్నటికీ మరువలేనిది అంటూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు గంటల పాటు కన్నుల పండుగగా సాగిన నాట్యవిభావరి లో “శ్రీ గణనాధం” - త్యాగరాజ కృతి కనకాంగి రాగం, ఆది తాళంలో ఉన్న వినాయకుడి స్తుతితో ప్రారంభమైంది. “ఒక పరి ఒక పరి” – ఖరహర ప్రియ రాగం, ఆది తాళంలో అన్నమాచార్య కీర్తన శ్రీ వేంకటేశ్వర స్వామి అందాన్ని వర్ణిస్తుంది. ముదురు రంగులో అలమేలుమంగ సరసమైన ఛాయతో మెరుపుల పరంపరతో ఆలింగనం చేయబడిన చీకటిమేఘంతో పోల్చబడింది. “క్షీర సాగర శయన” – దేవ గాంధారి రాగం, ఆది తాళాల్లో ఉన్న ఈ త్యాగరాజ కృతి - గజేంద్ర మోక్షం, ద్రౌపది వస్త్రాపహరణం అంశాలలో చక్కగా చూపబడింది. “అద్వైతం - యోగా నృత్యం” - ప్రపంచ శాస్త్రీయ నృత్యాల చరిత్రలో మొదటిసారిగా యోగా, భారతీయ శాస్త్రీయసంగీతం యొక్క ఏడు స్వరాలు, ఆ స్వర చిహ్నాల కలయిక ఈ అంశంలో వినూత్నంగా చూపబడింది. మానవ శరీరంలో మూలాధారంతో ప్రారంభమై సహస్రారంతో ముగుస్తుంది. 7 శక్తి కేంద్రాలు నాట్యశాస్త్రం యొక్క వివిధ నృత్య భంగిమలతో చూపించబడ్డాయి.“తెలుగు కవన నర్తనం” - తెలుగు భాషా సాహిత్యం, కవిత్వం, సంగీతానికి ముఖ్యమైనది. త్యాగరాజస్వామి కృతి ‘ఎందరో మహానుభావులు’, ‘ఎంకి నాయుడు బావ’ యుగళగీతం, అన్నమయ్య 'బ్రహ్మం ఒక్కటే’, విశ్వనాథ వారి ‘కిన్నెరసాని’, మంగళంపల్లి బాలమురళి గారి ‘తిల్లానాతో’ మొదలై భక్త రామదాసు పాటలతో తెలుగుసాహిత్యంలోని వాగ్గేయకారులకు, కవులకు నివాళితో గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన కూచిపూడి నృత్యహేల అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ “మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సాహిత్యం, కళలను నిరంతరం ప్రోత్స హిస్తున్న డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో యింతటి గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసినందులకు వారిని, మహాత్మాగాంధీ మెమోరియల్, తానా, ఆటా, టిపాడ్, ఇండియా అసోసియేషన్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సభ్యులను ప్రత్యేక అభినందనలు అన్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలను చేరదీసి కూచిపూడి నాట్యంలో ఎంతో అకుంటిత దీక్షతో ఆణిముత్యాలను తయారుచేస్తున్న స్వాతి సోమనాథ్ కృషి ఎంతో కొనియాడదగ్గది అని ప్రశంసించారు. ప్రముఖ కూచిపూడి నాట్యగురు కళారత్న కె.వి సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతి సోమనాథ్ తో చిరకాల పరిచయం అని, ఇద్దరం కలసి కొన్ని ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశామని, ఈ రోజు డాలస్ లో కలుసుకోవడం ఆనందంగా ఉందని, కూచిపూడి నాట్యాన్ని ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళే ఆమె కృషి సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.గౌరవ అతిథులుగా విచ్చేసిన బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలు వివిధ సంఘాల నాయకులతో కలసి నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలలను ఘనంగా సన్మానించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంఘ నాయకులు – డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వల, తయాబ్ కుండావాల, బి ఎన్ రావు, మహేంద్ర రావు, మురళి వెన్నం, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకులు షబ్నం మాడ్గిల్, సుష్మా మల్హోత్రా, డా. జే పి, ముర్తుజా, ఆటా, టి పాడ్ నాయకులు రఘువీర్ బండారు, వేణు భాగ్యనగర్, శారదా సింగిరెడ్డి, పాండు పాల్వాయి, సత్య పెర్కారి, తానా నాయకులు లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, టాన్ టెక్స్ నాయకులు చంద్ర పొట్టిపాటి, సుబ్బు జొన్నలగడ్డ, భీమ పెంట, ఆనందమూర్తి, లలిత మూర్తి కూచిభొట్ల, చిన సత్యం వీర్నపు, నరసింహా రెడ్డి ఊరిమిండి, పుర ప్రముఖులు లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, చంద్రహాస్ మద్దుకూరి, జాకీర్ హుస్సేన్, మడిసెట్టి గోపాల్, అత్తలూరి విజయలక్ష్మి, భార్గవి పేరి, నాగరాజు నలజుల, పూర్ణా నెహ్రు మొదలైన వారు హాజరై ఈ కార్యక్రమాన్ని ఆసాంతం ఆస్వాదించారు.బి.ఎన్ రావు తన వందన సమర్పణలో ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన కాక తీయహాల్ నిర్వాహకులకు, డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి, ఫన్ ఏషియా, సురభి రేడియో యాజమాన్యాలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, హాజరైన కళాపోషకులకు, అద్భుతమైన నాట్య ప్రదర్శనలు చేసిన కళాకారులు నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలకు, గౌరవ అతిథులుగా విచ్చేసిన బిజెపి నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్ 2025 టోర్నమెంట్ ఘన విజయం
సింగపూర్: స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్ 2025 ఆధ్వర్యంలో తెలుగు సంఘానికి ప్రత్యేకంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడపా, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు, కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ భరద్వాజ్, తెలుగు సమాజం నుంచి నాగేశ్ టేకూరి మద్దతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాయబార కార్యాలయం నుంచి VSR కృష్ణ, సన్యమ్ జోషి భాగస్వామ్యం మరో ప్రత్యేకత. ఈ టోర్నమెంట్లో మొత్తం 40 జట్లు తమ ప్రతిభను చాటుకున్నాయి. ప్రారంభ రౌండ్లు రౌండ్-రాబిన్ లీగ్ తరహాలో నిర్వహించగా, అనంతరం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నుండి నాక్అవుట్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగాయి. తుదిపోరులో అనూప్- విజయ్ జంట విజేతలుగా నిలిచింది. నిర్వాహకులు ద్వారకానాద్ మిట్టా, నవీన్ మల్లం, మహేశ్వర చౌదరి కాకర్ల, సాయి కృష్ణ సేలం, రమేష్ గోర్తి, ఉమామహేశ్వర రావు తెళదేవర, వెమ్మెసెన కులశేఖర్ రీగన్, ప్రసాద్, చంద్రబాబు జొన్నారెడ్డి, విశ్వనాథ్ తదితరులు ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!క్రీడా స్పూర్తిని, సాంఘిక సమైక్యతను,సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ టోర్నమెంట్ సాగింది. ఖచ్చితమైన ప్రణాళిక, స్నేహపూర్వక పోటీలు, ఉత్సాహభరిత వాతావరణంతో ఈ కార్యక్రమం అందరి మెప్పు పొందింది. స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ ఈ టోర్నమెంట్ను విజయవంతం చేసిన ఆటగాళ్లు, స్వచ్ఛంద సేవకులు, ప్రోత్సాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా వీరా ఫ్లేవర్స్, సరిగమ, కుంభకర్ణ, ఫ్లింటెక్స్ కన్సల్టింగ్, ERA, ఈస్ట్ కోస్ట్ ఫిజియోథెరపీ సంస్థల సహకారం ఈ టోర్నమెంట్కు బలాన్ని చేకూర్చిందని నిర్వాహకులు తెలిపారు.
క్రైమ్

రాత్రి 11కి ఎవరితో మాట్లాడుతున్నావ్..!
వికారాబాద్: ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా వని ప్రశ్నించినందుకు భర్తను గొంతు నులిమి చంపేసిందో భార్య. కూతురుకు మంచీచెడు చెప్పాల్సిన తండ్రి ఇందుకు సహకరించడం గమనార్హం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ నగేశ్, స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాపూర్కు చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ (33)కు ఇదే మండలం కోత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఈశ్వర్ ప్రసాద్ (10), సుకుమార్ (7) కుమారులు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చురేపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. ఇటీవలే నచ్చజెప్పిన ఇరుకుటుంబాల వారు దంపతులిద్దరినీ కలిపారు. జయశ్రీ తండ్రి పండరి సైతం వీరితో పాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి 11గంటల వరకు వెంకటేశ్ బయటే గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లగా భార్య ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం వెంకటేశ్ నిద్రపోయాడు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస్, కృష్ణ సోమవారం ఉదయాన్నే వచ్చి తమ్ముడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్, ఎస్ఐలు రాథోడ్ వినోద్, సాజిద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ నాన్నను అమ్మ, తాత కలిసి గొంతు నులిమి చంపేశారని మృతుడి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.

భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏంటంటే?
సాక్షి,బెంగళూరు: భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మతో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్పై వడిగేరికి వెళ్లి ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గం మధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది.నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచ్చిన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది.ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు.అయితే, ఇదే కేసులో భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భర్తను నదిలోకి తోసేసినట్లు భార్య పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చట్టపరంగా భర్తపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉపక్రమించారు. In #Karnataka's Yadagiri, a wife pushed her husband into the river on the pretext of taking a selfie.The couple got married 2 months ago, the husband had gone to his mother's house to pick up his wife, while returning,1/2 pic.twitter.com/u0N8xK8QLI— Siraj Noorani (@sirajnoorani) July 16, 2025

కనిపించని పశ్చాత్తాపం.. జైలు జీవితం బాగుందంటున్న సోనమ్
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో నిందితురాలు సోనమ్ రఘవంశీకి జైలు జీవితం బాగుందని సమాచారం.పెళ్లైన 11 రోజులకే హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లిన భర్త రాజా రఘువంశీని అప్పటికే మాట్లాడి పెట్టుకున్న సుపారీ గ్యాంగ్తో సోనమ్ రఘువంశీ హత్య చేయించింది. ఇదే కేసులో మేఘాలయా షిల్లాంగ్ జైలులో శిక్షను అనుభవిస్తోంది.నెల రోజుల జైలు శిక్ష పూర్తి చేసుకున్న క్రమంలో ఈక్రమంలో జైల్లో ఉన్న సోనమ్ రఘువంశీ గురించి ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైలు నిబంధనల ప్రకారం.. జైల్లో ఉన్న సోనమ్ను చూసేందుకు ఆమె కుటుంబసభ్యులకు అనుమతి ఉంది. కానీ ఆమెను చూసేందుకు ఎవరూ రాలేదు. భర్తను చంపేశానన్న పశ్చాత్తాపం సోనమ్లో లేదు. జైలు వాతావరణానికి తగ్గట్లు తనని తాను మార్చుకుంది. ఇతర మహిళా ఖైదీలతో కలిసిపోతుంది. జైలు నిబంధనల ప్రకారం.. సమయపాలన పాటిస్తోంది. ప్రతి రోజూ టైం ప్రకారం నిద్ర లేస్తోంది. అయితే, తన వ్యక్తిగత జీవితం, భర్తను హత్య చేయించిన విషయాల గురించి జైలు సిబ్బందితో,తోటి ఖైదీలతో మాట్లాడడం లేదని సమాచారం.ఇక సోనమ్ను జైలు అధికారులు జైలు వార్డెన్ సమీపంలో ఆమెకు గదిని కేటాయించారు. ఆ గదిలో ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళ ఖైదీలు రూమ్ను షేర్ చేసుకుంటున్నారు. సోనమ్ కుట్టుమిషను ఇతర స్కిల్ సంబంధిత పని నేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రతి రోజు తప్పని సరిగా టీవీ చూస్తున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. షిల్లాంగ్ జైలులో మొత్తం 496 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 20 మంది మహిళలు. సోనమ్ జైలులో హత్య కేసులో నిందితురాలైన రెండవ మహిళా ఖైదీ.ఆమెను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

భర్త బర్త్ డే విషెస్ చెప్పలేదని టీచర్..!!
ఏలూరు: అనుమానాస్పద స్ధితిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక (38) తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది. నూజివీడు సమీపంలో బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మందాడ లక్ష్మయ్య, ప్రభావతి కుమార్తె దేవికను పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన చిన్ని సురేంద్రకిచ్చి 20 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి పవన్ తేజ, గౌతమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవిక ఉంగుటూరు మండలం నల్లమాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సురేంద్ర ఉంగుటూరు మండలం రాచూరు పాఠశాలలో హెచ్ఎంగా ఉన్నారు. చొదిమెళ్ళ శ్రీవల్లి అపార్ట్మెంట్స్లో ఐదేళ్ల కిందట అపార్ట్మెంట్ కొన్నారు. ఉద్యోగాల నిమిత్తం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఉంటున్నారు. శని, ఆదివారాలు ఏలూరు అపార్ట్మెంట్కు వెళ్తుంటారు. శనివారం సాయంత్రం 5 గంటలకు సురేంద్ర వచ్చేసరికి ఉరి వేసుకుని భార్య దేవిక మృతి చెంది ఉంది. మనస్తాపంతో కాళ్లు, చేతులపై అతను తీవ్రంగా కోసుకున్నాడు. దేవిక పుట్టిన రోజు సందర్భంగా కుమారులు శుభాకాంక్షలు చెప్పేందుకు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారు లిఫ్ట్ చేయకపోవడంతో ఏలూరులోనే ఉంటున్న పెదనాన్నకు చెప్పడంతో అతను అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా రక్తమడుగులో ఉన్న తమ్ముడు కనిపించాడు. వెంటనే పోలీసులకు, సురేంద్ర మామ లక్ష్మయ్యకు విషయం తెలియచేసి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపార్ట్మెంట్ను పరిశీలించారు. మృతిపై అనుమానాలు: మృతురాలి తండ్రి తన కూతురు దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు తండ్రి లక్ష్మయ్య తెలిపారు. పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని కోరారు. టీచర్ మృతి చెందిన అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పనిచేయటం లేదని సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరి సెల్ఫోన్ డేటా కీలకం కానుంది. పుట్టినరోజు నాడే తన కుమార్తె దేవిక మృతి చెందటం తట్టుకోలేకపోతున్నానని తండ్రి లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న కూతురుగా గారాబంగా పెంచమని ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు.