శ్రీమందిరంలో వనవాస సేవ | - | Sakshi
Sakshi News home page

శ్రీమందిరంలో వనవాస సేవ

Apr 10 2025 12:35 AM | Updated on Apr 10 2025 12:35 AM

శ్రీమందిరంలో వనవాస సేవ

శ్రీమందిరంలో వనవాస సేవ

భువనేశ్వర్‌: శ్రీరామ నవమి ఉత్సవాలు పురస్కరించుకుని శ్రీక్షేత్రంలో వనవాస సేవ ఉత్సాహంగా జరుపుకున్నారు. ఏటా పవిత్ర చైత్ర శుక్ల ద్వాదశి నాడు ఈ సేవ నిర్వహిస్తారు. శ్రీరామ నవమి ఉత్సవాలతో పూరీ పట్టణంలో సాహి జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో వీధి కళాకారులు కనులకు కట్టినట్లు శ్రీరామ వనవాసం వివరాలతో ప్రదర్శించిన బహిరంగ నాటక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వనవాస సేవ జరిపారు. ఽశ్రీజగన్నాథ వల్లభ మఠం ప్రాంగణంలో ఈ సేవ నిర్వహించారు. ధూపదీప సేవ అనంతరం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఉత్సవమూర్తులను ఛాత్రఛాయలో ఘంటానాదం మధ్య పల్లకీలో ఊరేగింపుగా శ్రీజగన్నాథ వల్లభ మఠానికి తరలించారు. ఈ ప్రాంగణంలో ప్రత్యేక శయ్యపై ఉత్సవమూర్తులను ఆసీనపరచి వనవాస సేవ ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కండేశ్వర్‌ వీధి కళాకారుల బృందం శ్రీరామ వనవాసం వీధి నాటకం ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ముగిసిన తర్వాత శీతల భోగ సేవ తదితర ఆచారాలతో ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శ్రీమందిరం దక్షిణ గృహానికి తరలించి యథాస్థానంలో పదిలపరచడంతో శ్రీరామ వనవాసం సేవ ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement