
రాజీవ్ యువవికాసంపై దృష్టి సారించాలి
నిజామాబాద్అర్బన్: రాజీవ్ యువవికాసంపై ప్ర త్యేక దృష్టి సారించి యువతకు విస్తృతంగా అవగా హన కల్పించాలని, పథకం అమలు తీరును నిశితంగా పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. రాజీవ్ యువవికాసంపై వీడియాకాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం సోమ వారం సాయంత్రం సమీక్షించారు. వీలైనంత ఎక్కు వ మంది అర్హులు దరఖాస్తు చేసుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని, దీంతో నిరుద్యోగ యు వతకు వారు ఎంపిక చేసుకునే రంగాల్లో స్వయం ఉపాధి పొందే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువత స్వయం ఉపాధిని ఎంచుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని ప్రభుత్వం రా జీవ్ యువవికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. గతంలో స్వయం ఉపాధి ప థకాల కింద వచ్చిన దరఖాస్తుల్లో మొక్కుబడిగా కేవలం 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే మంజూరీలు, యూనిట్ల గ్రౌండింగ్ జరిగిందన్నారు.
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. రాజీవ్ యువవికాసం పథకానికి వీలైనంత ఎక్కువమంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా ప్రకటనలు జారీ చేయడంతోపాటు విస్తృత ప్రచారం చేశామన్నారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలుగకుండా కు ల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెంటవెంటనే జారీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించామన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక స మావేశాన్ని ఏర్పాటు చేసి పథకం ప్రాధాన్యతను, అమలు తీరుపై మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటి వర కు అందిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ తెలిపా రు. అదనపు కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, డీబీసీడీవో స్రవంతి, డీటీడబ్ల్యూవో నాగూరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు విస్తృతంగా
అవగాహన కల్పించండి
అమలుతీరును నిశితంగా పర్యవేక్షించాలి
వీడియోకాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క