Odisha Latest News
-
చాందీపూర్, తలసరి బీచ్లకు మహర్దశ
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా కోస్తా ప్రాంతాల పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి ప్రభాతి పరిడా బాలాసోర్ జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాల్లో అనుకూల వనరులపై వైమానిక సర్వే నిర్వహించారు. జిల్లాలో తొలొసొరా, చాందీపూర్ రెండు ప్రధాన సాగర తీరాలు. విశేష సంఖ్యలో పర్యాటకుల్ని ఈ తీరాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాల్లో చక్కటి పర్యావరణ పురోగతితో సందర్శకులకు అనుకూలమైన వసతి, మనోరంజక, కాలక్షేప వసతులు సమకూర్చితే అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా వెలుగొందుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బాలాసోర్ జిల్లాలో బీచ్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ రెండు ప్రధాన బీచ్లు తొలొసొర, చాందీపూర్ ప్రధాన పర్యాటక కేంద్రాలుగా మలిచే లక్ష్యంతో గణనీయమైన ఆర్థిక కేటాయింపులు, పర్యాటక కార్యక్రమాలను మంత్రి ప్రతిభా పరిడా ప్రకటించారు. ఆసియాలోనే అతిపెద్ద శివలింగానికి నిలయమైన భుషండేశ్వర్ పీఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను పెంచడానికి రూ.10 కోట్ల గ్రాంట్ ప్రకటించారు. సాగర తీరాలకు రూ. 11 కోట్లు పర్యాటకులకు అనుకూలమైన ప్రసిద్ధ తీరప్రాంత గమ్యస్థానమైన చాందీపూర్ బీచ్ సమగ్ర అభివృద్ధికి మంత్రి రూ. 11 కోట్లు కేటాయించారు. ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందడం లక్ష్యంగా పేర్కొన్నారు. పర్యావరణ పర్యాటక రంగానికి ప్రోత్సాహకంగా, ఈ సంవత్సరం బాలసోర్ తీర ప్రాంతంలో ఎకో రిట్రీట్ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. సుస్థిర, ప్రకృతి కేంద్రీకృత అనుభవాలను కోరుకునే పర్యాటకులను ఆకర్షించడం ఈ చొరవ లక్ష్యం. జిల్లాలోని వివిధ బీచ్లలో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు పురోగతి దశలో ఉన్నాయి. ఈ తీరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధిక సంఖ్యలో సందర్శకులను ఆకర్షించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ల ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి మంత్రి హెలికాప్టర్ ద్వారా వైమానిక సర్వే నిర్వహించారు. అనంతరం ఆమె పర్యాటక శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ బల్వంత్ సింగ్తో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధిని వేగవంతం చేయడంపై ప్రాధాన్యత పెంపొందించారు. సాగర తీరాల బహుముఖ అభివృద్ధి పర్యాటక రంగం బహుముఖ అభివృద్ధితో సమాజంలో సన్నకారు, బలహీన తదితర వర్గాలకు అనేక ఉపాధి అవకాశాల్ని అందుబాటులోకి తెస్తాయని మంత్రి తెలిపారు. -
ఈస్ట్ కోస్ట్ జీఎంతో నబరంగ్పూర్ ఎంపీ భేటీ
కొరాపుట్: ఈస్ట్ కోస్ట్ జీఎం పరమేశ్వర్ ఫఖువాల్తో నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి శనివారం భేటీ అయ్యారు. శనివారం జీఎం కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. జయపూర్–నబరంగ్పూర్, జయపూర్–మల్కన్గిరి, మల్కన్గిరి–భద్రాచలం, నబరంగ్పూర్ –జునాఘడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి పై చర్చించారు. రాయగడ రైల్వే డివిజన్ లోని గుణుపూర్–తెరువల్లి నిర్మాణ పురోగతి సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గొర్రెలపై హైనా దాడి కొరాపుట్: గొర్రెల కావడి మీద హైనా దాడి చేయడంతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. శనివారం వేకువజామున నబరంగ్పూర్ జిల్లా నందాహండి సమితి పడాల్గుడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేణుధర్ తాడి తన ఇంటి సమీపంలో గొర్రెల కావడి నుంచి గొర్రెల అరుపులు రావడంతో అక్కడికి చేరుకున్నాడు. అయితే మనుషుల అలికిడి విని ఒక అటవీ జంతువు పరారయ్యింది. లోపలికి వెళ్లి చూస్తే 4 గొర్రెలు మృతి చెందాయి. మరో రెండు తీవ్రగాయాలు పాలై ఉన్నాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. గొర్రెలకు ఉన్న గాయాలు ప్రకారం ఇది హైనా దాడిగా అనుమానించారు. అటవీ శాఖ సిబ్బంది గాయపడిన గొర్రెలకు చికిత్స అందజేస్తున్నారు. ఈనెల 7 వరకు వర్షాలు ● 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ భువనేశ్వర్: రాష్ట్రంలో కాలవైశాఖి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణం ఈనెల 7వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో 8 జిల్లాలకు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వాన సంకేతాలతో తుఫాన్ పోలిన వాతావరణం తాండవిస్తుందని వాతావరణ కేంద్రం సమాచారం. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. వీటిలో మయూర్భంజ్, సుందర్గఢ్, కెంజొహర్, బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, గజపతి మరియు గంజాం జిల్లాలు ఉన్నాయి. ఉపరితల గాలులు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ సూచన. కాల వైశాఖి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో మరో 22 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈనెల 7వ తేదీ వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల్లో సమగ్రంగా పగటిపూట ఉష్ణోగ్రత మారే అవకాశం లేదు. రానున్న రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ సమాచారం. శ్మశానంలో తేనెటీగల దాడి కొరాపుట్: శ్మశానంలో తేనెటీగలు దాడి చేయడంతో అంత్యక్రియలకు వచ్చిన వారు చెల్లాచెదురయ్యారు. శనివారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి లౌడి గ్రామానికి చెందిన సమికా ఖొరా అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. గ్రామస్తులు అంత్యక్రియల కోసం శ్మశానంలో ఏర్పాట్లు చేశారు. మృతదేహంపై కర్రలు కప్పుతుండగా తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో అంతా పరుగులు తీశారు. కొందరు నదిలో దూకారు. 15 మంది గాయపడడంతో వారిని సుంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు పీతం పాఢి, రఘురాం పోడాల్, ప్రపుల్ల పంగి పరామర్శించారు. -
ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్టు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా డాబుగాం పోలీసులు ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉమరాహండి గ్రామానికి చెందిన చంచల మజ్జి అనే మహిళ పపడాహండిలో ప్రతిరోజూ కూరగాయలు విక్రయించి తిరిగి ఇంటికి వస్తుంది. ఆమెను గత కొంతకాలంగా జొరిగాం సమితి పట్రాసిల్ గ్రామానికి చెందిన పరశురాం శాంత, ముండాగుడ గ్రామానికి చెందిన రాకేష్ శాంతలు అనుసరిస్తున్నారు. ఇటీవల బాధిత మహిళ కన్యాశ్రమం వద్ద బస్సు దిగి తన గ్రామానికి వెళ్తుండగా వీరిద్దరూ ముఖానికి ముసుగులు వేసుకొని వచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుని లాక్కొనిపోయారు. దీంతో బాధితురాలు చంచల డాబుగాం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు బంగారు గొలుసుని ఉమ్మర్కోట్లో విక్రయించి ఆ డబ్బులతో డాబుగాంలో విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు నిలదీయడంతో నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి నగదు, నంబర్ ప్లేట్లేని బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
ప్రకృతి విపత్తులపై ప్రజలను అప్రమత్తం చేయండి
కొరాపుట్: రానున్న వర్షాకాలంలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ, ప్రాథమిక విద్య, మైనారిటీ శాఖ మంత్రి నిత్యానందో గోండో సూచించారు. శనివారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రసంగించారు. జిల్లావ్యాప్తంగా నదులు, కాలువలు దెబ్బతిన్న గట్లు ముందస్తుగా గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు. వరదలు రావడానికి ముందే జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన అనుమానిత ప్రాంతాల్లో మందులు, మిల్క్ పౌడర్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బెల్లం, అటుకులు సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణులను గ్రామాల్లో గుర్తించి కాన్పు సమయానికి ముందే ఆస్పత్రులకు చేర్చాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్, అగ్నిమాపక బృందాలకు అవసరమైన సామగ్రి ముందే సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, ఎమ్మెల్యేలు మనోహర్ రంధారి, గౌరీ శంకర్ మజ్జి, మున్సిపల్ చైర్మన్ కునునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నందపూర్పై కాల వైశాఖి ప్రభావం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్ సమితిపై కాలవైశాఖి ప్రకోపం చూపించింది. ఈదురు గాలులతో భారీ వర్షాలు పడడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. సిమిలిగుడ రహదారుల మద్య భారీ వృక్షాలు కూలడంతో రాకపోకల స్తంభించాయి.నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లమ్తాపుట్ సమితి ఉర్దిగుడ గ్రామంలో నవీన్ హంతాల్ ఇంటి పై భారీ వృక్షం పడింది. త్రుటిలో కుటుంబీకులు ప్రాణాలతో బయటపడ్డారు. తహసిల్దార్ దివాకర్ బాగ్, ఫైర్ స్టేషన్ ఒఐసీ చిత్రరంజన్ పంజియాలు సహయ సహకారాలు, పునరుద్ధరణ కార్యక్రమాల్ల్లో పాల్గొన్నారు. -
తండ్రీకొడుకుల దారుణ హత్య
● సరిగుడ గ్రామంలో దారుణం ● ఐదుగురిపై కేసు నమోదు ● పోలీసుల అదుపులో ఒకరు రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి లికిటిపొదొరొ పంచాయతీలోని సరిగుడ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని తండ్రీకొడులను గుర్తు తెలియని దుండగులు మరణాయుధాలతో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురిపై చంద్రపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సరిగుడ గ్రామంలో నివసిస్తున్న అగాదు గొమాంగొ (32), శంభుర గొమాంగొ(62)లు తండ్రీకొడుకులు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని కొంతమంది దుండగులు గొమాంగొ ఇంటికి వెళ్లి తగువు పడ్డారు. వాగ్వాదం పెరగడంతో వారు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. కేకలు వినిపించడంతో అగాదు తండ్రి శంభుర బయటకు వచ్చి చూశాడు. దీంతో దుండగులు అతనిపై కూడా దాడికి దిగారు. అదే సమయంలో అగాదు భార్య జెనిత గొమాంగొ బయటకు వచ్చి చూడగా తన భర్త, మామలపై దుండగులు మరణాయుధాలతో దాడి చేయడం కనిపించింది. దీంతో ఆమె వెంటనే ఇరుగు పొరుగు వారిని తీసుకువచ్చింది. వారు వచ్చి చూసేసరికి ఇంటి బయట రక్తపు మడుగులో భర్త అగాదు, మామాయ్య శంభుర పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పాత కక్షల కారణంగానే దుండగులు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే తన భర్త, మామాయ్యలపై దాడి చేసి హతమార్చారంటూ బాధితురాలు జెనిత గొమాంగొ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
లైంగిక వేధింపులపై ప్రజల ఆగ్రహం
కొరాపుట్: విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ప్రజలు ఆందోళనకు దిగారు. కొరాపుట్ జిల్లా నందపూర్ పోలీసు సబ్ డివిజన్ లమ్తాపుట్ సమితిలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ స్కూల్లో ఏప్రిల్ 13వ తేదీన 8 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఈ విషయం పాఠశాల సిబ్బంది రహస్యంగా ఉంచి బాలికకు చికిత్స చేయించారు. కానీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో గత్యంతరం లేక ఏప్రిల్ 30వ తేదీన గుణయిపొడలోని బాలిక ఇంట్లో దింపి వెళ్లిపోయారు. బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబీకులు వైద్యం కోసం తీసుకొని వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మకు విషయం తెలియజేయడంతో దర్యాప్తునకు ఆదేశించారు. లమ్తాపుట్ సమితి కేంద్రంలో ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూకుమ్మడిగా ఇళ్ల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీగా బయటకు వచ్చారు. ఆగ్రహంతో పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్డీపీవో దేవేంద్ర మాలిక్ స్పందించి కేసు దర్యాప్తు జరుగుతోందని తెలియజేశారు. సున్నితమైన కేసు కావడంతో వివరాలు ప్రకటించలేమన్నారు. మరోవైపు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిపప్పు, పైనాపిల్ ఎగుమతి చేయండి
● జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అత్యధికంగా ఉత్పాదన అవుతున్న జీడిపప్పు, పైనాపిల్, మిరియాలు, రబ్బరు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే మైక్రో, చిన్న, మీడియం పరిశ్రమలదారులకు అధికంగా లాభాలు వస్తాయని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. కలెక్టరేట్ వద్ద ఆర్శెఠి భవనంలో జిల్లా స్థాయి జీడిపప్పు వెండర్ మొబిలైజేషన్ డ్రైవ్ కర్మశాలను శనివారం ప్రారంభించారు. ఈ వర్క్షాపు డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, మార్కెటింగ్ (ఒడిశా) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇతర అతిథులుగా ఎం.ఎస్.ఎం.ఈ జాయింట్ డైరెక్టర్ కమల్జిత్ దాస్, ఎగుమతి ప్రమోషన్ డైరెక్టర్ అశోక్ కుమార్ బెహరా, చీఫ్ ఎక్స్పోర్టు డిపార్ట్మెంట్ ఫెడరేషన్ కమలకాంత సాహు, ఇకో బ్యాంకు సాధారణ పర్యవేక్షకుడు నితీష్ మహంతి, సీఈఓ సంజయ్కుమార్ ప్రధాన్, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎం సునారాం సింగ్ తదితరులు పాల్గొన్నారు. గజపతి జిల్లాలో 60కి పైగా జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉన్నాయని, ఏ ఓక్క పారిశ్రామిక వేత్త ఎగుమతి చేయడం లేదని ఎం.ఎస్. ఎం.ఈ జాయింట్ డైరక్టర్ కమల్జిత్ దాస్ అన్నారు. భారత్ ఏడాదికి సుమారు రూ.1.20 లక్షల కోట్ల ఎగుమతులు చేస్తుందని, అందులో ఒడిశా రూ.440 కోట్ల ఎగుమతి చేసి 7వ స్థానంలో ఉందన్నారు. దేశంలో ఒడిశా ఎగుమతుల్లో ఐదో స్థానంలో నిలబెట్టుకోవడానికి పారిశ్రామికవేత్తలు అడుగులు ముందుకువేయాలన్నారు. పారిశ్రామిక వేత్తలకు పారాదీప్ ధమ్రా పోర్టు, భువనేశ్వర్ నుంచి దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్కు కార్గో ఎయిర్ ఫ్లైయిట్ నడుస్తుందని డైరెక్టర్, ఎక్స్పోర్టు ప్రమోషన్ అశోక్ కుమార్ బెహరా అన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఎగుమతి చేయడానికి అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని ఇకో బ్యాంకు పర్యవేక్షకుడు నితీష్ మహాంతి అన్నారు. ఈ సంధర్బంగా ‘ఒడిషా ఎక్స్పోర్టు సక్సస్’ అనే బ్రోచర్ను అతిథులు విడుదల చేశారు. కలెక్టర్ బిజయ కుమార్ దాస్కు జ్ఞాపికతో సత్కరించారు. జిల్లాలో వివిధ పారిశ్రామిక వేత్తలు పాల్గొని వస్తు ఎగుమతిపై తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ వర్క్షాపు భువనేశ్వర్ డైరెక్టరేట్, ఎగుమతి, మార్కెటింగ్ ప్రమోషన్శాఖ ఆధ్వర్యంలో జరిగింది. -
ఎక్కడో ఊరవతల ఓ మర్రి చెట్టు.. ఎండన పడి తిరిగే వారిని కాసేపు కూర్చోండర్రా.. అని పిలుస్తూ ఉంటుంది. ఊరి మధ్యన రావి చెట్టు.. ఎర్రటి ఎండకు ఆకులతో గొడుగు పట్టి తన ఒడిలో కూర్చున్న వారికి ప్రాణ వాయువు అందిస్తూ ఉంటుంది. ఇంటివెనుక జామ చెట్టు.. తీయటి ఫలాలు అందించడంత
●విశాలమైన ప్రాంగణం మాది గండ్రేడు. శివారు గ్రామం. నాగావళి నది ఒడ్డున ఉంది. నది నుంచి వచ్చే చల్లని గాలి మర్రిచెట్టు కిందకు వచ్చి మరింత కూల్గా మారిపోతుంది. దీంతో పెద్దలు ఇక్కడే నిద్రపోయేందుకు, సేద దీరేందుకు వస్తుంటారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు అనువుగా చెట్టు నీడ ఉంది. ఈ చెట్టు మా గ్రామానికి వరం. – చింతాడ సూర్యారావు, గండ్రేడు, పొందూరు మండలం ●ఎండ నుంచి ఉపశమనం మాది మలకాం గ్రామం. చి న్న పల్లెటూరు. వేసవి కాలం వచ్చిందంటే గ్రామంలోని ప్రజలు ఈ మర్రి చెట్టుకిందకే కూర్చునేందుకు వస్తుంటారు. ఇక్కడే సేద దీరుతుంటారు. మర్రిచెట్టు వయస్సు సుమారు 200 ఏళ్లు ఉంటుంది. బయట నుంచి వచ్చేవారంతా కచ్చితంగా ఇక్కడ కూర్చొని ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. – జాడ అసిరినాయుడు, మలకాం, పొందూరు మండలం ● పచ్చని చెట్లే వేసవి విడిదులు ● పల్లెటూళ్లలో వృక్షాల కిందనే సేద దీరుతున్న ప్రజలు పొందూరు: పల్లెటూరు.. సందె వేళ.. మర్రి చెట్టు కింద మకాం.. కాసిన్ని కబుర్లు.. కావాల్సినంత చల్లని గాలి. అంతే వేసవి ఇట్టే గడిచిపోతుంది. చుట్టూ ఎండ తాండవం చేస్తున్నా చెట్టు నీడలో మాత్రం ఏసీ పెట్టినట్టే చల్లటి గాలి వీస్తుంది. అదే ఇప్పుడు పల్లెవాసులను రక్షిస్తోంది. పొందూరు మండలంలోని దళ్లవలస, కోటిపల్లి, మజ్జిలిపేట, గండ్రేడు, మలకాం, వీఆర్ గూడెం గ్రామాల్లో పెద్ద మర్రి చెట్లు వేసవి విడిదులుగా దర్శనమిస్తున్నాయి. ఈ చెట్లు సుమారు 60 ఏళ్ల నుంచి 200 ఏళ్ల వయస్సు ఉన్నవి. విశాలంగా వ్యాపించిన ఊడలతో నీడ అల్లుకుంటుంది. దీంతో ఎండకు దొరకకుండా పిల్లలు, పెద్దలు వాటి కిందనే సేద దీరుతున్నారు. ఽమధ్యాహ్న సమయాల్లో చెట్ల కిందకు వచ్చి ముచ్చటించుకునేవారు కొందరు, నిద్రపోయే వారు మరికొందరు, ఆడుకునే పిల్లలు, వలస కూలీలు అక్కడే ఉంటున్నారు. -
మోసగించిన కేసులో నలుగురు మహిళల అరెస్టు
రాయగడ: బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి మోసగించి బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో కాశీపూర్ పోలీసులు నలుగురు మహిళలను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కటిని గిరి, మమిత గిరి, దుర్గా గిరి, విశ్వమణి గిరిలు ఉన్నారు. వీరి నుంచి పోలీసులు 34 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని నిందితులను శనివారం కోర్టుకు తరలించారు. కాశీపూర్ సమితి లదాఖాన్ గ్రామంలో శుక్రవారం ఉదయం నలుగురు మహిళలు వెళ్లి బంగారు ఆభరణాలకు మెరుగుపడతామని నమ్మించారు. దీంతో గ్రామానికి చెందిన లావణ్య గౌడొ అనే మహిళ తన వద్ద గల రెండు తులాల బంగారు హారాన్ని మెరుగు పెట్టేందుకు ఇచ్చింది. అనంతరం మెరుగుపెట్టినట్లు నటించిన ఆ నలుగురు మహిళలు కొద్ది సేపటి తర్వాత ఒక కవరులో ప్యాక్ చేసి మెరుగు పెట్టినందుకు గాను కొంత మొత్తం డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత మెరుగు పెట్టేందుకు ఇచ్చిన ప్యాకెట్ను ఓపెన్ చేసి చూడగా అందులో ప్లాస్టిక్ హారం ఉండటంతో మోసపోయానని భావించిన గౌడొ లబోదిబోమంటూ వెంటనే కాశీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలొకి దిగిన పోలీసులు అదే రోజు సాయంత్రం ఆ నలుగురు మహిళలను పట్టుకుని అరెస్టు చేశారు. -
మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు సరికాదు
కొరాపుట్: మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు తగదని స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ కొరాపుట్ జిల్లా విభాగ ప్రెసిడెంగ్ తరుణ్ కుమార్ మహాపాత్రో పేర్కొన్నారు. శనివారం జయపూర్ పట్టణంలోని నేషనల్ ఐబీలో జరిగిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ సభలో ప్రసంగించారు. కాలానుగుణంగా మీడియాలో మార్పులు జరుగుతున్నాయన్నారు. ఎంత అభివృద్ది జరిగినా మీడియాపై దాడులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు పవన్ పాణీగ్రాహి, సత్యనారాయణ పట్నాయక్, సన్న చౌదరి, శిశిర్ ఆచార్య, తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.. జయపురం: మీడియా ప్రతినిధులు నిర్భయంగా విధులు నిర్వహించగలిగిన నాడే పత్రికలకు మనుగడ ఉంటుందని పలువురు పాత్రికేయులు అన్నారు. శనివారం ప్రపంచ ప్రెస్ స్వేచ్ఛా దినం సందర్భంగా స్టేట్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఒడిశా, కొరాపుట్ జిల్లా శాఖ సమావేశం నిర్వహించింది. స్థానిక రోడ్లు, భవణ నిర్మాణ విభాగ అతిథి గృహంలో జిల్లా అధ్యక్షుడు తరుణ్ మహాపాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు జర్నలిస్టులు మాట్లాడారు. సమాజంలో పాత్రికేయులకు రక్షణ కల్పించేందుకు ప్రభత్వం దృష్టి కేంద్రీకరించాలని కోరారు. -
అన్నదమ్ములకు 560 మార్కులు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి.79 పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అన్నదమ్ములు డానీ ఎల్.లెంక, డోంబుర్ లెంకకు శనివారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 560 మార్కులు వచ్చాయి. అన్నదమ్ములను ఉపాధ్యాయులు అభినందించారు. కుమారుల విజయం పట్ల తండ్రి మోహన్ లెంక ఆనందం వ్యక్తం చేశారు. టీచర్లకు ఆర్జిత సెలవులు మంజూరుచేయాలి శ్రీకాకుళం న్యూకాలనీ: ఇటీవల వెలువడిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వేసవి సెలవుల్లో సైతం హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి స్వచ్ఛందంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారందరికీ ఆర్జిత సెలవులు మంజూరుచేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.రవి, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞిప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకు పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. విద్యార్థుల మానసిక స్థితి, మండే ఎండలు, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లావ్యాప్తంగా నాటుసారా స్థావరాలెక్కడ ఉన్నా విస్తృతంగా దాడులు జరిపి అరికట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) దోసకాయల శ్రీకాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి జిల్లాలో గల స్టేషన్ ఆఫీసర్స్, ఇన్స్పెక్ట ర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో 80 అడుగుల రో డ్డు సమీప ఎకై ్సజ్ కార్యాలయంలో డీసీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 110 సారా గుర్తింపు గ్రామాలను సారా రహిత గ్రామాలుగా మార్చాలన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 212 ఐడీ కేసులు నమోదై 162 మందిని అరెస్టు చేసి 2231 లీటర్ల సారా, ఏడు వాహనాలను స్వాధీనపర్చుకున్నామన్నారు. 6735 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు. అక్రమంగా మద్యం విక్రయించేవారిపై 874 కేసులు నమోదు చేసి అంతేమందిని అరెస్టు చేశామని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, జిల్లా అధికారి తిరుపతినాయుడు, అధికారులు పాల్గొన్నారు. ఎన్సీఈఆర్టీ అవార్డుకు ప్రాజెక్టు ఎంపిక కంచిలి: మండలంలోని చొట్రాయిపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గణిత అవధాని మడ్డు తిరుపతిరావు రూపొందించిన గణిత ప్రాజెక్టు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎన్సీఈఆర్టీ)వారు నిర్వహించిన అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ఆయనకు ఎన్సీఈఆర్టీ నుంచి సమాచారం వచ్చిందని ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్సీఈఆర్టీ వారు జనవ రి 13న జాతీయ గణిత విద్యా సమావేశాల నిర్వహణ సందర్భంగా దేశవ్యాప్తంగా గణిత ప్రాజెక్టులను ఆహ్వానించారు. అందులో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ‘గణిత ప్రాథమిక కార్యకలాపాల సన్నాహక దశలో విద్యార్థుల పనితీరు అంచనా వేయటానికి బోర్డు గేమ్ ప్రయోగం’ అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా 105 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో మన రాష్ట్రం నుంచి 4 మాత్రమే ఉన్నాయి. అందులో తిరుపతిరావు ప్రాజెక్టు చోటు సంపాదించుకోవడం విశేషం. శ్రామికులే దేశానికి వెన్నెముక శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రామికులే దేశానికి వెన్నెముక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్లో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వివరించి, న్యాయ సహా యం అందించాల్సిన విధానాలను తెలియజేశారు. కార్మికులు తమ చెమటతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన అన్నారు. 1886 మే 1న అమెరికాలో ఎనిమిది గంటల పనిది నం కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని, షికాగోలో హే మార్కెట్ కాల్పులను గుర్తుచేశారు. ఈ చరిత్రను యువతకి తెలియజేసి కా ర్మికుల హక్కులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, డి ప్యూటీ లేబర్ కమిషనర్ కె.అజయ్ కార్తికేయ, తదితరులు పాల్గొన్నారు. -
వంతెన నిర్మాణంలో క్రేన్ కూలి ముగ్గురు మృతి
భువనేశ్వర్: కటక్ ఖాన్ నగర్ ప్రాంతం రింగ్ రోడ్ వంతెన నిర్మాణంలో క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో కార్మికుడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ దుర్ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా కొనసాగుతోంది. కటక్ ఖాన్ నగర్ ప్రాంతంలోని ఒక వంతెన వద్ద శనివారం పనులు జరుగుతుండగా నిర్మాణ పనులకు ఉపయోగించిన క్రేన్ కూలిపోయిన ప్రమాదం జరిగింది. దీంతో కొన్ని స్లాబ్లు కుప్ప కూలాయి. కఠొజొడి నదిపై వంతెన పనులు జరుగుతుండగా కొన్ని భారీ కాంక్రీట్ స్లాబ్లను ఎత్తుతున్న క్రేన్ ప్రమాదవశాదకదే కూలిపోయింది. క్రేన్ కింద పని చేస్తున్న కార్మికులు స్లాబ్ల కింద నలిగిపోయారు. క్షతగాత్రులను కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి చేర్చారు. ముఖ్యమంత్రి సంతాపం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబీకులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు వెచ్చిస్తారని పేర్కొన్నారు. ఇద్దరి పరిస్థితి విషమం -
సమ్మర్ క్రికెట్ కోచింగ్కు వేళాయె..●
● రేపటి నుంచి జిల్లాలో క్రికెట్ కోచింగ్ క్యాంప్లు మొదలు శ్రీకాకుళం న్యూకాలనీ: సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపులకు రంగం సిద్ధమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సూచనల మేరకు జిల్లా క్రికెట్ సంఘం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్లకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణ శిబిరాల్లో క్రికెట్పై ఆసక్తి కలిగిన బాలబాలికలు ఎవరైనా హాజరుకావచ్చని జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. 5 కేంద్రాల్లో శిక్షణ.. జిల్లాలో శ్రీకాకుళం జిల్లా కేంద్రం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాలతోపాటు కళింగపట్నం, నరసన్నపేట, టెక్కలి, ఇచ్ఛాపురం సబ్సెంటర్లలో ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్లను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ఉద యం 6 ఉదయం 8.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 6.30 వరకు సబ్ సెంటర్లలో నిష్ణాతులైన కోచ్లు శిక్షణ ను అందించనున్నారు. శిక్షణకు హాజరయ్యే చిన్నారులు, బాలబాలికలకు ఫిట్నెస్తోపాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తదితర విభాగాల్లో తర్ఫీదును అందిస్తారు. తల్లిదండ్రులు వారి పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలని సబ్సెంటర్ల కోచ్లకు అందజేయాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ పేర్కొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్రీడాకారులకు జూన్ ఒకటో తేదీన ఆయా సబ్సెంటర్లలో సర్టిఫికెట్లను అందజేయనున్నట్టు వారు వెల్లడించారు. -
ఇంద్రావతి నదీ తీరంలో అస్థి పంజరం
కొరాపుట్: ఇంద్రావతి నదీ తీరంలో గుర్తు తెలియని వ్యక్తి అస్థి పంజరం లభ్యమైంది. శనివారం నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి పోలీస్ స్టేషన్ పరిధిలో నందాహండి సమితి ఎకంబా–నువాగాం గ్రామాల మధ్య ప్రజలు స్నానానికి వెళ్లారు. అక్కడ ఇసుకలో అస్థి పంజరం కొంత బయటకు వచ్చి కనిపించింది. దీంతో స్థానిక సర్పంచ్ ద్వారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తవ్వకాలు ప్రారంభించగా అస్థి పంజరంతో పాటు మొబైల్ ఫోన్ కూడా దొరికింది. ఐఐసీ ప్రణవ్ తుడు, అదనపు తహసీల్దార్ పురుషోత్తమ బెనియా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. సైంటిఫిక్ టీం రంగంలోకి దిగింది. అనంతరం అస్థి పంజరాన్ని తరలించారు. -
రైతులు ధాన్యం డబ్బులు చెల్లించాలి
కొరాపుట్: రాయిఘర్ ప్రాంతంలోని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు చెల్లించాలని బీజేడీ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి డిమాండ్ చేశారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని రాకీసాన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలోని సుమారు 144 మంది రైతుల వద్ద ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. మూడు నెలలు అయినా వారికి డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. అనంతరం బీజేడీ నేతలు నేరుగా సీఎస్వో ఆఫీస్కి వెళ్లి ధర్నా చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి మరో 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రందారి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ మంజులా మజ్జి, మాజీ ఎమ్మెల్యే సుభాష్ గొండో తదితరులు పాల్గొన్నారు. -
కష్టార్జితం కాలిపోయింది..
కొత్తూరు: కష్టార్జితం కాలిపోయింది. కుమార్తె పెళ్లి కోసం దాచిపెట్టిన నగదు, బంగారం బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం కొత్తూరులోని కొత్తపేట కాలనీలో శుక్రువారం కొగాన పద్మావతి శుక్రవారం ఉదయం దేవుడి పటం వద్ద దీపం వెలిగించి ఉపాధి పనికి వెళ్లిపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు గమనించి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే పద్మావతి కుమార్తె వివాహం కోసం ఇనుప పెట్టెలో దాచిన రూ. 2.80 లక్షల నోట్లు కాలిబూడిదయ్యాయి. తులంన్నర బంగారం, పిల్లల విలువైన పత్రాలు, దుస్తులు, నిత్యావసర సరుకులు కాలిపోయాయి. సర్వం కోల్పోయిన పద్మావతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొత్తూరుకు చెందిన గోగుల చిట్టిబాబు బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం కుమార్తె వివాహం కోసం దాచిన రూ.2.80 లక్షల నగదు బూడిద -
ఆవాస్ యోజనపై అవగాహన
రాయగడ: పట్టణంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–2.0 కార్యక్రమంపై శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ సమావేశం హాల్లో చైతన్య కార్యక్రమం జరిగింది. జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికా రి అక్షయ కుమార్ ఖెముండొ ముఖ్యఅతిథిగా హాజరవ్వగా రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, వైస్ ఛైర్మన్ శుభ్రా పండలు పాల్గొన్నా రు. రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ ఆధ్వర్యంలొ ప్రారంభమైన ఈ చైతన్య కార్యక్రమంలో భాగంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతంలొ నివిసిస్తున్న అర్హులైన అందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలొ విలీనం చేసి వారు ఆ పథకం ద్వారా లబ్దీపొందాలన్న ఉద్దేశ్యంతొ ఈ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అందుకు మున్సిపాలిటీ పరిధిలొ గల 24 వార్డుల్లొ గల కౌన్సిలర్లు వారి వారి ప్రాంతాల్లొ గల అర్హులైన వారిని పథకంలొ చేర్పించేందుకు సహకరించాల్సి ఉంటుందని అన్నారు. -
ఘనంగా సాహిత్య సంసద్ వార్షికోత్సవం
జయపురం: ఛండనొయి సాహిత్య సంసద జయపురం శాఖ వార్షికోత్సవం స్థానిక లోకేశ్వరి కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో శుగ్రవారం ఘనగా జరిగింది. ఉత్సవంలో ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ సురేష్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. శ్రీజగన్నాధుని చిత్రపటానికి పూల మాలలు వేసి పూజించిన తరువాత ఛిండినొయి సాహత్య సంసద్ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు యుధిస్టర్ మల్లిక్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో ముఖ్యవక్తగా ఆదివాసీ భాష పరిశోధకులు డాక్టర్ రాజేంద్రపాఢీ, గౌరవ అతిథిగా అధ్యాపకులు డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్ హాజరై సమాజాన్ని చైతన్య పరచటంలో సాహిత్య ప్రభావాన్ని వివరించారు. ఛిండినొయి సాహత్య సంసద్ వార్షికోత్సవం ముఖ పత్రం శుభశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహిక రచయితలు నేటి సమాజ పరివర్తనలో సాహిత్య భూమికపై చర్చించారు. చర్చలలో భైరాగి చరణ సాహు, విజయ లక్ష్మి పాణిగ్రహి, ప్రమోద్ కుమార్ రౌళొ, అశోక్ పొలాయ్, భావ చంద్రికా దేవి, అజయ మల్లిక్, డోలి నాయిక్, నారాయణ సాగర్, ఘాశీరాం మహాపాత్రో, శుభశ్రీ పట్నాయక్, రాజశ్రీస్వై, అభిలాష్ శాంత పాత్రో, శుభశ్రీ పాత్రో, సంఘమిత్ర భుక్త పాల్గొన్నారు. ప్రముఖ కవులు, కవియిత్రిలు తమ శ్వీయ రచనలను వినిపించారు. నిరంజన్ పాణిగ్రహి, సంతోష్ నాయిక్, నికుంజ రంజనీ మహంతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
పలాస : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపి వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి శుక్రవారం పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు దండకారణ్యంలో ఆదివాసీలు సుమారు 400 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమం చేపట్టడం అప్రజాస్వామ్యమన్నారు. కర్రెగుట్ట కొండలను జల్లెడ పడుతున్నారని, అన్నిరకాల భద్రతా బలగాలను ఈ ఆపరేషన్కు వినియోగించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, చాపర వేణు, కొర్రాయి నీలకంఠం, పోతనపల్లి అరుణ, లక్ష్మణరావు, పుచ్చ దుర్యోధనరావు, మద్దిల రామారావు, ఎం.వినోద్, గొరకల బాలకృష్ణ, వంకల పాపయ్య, మామిడి భీమారావు, రాపాక మాధవరావు, జడ్డే అప్పయ్య, పోతనపల్లి కుసుమ, బర్ల గోపి, ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
10న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన
భువనేశ్వర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈనెల 10న భువనేశ్వర్ చేరుకుంటారు. తొలి పర్యటనలో జట్నీ సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసి సాయంత్రం పూరీలో పర్యటిస్తారు. శ్రీమందిరంలో శ్రీజగన్నాథుని దర్శించుకుని పూజాదుల్లో పాల్గొంటారు. ఆ రాత్రి పూరీలో బస చేస్తారు. మరుసటి రోజు పశ్చిమ ఒడిశా సందర్శిస్తారు. సంబలపూర్ ప్రాంతంలో మా సమలేశ్వరి మాత ఆలయం సందర్శించి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భువనేశ్వర్ జనతా మైదాన్లో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ తెలిపారు. రాధాకృష్ణ దేవాలయ నిర్మాణానికి భూమిపూజ కొరాపుట్: రాధాకృష్ణ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని నీలకంఠ నగర్–ఇచ్ఛావతి గుడల మధ్య నూతనంగా నిర్మి్ంచనున్న ఆలయ పనులకు నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి శుక్రవారం భూమి పూజ చేశారు. వేద పండితుల సమక్షంలో మట్టిని పోసి తొలి క్రతువు ముగించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కను దాస్ పాల్గొన్నారు. తాగునీటి బాటిళ్లలో నాటుసారా భువనేశ్వర్: మినరల్ వాటర్ బాటిళ్లలో నాటుసారా అమ్మకం గుట్టు రట్టయ్యింది. ఖుర్దా జిల్లా భువనేశ్వర్ శివారు దారుఠెంగో ప్రాంతంలో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఆకస్మిక దాడుల్లో అబ్కారీ విభాగం పోలీసులు 10,000 లీటర్ల నాటుసారాతో మినరల్ వాటర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.19 లక్షలుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి మూడు నాలుగు చక్రాల వాహనాలు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. దంపతుల ఆత్మహత్య రాయగడ: ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అందుకు పెద్దలు కూడా అంగీకరించారు. వారి దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగుతుండేది. అయితే ఏ కష్టమొచ్చిందో గానీ ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన జిల్లాలోని చంద్రపూర్ సమితి లక్ష్మీపూర్ గ్రామంలో గల నువాసాహిలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతులను కేదార్ కుసులియా (32), శ్రీయా బొడొనాయక్ (27) లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న బిసంకటక్ ఎస్డీపీఓ సంతొషిణి ఓరం సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బిసంకటక్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. విజిలెన్స్ వలలో దశమంతపూర్ సీడీపీఓ కొరాపుట్: విజిలెన్స్ వలకు అవినీతి సీడీపీఓ చిక్కారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సీడీపీఓ శకుంతల దాస్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అరెస్టయ్యారు. అదముండా గ్రామ అంగన్వాడీ వర్కర్ మినతి ఖొస్లా విధి నిర్వహణ పత్రాలు ఆమోదించడానికి రూ.10 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇవ్వలేని మినతి జయపూర్ విజిలెన్స్ కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో వారు వల వేసి సీడీపీఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం జయపూర్ విజిలెన్స్ కార్యాలయానికి తరలిస్తున్నారు. -
కోపరేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ పర్యటన
కొరాపుట్: రాష్ట్ర కోపరేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, కొరాపుట్ జిల్లా నోడల్ అధికారి రాజేష్ ప్రభాకర్ పాటీల్ కొరాపుట్ జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఆరు అంచెల ఎకనామిక్ కారిడర్ భారత మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా పర్వత టన్నెల్ సందర్శించారు. అతి పెద్ద వాటర్ సప్లై ప్రాజెక్ట్, రాజపుట్లో మిలిట్ ప్రోసెసింగ్ సెంటర్, పెట్టెరులో రూరల్ ఇండస్ట్రీయల్ పార్క్లను సందర్శించి వాటి పురోగతిని సమీక్షించారు. గతంలో ఈ ప్రాంతంలో కలెక్టర్గా పనిచేయడంతో రాజేష్ రాకతో అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. పలు చోట్ల ప్రజలు వినతులు ఇచ్చారు. పర్యటనలో జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరం సశ్యా రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. -
మసీదులో గంధంచెట్లు నరికివేత
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని సూర్యమహాల్ కూడలి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న జామియా మసీదులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు గంధం చెట్లు నరికి తరలించే యత్నం చేశారు. ఈ విషయమై ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కు మసీదు మౌజన్ (గురువు) ఎస్.కె.మహ్మద్ ఫిర్యాదు చేసినట్లు మత పెద్దలు కె.ఎస్.అమానుల్లా, మరికొందరు చెప్పారు. మసీదులో సుమారు 40 వరకు చిన్నవి, పెద్దవి గంధం చెట్లున్నాయని, శుక్రవారం ఉదయం చెట్లను వాచ్మెన్ నాయుడు దగ్గరుండి ట్రిమ్మింగ్ చేసినట్లు తెలిసిందన్నారు. సాయంత్రం 4 గంటలకు 30 అడుగుల పొడవుండే ఒక గంధం చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు తరలించేశారని అదే వాచ్మెన్ మౌజన్కు చెప్పడంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఇంకా లోపల ఎన్ని చెట్లు కొట్టేశారో తెలియాల్సి ఉందన్నారు. గంధం చెట్టు కొమ్మ -
22 బైక్ల స్వాధీనం
● బైక్ దొంగల గుట్టు రట్టు ● నలుగురు నిందితుల అరెస్టు జయపురం: ఒక బైక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తే మొత్తం బైక్ దొంగల గుట్టు రట్టయ్యింది. జయపురం పట్టణ పోలీసులకు అందిన ఒక కేసు దర్యాప్తు జరపగా అనేక బైక్ దొంగతనం కేసులు బయట పడ్డాయి. జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీస్ కాశ్యప్ శుక్రవారం మధ్యాహ్నం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. గత నెల 27న జయపురం సౌరసాహి వాసి కార్తీక మహాపాత్రో(19) తన బైక్ పోయిందని ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఆ మేరకు దర్యాప్తు ప్రారంభించామని దర్యాప్తులో నరసింగ ఉరఫ్ నరేష్ దవురుని అదుపులోకి తీసుకుని విచారణ చేశామని తెలిపారు. అయితే తాను ఒక్కడినే కాదని, తనతో బొరిగుమ్మ సమితి బొడొదుబులి గ్రామ వాసి అనిల్ హరిజన్(33) కూడా ఉన్నాడని బయటపెట్టాడని పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి దొంగిలించిన బైక్లు అన్నీ నవరంగపూర్ జిల్లా మైదల్పూర్ డెంగా సాహి లక్ష్మణ హరిజన్(50) ఇంటిలో ఉంచామని వెల్లడించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అనంతరం దొంగిలించిన మోటారు 22 బైక్లు అన్నీ లక్ష్మణ మఝి, భీమ ఖిలోల ద్వారా మల్కన్గిరి, కొరాపుట్, నవరంగపూర్ జిల్లాల మారుమూల ప్రాంతాల్లో రూ.10వేలు, రూ.15వేలకు అమ్మేసినట్లు తెలిపారని పేర్కొన్నారు. ఆ బైక్లన్నీ లక్ష్మణ్, భీమ ఖిలోల ద్వారా రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుడు అనిల్ హరిజన్ దొంగిలించిన మోటారు బైక్లను మైదల్పూర్ లక్ష్మణ ఇంటి సమీపంలో చేర్చి ఒక్కో కస్టమర్ను ఏర్పాటు చేసి వారికి అమ్ముతున్నట్లు వెల్లడించారు. బైక్ దొంగతనంలో ఆరితేరిన అనిల్ హరిజన్ను గతంలో బొరిగుమ్మ పోలీసులు అరెస్టు చేశారని, అప్పట్లో అతడి నుంచి 15 బైక్లు రికవరీ చేశారని పోలీసు అధికారి కాశ్యప్ వెల్లడించారు. రెండు నెలల కిందటే అనిల్ బెయిల్పై విడుదలయ్యాడని తెలిపారు. అతడు జయపురం పట్టణం, జయపూర్ సదర్, అంపాణి, బొరిగుమ్మ, బొయిపరిగుడ, రాయిఘర్, నవరంగపూర్, సునాబెడ, మొదలగు పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలు చేశాడని వెల్లడించారు. గురువారం సాయంత్రం వారిని అరెస్టు చేసి శుక్రవారం హాజరు పరిచామని చెప్పారు. ఇంకొన్ని బైక్ల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. బైక్ల అప్పగింతజయపురం: వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగలు దొంగిలించిన బైక్లను బైక్ల యజమానులకు జయపురం పోలీసు అధికారు శుక్రవారం అప్పగించారు. జయపురం పట్టణ పోలీసులు 22 బైక్లను నిందితుల నుంచి స్వాధీన పరుచుకున్నారు. వాటిని జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీష్ కాశ్యప్, పట్టణ పోలీసు అధికారి అశవిణీ కుమార్ పట్నాయిక్ తదితరుల సమక్షంలో యజమానులకు అప్పగించారు. -
పదో తరగతి ఫలితాలు విడుదల
● జిల్లా వ్యాప్తంగా 98.10 శాతం ఉత్తీర్ణత పర్లాకిమిడి: పదో తరగతి పరీక్ష ఫలితాలను సెకండ రీ ఎడ్యుకేషన్ బోర్టు శుక్రవారం ప్రకటించింది. గజ పతి జిల్లాలో ఉత్తీర్ణత శాతం 98.10 ఉన్నట్టు జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మాయాధర్ సాహు తెలిపారు. ఈసారి బాలికల కంటే బాలుర శాతం అధికంగా పాసయ్యారు. మొత్తం జిల్లాలో 110 ఉన్నత పాఠశాలల్లో పది పరీక్షలు ఫిభ్రవరిలో జరిగాయి. 7685 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా వారిలో 137 మంది గైర్హాజర్ అయ్యారు. ఏ1 (ఫస్టుక్లాస్) 15 మంది ఉత్తీర్ణత అవ్వగా, ఏ2లో 633, బి1లో 2254, బి2లో 2365, కంపార్ట్మెంటల్ 1331, డి గ్రేడ్ 745, ఈగ్రేడ్ 156, ఫెయిల్ 801 మంది ఉన్నారు. మొత్తంగా బాలికలు 20,647 మంది, బాలురు 20783 మంది పాసయ్యారు. సరస్వతీ శిశు విద్యామందిర్ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఏ1 గ్రేడ్ను (90శాతం) 566/600 ప్రజ్యోతి చౌదురి, అంకితా పాఢి 600మార్కులుకు గాను 553 సాధించింది. సరస్వతీశిశు విద్యామందిర్లో శతశాతం పాసయ్యినట్టు ప్రధాన అచార్యులు సరోజ్ పండా తెలియజేశారు. జయపురంలో 100 శాతం ఫలితాలు జయపురం: రాష్ట్రంలో మెట్రిక్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. కొరాపుట్ జిల్లాలో 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా తెలుగు సంస్కృతిక సమితిచే నిర్వహించబడుతున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో 100 శాతం ఫలితాలు సాధించింది. ఈ పాఠశాల నుంచి 75 మంది మెట్రిక్ పరీక్షలు రాయగా వారంతా ఉత్తీర్ణులు అయ్యారు. వారి లో ఏ–2 గ్రేడ్లో ఒకరు ఉత్తీర్ణ కాగా బి.1 గ్రేడ్లో 11 మంది,బి.2 గ్రేడ్లో 23 మంది.సి.గ్రేడ్లో 32 మంది. డి గ్రేడ్లో 6 గురు, ఇ. గ్రేడ్లో ఇద్దరు ఉత్తీర్ణులైనట్టు పాఠశాల వర్గాలు వెల్లడించాయి. -
భారీ విమానయాన ప్రణాళికల ఆవిష్కరణ
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రామాణికలతో కూడిన భారీ విమానయాన ప్రణాళికని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో పారాదీప్లో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, 15 జిల్లాల్లో హెలీపోర్ట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విమానయాన మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశలో ఇదో కీలకమైన అడుగు. స్థానిక లోక్ సేవా భవన్లో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాష్ట్ర విమానాశ్రయాలు ఆధునీకరణ, విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ ప్రామాణికలు లక్ష్యంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. పారదీప్ ప్రాంతంలో విమానయాన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రణాళికలను ఆవిష్కరించింది. పూరీ విమానాశ్రయ సన్నాహాలు వేగవంతం పూరీలోని శ్రీ జగన్నాథ్ విమానాశ్రయాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విమాన రాకపోకలకు ఆదరణ పెరుగుతున్నందున విమానయాన అనుసంధానం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు, సందర్శకుల రాకపోకలతో నిత్యం కిటకిటలాడే పూరీ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాధాన్యతని ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో వైమానిక ప్రయాణ సౌకర్యాలు పెంపొందించడానికి విస్తృత వ్యూహాన్ని ప్రతిబింబిస్తూ 15 జిల్లాల్లో హెలీపోర్ట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నట్లు ఈ సమావేశంలో ప్రస్తావించారు. హెలిపోర్ట్లు, విమానయాన కేంద్రాల అభివృద్ధి ప్రాంతీయ ప్రాధాన్యతను మెరుగుపరచడానికి 15 జిల్లాల్లో హెలిపోర్ట్లను నిర్మించే ప్రతిపాదనకు ప్రాధాన్యత కల్పించారు. ఢెంకనాల్ బిరాషోల్ ఎయిర్స్ట్రిప్ వద్ద బిజూ పట్నాయక్ ఏవియేషన్ సెంటర్ భవిష్యత్ అభివృద్ధి ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ప్రజా నిర్మాణ విభాగం నోడల్ ఏజెన్సీగా నియమించారు. రౌర్కెలా విమానాశ్రయం అభివృద్ధి రౌర్కెలా విమానాశ్రయం అభివృద్ధి ప్రణాళికలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో విమానయాన అనుసంధానం మరింత పెంపొందించేందుకు జయపురం, దండబోస్, రొంగైలుండా, గోటమా, సతిభట, రైసువాన్, తుషారా, జమదర్పాలి, మల్కన్గిరి, అమర్దా రోడ్ మరియు ఉత్కెలాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానాశ్రయాలపై దృష్టి సారించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలపై దృష్టి రాష్ట్ర వ్యాప్తంగా విమానాశ్రయాలు, హెలిపోర్ట్లు, డ్రోన్ హబ్లతో కూడిన ప్రపంచ స్థాయి విమానయాన సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే నిబద్ధతను ముఖ్యమంత్రి మాఝీ పునరుద్ఘాటించారు. ఒడిశా విమానయాన రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన మానవ వనరుల ప్రతిపాదనలను చర్చించారు. కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం 15 జిల్లాల్లో హెలీపోర్ట్లు -
11 నుంచి సిమిలిగుడ అగ్ని గంగమ్మ పండగలు
కొరాపుట్: సిమిలిగుడలో అగ్ని గంగమ్మ పండగలు 11వ తేదీ నుంచి జరపాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలోని అగ్ని గంగమ్మ దేవాలయ ప్రాంగణంలో తేదీ ఖరారు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సభ్యులందరూ సామూహికంగా మే 11 నుంచి 20వ తేదీ వరకు పండగలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, మాజీ ఎమ్మెల్యే రఘరాం పొడా ల్, సునాబెడా మున్సిపల్ చైర్మన్ రాజేంద్రకుమార్ పాత్రో, సునాబెడా ఎస్డీపీఓ సుమిత్ర జెన్న తదితరులు పాల్గొన్నారు. -
జగన్నాథ్ ధామ్ అంటే పూరీ మాత్రమే
● రామకృష్ణ దాస్ మహాపాత్రో భువనేశ్వర్: పశ్చిమ బెంగాలు దిఘా ప్రాంతంలో జగన్నాథ ఆలయం ప్రారంభోత్సవం వివాదాస్ప దం అయింది. ఈ ఆలయాన్ని జగన్నాథ ధామ్గా పేర్కొనడం, ఆలయంలో రాతి విగ్రహాలు చర్చనీయాంశం అయ్యాయి. ఇటువంటి వివాదస్పద జగన్నాథ ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి శ్రీ మంది రం నుంచి స్వామి సేవాయత్ల బృందం హాజరు కావడం రచ్చ ప్రేరేపించింది. ఈ పరిస్థితిపై దైతప తి నియోగుల సంఘం కార్యదర్శి రామకృష్ణ దాస్ మహాపాత్రో శుక్రవారం స్పందించారు. పూరీలో ప్రసిద్ధ జగన్నాథ ఆలయం శ్రీమందిరంలో మినహా మరెక్కడా దారు బ్రహ్మ లేడని పేర్కొన్నారు. అలాగే జగన్నాథ్ ధామ్ అంటే పూరీని మాత్రమే సూచిస్తుందన్నారు. మరెక్కడా జగన్నాథ్ ధామ్ ఉండదని తేల్చేశారు. ఈ మేరకు అధికారిక స్థాయిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఆమెకి లేఖ రాసి ఈ విషయం తెలియజేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లోని దిఘాలో కొత్తగా ప్రారంభించబడిన జగన్నాథ ఆలయానికి ఆహ్వానం అందిన తర్వాత తాను హాజరైనట్లు వెల్లడించారు. అక్కడ విగ్రహాల ఎత్తు రెండున్నర అడు గుల నుంచి మూడు అడుగుల మధ్య ఉందన్నారు. మమతా బెనర్జీ తన శిష్యులలో ఒకరుగా పేర్కొన్నా రు. ఆమె తనను దిఘాలో జగన్నాథ ఆలయాన్ని స్థాపించమని ఆహ్వానించింది. తిథి ప్రకారం పూజ చేయమని కోరింది. అక్కడ 3 నెలలు రాతి విగ్రహా లు ఉన్నాయి. అయితే ప్రతిష్టించబడిన విగ్రహాలు వేప చెక్కతో తయారు చేయబడినవని స్పష్టం చేశా రు. పశ్చిమ బెంగాల్లోని దిఘాలో జగన్నాథ ఆల య స్థాపన మరియు దానికి జగన్నాథ్ ధామ్ అని పేరు పెట్టడంపై చెలరేగిన వివాదంపట్ల సేవకుల లో మిశ్రమ స్పందనలు కలకలం రేపుతున్నాయి. -
గజపతి టాప్.. కొరాపుట్ లాస్ట్
● మెట్రిక్ పరీక్ష ఫలితాలు వెల్లడి ● సమగ్ర ఉత్తీర్ణత 94.93 శాతం భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడించారు. ఈ ఏడాది ఫలితాల్లో 94.93 శాతం సమగ్ర ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలు రాసిన 5 లక్షల 2 వేల 417 మంది విద్యార్థుల్లో 4 లక్షల 84 వేల 863 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచారు. బాలికల ఉత్తీర్ణత 96 శాతం నమోదు కాగా బాలుర ఉత్తీర్ణత 94 శాతానికి పరిమితమైంది. అత్యధికంగా 99.35 శాతం ఉత్తీర్ణతతో గజపతి జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. అత్యల్పంగా 92.83 శాతం ఉత్తీర్ణతతో కొరాపుట్ జిల్లా అట్టడుగుకు దిగజారింది. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద గోండ్ బోర్డు కార్యాలయం సందర్శించి ఫలితాల్ని ప్రకటించారు. ఆయనతో విభాగం ప్రముఖ కార్యదర్శి షాలిని పండిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫలితాల సంచికని ఆవిష్కరించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఫలితాలు bsodisha.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఓఆర్10 అని టైప్ చేసి 5676750 కు ఎస్ఎంఎస్ చేస్తే ఫలితాలు వివరాలు అందుతాయన్నారు. పరీక్ష ఫలితాల్లో 3,273 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. గత ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత రేటు 96.27 శాతం నమోదైంది. ముఖ్యమంత్రి అభినందనలు బోర్డు వార్షిక పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందించారు. ఆశాజనకమైన ఫలితాలు సాధించలేకపోయిన విద్యార్థులు దృఢ సంకల్పంతో సాధన చేసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. విద్యార్థులంతా ఉజ్వల భవిష్యత్తో ఉన్నత ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
కిట్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మరణం
● విదేశాంగ శాఖ సంతాపం ● యూజీసీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు ● క్యాంపస్ ప్రాంగణంలో పోలీసుల డేరా భువనేశ్వర్: స్థానిక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటి – కిట్) విశ్వవిద్యాలయ హాస్టళ్లలో నేపాల్కు చెందిన విద్యార్థినుల మరణాలు వరుసగా చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఈ విశ్వ విద్యాలయంలో నేపాలీ విద్యార్థి ప్రిషా షా మరణం అనుమానాస్ప దమైంది. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శుక్రవారం సాయంత్రం నుంచి క్యాంపస్లో పోలీసుల బృందం డేరా వేసింది. మరో వైపు ఈ విషాద సంఘటనపై విచారణ జరిపేందుకు పలు ప్రముఖ వర్గాలు ఎవరి తరహాలో వారు రంగంలోకి దిగారు. పోలీసు కమిషనర్, డిప్యూటీ పోలీసు కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఘటనా స్థలం సందర్శించారు. విద్యార్థిని విషాదకర మర ణం పట్ల విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసి సంతాపం ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో మృతు ల కుటుంబానికి సానుభూతిని తెలియజేసింది. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఒడిశా ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో నేపాలీ విద్యార్థి మరణం ఈ క్యాంపస్లో నేపాలీ విద్యార్థి మృతి చెందడం వరుసగా ఇది రెండోసారి. మృతుల కుటుంబానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించింది. ప్రస్తుతం ఒడిశా పోలీసులు సమగ్ర విచార ణ నిర్వహిస్తున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీ య విద్యార్థుల భద్రత, రక్షణ, శ్రేయస్సును తీవ్రంగా పరిగణిస్తుందని ఈ శాఖ పేర్కొంది. ఈ విషయంలో అనుక్షణం తాజా సమాచారం కోసం సమన్వయాన్ని నిర్ధారించడానికి నేపాలీ అధికారులు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కిట్ నిర్వహణ యంత్రాంగంతో తాము సన్నిహితంగా ఉంటున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ప్రిషా షా మరణంపై నేపాల్ రాయబా ర కార్యాలయం సంస్థ ప్రతినిధులు, పోలీసు అధికారులు మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు సంబంధిత ఇతర పార్టీలను సంప్రదించి చర్చలు జరిపింది. నేపాల్ రాయబార కార్యాలయం కూడా ఈ సంఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తును డిమాండ్ చేసింది. కిట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నేపాలీ విద్యార్థులందరి భద్రత, రక్షణను నిర్ధారించడం కీలకంగా పే ర్కొంది. ఈ విషయానికి సంబంధించి నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు ప్రధానమంత్రి కా ర్యాలయం నుంచి తాజా సమాచారం సేకరిస్తుంది. కిట్ విశ్వవిద్యాలయం ప్రతిస్పందన క్యాంపస్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని, ఈ సంఘటనపై కిట్ అధికారు లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్యాంపస్లో ఈ సంఘటనను గుర్తించిన వెంటనే, హాస్టల్ అధికారు లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారి సమక్షంలోనే విద్యార్థి మృత దేహాన్ని స్వాధీ నం చేసుకున్నారు. ఆమెను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తదనంతరం తదుపరి ప్రక్రియ ల కోసం మృతదేహాన్ని ఎయిమ్స్ భువనేశ్వర్కు తరలించారు. నిజ నిర్ధారణ కమిటి ఈ సంఘటనపై యూజీసీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఇగ్నో మాజీ వైస్ చాన్స్లర్ నాగే శ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో చైర్మన్తో పాటు 3 మంది సభ్యులు ఉంటారు. క్యాంపస్లో ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయో కమిటీ నిజ నిర్ధారణ చేస్తుంది. దర్యాప్తు ముగించి కమిటీ 10 రోజుల్లో నివేదికను సమర్పిస్తుంది. -
దిఘా జగన్నాథ ఆలయ వివాదం తీవ్రతరం
● అంతర్గత దర్యాప్తునకు ఆదేశాలు భువనేశ్వర్: పశ్చిమబెంగాల్లోని దిఘా ప్రాంతంలో జగన్నాథ ఆలయం ప్రతిష్ట మహోత్సవం వివాదస్పదమై తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిస్థితిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ స్పందించారు. ఈ వివాదం కోణంలో అంతర్గత దర్యాప్తు జరపాలని పూరీ శ్రీజగన్నాథ ఆలయ ప్రధాన పాలన అధికారి(సీఏఓ) డాక్టర్ అరవింద్ కుమార్ పాఢికి మంత్రి లేఖ రాశారు. ఈ లేఖలో దర్యాప్తు జరపాల్సిన సమస్యాత్మక అంశాల్ని స్పష్టం చేశారు. దిఘా ఆలయానికి జగన్నాథ ధామ్ అని పేరు పెట్టడం అత్యంత వివాదస్పదం అయింది. దేశంలో సమగ్రంగా చతుర్థామాలు ఉన్నాయి. వీటిలో పూరీ ఒకటిగా స్థానం సాధించింది. ఈ పరిస్థితుల్లో దిఘా జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ ధామ్గా పేర్కొనడంతో రచ్చ రగులుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పూరీ శ్రీమందిరం నుంచి సేవాయత్లు దిఘా ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం వివాదాన్ని మరింత రగిల్చింది. మరోవైపు దిఘా ఆలయంలో దేవతల విగ్రహాలను నిర్మించడానికి శ్రీమందిరంలో దారు విగ్రహాల తయారీ తర్వాత మిగిలిన పవిత్ర కలప ఉపయోగించినట్లు ప్రసారమైన వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దిఘా జగన్నాథ ఆలయాన్ని ఏప్రిల్ 30న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. ఈ చర్యలు జగన్నాథ స్వామి భక్తులు మరియు ఒడిశాలోని నాలుగున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వివాదస్పద అంశాల్ని పరిగణనలోకి తీసుకుని అంతర్గత దర్యాప్తు చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తీసుకు రావాల్సి ఉందని మంత్రి శ్రీమందిరం సీఏఓకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
నైపుణ్యాలతో ఉద్యోగ అవకాశాలు
వజ్రపుకొత్తూరు రూరల్: యువతకు నైపుణ్యాలతోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని గరుడభద్రలో సైనింగ్ స్టార్ యువజన సంఘం 25వ వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్రస్థాయి డీఎస్సీ టాలెంట్ టెస్ట్ను గురువారం నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్లో రాష్ట్రవ్యాప్తంగా 500 మంది అభ్యర్థులు పాల్గొని ఆన్లైన్లో ప్రతిభ పరీక్ష రాశారు. ఈ పోటీ పరీక్షలో కె.స్వప్న (శ్రీకాకుళం) ప్రతిభ కనబ ర్చి ప్రథమ స్థానంలో నిలిచింది. కె.భారతి(శ్రీకాకుళం) ద్వితీయ స్థానం, ఎన్.శ్యామల(విజయనగరం) తృతీయ స్థానంతో పాటు మరో ఏడు స్థానాల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు నగదు బహుమతి తో పాటు జ్ఞాపికలను మాజీ మంత్రి చేతులమీదు గా అందజేశారు. కార్యక్రమంలో సైనింగ్ స్టార్ యువజన సంఘ అధ్యక్షుడు వై.సంతోష్కుమార్, సర్పంచ్ గూడ గిరిజ ఈశ్వరరావు, సైనింగ్ స్టార్ యువజన సంఘ కార్యదర్శి జి.నగేష్, గ్రామ సంఘ కార్యదర్శి చెల్లూరి పాపారావు, గాయిత్రి కళాశా ల ప్రిన్సిపాల్ షణ్ముఖరావు, జగన్ కోచింగ్ సెంటర్ అధినేత జగన్, గూడ భాస్కరరావు, వై.ధర్మారావు, వై.అప్పారావు, వై.అనందరావు, ఎ.దానేష్ పాల్గొన్నారు. -
15 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు అరెస్టు పర్లాకిమిడి: గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గజపతి జిల్లాలోని మోహనా బ్లాక్ అడవ పోలీసుస్టేషన్ పరిధి హాడపోదా జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని అందుకున్న సమాచారం మేరకు దాడులు చేశామన్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులు అడవ గ్రామానికి చెందిన రఘునాథ శెఠి, అజయ్ నాయక్లుగా గుర్తించామన్నారు. 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం! జయపురం: బైక్ దొంగల ఆట కట్టించేందుకు జయపురం పట్టణ పోలీసులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా చోరీకి పాల్పడుతున్న వారిని గుర్తించి వారివద్ద నుంచి 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ విషయాన్ని పట్టణ పోలీసు అధికారి వల్లభ చంధ్ర రౌత్ వద్ద ప్రస్తావించగా సమాదానం చెప్పేందుకు నిరాకరించారు. అయితే తగిన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు. గాయపడిన వ్యక్తి మృతి నరసన్నపేట: మండలంలోని ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఢీకొని గాయపడిన తుంగాన గోవిందరావు (48) గురువారం వేకువజామున మృతి చెందారు. బుధవారం ఉదయం ట్రైన్ ఢీకొనడంతో గాయాలపాలై న విషయం తెలిసిందే. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు తెలిపా రు. కాగా మృతునికి భార్య అప్పలనర్సమ్మ, కుమారుడు మహేష్, కుమార్తె అనితలు ఉన్నారు. కానిస్టేబుల్పై కేసు నమోదు కాశీబుగ్గ: పలాస కోర్టుకు సంబంధించి వివిధ కేసుల్లో రికవరీ అయిన బంగారం, నగదును సొంతానికి వాడుకున్న విషయమై ఒక కానిస్టేబుల్పై కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదయ్యింది. సంబంధిత బాధితులకు అందాల్సిన రూ.10 లక్షలు, ఆరు తులాల బంగారం అందకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించగా విషయం బయటపడింది. ఇదే విషయంపై కాశీబుగ్గ పోలీసుస్టేషన్ సీఐ సూర్యనారాయణకు వివరణ కోరగా, అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి
● బహుళార్ధసాధక కార్మికుల విశ్రాంతి గదుల ప్రారంభంలో సీఎం మాఝి ● ఒడిశా శ్రామిక్ సాథీ మొబైల్ యాప్ ప్రారంభం భువనేశ్వర్: ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నామని, ప్రధానంగా అట్టడుగు స్థాయి ప్రజలకు ప్రభుత్వ సేవలు అంకితం చేస్తున్నామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి ఇదే దృక్పథంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఓయూఏటీ వ్యవసాయ విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా నగరంలో 2 బహుళార్ధసాధక కార్మికుల విశ్రాంతి సముదాయాల్ని ప్రారంభించారు. స్థానిక డుమ్డుమా మరియు కల్పనా ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు. ఈ ప్రాంగణాల్లో కార్మికులకు తాత్కాలిక ఆశ్రయ సౌకర్యాలతో పాటు సురక్షిత తాగు నీరు, మరుగుదొడ్లు, పార్కులు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో కటక్, రౌర్కెలా, సంబలపూర్, కెంజొహర్, బరంపురం వంటి ఇతర పట్టణ ప్రాంతాలలో కార్మికుల నిరీక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కార్మికులు అకాల మరణానికి గురైతే అందజేసే మరణ పరిహారం మొత్తం పరిమితి పెంచినట్లు తెలిపారు. ఇకపై సాధారణ మరణానికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పరిహారం పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 47 లక్షల మంది నిర్మాణ కార్మికులు నమోదు చేసుకున్నారు. వీరంతా వివిధ పథకాల కింద రూ.3,951 కోట్లకు పైగా సహాయం పొందారని వివరించారు. తాజాగా 4 లక్షలకు పైగా నిర్మాణ కార్మికులు నమోదు చేసుకుని రూ. 370 కోట్లకు పైగా సహాయం పొందారని తెలిపారు. యాప్ ప్రారంభం.. మే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది అర్హులైన నిర్మాణ కార్మికులకు ఒకేసారి కొత్త గుర్తింపు కార్డుల్ని సీఎం జారీ చేశారు. వీరిలో అర్హత కలిగిన లబ్ధిదారులకు రూ. 40 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయం అందజేశారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వివిధ సేవలు కార్మికులకు చిటికెలో లభ్యం అయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఒడిశా శ్రామిక్ సాథీ మొబైల్ యాప్ను ప్రారంభించారు. దీనివల్ల కార్మికులు ఇంటి నుంచే వివిధ సేవలను సులభంగా, సౌకర్యవంతంగా పొందగలుగుతారని సీఎం చెప్పారు. నిర్మాణ కార్మికులకు ఆన్లైన్ వర్కర్ రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ, సహాయం కోసం దరఖాస్తు వంటి సేవలను పొందడంలో ఈ మొబైల్ యాప్ ఎంతో సహాయపడుతుందని తెలిపారు. వలస కార్మికులను గుర్తించి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ఒడియా వలస కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లోక్సభ సభ్యురాలు, ఎమ్మెల్యే, కార్మిక–ఉపాధి శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి పాల్గొన్నారు. -
సెంట్రల్ వర్సిటీ వీసీ రాజీనామా ఆమోదం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా సునాబెడా సమీపంలో ఉన్న ఒడిశా సెంట్రల్ యునివర్సిటీ వైస్ చాన్సలర్ చక్రధర్ త్రిపాఠి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. గురువారం ఈయన స్థానంలో నర్సింగ్ చరణ్ పండాని నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యాయవాది మృతికి సంతాపం కొరాపుట్: న్యాయవాది సుజాత పాత్రో అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. గురువారం జయపూర్లోని కొరాపుట్ జిల్లా కోర్టుల సముదాయంలో సంతాప సభ నిర్వహించారు. బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరి భలోనాథ్ పట్నాయక్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సునాబెడాలో అప్రమత్తం కొరాపుట్: భారత్–పాక్ యుద్ధ వాతావారణ నేపథ్యంలో కొరాపుట్ జిల్లా సునాబెడాలో అప్రమత్తం చేశారు. యుద్ద విమానాల ఇంజిన్లు ఇక్కడి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) తయారు చేసి అందిస్తుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఐడెంటీ కార్డులు లేనిదే ఎవరినీ అనుమతించడం లేదు. ఇస్కాన్ మందిరంలో పూజలు కొరాపుట్: కొట్పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర ఇస్కాన్ మందిరాన్ని దర్శించుకున్నారు. గురువారం పట్టణంలో ఇస్కాన్ మందిరానికి వెళ్లి భగవతం ప్రవచనాలు ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను సైన్యంలో పని చేస్తున్నప్పటి నుంచి ఇస్కాన్ సంస్కృతి కి గౌరవం ఇచ్చేవాడినని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతర బీజేపీలో చేరిన తర్వాత ఇస్కాన్ పట్ల మరింత విదేయత పెరిగిందన్నారు. పెళ్లి ఊరేగింపులో పాములు భువనేశ్వర్: పెళ్లి ఊరేగింపులో నాగుపాములను ప్రదర్శించిన ఘటన భద్రక్ జిల్లా ధామ్రా బంశద గ్రామ పంచాయతీ ఛెడకా గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన వివాహ ఊరేగింపులో మూడు పాములను తీసుకొచ్చి నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న భద్రక్ వన్య ప్రాణుల విభాగం బృందం ఘటనా స్థలానికి చేరుకుని పాములను ప్రత్యేక బోనులో భద్రపరిచారు. సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని భద్రక్ మండల అటవీ అధికారి (డీఎఫ్ఓ) సౌభాగ్య కుమార్ సాహు తెలిపారు. కల్యాణం.. కమనీయం రాయగడ: కొలనార సమితి అమలాభట్ట వద్ద గల శ్రీక్షేత్ర టౌన్ షిప్లో ఉన్న లక్ష్మీనృసింహుని సన్నిధిలో అక్షయ తృతియ పురస్కరించుకుని జరుగుతున్న చందనోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం కల్యాణోత్సవం అత్యంత వైభంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాఽథ్ ఆచార్యులు, స్థానిక బాలాజీ నగర్లో గల కల్యాణ వేంకటేశ్వరుని ఆలయ ప్రధానార్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణోత్సవాలు సంప్రదాయ బద్ధంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
అరుదైన శస్త్ర చికిత్స
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గురువారం అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గార మండలం అచ్చెన్నపాలెంకు చెందిన శిమ్మ నీలకంఠం వెల్డర్గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 30న పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కటింగ్ మిషన్ చేయిమీదకు రావడంతో కుడిచేయి భాగం తెగిపోయింది. నరాలు తెగిపోవడం, ఎక్కువగా రక్తస్రావం జరగడంతో పనిచేయలేని స్థితికి వచ్చేసింది. విశాఖపట్నంలోని ఒక ఆస్పత్రిని సంప్రదిస్తే సుమారు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలుసుకున్నారు. దీంతో వెంటనే రాగోలు జెమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ డాక్టర్ బుల్లి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా అరుదైన ఆపరేషన్ను ఉచితంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ చేయడానికి సుమారు 5 గంటల సమయం వెచ్చించినట్లు ఆర్ఎంవో మేనేజర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. -
క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం
● జిల్లావ్యాప్తంగా 50 కేంద్రాల్లో శిక్షణ శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు (సమ్మర్ కోచింగ్ క్యాంప్లు) గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు శాప్ సూచనలతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 50 శిక్షణ శిబిరాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. 22 క్రీడాంశాల్లో జరుగుతున్న ఈ శిబిరాల వద్దకు క్రీడాకారులు, బాలబాలికలు తరలివస్తున్నారు. దీంతో క్రీడా మైదానాల్లో సందడి వాతావరణం నెలకొంది. క్రీడాకారులు శారీరక ఫిట్ నెస్తోపాటు నిర్దేశిత క్రీడలో సాధన చేపడుతున్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడి యం వేదికగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సీఈవో పి.సుందరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. చదువుతోపాటు క్రీడలు కూడా అవ సరమేనన్న విషయాన్ని విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు గుర్తించాలన్నారు. ఒలింపిక్ అసోసియేష న్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బీవీ రమణ మాట్లాడుతూ క్రీడాకారులు తయారయ్యేది,ఓనమా లు దిద్దుకునేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలతోనేనని తెలిపారు. డీఎస్డీవో డాక్టర్ కె.శ్రీధర్రావు మాట్లాడుతూ జిల్లాలో 50 కేంద్రాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, అత్యంత ఆదరణ కలిగిన క్రీడాంశాలకు పెద్దపీట వేశామన్నారు. కేంద్రాని కి రూ.7 వేలు చొప్పున శాప్ కేటాయించిందన్నారు. 8 ఏళ్లు పైబడిన బాలబాలికలు సద్వినియోగం చేసు కోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పర్యాటకాధికారి ఎన్.నారాయణరావు, టీటీ కోచ్ ఎం.మాధురీలత, పీడీలు చల్లా జగదీష్, ఎన్వీ రమణ, జి.అర్జున్రెడ్డి, రాజీవ్, పురుషోత్తం, క్రీడాసంఘాల ప్రతినిధులు, కోచ్లు, సీనియ ర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
శాశ్వత పట్టాలు ఇవ్వాలి
జయపురం: జయపురం సమితి బరిణిపుట్ పంచాయతీ ముండిగుడ ఒడిశా కన్స్ట్రక్షన్ కాలనీ(ఓసీసీ) ప్రాంతంలో 50 ఏళ్లుగా నివసిస్తున్న వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ నేత రవీంద్రమహాపాత్రో కోరారు. మహాపాత్రో నేతృత్వంలో వందలాది మంది ఓసీసీ ప్రాంత నివాసులు జయపురం సబ్ కలెక్టర్కు గురువారం వినతి పత్రం సమర్పించారు. 2019లో ఆ ప్రాంత నివాసులైన 250 పైగా కుటుంబాల వారు ఇళ్ల పట్టాలు కోసం విజ్ఞప్తి చేశారన్నారు. జిల్లా కలెక్టర్ 49 కుటుంబాలకు బరిణిపుట్ పంచాయతీలో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేశారని వెల్లడిచారు. అంతకు ముందు ఆ ప్రాంతంలో ఉంటున్న 250 కుటుంబాలకు భూమి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వినతి పత్రంలో గుర్తు చేశారు. అయితే వారికి 7 ఎకరాల 50 సెంట్ల భూమి చూసి అక్కడ ఇళ్లు కట్టుకోమన్నారన్నారు. అందుకు కొంతమంది అందుకు అంగీకరించలేదని వివరించారు. తరువాత కాలంలో ఆ డొంగర భూమిని చదును చేసి ఇళ్లు కట్టు కొనేందుకు అంగీకరించారని అందు చేత అచ్చట నివాసం ఏర్పరుకున్న వారికి శాశ్వత పట్టాలు సమకూర్చి ఆ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని సబ్కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అధికారులకు ముండిగుడ వాసుల విజ్ఞప్తి -
ట్రాక్టర్ ఢీకొనడంతో మహిళకు గాయాలు
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీలోని వీకేపేట రోడ్లో ఒక ట్రాక్టర్ స్కూటీని ఢీకొనడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం అత్యంత రద్దీగా ఉన్న వీకేపేట రోడ్లో రత్తకన్న వైపు నుంచి మార్కెట్ వైపు ఒక వ్యక్తి ట్రాక్టర్ని వేగంగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న స్కూటీనీ తప్పించే క్రమంలో ఢీకొన్నాడు. దీంతో స్కూటీ నడుపుతున్న పెద్ద ఆకుల వీధికి చెందిన కిల్లంశెట్టి శరణ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండడం కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ ముకుందరావు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సవరాశి దుదిష్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు జిమ్ ప్రారంభం
రాయగడ: జిల్లాలోని చందిలి రిజర్వ్ పోలీసు కార్యాలయం ప్రాంగణంలో పోలీసు జిమ్ ప్రారంభమయ్యింది. దక్షిణాంచల్ డీఐజీ అఖి లేశ్వర్ సింహ్ ముఖ్య అతిథిగా హాజరై జిమ్ను మంగళవారం ప్రారంభించారు. వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా పోలీసు విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాధునిక పరికరాల తో ప్రారంభమైన జిమ్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, ఏఎస్పీ బిష్ణు ప్రసాద్ పాత్రో, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కవిబర్ డెవురా తదితరులు పాల్గొన్నారు. ఈసీహెచ్ఎస్ మొబైల్ యాప్ ప్రారంభం రాయగడ: గోపాల్పూర్కు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు ఈసీహెచ్ఎస్ (ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రీబ్యూటరీ హెల్త్ స్కీమ్) మోబైల్ యాప్ను బరంపురంలోని పాలీ క్లీనిక్లో బుధవారం ప్రారంభించారు. ఈ యాప్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు సహకారం అందజేసేవిధంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న సైనికులు వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఈ యాప్లో నమోదు చేసుకొని సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. వైభవంగా రామాలయ ప్రతిష్ట కొరాపుట్: జిల్లా కేంద్రంలోని పూజారిపుట్లో రామాలయ ప్రతిష్ట వైభవంగా బుధవారం నిర్వహించారు. సుమారు 600 మంది మహిళ లు నరేంద్ర సరోవర్ నుంచి కలశాలతో పవిత్ర నీటిని తీసుకొచ్చారు. ఆ నీటితో రాజస్థాన్లో తయారు చేసి దేవతామూర్తుల విగ్రహాలు అభిషేకం చేశారు. మధ్యాహ్నం సమయంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చీమలమందు తాగి మహిళ ఆత్మహత్య టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడు గ్రామానికి చెందిన పినిమింటి లక్ష్మీ(37) చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ భర్త రామారావు రోజు మద్యం సేవించి భార్యాపిల్లలతో గొడవ పడేవాడు. ఇంట్లో దాచిపెట్టిన డబ్బులను ఈ నెల 27న తీసుకుపోయి రోజంతా పూటుగా తాగి సాయంత్రం ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. మనస్థాపానికి గురైన లక్ష్మీ ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలుపుకొని తాగింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుశం రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. లక్ష్మికి కుమార్తె జగదీశ్వరి, కుమారుడు శ్యాం ఉన్నారు. వరకట్న వేధింపులపై కేసులు నమోదు కాశీబుగ్గ: పలాస మండలం, మున్సిపాలిటీ పరిధిలో వరకట్న వేధింపులపై కేసులు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ బుధవారం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన కె.ఇందు తన భర్త మహేష్, భర్త కుటుంబ సభ్యులు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా, పలాస మండలం రెంటికోట గ్రామానికి చెందిన రేఖమ్మ తన భర్త కై లష్హోరి రూ.3లక్షలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. రైలు ఢీకొని వ్యక్తికి గాయాలు నరసన్నపేట: మండలంలోని ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న ఘటనలో కొత్తపోలవలసకు చెందిన తుంగాన గోవిందరావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు కేసు నమోదు చేశారు. -
ఆటాడుకుందాం రా..!
అథ్లెటిక్స్: జీహెచ్ స్కూల్ పలాస– 9494379648, టెక్కలి– 9492417570, జెడ్పీహెచ్ స్కూల్ కేకే రాజపురం– 8464906752, టీపీఎంహెచ్ స్కూల్ శ్రీకాకుళం– 8500271575, కేవీకే ఇచ్ఛాపురం– 9441024555, పాతపట్నం– 9100736583, జెడ్పీహెచ్ స్కూల్– 8688872304. వాలీబాల్: జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట– 9441011391, జెడ్పీహెచ్ స్కూల్ పైడి భీమవరం– 9849326018, జెడ్పీహెచ్ స్కూల్ ప్రగడపుట్టుగ– 9491569394, జెడ్పీహెచ్ స్కూల్ కొర్ని– 9440955034, జెడ్పీహెచ్ స్కూల్ మాకివలస– 9963753719, జెడ్పీహెచ్ స్కూల్ పాతపట్నం– 9440955034, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ– 9494814087. కబడ్డీ: బలగ శ్రీకాకుళం – 9010406706, జెడ్పీహెచ్ స్కూల్ సింగుపురం– 9642287746, ప్రభుత్వ డిగ్రీ కళాశాల టెక్కలి– 9441262515, జెడ్పీహెచ్ స్కూల్ పల్లెసారధి– 9502983175. ఖోఖో: జెడ్పీహెచ్ స్కూల్ పలాస– 9618583449, కేఆర్ స్టేడియం శ్రీకాకుళం– 9866288802, ఎంజీహెచ్ స్కూల్ ఇచ్ఛాపురం– 9177914135. హ్యాండ్బాల్: జెడ్పీహెచ్ స్కూల్ అల్లినగరం– 9493764447, జెడ్పీహెచ్ స్కూల్ పిల్లలవలస– 9966849462, జెడ్పీహెచ్ స్కూల్ పాతటెక్కలి– 7330831517. సాఫ్ట్బాల్: జెడ్పీహెచ్ స్కూల్ ఇప్పిలి– 9440436317, జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట– 9705302968, జెడ్పీహెచ్ స్కూల్ కురుడు– 9052500720. ఫుట్బాల్: కేఆర్ స్టేడియం శ్రీకాకుళం– 9533691018, కలెక్టరేట్ వద్ద ఆర్అండ్బీ గెస్ట్హౌస్ హెచ్–గ్రౌండ్ శ్రీకాకుళం– 9177564623, జెడ్పీహెచ్ స్కూల్ నరసన్నపేట– 8639629920. బాల్ బ్యాడ్మింటన్: జీహెచ్ స్కూల్ ఎచ్చెర్ల– 8074452351, ఎంజేపీ నరసన్నపేట– 7013473337. బాక్సింగ్: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్,శ్రీకాకుళం– 8977496979, పీఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ శ్రీకాకుళం– 9989364548. జూడో: జెడ్పీహెచ్ స్కూల్, వప్పంగి– 9440688828, జెడ్పీహెచ్ స్కూల్ పోలవరం– 9550743035. తైక్వాండో: ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం శ్రీకాకుళం– 9393178455, టౌన్ హాల్ శ్రీకాకుళం– 8919591487. వెయిట్ లిఫ్టింగ్: జీహెచ్ స్కూల్ నరసన్నపేట: 9492299769, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆమదాలవలస– 9390745150. బ్యాడ్మింటన్: టెక్కలి– 7799335725 బేస్బాల్: జెడ్పీహెచ్ స్కూల్ లావేరు– 8639000705. బాస్కెట్బాల్: టెక్కలి– 8986951096. చెస్: కోడిరామ్మూర్తి (కేఆర్) స్టేడియం శ్రీకాకుళం– 9908162634. క్రికెట్: పాతపట్నం– 9701454500. ఫెన్సింగ్: టౌన్హాల్ శ్రీకాకుళం– 7660874844. సెపక్తక్రా: ఎన్టీఆర్ఎం హెచ్స్కూల్ శ్రీకాకుళం– 8500828965. టేబుల్టెన్నిస్: బాలభాను విద్యాలయం – 9290577033. టెన్నీకాయిట్: జీహెచ్స్కూల్ పలాస– 9441089592. ఉషూ: ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం శ్రీకాకుళం– 9885734313. ● నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభం ● జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో నెలరోజుల పాటు శిక్షణ ● 22 క్రీడాంశాలకు చోటు ● 8 ఏళ్లు పైబడిన బాలబాలికలకు అవకాశం శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో బాలబాలికలంతా మైదానబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులంతా మరో నెల రోజులపాటు ఆటల్లో ముగినితేలనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు(సమ్మర్ కోచింగ్ క్యాంప్)లను నిర్వహిస్తున్న విషయం విదితమే. జిల్లాలో గురువారం నుంచి శిక్షణా శిబిరాలు మొదలుకానున్నాయి. అరకొర నిధులతోనే.. మే ఒకటి నుంచి మొదలుకానున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు విధిల్చి చేతులు దులుపేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలలో మే నెలాఖరు వరకు ఈ శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. ఒక్కొక్క శిబిరానికి కేవలం రూ.7వేలు మాత్రమే కేటాయించారు. ఇందులో శిక్షకుడు/కోచ్కు రూ.1500, ఫ్లెక్సీకి రూ. 500, స్పోర్ట్స్ మెటీరియల్కు రూ.5వేలు వెచ్చించనున్నారు. శిక్షణ సమయంలో క్రీడాకారులకు పోటీ లను నిర్వహిస్తారు. ఆఖర్లో ఆన్లైన్లో సర్టిఫికెట్లు అందజేస్తారు. అరకొరగా నిధుల కేటాయింపు పట్ల క్రీడాసంఘాల ప్రతినిధులు పెదవివిరిస్తున్నారు. ఇవీ విధివిధానాలు.. ● సమ్మర్ కోచింగ్ క్యాంపులలో 8 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందిస్తారు. 16 ఏళ్లపైబడి ఆసక్తి కలినవారు కూడా హాజరుకావచ్చు. ● ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మరళా సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ● శాప్ కోచ్లతోపాటు పీడీలు/పీఈటీలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ అందించేందుకు అర్హులు. ● ప్రతిరోజు క్రీడాకారులకు హాజరు వేయాల్సి ఉంటుంది. ● వారంతాల్లో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి. ● శిబిరాల సమయంలో గ్రామీణ, పాఠశాల స్థాయి స్పోర్ట్స్ క్లబ్లను క్రీడాంశాల వారీగా ఏర్పాటు చేయాలి. ● శిక్షణా శిబిరాల సమయంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారిని ప్రత్యేకంగా సానబెట్టి భవిష్యత్తులో జరిగే పోటీలకు సిద్ధంచేయాలి. ● దాతల సహకారం, చేయూతతో శిక్షణా శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలకు క్రీడాపరికరాలు, క్రీడాదుస్తులు, షూ, సాక్సులు, స్నాక్స్, మెడల్స్, బహుమతులు, అందించేలా ఆయా కేంద్రాల శిక్షకులు చొరవ తీసుకోవాలి. గ్రామీణ క్రీడలకు పెద్దపీట.. సమ్మర్ కోచింగ్ క్యాంప్ కేటాయింపులో గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారు. జిల్లా వ్యాప్తంగా 22 కేంద్రాలను కేటాయించారు. అత్యధికంగా అథ్లెటిక్స్కు, వాలీబాల్కు ఏడేసి చొప్పున కేంద్రాలను కేటాయించగా.. కబడ్డీ 4, ఫుట్బాల్ 3, హ్యాండ్బాల్ 3, సాఫ్ట్బాల్ 3, ఖోఖో 3, బాల్ బ్యాడ్మింటన్ 2, బాక్సింగ్ 2, జూడో 2, తైక్వాండో 2, వెయిట్లిఫ్టింగ్ 2, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్, ఫెన్సింగ్, సెపక్తక్రా, టేబుల్టెన్నిస్, టెన్నికాయిట్, ఉషూ క్రీడాంశాల్లో చెరో కేంద్రం చొప్పున శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. అత్యంత ఆదరణ కలిగిన ఆయా ప్రాంతాల్లో పాఠశాలల మైదానాల్లోనే శిక్షణ అందించనున్నారు. శిబిరాలు ఎక్కడెక్కడంటే.. సద్వినియోగం చేసుకోవాలి.. బాలబాలికల ప్రతిభ బయటపడేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలలోనే. జాతీయస్థాయిలో తీర్చిదిద్దే శిక్షకులు జిల్లాలో ఉన్నారు. క్రమం తప్పుకుండా హాజరై శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ఒలింపిక్ అసోసియేషన్, క్రీడాసంఘాలు, పీఈటీ సంఘ నాయకులతో కలిసి శిక్షణా కేంద్రాలను కేటాయించాం. కేంద్రానికి రూ.7వేలు చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించిన విదివిధానాలను శాప్ ప్రకటించింది. – డాక్టర్ కె.శ్రీధర్రావు, డీఎస్డీఓ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, శ్రీకాకుళం -
బాధిత కుటుంబాలకు చేయూత
భువనేశ్వర్: విధి నిర్వహణలో అకాల మరణం పాలైన ఇద్దరు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ముఖ్యమంత్రి చేయూతనిచ్చి ఆదుకున్నారు. దివంగత సిబ్బంది భార్యలకు హోం గార్డు ఉద్యోగం కల్పించారు. స్థానిక లోక్సేవా భవన్లో బుధవారం ముఖ్యమంత్రి నియామక పత్రం మరియు సహాయనిధి కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రభాసిని బెహరా, దేవి షబర్ నియామకపత్రంతో పాటు చెక్కులు అందుకున్నారు. వీరి ఇద్దరు భర్తలు పీసీఆర్ వ్యాన్లో డ్యూటీలో ఉండగా ప్రమాదంలో ఇటీవల మరణించారు. మహిళలకు చెక్కులు, నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం మోహన్చరణ్ -
లక్ష్మీనృసింహునికి ప్రత్యేక అభిషేకాలు
రాయగడ: కొలనార సమితి అమలాభట్ట వద్దనున్న శ్రీక్షేత్రటౌన్ షిప్లోని శ్రీలక్ష్మీ నృసింహ ఆలయంలో పవిత్ర అక్షయ తృతీయ పురస్కరించుకొని మంగళవారం నుంచి చందనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాథ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఆరాధన, దీపారాధన, క్షీరాభిషేకాలతో పాటు చందనాభిషేకాలు చేపట్టారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్రావు పరివేక్షణలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిషేకాలు చేస్తున్న అర్చకులు -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాయగడ: బిసంకటక్ నుంచి పర్శాలికి వెళ్తున్న లక్ష్మీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఈ ఘటన పాతలొంబ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఉదయం ప్రయాణికులతో బిసంకటక్ నుంచి బయల్దేరిన బస్సు పాతలొంబ గ్రామానికి చేరేసరికి మలుపు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. గత రెండు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మలుపు వద్ద మట్టి పేరుకుపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిడుగుపాటుకు 11 ఆవులు మృతి కొరాపుట్: పిడుగుపాటుకి 11 ఆవులు మృతి చెందిన ఘటన కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితి సంగల్బెడా గ్రామ పంచాయతీ పుల్బాడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఆవుల మందపై పిడుగులు పడడంతో మొత్తం 11 ఆవులు మృత్యువాత పడ్డాయి. దీంతో యజమానులు విలపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. బుధవారం రైతు దినోత్సవం, పవిత్ర అక్షయ తృతీయ సందర్భంగా జిల్లా వ్యవసాయ మరియు కృషక్ స్వశక్తీకరణ ఆధ్వర్యంలో బి.ఎన్.ప్యాలస్ రోడ్డులో అధికారులు దుక్కులు దున్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి రవీంద్రకుమార అఢెక్, జల విభాజన మరియు ప్రాజెక్టు డైరక్టర్ సురేష్ కుమార్ పట్నాయిక్, ఉద్యానవనాల శాఖ ఉపసంచాలకులు సుశాంత్ రంజన్ దాస్, అదనపు ప్రాణి చికిత్సా అధికారి డాక్టర్ రమాకాంత రోణా తదితరులు పాల్గొన్నారు. నూతన భవనం ప్రారంభం పర్లాకిమిడి: స్థానిక తెలుగు సొండివీధి సరస్వతీ శిశు విద్యామందిర్ సమీపంలో వందేమాతరం నృత్య, సంగీత పాఠశాల నూతన భవనాన్ని బుధవారం జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు ప్రారంభించారు. సుమారు 23 సంవంత్సరాల నుంచి ఈ నృత్య, సంగీత అకాడమీ అద్దె భవనంలో నడుస్తోంది. ప్రస్తుతం ఈ సంగీత, నృత్య అకాడమీలో 32 మంది విద్యార్థులు, 5 మంది గురువులు శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బసంతకుమార్ పట్నాయిక్, రాజీవ్ లోచన పండా, రబి పాణిగ్రాహి, అమూల్య పాత్రో, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగానికి పెద్దపీట
రాయగడ: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ఆదివాసీ, హరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాల సంక్షేమ శాఖల మంత్రి నిత్యానంద గొండా అన్నారు. పవిత్ర అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం గుణుపూర్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా ముందుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం పొలం దున్ని, విత్తనాలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఫరూల్ పట్వారి, బీజేపీ నాయకులు శివశంకర్ ఉలక, రబి గొమాంగో తదితరులు మంత్రి నిత్యానంద గొండా పాల్గొన్నారు. విత్తనాలు చల్లిన విద్యార్థులు జిల్లాలోని గుణుపూర్లో ఉన్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ విభాగానికి చెందిన విద్యార్థులు అక్షయ తృతీయ పురస్కరించుకొని పంట పొలాల్లో విత్తనాలు జల్లారు. ఆ విభాగం ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ మిశ్రో, ప్రొఫెషర్ డాక్టర్ సుశాంత్ కుమార్ మహంతి, డాక్టర్ రినా స్వయి, అధ్యాపకులు, వ్యవసాయ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ కిషాన్ మోర్చ ఆధ్వర్యంలో సదరు సమితి అకుసింగి గ్రామంలో అక్షయ తృతీయ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ పార్టీ డీఎల్పీసీ సభ్యులు సుమంత్ కుమార్ మహరణా, జిల్లా కృషక్ మోర్చ అధ్యక్షుడు కృష్ణ పండ తదితరులు పాల్గొన్నారు. -
అంకురార్పణ
నిత్యం చందన లేపనం భువనేశ్వర్: జగతినాథుడు కొలువుదీరిన శ్రీక్షేత్రం (పూరీ)లో పవిత్ర అక్షయ తృతీయ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీ జగన్నాథుని సంస్కృతిలో ఈ తిథితో విశ్వ విఖ్యాత రథయాత్ర ముడిపడి ఉంది. అక్షయ తృతీయ పురస్కరించుకుని ఈ ఏడాది జరగనున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్ర కోసం రథాల నిర్మాణం బుధవారం నుంచి ప్రారంభించారు. దీంతో 42 రోజుల పాటు జరిగే ప్రసిద్ధ చందన యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీమందిరం సింహ ద్వారం తలుపులు తెరిచి లోపలి భాగాన్ని శుభ్రం చేసి మంగళ హారతి సమర్పించారు. మధ్యాహ్న ధూపం 1.15 నుంచి 2.30 గంటల మధ్య నిర్వహించారు. మధ్యాహ్న ధూపం తర్వాత శ్రీమందిరం రత్న వేదిక నుంచి దేవతాత్రయం మూడు ఆజ్ఞామాలలు రథ తయారీ ప్రాంగణానికి చేరాయి. ఈ సందర్భంగా బాజాభజంత్రీలు, మేళతాళాలతో పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలముకున్నాయి. స్వామివార్షిక రథయాత్రకు ఇది ఆరంభ సంకేతంగా భక్తుల హృదయం పులకించింది. వన జాగరణ ఆచారం ప్రకారం రథ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ పూజారులు (దెవుళో పురోహిత్), రాజ గురువు, శాసీ్త్ర బ్రాహ్మణులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాలలో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా నృసింహ మంత్రంతో నృసింహ స్వామియాగం నిర్వహించారు. ప్రత్యేక ఆచారాల ప్రకారం, ఆలయ పూజారి ముందుగా మూడు చెక్క దుంగలను స్పర్శింపజేశారు. దక్షిణ కాళీమాత మంత్రోచ్ఛరణతో పవిత్రం చేశారు. వెంబడి విశ్వకర్మలు రథాల నిర్మాణానికి సిద్ధం అయ్యారు. రథ నిర్మాణ అధిపతి (ముఖ్య విశ్వకర్మ), ప్రధాన భోయి సేవకుడు, చిత్రకారుడు, రూపకారుడు, కమ్మరి మొదలైన 10 వర్గాల మహారణల తలలకు పాగా (సాఢి బొంధొ) చుట్టి రథాల తయారీ పనులకు స్వాగతించారు. ఇతరేతర లాంచనాలు పూర్తి చేయడంతో మహరణ సేవకుల వర్గం రథాల నిర్మాణం ప్రారంభం చేపట్టింది. చందన యాత్ర శ్రీమందిరం రత్న వేదికపై ఆసీనుడైన శ్రీజగన్నాథ స్వామివారికి చందన లేపిత సేవ ఆరంభమైంది. పవిత్ర అక్షయ తృతీయ పురస్కరించుకుని బుధవారం నుంచి ఈ సేవ ప్రారంభం కావడం విశేషం. స్నాన పూర్ణిమ రోజు వరకు 42 రోజుల పాటు నిరవధికంగా కొనసాగుతుంది. ఈ 42 రోజుల పాటు స్వామి నిత్యం చందన యాత్రలో పాల్గొంటాడు. తొలి సగం రోజులు (21) వెలుపలి చందన యాత్ర, చివరి సగం రోజులు (21) అంతర్ చందన యాత్రగా స్వామి నిత్యం సంధ్య వేళలో ఉత్సవం జరుపుకుంటాడు. వెలుపలి చందన యాత్రలో భాగంగా నిత్యం సంధ్య వేళలో పల్లకిలో ఊరేగుతూ నరేంద్ర పుష్కరిణి తీరం చేరుతాడు. ఈ పుష్కరిణిలో కొన్ని గంటల సేపు దేవేరులతో కలిసి నావికా విహారంలో పాల్గొంటారు. పుష్కరిణిలో నంద మరియు భద్ర అనే నావలపై దేవదేవుళ్లు జల క్రీడల్లో పాల్గొని భక్తులను మురిపిస్తారు. చివరి 21 రోజులు అంతర్ చందన యాత్రగా శ్రీ మందిరం లోపలి ప్రాకారంలో జరుగుతుంది. శ్రీమందిరంలో ఘనంగా అక్షయ తృతీయ ప్రారంభమైన చందన యాత్ర 42 రోజుల పాటు జరగనున్న చందన యాత్ర అక్షయ తృతీయ అత్యంత ఆనందోత్సాహాలతో జరిగే పండగగా స్వామి భక్తులు పరిగణిస్తారు. అక్షయ తృతీయ నుంచి స్నాన పూర్ణిమ వరకు నిత్యం భోగ మండప సేవ తర్వాత చందన లేపనం చేస్తారు. ఈ సందర్భంగా మూల విరాటుల సాధారణ వస్త్రధారణ తొలగించి శుక్ల వర్ణ వస్త్రాలను తొడుగుతారు. ఈ వస్త్రం పొడవు 10 మూరలు మరియు వెడల్పు 3 మూరలు ఉంటుంది. దీనిని చందన్ గొఢా అని వ్యవహరిస్తారు. ఈ సేవలో భాగంగా సుగంధిత పుష్పాదులతో మూల విరాటుల్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇదే తరహాలో శ్రీ మందిరం సింహద్వారం ఆవరణలో తొలి దర్శనం ఇచ్చే పతిత పావనుని కుడ్య ప్రతిమకుల అలంకరణ, సేవాదులు నిర్వహించడం ఆచారం. అల్లంత దూరం నుంచి ఆరు బయట నుంచి దర్శనం ఇచ్చి పతితుల్ని పావనం చేసే భగవంతుడుగా నిత్య దర్శనం ప్రసాదిస్తాడు. -
లక్ష్మీపూర్లో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత పర్యటించారు. మంగళవారం సమితిలోని గౌడ గుడ గ్రామ పంచాయతీ లక్ష్మణి గ్రామంలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో బలి జాతర ఏర్పట్లను పర్యవేక్షించారు. గ్రామ గిరిజనులతో సమావేశమై వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. తాను అందుబాటులో లేనప్పుడు తన తరఫున ఎంపీ ప్రతినిధి ఈ ప్రాంతంలో ఉంటారని, ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అంతకు ముందు గ్రామ సరిహద్దులలో గిరిజన యువతులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామ దేవతకు ఎంపీ, ఎమ్మెల్యే పూజలు చేశారు. -
గోపాలచంద్ర శతపథికి రాష్ట్రపతి పురస్కారం
పర్లాకిమిడి: స్థానిక ముత్యాలమ్మ వీధిలో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచియిత, కవి గోపాలచంద్ర శతపథి (75)కి వయోసర్వశ్రేష్ఠ సమ్మాన్– 2021 అవార్డు న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో మే 2న అందుకోనున్నట్టు ఆయన తెలిపారు. గోపాలచంద్ర శతపథి 2009లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సర్వీసులో ఉత్తమ ఉపాధ్యాయునిగా 1992లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్నట్టు తెలియజేశారు. ఇప్పుడు వయో సర్వశ్రేష్ట సమ్మాన్ అవార్డు 2021 అందుకోనున్నట్టు తెలిపారు. అవార్డు దక్కడం పట్ల డీఈఓ మాయాధర్ సాహు, జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అభినందనలు తెలిపారు. సెంచూరియన్ విద్యార్థులకు శిక్షణ పర్లాకిమిడి: గుసాని సమితి ఉప్పలాడ రవీంద్రనాథ్ ఠాగోర్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో సెంచూరియన్ వర్సిటీ ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్లాంటేషన్ డేను నిర్వహించారు. అలాగే వ్యవసాయదారుల శిక్షణ శిబిరం కూడా పాఠశాలలో ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో నూతన సేంద్రియ పద్ధతులను రైతులకు విద్యార్థులు తెలియజేశారు. రమణమూర్తికి ఈఓగా పదోన్నతి అరసవల్లి: అరసవల్లి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కుప్పన్నగారి రమణమూర్తికి గ్రేడ్–3 ఈవోగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి గతేడాది అరసవల్లి ఆలయానికి బదిలీపై రాగా.. తాజా పదోన్నతితో మళ్లీ విజయనగరంలో 6–సి ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా మరో రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం అరసవల్లి ఆలయంలో అన్నదాన ప్రసాదాల సెక్షన్ ఇన్చార్జిగా ఉన్న ఈయనకు పదోన్నతి రావడంపై ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ‘ఆదిత్య’లో జాతీయ స్థాయి పోటీలు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్ ద్వారా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించినట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, ఆలిండియా స్టూడెంట్స్ యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో క్విజ్, డిజిటల్ పోస్టర్ మేకింగ్, వ్యాసరచన, స్లోగన్ రైటింగ్, అవేర్నెస్ రీల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. హోంగార్డు కుటుంబానికి సాయం శ్రీకాకుళం క్రైమ్ : హోంగార్డు పి.పైడిరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబానికి రూ.4.07 లక్షల నగదు చెక్కును మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అందజేశారు. సహచర హోంగార్డుల ఒక్కరోజు వేతనాన్ని ఈవిధంగా అందించారు. నీలమణి దుర్గ ఉత్సవాలు ప్రారంభం పాతపట్నం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారి 50వ వార్షిక మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమపూజ, అష్టోత్తర శతనామ పూజ, హోమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సుదీష్ఠ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మే 7 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఈవో టి.వాసుదేవరావు చెప్పారు. పూజా కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సన్యాసిరావు, బాబ్జీ, సతీష్, మడ్డు రామారావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒడిశా గవర్నర్కు స్వాగతం కంచిలి: మండలంలోని దాలేశ్వరం గ్రామంలోని సోలార్ ప్లాంట్ వద్దకు మంగళవారం విచ్చేసిన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుకు మండల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన్ను కలిసి రోడ్డును అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎన్.రమేష్కుమార్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, ఈఓపీఆర్డీ పి.ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా చట్టాలపై అవగాహన
జయపురం: మహిళా చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని వక్తలు అన్నారు. వర్కింగ్ మహిళల వేధింపు, ఎస్టీ, ఎస్సీ అత్యాచార చట్టం 1989పై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు న్యాయ చైతన్య శిబిరాన్ని గోపాలకృష్ణ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో గౌరహరి విహార్, రాణిపుట్లో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం నిర్వహించిన సచేతన శిబిరాన్ని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా లోక్ అదాలత్ శాశ్వత విచారపతి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి సుమన్ జెన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో ఉద్యోగాలు పొందిన మహిళలపై శారీరిక వేధింపుల నియంత్రణకు, అభ్యంతర అభియోగ కమిటీ ఏర్పాటు జరుగుతుందని మహిళలకు రక్షణ కల్పించే చట్టాలపైన, సోస్కొ చట్టాలపై వివరించారు. గోపాల కృష్ణ ఇంజినీరింగ్, టెక్నాలజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
తెలుగు భాషాభివృద్ధికి కృషి
జయపురం/కొరాపుట్: తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నామని వక్తలు అన్నారు. జయపురం తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహణలో కొనసాగుతున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం సోమవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి పది గంటల వరకు ఉత్సాహంగా కొనసాగింది. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయక్ అధ్యతన జరిగిన కార్యక్రమంలో అతిథులకు ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయక్ స్వాగతం పలికారు. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు బిరేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. తెలుగు సాంస్కృతిక సమితి పెద్దల ఉద్యమంతో 1981లో తెలుగు బాలికల కోసం తెలుగు సాంస్కృతిక సమితి తెలుగు మాధ్యమ ఉన్నత పాఠశాలను నెలకొల్పిందని గుర్తు చేశారు. అనంతరం 2014లో ఆంగ్ల భాష మాధ్యమంలో కూడా ఉన్నత పాఠశాల ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. సమాజంలో అట్టడుగు వర్గాల విద్యార్థులకు విద్య నేర్పేందుకు ఈ పాఠశాల ఏర్పడిందన్నారు. తెలుగు విద్యాబోధనలో సమతి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆనాటి సమితి నిర్వాహకులు అవదానం వలన పాఠశాల నెలకొందన్నారు. పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. అతిథులుగా సిటీ ఉన్నత పాఠశాల పరిశీలన కమిటీ అధ్యక్షులు ఎ.శ్రీనివాసరావు, తెలుగు సాంస్కృతిక సమితి కార్యదర్శి వై.శ్రీనివాస ఖన్నా, పాఠశాల వ్యవస్థాపక సభ్యులు శశిభూషణ పట్నాయక్, సిటీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుజాత, సిటీ ఎంఈ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం.మాధవి, సిటీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయక్ పాల్గొన్నారు. ఉత్తమ విద్యార్థులకు ప్రొఫెషనల్, భాస్కర అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ, జానపద, సంబల్పురి, ఒడిస్సీ నృత్యాలు, తెలుగు సంప్రదాయ డ్యాన్స్లు ఆహూతులను అలరించాయి. సిటీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో వక్తలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు -
గజపతిలో ఆరోగ్య సంక్షేమశాఖ కమిషన్ పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్లో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, కార్యదర్శి ఎస్.అస్వతీ మంగళవారం పర్యటించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వర్కింగ్ వుమెన్స్ హోస్టళ్లను తనిఖీ చేపట్టారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, ఒడిశా జీవనోపాదుల శాఖ డి.పి.ఎం టిమోన్ బోరా, మోహనా బీడీఓ రాజీవ్ దాస్, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు ఉన్నారు. మోహనా ప్రభుత్వ ఆస్పత్రిలో అందజేస్తున్న ఉచిత మందులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాతీయ హెల్త్ మిషన్ పథకాలు అమలుపై ఆరా తీశారు. -
దిఘాలో జగన్నాథ ఆలయ ప్రతిష్టపై వ్యతిరేకత
భువనేశ్వర్: ప్రసిద్ధ పూరీ శ్రీ జగన్నాథ ఆలయానికి అద్భుతమైన ప్రతిరూపం పశ్చిమ బెంగాల్లోని దిఘా ప్రాంతంలో నిర్మితమైంది. ఈ జగన్నాథ ఆలయం బుధవారం ప్రారంభించనున్నారు. దీని నిర్మాణానికి రూ. 250 కోట్లు వెచ్చించారు. పవిత్ర అక్షయ తృతీయ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలయాన్ని ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ దిఘాలోని జగన్నాథ ఆలయంలో జరిగే ప్రతిష్టోత్సవంలో పాల్గొనవద్దని పూరీలోని సువార్ మహాసూర్ నియోగుల వర్గం నిర్ణయించింది. ఉల్లంఘించిన వారు బహిష్కరణకు గురవుతారని ఈ వర్గం హెచ్చరించింది. కొత్తగా ప్రారంభం కానున్న ఈ ఆలయంలో రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. దారు విగ్రహాల బదులుగా రాతి విగ్రహాలు ఎంచుకోవడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్ట మహోత్సవానికి శ్రీ మందిరం నుంచి అంతా దూరంగా ఉండాలని సూచించారు ఉల్లంఘనకు పాల్పడితే ఆలయం నుంచి బహిష్కరణ, స్వామి సేవల నుంచి శాశ్వతంగా తొలగింపు వంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. -
53 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: ఉత్కళ గౌరవ్ మధుసూదన దాస్ జన్మదినం సందర్బంగా స్థానిక కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. స్థానిక డిప్యూటీ రిజస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ వారు నిర్వహించిన శిభిరాన్ని కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ పరిశీలన కమిటీ అధ్యక్షులు ఈశ్వర చంద్రపాణిగ్రహి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం అన్ని దానాలకంటే గొప్పదన్నారు. అర్హులందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి బ్లడ్బ్యాంక్ టెక్నిషియన్ అభయ పండ నేతృత్వంలో 53 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ భీమసేన్ సాహు, కేసీసీ బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శిశిర దాస్, జయపురం సబ్డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో పాల్గొన్నారు. -
నబరంగ్పూర్లో సినిమా చిత్రీకరణ
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లాలో దూరదర్శన్ వారు నిర్మిస్తున్న ఒడియా చలన చిత్రం ఖాలీ హండి నిర్మాణం పూర్తిచేసుకుంది. మంగళవారం జిల్లా కేంద్ర పరిసర గ్రామాల్లో ముగింపు షాట్లు చిత్రీకరించారు. ఒక అమాయక గిరిజనుడు సమాజంలో వివిధ సమస్యలతో పోరాడి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో ఈ చిత్రంలో చూపిస్తారు. గతంలో 6 దూరదర్శన్ చిత్రాలకి దర్శకత్వం వహించిన మనోజ్ కుమార్ పట్నయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిల్లాకి చెందిన స్థానిక కళాకారులు జితేంద్ర పరిచా, జితేంద్ర కుమార్ చౌదరి, ప్రకాష్ చంద్ర బారిక్, తదితరులు నటించారు. త్రిశక్తి కల్చరల్ అసోసియేషన్ ఈ సినిమాను నిర్మించింది. -
మీనాజోలను తీర్థస్థలంగా మారుస్తాం
● రాష్ట్ర రవాణా, గనుల శాఖ మంత్రి బిభూతి జెన్న రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితిలో పులాపొలియా, వంశధార, చవులధువా నదుల కలిసే త్రివేణి సంగమంగా గుర్తింపు పొందిన మీనాజోల ప్రాంతాన్ని తీర్థ స్థలిగా గుర్తించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందని రాష్ట్ర రవాణా, గనుల శాఖ మంత్రి బిభూతి జెన్న అన్నారు. సోమవారం నాడు మీనాజోలలో కొత్తగా నిర్మించిన మీనకేతనేశ్వర్ మందిరం ప్రారంభోత్సవంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ నుంచి తీసుకువచ్చిన స్పటిక లింగం ప్రాణ ప్రతిష్టోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మందిరం, లింగం ప్రతిష్టోత్సవాల్లో పాల్గొన్న మంత్రి జెన్న అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో గల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో మీనాజొల ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా గుర్తించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని అన్నారు. మూడు నదుల సంగమంగా గుర్తింపు పొందిన మీనాజొలలో ఏటా శివరాత్రి నాడు ఈ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతుందని అన్నారు. ఇంతటి ప్రాధాన్యత గల ఈ ప్రాంతానికి పర్యాటక స్థలంగా గుర్తింపు దక్కితే ఇక్కడ కొలువై యున్న మీనకేతనేశ్వర్ మందిరం కూడా పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందుతుందని అభిప్రాయపడ్డారు. పర్యటకులకు, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా ఈ ప్రాంతాభివృధ్దికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. మీనాజోల ఆధ్యాత్మిక కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ పండ నేతృత్వంలో ఈ ప్రాంతం ఎంతొ అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి జెన్న అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకుడు శివకుమార్ పట్నాయక్, యాల్ల కొండబాబు, కాళీరాం మాఝి తదితర ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు పద్మపూర్ సమీపంలో గల ముచికిపొదొరొ కూడలిలో మంత్రికి యాల్ల కొండబాబు అతని మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. -
డ్రైవర్కు గుండెపోటు!
● అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన బస్ కొరాపుట్: ప్రభుత్వ లక్ష్మీ బస్సు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు రావడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మంగళవారం కొరాపుట్ జిల్లా గొడపొదర్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు జయపూర్ వైపు వెళ్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో గృహోపకరణాలు దగ్ధం రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదళ పంచాయతీలోని నువాపడ గ్రామానికి చెందిన విలాస్ కొరకొరియా ఇంట్లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువైన టీవీ, ఫ్రిడ్జ్, బీరువ తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. కుటుంబంతో కలిసి విలాస్ సోమవారం తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే ఇంట్లో దట్టమైన పొగ బయటకు వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు చూసి అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం అందించారు. అయితే సిబ్బంది వచ్చేసమయానికే గృహోపకరణాలన్నీ బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. అంబొదళలో జగన్నాథుని విగ్రహ ప్రతిష్ట రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదళలో జగన్నాధ మందిరంలో జగన్నాథుని కొత్త విగ్రహ ప్రతిష్టోత్సవాలు సొమ,మంగళవారాల్లొ అత్యంత వైభవంగా జరిగాయి. సంప్రదాయ పద్ధతిలో స్వామి వారి పూజా కార్యక్రమాలను నిర్వహించి జగన్నాథుని కొత్తగా రూపొందించిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. జగన్నాథ మందిరం నిర్వాహక కమిటీ అధ్యక్షులు చంద్రశేఖర్ జోషి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. విగ్రహ ప్రతిష్టోత్సవాలకు పరిసర ప్రాంతాలకు చెందిన వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రెండు నెలల కిందట స్వామి విగ్రహం కాలిపోగా.. కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. కళాకారులకు సన్మానం జయపురం: కొరాపుట్ జిల్లా ధమంజోడిలో పది రోజులు నిర్వహించిన పంచపటమాలి 19వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు మంగళవారంతో ముగిశాయి. నాటక పోటీలలో జయపురం కళాకారులు ‘జీవన ఎకో నాటక( జీవితం ఒక నాటకం)’అనే నాటకాన్ని ప్రదర్శించి పలు బహుమతులు అందుకున్నారు. నాటక రచయిత జగదీస్ అధికారి, అభినేత్రి విజయలక్ష్మీ పాణిగ్రహి, నటులు బిఘ్నరాజ్ ఆచార్య, బాలనటుడు నివేదన పాణిగ్రహి, ముఖ్యఅతిథి నటులు నిరంజన్ సామల్లను ఈ సందర్భంగా నిర్వహకులు సత్కరించి గౌరవించారు. ఈ నాటకానికి నిరంజన్ పాణిగ్రహి దర్శకత్వం వహించగా జి.మహేష్ సంగీతం సమకూర్చారు. -
ఘనంగా సుదర్శన హోమం
రాయగడ: కొలనార సమితి అమలాభట్ట వద్ద గల శ్రీక్షేత్ర టౌన్షిప్లో ఉన్న శ్రీలక్ష్మీనృసింహుని మందిరంలో మంగళవారం నుంచి చందనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాధ్ ఆచార్యులు, స్థానిక బాలాజీ నగర్లో గల కల్యాణ వేంకటేశ్వర మందిరానికి చెందిన ప్రధాన అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మీనృసింహ స్వామికి ఉదయం ఆరాధన, చందనాభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు సుదర్శన హోమం నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్వామి కల్యాణోత్సవాలు అత్యంత ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తెలియజేశారు. -
రోహింగ్యాలపై ఫిర్యాదు
కొరాపుట్: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలపై నబరంగ్పూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ పిర్యాదు చేసింది. మంగళవారం చాంబర్ ప్రతినిధులు ఎస్పీ మిహిర్ పండాను అతని కార్యాలయంలో కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాము కష్టపడి టాక్స్లు, విద్యుత్ బిల్లులు, కార్మికులకు వేతనాలు, సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నామన్నారు. సామాజిక అభివృద్ధిలో ఎన్నో వ్యయప్రయాసలు పడి భాగస్వామ్యం అయ్యామన్నారు. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చి ఈ ప్రాంతంలో బైక్ల మీద గ్రామాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. వారికి ఎటువంటి అనుమతులు లేవన్నారు. వారి పూర్వ చరిత్ర కూడా ఎవరికీ తెలియదన్నారు. వీరి వలన సమాజంలో అసాంఘీక సమస్యలు ఏర్పడతాయన్నారు. ఎస్పీని కలిసిన వారిలో చాంబర్ ప్రెసిడెంట్ కను దాస్, సభ్యులు పి.ఎల్.మూర్తి, వి.మహేష్, రాకేష్ గుప్తా, తదితరులు ఉన్నారు. -
స్వాభిమాన్ ఏరియాలో కలెక్టర్ పర్యటన
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియాలో మంగళవారం కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, ఎస్పీ వినోద్కుమార్ పటేల్ పర్యటించారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మావోల అలజడి ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో గిరిజనులు ఎక్కువగా గంజాయి సాగు చేసేవారు. ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాన్ల రాకతో మావోలు తగ్గిపోయారు. గిరిజనుల్లోనూ చైతన్యం వచ్చింది. ఈ సందర్భంగా గిరిజనులతో చర్చించిన కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సేతు యోజన పథకంలో ఈ ప్రాంతంలో గిరిజనుల ఉపాధి కోసం గాను పసుపు, చోడి, అల్లం తదితర పంటలు పండించుకునేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఆరా తీశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు సందర్శించారు. -
మే 20 నుంచి రబీ ధాన్యం సేకరణ
రాయగడ: రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం మే 20 నుంచి సేకరిస్తుందని కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో జరిగిన సమీక్షసమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ ఏడాది జిల్లాలో 8,890 క్వింటాళ్ల ధాన్యం సేకరణకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మండీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణతో పాటు బజారు నియంత్రణ కమిటీ (ఆర్ఎంసి) అధికారులు మండీల ఏర్పాటుకు సంబంధించి అన్ని సన్నాహాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి రైతు నుంచి ధాన్యం సేకరించాలని ధాన్యం సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మండీల్లొ రైతులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బిష్ణు ప్రసాద్ కర్ మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఇప్పటి వరకు 503 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు వివరించారు. ధాన్యం క్వింటాల్ ఽమద్దతు ధర రూ.2300 ప్రభుత్వం ప్రకటించగా ఇన్పుట్ సహాయం కింద రైతులు ప్రతి క్వింటాల్కు అదనంగా మరో రూ.800 పొందగలరని అన్నారు. జిల్లాలోని బిసంకటక్, మునిగుడ, గుడారి, పద్మపూర్ ,రామనగుడ, కొలనార సమితుల్లో మే 20 నుంచి ధాన్యం మండీలు ప్రారంభమవ్వగా గుణుపూర్లో మే 28 నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సమావేశంలొ రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక జిల్లా స్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు. -
తీర ప్రాంతంలో భద్రత పెంపు
భువనేశ్వర్: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాష్ట్రంలో తీరప్రాంత భద్రతను కట్టుదిట్టం చేశారు. దేవీ నది ముఖద్వారం వెంబడి అస్తరంగ్ మైరెన్ పోలీసు దళాలు నావికా దళ అధికారులు, మైరెన్ పోలీసుల సంయుక్త బృందంతో పహారా నిర్వహించారు. నదిలో మత్స్యకారుల గుర్తింపును పహారా బృందం తనిఖీ చేస్తోంది. ఈ ప్రాంతంలో ఏదైనా అనుమానాస్పద కదలిక లేదా తెలియని వ్యక్తి సంచరిస్తే వారికి తెలియజేయాలని స్థానికుల్ని కోరారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లే ప్రతిసారీ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వారి మైరెన్ కార్డులు, వారి ఓటరు గుర్తింపు కార్డులను కూడా అడగాలని పోలీసు అధికారులు మత్స్యకారులకు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే సంప్రదించగల ఫోన్ నంబర్ను కూడా అధికారులు మత్స్యకారులకు అందజేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత దేవి నది ముఖద్వారం వద్ద భద్రతను పెంచారు. ఏదైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరిగినట్లు అనుమానం వస్తే తక్షణమే తెలియజేయాలని మత్స్యకారులను ఆదేశించినట్లు ఒక అధికారి తెలిపారు. -
వడగాడ్పులపై ఆరోగ్య శాఖ సమగ్ర సన్నాహాలు
భువనేశ్వర్: రాష్ట్రంలో వేసవి తాపం విపరీతంగా పెరుగుతోంది. తెల్లారితే గడప దాటడం కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో వడగాడ్పుల ప్రభావంతో వడదెబ్బ ప్రమాదాల తీవ్రత పట్ల రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. వడగాడ్పుల సమర్థమైన నిర్వహణతో అవాంఛనీయ సంఘటనల నివారణకు విభాగం ప్రాధాన్యత కల్పించింది. ఆరోగ్య శాఖాపరమైన ఏర్పాట్లతో సాధారణ ప్రజానీకంలో అవగాహన పెంపొందించాలనే దృక్పథంతో పరిస్థితుల్ని సమీక్షించారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ ఆదేశాల మేరకు వడగాడ్పుల నిర్వహణతో వడదెబ్బ ప్రమాదాల నివారణ కోసం అవసరమైన కార్యాచరణ, అనుబంధ ఏర్పాట్లు క్రమబద్ధీకరణకు ప్రజారోగ్య (డీపీహెచ్) డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. వడ గాలుల ప్రభావాలను తగ్గించడానికి ఇంట్రావీనస్ ద్రవాలు, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ఓఆర్ఎస్), మందులు, ఎయిర్ కూలర్లు, పవర్ బ్యాకప్ వ్యవస్థలు వంటి అవసరమైన వైద్య సామగ్రి నిరంతర లభ్యతను నిర్ధారించడానికి శాఖ కృషి చేస్తోందని తెలిపారు. వడదెబ్బ సంబంధిత బాధితుల సత్వర చికిత్స, వైద్యం కోసం ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని పడకలు ముందస్తుగా సిద్ధం చేయాలని రాష్ట్రంలో 30 జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. వడగాడ్పుల నిర్వహణపై దృష్టి సారించి సంబంధిత అనారోగ్యాలను నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ కార్యాచరణ కోసం ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ శిక్షణలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు మాత్రమే కాకుండా, స్థానిక ఆరోగ్య కార్యకర్తలు, సాధారణ ప్రజానీకానికి వేసవి తాపం సంబంధిత ఆరోగ్య సమస్యలకు త్వరగా మరియు సమర్థవంతంగా స్పందించడానికి వీలుగా శిక్షణ కల్పిస్తారు. దీనితో పాటు, వేడిగాలులతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి, వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడంపై ప్రజలకు ఆచరణాత్మక సలహాలను అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సమాచార, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ) ప్రచారం తీవ్రతరం చేస్తారు. తీవ్రమైన వేడి ప్రభావాన్ని తగ్గించడానికి సకాలంలో వైద్య సహాయం అందించడం, అవగాహన పెంచడం, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, వనరులు అందుబాటులో ఉన్నాయని సమీక్ష సమావేశంలో అధికారులు హామీ ఇచ్చారు. వేడి సంబంధిత వ్యాధుల నోడల్ అధికారి డాక్టర్ బసంత్ ప్రధాన్, రాష్ట్ర నిఘా అధికారి డాక్టర్ అశోక్ పాయిక్రాయ్, నర్సింగ్ అదనపు డైరెక్టర్ డాక్టర్ సెఫాలి మల్లిక్, డీఎఫ్డబ్ల్యూ అదనపు డైరెక్టర్ డాక్టర్ ప్రతిభా ప్రధాన్, అన్ని జిల్లాల నుండి ప్రధాన జిల్లా వైద్య అధికారులు (సీడీఎంఓలు) వ్యక్తిగతంగా, వర్చువల్ మోడ్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. -
చిత్రకొండ జలాశయంలో చేప పిల్లలు విడుదల
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితిలోని జలాశాయంలోకి కోటి రూపాయల విలువ చేసే చేపపిల్లలను జిల్లా మత్స్యశాఖ అధికారులు సోమవారం విడుదల చేశారు. సేతు యోజన పథకంలో భాగంగా వీటిని విడుదల చేసినట్టు జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్ జేన్నా తెలిపారు. సమితిలోని తొమ్మిది పంచాయతీలకు చెందిన ప్రజలు చి త్రకొండ జలాశయంలో చేపలవేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారన్నారు. చేప పిల్లలు పెరి గి పెద్దవి అయితే అధిక రాబడి వస్తుందన్నారు. విస్తరాకులు కుట్టిన కలెక్టర్ కొరాపుట్: నబరంగ్పూర్ కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో విస్తరాకులు కుట్టి మహిళలకు స్ఫూర్తినిచ్చారు. సోమవారం జిల్లాలోని పపడాహండి సమితి సెమ్లా గ్రామంలో ఒర్మాస్ సహాయ సహకారాలతో నడుస్తున్న మాత్రుశక్తి ప్రొడ్యూసర్ ఎంటర్ప్రైజెస్ను సందర్శించారు. అక్కడ ఉన్న విస్తరాకులను మిషన్ ద్వారా కుట్టి మహిళలను ఆశ్చర్య పరిచారు. నిలిచిన పపడాహండి– ఉమ్మర్కోట్ మార్గం కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా పపడాహండి–ఉమ్మర్ కోట్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ భారీ వాన కురిసింది. పపడా హండి సమీపంలో సాయుధ స్థూపం సమీపంలో కల్వర్టు నిర్మాణంలో ఉంది. వాహనాల రాకపోకల కోసం పక్కనే తాత్కాలిక రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు మొత్తం నీటితో నిండిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డెక్కిన ప్రజలు కొరాపుట్: విద్యుత్, తాగునీటి కోసం సోమవా రం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి ఒడియా పెంట గ్రామ పంచాయతీ కేంద్రంలో ప్రజలు రోడ్డెక్కారు. లక్ష్మీపూర్–టికిరి మార్గంలో రోడ్డుపై ఖాళీ కుండలతో ధర్నాకు దిగారు. విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. గ్రామంలో తాగునీటి సర ఫరా లేదని ఆరోపించారు. వెంటనే అధికారు లు అక్కడకు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ వైర్లు కలపి పునరుద్ధరించారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సునాలీ కార్జికి నాలుగో ర్యాంకు పర్లాకిమిడి: బరంపురం విశ్వవిద్యాలయం ప్లస్త్రీ పరీక్ష ఫలితాలు సోమవారం ప్రకటించింది. పర్లాకిమిడి మహిళా కళాశాల ప్లస్త్రీ డిగ్రీ విద్యార్థినులు సోషల్ సైన్సు విభాగంలో ర్యాంకులు సాధించారు. వారిలో ఒకరు సోనాలీ కార్జి సోషల్ సైన్సులో నాలుగో ర్యాంకు సాధించారు. పదో ర్యాంకును సునీతా ప్రధాన్ సాధించారు. వీరికి ప్రిన్సిపాల్ రీనా సాహు, అధ్యాపకురాలు ముధుస్మితా ప్రధాన్లు మెమోంటోలతో సత్కరించారు. -
హైటెక్ గ్రూప్ బిశ్వజిత్ పాణిగ్రాహికి సత్కారం
పర్లాకిమిడి: ఉన్నత విద్య, ఆరోగ్యశాఖలో అనేక విప్లమాత్మక మార్పులు తెచ్చిన ఒడిశాలోని హైటెక్ గ్రూప్ మెడికల్ కళాశాలల డైరక్టర్ బిశ్వజిత్ పాణిగ్రాహిని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ సంఘం మంత్రి డాక్టర్ ముఖేష్ మహలింగ సోమవారం భువనేశ్వర్లో మెమొంటోతో సత్కరించారు. భువనేశ్వర్లో జరిగిన కాన్క్లేవ్ ఒడిశా కార్యక్రమంలో బిశ్వజిత్ను సత్కరించారు. బిశ్వజిత్ పాణిగ్రాహి హైటెక్ మెడికల్ కళాశాలల మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి కుమారుడు. రూర్కెలా, భు భనేశ్వర్, తిరుపతిలో వైద్య కళాశాలలు నెలకొల్పిన చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి సంతానం సురేష్కుమార్ పాణిగ్రాహి. -
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మృతి
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. బాలాజీ (57) అనారో గ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ భాహీణి పతి, మున్సిపల్ మాజీ చైర్మన్ మీకాక్షి బాహీనీ పతి, జయపూర్ మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత తదితరులు కాాపువీధిలోని ఆయన స్వగృహానికి వచ్చిన బాలాజీ మృతదేహానికి నివాళులర్పి్ంచారు.అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కాగా బాలాజీ భార్య పి.రామలక్ష్మి 11వ వార్డు కౌన్సిలర్గా వ్యవహరిస్తున్నారు. పొలాల్లోకి కలుషిత నీరు కొరాపుట్: కలుషిత నీటితో పంట పొలాలు పాడవుతున్నాయి. కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డులో వేస్తున్నారు. కానీ మురుగు నీరు మాత్రం రంగబలి కుంబ చంపాగు సెంటర్ ప్రాంతాల వైపు వెళ్తోంది. ఆ ప్రాంతంలో పొలాల్లో నిల్వ ఉండిపోతోంది. ఈ నీరు వెళ్లే మార్గం మళ్లించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. బొడొనాలో డ్యామ్ సందర్శన రాయగడ: జిల్లాలోని కెందుగుడ ప్రాంతంలో గల బొడొనాలో డ్యామ్ను జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి సోమవారం సందర్శించారు. అక్కడ గల మత్సకారులతో కాసేపు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేటకు వెళ్లే మత్సకారులు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. చేపల వేటనే జీవనోపాధిగా బతకు బాటు కొనసాగిస్తున్న మత్సకారులకు అండగా ఉంటామన్నారు. డ్యామ్ నుంచి సేకరించిన చేపలను వీధుల్లో తిరిగి విక్రయించే మహిళలతో కాసేపు ముచ్చటించారు. ప్రభుత్వం మత్సకారులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుందర్గఢ్ దుళింగ బొగ్గు గనిలో ప్రమాదం భువనేశ్వర్: సుందర్గఢ్ దుళింగ బొగ్గు గనిలో సోమవారం ఉదయం ప్రమాదం సంభవించింది. ఆపరేటర్లకు తీసుకుని వెళ్తున్న బస్సు గనిలో బోల్తా పడింది. బస్సులో 30 మందికి పైగా ఆపరేటర్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి పైగా గాయపడ్డారు. చికిత్స కోసం క్షతగాత్రులను బ్రజ్రాజ్నగర్లోని ఆస్పత్రిలో చేర్చారు. మృతుడు పుడాపల్లి నివాసి నిత్యానంద ప్రధాన్గా గుర్తించారు. ఘటనా స్థలంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. -
భువనేశ్వర్ స్టేషన్ వద్ద హై అలర్ట్
భువనేశ్వర్: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో నగరంలో రైల్వేస్టేషన్ల వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా చర్యలు పటిష్టపరిచారు. ఆయా ప్రాంగణాల్లో ప్రయాణికులు, సిబ్బంది ఇతరేతర ప్రజలకు ఏమాత్రం భద్రత లోపించకుండా అవాంఛనీయ సంఘటనల నివారణకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లలో భాగంగా రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) సిబ్బంది సోమవారం స్థానిక రైల్వే స్టేషన్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫామ్ల వద్ద ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి లేదా ఏదైనా సందిగ్ధ సామాన్లు చూస్తే తెలియజేయాలని ప్రయాణికులకు ఆర్పీఎఫ్ అధికారు లు కోరారు. ప్రయాణికులను లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ పరిశీలనలో అధునాతన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ప్రయాణికుల కదలికలను పర్యవేక్షించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రవేశ, నిష్క్రమణ ప్రాంగణాలు, ప్లాట్ ఫారమ్, పార్కింగ్ ప్రాంతాల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆయా ప్రాంగణాల్లో నిఘాను బలోపేతం చేశారు. ప్రజల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. తనిఖీల సమయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలని, ఏవైనా లగేజీలు లేకపోవడాన్ని లేదా అనుమానాస్పద ప్రవర్తనను వెంటనే నివేదించాలని ప్రయాణికులను అభ్యర్థించారు. భద్రతా స్క్రీనింగ్ కోసం అవసరమైన అదనపు సమయం కేటాయించేందుకు ప్రయాణికులు స్టేషన్కు రైలు ప్రయాణం సమయం కంటే ముందుగానే స్టేషనుకు చేరుకోవాలని రక్షణ అధికారులు అభ్యర్థించారు. -
ముగిసిన రెడ్క్రాస్ శిక్షణ శిబిరం
జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి జూనియర్ రెడ్క్రాస్ శిక్షకుల శిక్షణ శిబిరం సోమవారం సాయంత్రం సెమిలిగుడ ఉన్నత పాఠశాలలో ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ప్రధమ కార్యక్రమంలో సాధన కర్మి రామచంద్ర పాల్హెచ్ఐబీ, ఎయిడ్స్లపై వివరించి వాటి నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలుప వివరించినట్లు వెల్లడించారు. ముగింపు కార్యక్రమంలో అగ్నిమాపక విభా గ అధికారి శ్రీపతి స్వైయ్ అగ్ని ప్రమాదాలలో బాధితులను రక్షించటంలో రెడ్ క్రాస్ కార్యకర్తలు అనుపరించాల్సిన పద్ధతులను వివరించారు. రాష్ట్ర జూనియర్ రెడ్క్రాస్ సాధన కర్మి యజ్ఞేశ్వర పండ ప్రకృతి ప్రమాదాలలో అనుసరించాల్సిన విధానాలు, బాధితుల రక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. జూనియర్ రెడ్క్రాస్ అధికారి హరేకృష్ణ మహారాణ అధ్యక్షతన రెండవ అధివేషన్ జరిగింది. కార్యక్రమంలో రెడ్క్రాస్ జీవిత కాల సభ్యులు షేక్ ఇబ్రహిమ్, జగన్నాథ్ విద్యాపీఠం, సునాబెడ ప్రధాన ఉపాధ్యాయులు సిద్దార్థ మహాపాత్రో రెడ్క్రాస్ ప్రాధాన్యతను వివరించారు. మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముగింపు కార్యక్రమంలో జ్యోతిరంజన్ నంద, సపన్ దీక్షిత్, తపన పొరిడ, సాహెబ్ పరవిన్, శుభక్ష్మిత సాహు, అశోక్ కుమార్ పవడ పాల్గొన్నారు. సెమిలిగుడ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విష్ణుప్రియ సామంతసింహార్ ధన్యవాదాలు తెలియజేశారు. -
ఓఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
రాయగడ: స్థానిక కొత్తస్టాండు వద్ద గల ఓఎస్ఆర్టీసీ కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గత 38 రోజులుగా ఓఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు డ్రైవర్లు, కండక్టర్లతోపాటు వారి కుటుంబ సభ్యులు ఆందోళన లో పాల్గొన్నారు. జీతభత్యాలు చెల్లించకపొవడంతోపాటు అసలు పనులు కల్పిస్తారో, లేదో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొందని వారంతా ఆరోపించా రు. రాయగడ ఓఎస్ఆర్టీసీ డిపో పరిధిలో రాయగ డ, కొరాపుట్ జిల్లాల ప్రయాణీకులకు బస్సు సేవ లు అందిస్తుండేవి. అత్యంత పాత బడిన బస్సుల ను నమామాత్రంగా నడిపిస్తున్న ప్రభుత్వం వాటి ఆలనాపాలనను పూర్తిగా మరిచిపోయింది. దీంతో బస్సుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గతకొద్ది రోజుల క్రితం డిపోలో నడుస్తున్న పాత బస్సులు కండీషన్ సరిగా లేకపోవడంతో పాటు ఫిట్నెస్ లేవని ఆర్టీఓ అధికారి బస్సులను రద్దు చేశారు. అప్పటి నుంచి బస్సులు నడవకపోవడంతొ పాటు బస్సుల్లో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు పనులు లేక ఖాళీగా ఉండేవారు. బస్సులను యథావిధిగా నడిపించడం లేదు సరికదా తమకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొనడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళనకు దిగారు. 2015లో రాయగడ ఓఎస్ఆర్టీసీ డిపో ఏర్పాటైంది. ఈ డిపో పరిధిలో రాయగడ, కొరాపుట్ జిల్లల్ల్లో 9 రూట్లలో 11 బస్సులు నడుస్తుండేవి. ఈ బస్సుల్లో పనిచేస్తున్న 14 మంది డ్రైవర్లు, 12 మంది కండక్టర్లు జీవనోపాధి పొందుతుండేవారు. -
ఏడుగురు సైబర్ మోసగాళ్లు అరెస్టు
భువనేశ్వర్: పూరీ నీలాద్రీ భక్త నివాస్ మోసపూరిత వెబ్సైట్ను సృష్టించి వసతి కల్పించడంలో యాత్రికులను మోసం చేసే ప్రయత్నంలో పాల్గొన్న ప్రధాన నింది తుడితో సహా ఏడుగురిని రాష్ట్ర క్రైమ్ (సీఐడీ సైబర్ క్రైమ్) యూనిట్ విజయవంతంగా అరెస్టు చేసింద ని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్తోష్ మిశ్రా విలేకర్లకు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తుల్లో ప్రధాన నిందితుడు అన్షుమాన్ శర్మ (24)గా గుర్తించారు. మిగిలిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన అరవింద్ కుమార్ (35), ఆకాష్ కేశర్వాణి (33), గుజరాత్ కు చెందిన హితేష్భాయ్ పాత్రో (39), పార్థ్ పర్మా ర్ (25), ఠక్కర్ కర్సాంజి శోభాజీ (48), కురేషి మహ్మద్ అస్లాం (31) ఉన్నారు. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయ ప్రధాన నిర్వాహకుడి (సీఏఓ) లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నకిలీ వెబ్సైట్ సృష్టించి పుణ్య క్షేత్రం పూరీలో వసతి సదుపాయం కల్పిస్తా మని మోసగిస్తున్నట్లు ప్రజలు, భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు దాఖలు కావడంతో చర్యలు తీసుకోవా లని శ్రీ మందిరం సీఏఓ ఫిర్యాదు రాష్ట్ర క్రైం శాఖకు ఫిర్యాదు చేశారు. అమాయకపు యాత్రికులను వాట్సాప్ ద్వారా మొబైలు నంబరుకు పూరీ పుణ్య క్షేత్రంలో నీలాద్రి భక్త నివాస్లో వసతి సదుపా యం ఖరారు చేసినట్లు మోసగించి ఆన్లైన్లో చెల్లింపులు ప్రేరేపించి మోసాలకు పాల్పడుతున్న ట్లు ఫిర్యాదులో వివరించారు. మోసగాళ్లు కెనరా బ్యాంకులోని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా (ఖాతా నంబర్: 110217193478) లోకి చెల్లింపులు స్వీకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నా రు. అన్షుమాన్ శర్మ వెబ్సైట్ను మే 22, 2024న సృష్టించాడని తేలింది. ఫిర్యాదు నమోదైన వెంటనే ఆ మోసపూరిత సైట్ను తొలగించారు. అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాను ఉపయోగించిన మరో సహచరుడు అరవింద్ కుమార్ను కూడా దర్యాప్తులో గుర్తించారు. అరెస్టు చేసిన అనుమానితుల నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నీలాద్రి భక్త నివాస్ వెబ్సైట్కు సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, గోడాడీ హోస్టింగ్ సమాచారం, వెబ్సైట్ను రూపొందించడానికి ఉపయోగించిన రిజిస్టర్డ్ సిమ్ కార్డ్తో సహా అనేక వస్తువులను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఈ మోసపూరిత వ్యవహారంలో 4 వేర్వేరు కేసులు దాఖలు చేశారు. వీటి దర్యాప్తు కొనసాగించడానికి 2 దర్యాప్తు బృందాలను గుజరాత్ (అహ్మదాబాద్, ఆనంద్ జిల్లా, సూరత్) ఉత్తరప్రదేశ్కు పంపారు. రూ.1.28 కోట్లు మోసం గుజరాత్లోని సూరత్కు చెందిన హితేష్భాయ్ పాత్రో (39) ఖాతాలో నేరుగా రూ. 27 లక్షలు జమ అయిన ఆధారంతో ఆయనను అరెస్టు చేశారు. 6 చెక్ పుస్తకాలు, 31 డెబిట్/క్రెడిట్ కార్డులు, నకిలీ కంపెనీల 13 రబ్బరు స్టాంపులు, 12 మొబైల్ హ్యాండ్సెట్లు, సిమ్ కార్డులు, 4 పెన్ డ్రైవ్లు ఎనిమిది ప్రభుత్వ, ప్రభుత్వేతర ఐడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో సమగ్రంగా రూ.1.28 కోట్లు భారీ మోసం బట్టబయలైందని డీజీ పేర్కొన్నారు. రూ. 7.5 కోట్లు భారీ మోసం ఈ మోసం వ్యవహారంలో అహ్మదాబాద్కు చెందిన పార్థ్ పర్మార్ (25) ప్రాథమిక ఖాతాదారుడిగా వ్యవహరించినట్లు ధృవీకరించి అరెస్టు చేశారు. అతని ఖాతాలో ప్రత్యక్షంగా రూ. 25 లక్షలు జమ అయినట్లు పేర్కొన్నారు. పోలీసులు అతని మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డును స్వాధీనం చేసుకుని కొనసాగించిన దర్యాప్తులో మోసం పరిమాణం రూ.7.5 కోట్లుగా తేలింది. రూ. 87.8 లక్షల మోసం ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గుజరాత్లోని బనస్కాంతకు చెందిన ఠక్కర్ కర్సాంజీ శోభాజీ (48) తన ఖాతాలో రూ. 9.3 లక్షలు జమ చేసినట్లు గుర్తించడంతో ఈ డొంక కదిలింది. గుజరాత్లోని ఖేడా జిల్లాకు చెందిన కురేషి మొహమ్మద్ అస్లాం (31) ఖాతాలో రూ. 6 లక్షలు జమ అయినట్లు తేలింది. వీరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 1.4 కోట్లు మోసం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఆకాష్ కేషర్వానీ (33) ఖాతాకు రూ. 3.7 లక్షలు బదిలీ ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయి. తదుపరి దర్యాప్తులో ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలలో అదనపు కరెంట్ ఖాతాల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేరంలో ఇతర భాగస్వాములను, దాని ట్రాన్స్ ఇండియా పరిణామాలను, డబ్బు జాడను దర్యాప్తు బృందం కనుగొంటుందని తెలిపారు. -
వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు
కొరాపుట్: ఈ నెల రెండో వారంలో కేంద్రం తెచ్చిన వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి పేర్కొన్నారు. సోమవారం కలహండి జిల్లా భవానిపట్న లో ఇండియన్ ఫుడ్ పార్క్లో జరిగిన బీజేపీ వర్క్ షాప్లో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ బిల్లు లోక్ సభ, రాజ్యసభలలో అనుమతి పొందిందన్నారు. వక్ఫ్ రూల్స్ వలన ముస్లిం సోదరులు, సోదరీ మణులు గతంలో చాలా ఇబ్బందులు పడ్డా రన్నారు. ఇకపై ఆ కష్టాలు ఉండవని చెప్పారు. పేద ముస్లిం లకు ఈ బిల్లు ప్రస్తుతం సహాయం చేస్తుందని బలబద్ర మజ్జి పేర్కోన్నారు.ఈ సమావేవంలో కలహండి ఎంపీ రాజమాత మాళవిక దేవి, ఎంఎల్ ఎ సుదీర్ రంజన్ పఠజోషిలు పాల్గోన్నారు. -
ఘనంగా చాంబర్ ఆఫ్ కామర్స్ స్వర్ణోత్సవాలు
కొరాపుట్: జయపూర్ చాంబార్ ఆఫ్ కామర్స్ స్వర్ణోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. కొరపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి భద్రతలు బాగుంటే వర్తక వాణిజ్య రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవానికి సంబంధించి సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీని పతి, మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత, ప్రెసిడెంట్ ప్రభాకర్, సెక్రటరీ డి.మాధవ, సలహాదారుడు శశి పట్నాయక్, అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి వచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కడ్రక ఔదార్యం
రాయగడ: రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్ర క మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కొందరు వృద్ధులు సోమవారం మధ్యా హ్నం నడుచుకుంటూ వెళుతుండటం చూసి తన వాహనాన్ని ఆపి వారిని కలిశారు. ఎక్కడకు వెళుతు న్నారని ఆరా తీశారు. ఇంత ఎండలో నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏమిటని అడిగారు. తా ము సదరు సమితి పరిధి తడమ పంచాయతీలోని లుహాకాల్ గ్రామం నుంచి వచ్చామని వారంతా సమాధానం చెప్పారు. పింఛన్ తీసుకునేందుకు తా మంతా 11 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామని వివరించారు. ఆటో కొసం పడికాపులు కాచినప్పటి కీ లభించకపోవడంతో గత్యంతరం లేక నడుచుకుంటూ సమీపంలోని కొత్తబస్టాండుకు వెళుతున్నామని చెప్పారు. వివరాలు సేకరించిన ఎంఎల్ఏ కడ్రక ఆటోలను రప్పించి వారి వారి గ్రామాలకు తరలించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పెన్సన్ ను ఇటువంటి తరహా వృధ్దులకు ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చే సౌకర్యం కల్పించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని ఈ సందర్భంగా కడ్రక చెప్పారు. -
మధుసూదన్ జయంతి వేడుకలు
పర్లాకిమిడి: ఉత్కళ గౌరవ్ మధుసూదన్దాస్ జయంతిని పర్లాకిమిడి జిల్లా కోర్టులో లాయర్స్డే గా సోమ వారం జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికారణ అధ్యక్షులు ప్రణబ్ కుమార్ రౌత్రాయ్, ముఖ్యవక్తగా ఎస్.కె.సి.జి.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జితేంద్ర పట్నాయక్, అదనపు జిల్లా జడ్జి ప్రదీప్కుమార్ సోనాల, ఫ్యామిలీ కోర్టు జడ్జి అశోక్ కుమార్ పాహి, జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రౌవు లో, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జితేంద్ర కుమార్ పట్నాయక్, కార్యదర్శి పృఽథ్వీరాజ్, వినియోగదారుల ఫోరం అధ్యక్షులు రాజేంద్రపండా హాజరయ్యారు. మధుసూదన్ దాస్ ఒడిశాకు ప్రథమ పట్టభద్రులు, ప్రథమ లాయర్గా పనిచేశారని వక్తలు గుర్తు చేశారు. స్వతంత్ర ఒడిశా పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారని జిల్లా జడ్జి ప్రణబ్కుమార్ రౌత్రాయ్ అన్నారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్కళ గౌరవ మాధుసూదన్ దాస్ జయంతిని జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ జిల్లా జడ్జి శాంతాన్ కుమార్ దాస్ హాజరై మాధుసూదన్ దాస్ విగ్రహాని కి పూలమాలాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 40 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. పలువురు లాయర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అలానే ఉచిత వైద్య సేవలు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీత్పాల్ సింగ్, గోవిందపాత్రో, గోపాల్పండ పాల్గొన్నారు. రాయగడ: ఉత్కళ గౌరవ్ మధుసూదన్ దాస్ చిరస్మరణీయుడని వక్తలు కొనియాడారు. మధుసూదన్ దాస్ 177వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయగడ బార్ అసొసియేషన్ అధ్యక్షుడు దేవి ప్రసాద్ పట్నాయక్, న్యాయవాదులు బ్రజసుందర్ నాయక్, బాబు రాజ్గురు పాల్గొన్నారు. అలాగే స్థానిక యూజీఎంఐటీ ఇనిస్టిట్యూట్లో సిబ్బంది కూడా మధుసూదన్ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భువనేశ్వర్: ఉత్కళ గౌరవ్ మధుసూదన్ దాస్ 177వ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, విపక్ష నేత నవీన్ పట్నాయక్, వివిధ సామాజిక, సాంస్కృతిక సంస్థలు సహా పార్టీలకు అతీతంగా ఆయనకు నివాళులర్పించారు. స్థానిక రాజ్ భవన్ స్క్వేర్ వద్ద ఉన్న ఉత్కల్ గౌరవ్ విగ్రహం దగ్గర వివిధ రంగాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర శాసన సభ ఆవరణలో మధు బాబు నిలువెత్తు విగ్రహం దగ్గర స్పీకరు, ముఖ్యమంత్రి ఇతర మంత్రులు, శాసన సభ సభ్యులు ఇతరేతర ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నివాళులు అర్పించింది. ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. మధుబాబు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రత్యేక ఒడిశా ప్రావిన్స్ ఏర్పాటు, రాష్ట్ర పారిశ్రామికీకరణ, ఒడియా భాషా రక్షణకు ఆయన చేసిన అసమానమైన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ప్రతిపక్ష నాయకుడు మరియు బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తెలిపారు. -
పారాదీప్లో అగ్ని ప్రమాదం
భువనేశ్వర్: పారాదీప్ జీరో పాయింట్ ప్రాంతం స్టాక్ యార్డ్లో సోమవారం భయానక అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ పూతతో కూడిన ఇనుప పైపుల పోగులో మంటలు చెలరేగాయి. 10 యూనిట్లు పైబడి కుజంగ్ అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటలను అదుపు చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) చమురు పైప్ లైన్ వేయడం జరుగుతోంది. మంటల్లో కోట్లాది రూపాయల విలువైన పైపులు కాలి బూడిదయ్యాయి. ఈ పైపులు ద్రవ పెట్రోలియం ఉత్పత్తులను భూగర్భం గుండా రవాణా చేయడానికి ఉద్దేశించినవి. జగత్సింగ్పూర్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంటు, స్థానిక ఠాణా ఇనస్పెక్టరు ఇంచార్జి ప్రత్యక్షంగా ఘటనా స్థలం సందర్శించారు. ప్రమాదం తీవ్రతని సమీక్షించారు. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత దానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేశామని అధికారులు తెలిపారు. -
కర్ణపాడులో ఏనుగుల బీభత్సం
రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి కర్ణపాడు గ్రామంలో ఆదివారం రాత్రి రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో గల గొట్టపు బావిని పీకిపారేశాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులు చెంది బితుకుబితుకుమంటూ రాత్రంతా గడిపారు. అనంతరం గ్రామంలో గల అరటి, మామిడి, పనస చెట్లను ధ్వంసం చేశాయి. సమాచారం తెలుసుకున్న సికరపాయి అటవీ శాఖ ఫారెస్టర్ పీకే జెన్న, వన రక్షకుడు రామ సామల్ సంఘటన జరిగిన గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన బాధిత కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు. సేకరించిన వివరాలను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నయవంచకుడిపై పోలీసులకు ఫిర్యాదు కొరాపుట్: ప్రేమ పేరుతో నమ్మించి 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేసి పరారైన నయవంచకుడిపై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న హిర్లి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల గిరిజన బాలికను ప్రేమ పేరుతో అదే ప్రాంతానికి చెందిన షేక్ అలం హుస్సేన్ నమ్మించాడు. నిజమని నమ్మిన బాలిక అతనికి సర్వం అర్పించడంతో గర్భం దాల్చింది. అయితే అనంతరం అతను కనిపించకుండా పోవడంతో స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించింది. వారి సహకారంతో స్థానిక పోలీస్ స్టేషన్లో షేక్ అలం హుస్సేన్పై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఘాట్ రోడ్డులో లారీ బోల్తా కొరాపుట్: ఘాట్ రోడ్డులో కర్రల లోడుతో ఉన్న లారీ బోల్తా పడింది. సోమవారం కొరాపుట్–జయపూర్ మార్గంలో ఘాట్ రోడ్డులో మలుపు వద్ద ఏపీ 35 0588 నంబర్ గల లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దాంతో కర్రలు రోడ్డుకి అడ్డంగా పడ్డాయి. వాహనాలు దారి లేక ఆగిపోయాయి. వెంటనే లారీ సిబ్బంది అడ్డంగా ఉన్న కర్రలు తొలగించి మార్గం సుగమం చేశారు. కాశీపూర్లో ఇద్దరు ఆత్మహత్య రాయగడ : జిల్లాలోని కాశీపూర్ సమితి టికిరి పంచాయతీలోని వివాహిత కాంచన్ మాఝి (20 ) ఉరి వేసుకుని ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఆమెకు ఏడాది కిందట కంసారిగుడ గ్రామానికి చెందిన మున్నా మాఝితో వివాహమైంది. భార్యభర్తల మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో ఆమె తన అక్క వద్ద ఉంటోంది. ఆదివారం నాడు కూలి పనులకు వెళ్లిన కాంచన ఇంటికి తిరిగి రాకపొవడంతో అక్క వెతికింది. సమీపంలొ గల ఒక చెట్టు కొమ్మకు వేలాడుతూ కాంచన మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అదే రోజున కాశీపూర్ గ్రామంలోని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కాశీపూర్ అటవీ శాఖ రేంజ్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బాలిక మతిస్థిమితం బాగులేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
ఎంపీ పర్యటనపై ఉద్రిక్తత
జయపురం, కొరాపుట్: కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క జయపూర్ పర్యటనపై ఉద్రిక్తత నెలకొంది. ఒక్క సారిగా శాంతి భద్రతల సమస్య రేగింది. ఇటీవల పార్లమెంట్లో జరిగిన వక్ఫ్ బోర్డు వ్యతిరేక బిల్లు పై జరిగిన ఓటింగ్ లో పార్టీ ఆదేశానుసారం వ్యతిరేకంగా ఉల్క ఓటు వేశారు. దాన్ని నిరసిస్తూ జయపూర్లో హిందూ పరివార్ వర్గాలు ఆయన జయపూర్ పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించాయి. ముందస్తుగా గమనించిన ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను హెచ్చరించారు. వెంటనే జయపూర్ పట్టణ పోలీసులు వారిని అదుపు లోనికి తీసుకున్నారు. ఒక్కటైన ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఇంత వరకు ఎంపీ ఉల్కకి స్థానిక ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి వర్గాలకు సరిపడేది కాదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే వర్గం ఎంపీకి అండగా నిలిచింది. ఎమ్మెల్యే అనుచరులు బైక్ ర్యాలీ ద్వారా ఎంపీ ఉల్కకి స్వాగతం పలికారు. జయపూర్ మెయిన్ రోడ్డులో గల కాంగ్రెస్ కార్యాలయంలో భారీ ఎత్తున కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్ణయం శిరోధార్యం పార్టీ నిర్ణయం ప్రకారం వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశానని, రాజ్యంగ స్ఫూర్తి ప్రకారం నడుచుకున్నానని ఉల్క తెలిపారు. పెహల్గాంలో టెర్రరిస్టులు జరిపిన హత్యాకాండ అమానుషమని అన్నారు. ఇలాంటి హింసని ఏమాత్రం అంగీకరించకూడదన్నారు. మీరేనా హిందువులు...నేను కాదా ఎంపీని అడ్డుకొంటామని హెచ్చరించిన వారే హిందువులా.. మరి నేను కాదా అంటూ ఎమ్మెల్యే అన్నారు. అవసరమైతే పోరాటానికి వెనుకాడబోమన్నారు. -
ట్రక్కులో రూ.కోటి విలువైన గంజాయి జప్తు
భువనేశ్వర్: నగరం గుండా గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో సోమవారం ఒక ట్రక్కు లోడు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా అవుతున్న ఈ సరుకు మార్కెట్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. పుల్బణీ జిల్లా నుంచి హిమాచల్ ప్రదేశ్కు ట్రక్కులో ఈ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఆకస్మిక దాడిలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టుబడింది. గంజాయిని ట్రక్కుకు లోడ్ చేసిన ప్యాకెట్లలో రహస్యంగా చుట్టి ఉన్నట్లు తేలింది. ఈ దాడిలో 5 క్వింటాళ్లకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఈ మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది. -
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి
పర్లాకిమిడి: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను కూడళ్లలో ప్రతిష్టించి ఆరాధించే కంటే ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని దళిత సమాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.బాలక్రిష్ణ అన్నారు. అంబేడ్కర్ సమ్మాన్ అభియాన్ పేరిట భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక టౌన్ హాలులో బీజేపీ జిల్లా అధ్యక్షులు నవకిశోర్ శోబోరో ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా కోరాపుట్ ఎంపీ అభ్యర్థి కాళీరాం మఝి విచ్చేసి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. గౌరవ అతిథులుగా కొరాపుట్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, సుమంత్ కుమార్ ప్రధాన్, స్వస్థంబ్ మాజీ కార్యదర్శి జమానా కర్రెయ్య, రజక వికాస్ పరిషత్ అధ్యక్షులు కె.మోహన్రావు, బీజేపీ జిల్లా సాధారణ కార్యదర్శి జగన్నాథమహాపాత్రో పాల్గొన్నారు. అంబేడ్కర్ పేద కుటుంబంలో పుట్టినా ఆయన అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాడని జమానా కర్రెయ్య అన్నారు. భారత రాజ్యాంగం రూపొందించిన అంబేద్కర్తోనే వెనుకబడిన జాతులు, కులాలు ఈరోజు ఉన్నత స్థాయికి చేరుకున్నాయని కె.మోహన్రావు అన్నారు. కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో అధ్యక్షత వహించగా నృసింహ చరణ్ పట్నాయక్, ఛిత్రిసింహాద్రి సహకరించారు. -
కొండలెక్కి.. వాగులు దాటి
కొరాపుట్: దండకారణ్యంలోని దుర్గమ అటవీ ప్రాంతాలలో ఉండే గిరిజన గూడేంలను లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత సందర్శించారు. ఆదివారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి గౌడుగుడ గ్రామ పంచాయతీ లచ్చమణి, తులమట్టంగి, ఉప్పర్ మట్టంగి గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాలకు రోడ్డు మార్గం లేదు. కనీసం బైక్ వెళ్లడానికి కూడా అవకాశం లేదు. దీంతో ఎమ్మెల్యే కాలి నడకన కొండలు ఎక్కి, వాగులు దాటి గ్రామాలకు చేరుకున్నారు. పలు చోట్ల గిరిజనులతో మీటింగ్లు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల ముందు ఉన్న అరుగులే వేదికలయ్యాయి. స్వాతంత్య్ర అనంతరం ఇంత వరకు ఆ గ్రామాలకు ఎవరూ వెళ్లలేదు. పవిత్ర శాంత తొలి ఎమ్మెల్యే. తులమట్టంగి వద్ద ఉన్న పెద్ద జలపాతాన్ని కూడా సందర్శించి రోడ్డు వేయాలని పర్యాటక శాఖకు లేఖ రాశారు. -
చిరుత, ఎలుగు దాడులు
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా రాయగర్ సమితి కేంద్రానికి సరిహద్దులోని సరోనా ప్రాంతం అచిడోంగ్రి గ్రామంలోకి ఆదివారం చిరుత పులి ప్రవేశించింది. వీధిలో ఆడుకుంటున్న చిన్నారి బాలుడిపై దాడికి తెగబడింది. పిల్లవాడు భయంతో కేకలు వేయగా గిరిజనులు ఆయుధాలతో పులి పై దాడి చేశారు. వెంటనే ఆ బాలుడిని వదిలి అడవిలోకి పారిపోయింది. బాధితుడిని కాంకేర్ లోని కోమ్లాదేవి ఆస్పత్రికి తరలించారు. వేర్వేరు చోట ఎలుగు బంట్లు దాడులు ఆదివారం నబరంగ్ఫూర్ జిల్లా రాయగర్ సమితి కుసుంపూర్ గిరిజన గ్రామానికి చెందిన రాములు గొండో మెంతి ఆకులు సేకరణకు అడవి లోనికి వెళ్లింది. ఒక ఎలుగు బంటి వెనక నుంచి దాడి చేసి కాలు,భుజం మీద గాయ పరిచింది. భయంతో రాములు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గిరిజనుల రక్షించారు. హత్తిగావ్ పంచాయతీ లెండి గ్రామానికి చెందిన శంకర్ గొండో అడవిలో మెంతి ఆకుల సేకరణకి వెళ్లాడు. అతనిపై కూడా వేరే ఎలుగు బంటి దాడి చేసింది. సహచరులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరినీ రాయగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్తిగాం అటవీ ప్రాంతంలో ఎలుగు బంట్లు అధికంగా వచ్చాయని అటవీ శాఖ అధికారులు సమీప గ్రామాల్లో హెచ్చరికలు చేశారు. కానీ గిరిజనులు జీవనోపాధి కోసం తేనె, కలప, గుగ్గిలం, మెంతి ఆకుల సేకరణ కి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. -
భక్తులకు మజ్జిగ వితరణ
రాయగడ: స్థానిక మణిద్వీప మహిళా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగౌరీ మందిరం ప్రాంగణంలో ఆదివారం మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మజ్జిగౌరీ అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టినట్లు క్లబ్ అధ్యక్షురాలు మరాటం సుజన తెలిపారు. ఆదివారం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో క్లబ్ ద్వారా సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను తమ క్లబ్ తరచూ నిర్వహిస్తుందని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వి.స్వాతి, కోశాధికారి కె.లావణ్య, సహాయ కార్యదర్శి కె.సుహాసిని, సభ్యులు కింతలి జ్యోతిర్మణి, క్రిష్ణవేణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.పాము కాటుతో వ్యక్తి మృతి మల్కన్గిరి: పాముకాటుతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కన్గిరి జిల్లా పోడియా సమితి మాటేర్ పంచాయతీ కుమారగూడ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకోగా బీమా మాడీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేందు ఆకులు (బీడీ ఆకులు) తీయడం కోసం బీమా మాడీ సమీప అడవికి వెళ్లాడు. కింద పడిపోయిన ఆకులు తీస్తుండగా అందులో ఉన్న విష సర్పం కాటు వేసింది. భయంతో కేకలు వేయగా సమీపంలో ఉన్న వారు అక్కడకు చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. బాధితుడిని పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు..అప్పటికే బీమా మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతిని భార్య ఫిర్యాదు మేరకు పోడియా పోలీసుస్టేషన్ అధికారి నిరోధ్ కుమార్ బాష్ ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్యామ్లో పడి యువకుడు.. కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో చంపాపుట్ గ్రామానికి చెందిన బలరాం దురువా (40) ఆదివారం మాచ్ఖండ్ నది పరిధిలోని జాలా పుట్ డ్యామ్లో పడి మృతి చెందాడు. నందపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది మృతదేహాన్ని డ్యామ్ నుంచి వెలుపలికి తీశారు. పాడువా పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.గూడ్స్ రైలులో మంటలు రాయగడ: రాయిపూర్ నుంచి విశాఖపట్నం పోర్టుకు బొగ్గులోడుతో వెళుతున్న గూడ్స్రైలులో మంటలు చెలరేగాయి. శనివారం సాయంత్రం ఈ ఘటన జిల్లాలోని బిసంకటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రాయిపూర్ నుంచి బొగ్గు లోడుతో వస్తున్న గూడ్స్ బిసంకటక్ రైల్వే స్టేషన్లో కొద్దిసేపు నిలిచింది. కొంతసేపటికి ఒక బోగీ నుంచి పొగలు రావడం గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే స్టేషన్ మాస్టార్కు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఆయన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగుపాటుకు పశువులు మృతి రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్లో పిడుగుపాటుకు మూడు పశువులు మృతి చెందాయి. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతొ కూడిన వర్షం కురిసింది. ఇంటిముందు ఉన్న చెట్టు కింద పశువులు పచ్చిక మేస్తున్న సమయంలో చెట్టుపై పిడుగు పడింది. దీంతో కింద ఉన్న తమ పశువులు మృతి చెందాయని బాధితులు ఘాసి భొత్ర, సుందర్ కౌసల్యలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
వేర్వేరు సంఘటనల్లో నలుగురు జల సమాధి
భువనేశ్వర్: రాష్ట్రంలో రెండు వేర్వేరు సంఘటనలలో నలుగురు బాలురు జల సమాధి అయ్యారు. ఆదివారం ఆయా ప్రాంతాల్లో విషాదం అలుముకుంది. కటక్, నయాగఢ్ జిల్లాల్లో ఈ విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. నయాగఢ్ జిల్లా దస్పల్లా పోలీస్ ఠాణా పరిధి గోడిబిడ గ్రామంలో ముగ్గురు బాలురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు ముగ్గురు చెరువులో స్నానం చేస్తూ దురదృష్టవశాత్తు నీట మునిగారు. బాలురును బహదఖల పొడా సాహికి చెందిన 9 ఏళ్ల శుభ ఖిలార్, ఉమాకాంత్ నాయక్, నువాగాంవ్ పోలీస్ ఠాణా పరిధిలోని ఖలమడ గ్రామానికి చెందిన 11 ఏళ్ల ఏళ్ల రితేష్ ప్రధాన్గా గుర్తించారు. ఈ ముగ్గురినీ వెలికి తీసి దసపల్లా మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడికి చేరుకునే లోపే వీరంతా మరణించారని వైద్యులు ప్రకటించారు. కఠొజొడి నదిలో బాలుడు గల్లంతు కటక్లోని ఖాన్ నగర్ సమీపంలోని కఠొజొడి నదిలో కొట్టుకుపోయి 14 ఏళ్ల మైనర్ బాలుడు సూర్యకాంత్ మాఝీ గల్లంతయ్యాడు. నగరంలోని బేతాబింధాని సాహికి చెందిన సూర్యకాంత్ స్నానం చేస్తుండగా బలమైన ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి బాలుని గాలించి ఖాన్ నగర్ రైల్వే వంతెన సమీపంలోని నది నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్రంలో అకాల వర్షాలు
● 9 జిల్లాలకు ఐఎండీ నారింజ రంగు, 21 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ భువనేశ్వర్: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కేంద్రం రాష్ట్రంలోని 30 జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసింది. 9 జిల్లాలకు నారింజ, 21 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మే నెల 1వ తేదీ వరకు ఈ వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుందని భావిస్తున్నారు. నారింజ హెచ్చరిక సుందర్గఢ్, కెంజొహర్, మయూర్భంజ్, బాలాసోర్, భద్రక్, గజపతి, గంజాం, రాయగడ మరియు కొరాపుట్ జిల్లాల్లో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలుల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. పసుపు హెచ్చరిక జాజ్పూర్, కేంద్రాపడా, కటక్, జగత్సింగ్పూర్, ఝార్సుగుడ, బర్గడ్, సంబల్పూర్, దేవ్గడ్, అంగుల్, ఢెంకనాల్, పూరీ, ఖుర్దా, నయాగడ్, సోన్పూర్, బౌధ్, నువాపడా, బొలంగీర్, కలహండి, కంధమల్, నవరంగ్పూర్, మల్కన్గిరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసే అవకాశం ఉంది. -
గుప్తేశ్వరంలో ఎంపీ పర్యటన
కొరాపుట్: సహజసిద్ధ పుణ్య క్షేత్రం గుప్తేశ్వరంలో నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి పర్యటించారు. ఆదివారం ఉదయం కొరాపుట్ జిల్లా బొయిపరి గుడ సమితి రామగిరి పంచాయతీలో ఉన్న ఈ క్షేత్రం సందర్శించారు. అక్కడ జరుగుతున్న క్షేత్ర అభివృద్ధి పనుల పురోగతి సమీక్షించారు. సత్వరం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని దండకారణ్య కొండల్లో నివసిస్తున్న గిరిజనులకు ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేశారు. పర్యటనలో కొట్పాడ్ ఎమ్మెల్యే రుఫుదర్ బోత్ర, పార్టీ నాయకులు,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
29, 30 తేదీల్లో చందనోత్సవాలు
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల అమలాభట్టకు సమీపంలో ఉన్న శ్రీక్షేత్ర టౌన్షిప్లో కొలువై ఉన్న శ్రీలక్ష్మీ నృసింహ ఆలయంలో ఈ నెల 29, 30వ తేదీల్లో అక్షయ తృతీయను పురస్కరించుకుని చందనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాథ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 30న ఉదయం ఏడు గంటలకు చందనాభిషేకం, తీర్థ ప్రసాద సేవ కార్యక్రమాలు అలాగే సాయంత్రం 6 గంటల నుంచి శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. -
పాక్ మహిళ తిరుగు ప్రయాణం
భువనేశ్వర్: పాకిస్తాన్ జాతీయురాలు నగ్మా యూసుఫ్ ఆదివారం భువనేశ్వర్ నుంచి బయలుదేరింది. స్వదేశానికి తిరిగి పంపడానికి ఇక్కడి అధికారులు గుర్తించిన పొరుగు దేశానికి చెందిన 12 మంది పాకిస్తాన్ పౌరులలో ఆమె ఒకరు. 2008 సంవత్సరంలో భారతీయ పౌరుడు మొహమ్మద్ నిజాముద్దీన్ను వివాహం చేసుకుంది. తర్వాత ఆమె దీర్ఘకాలిక వీసాపై స్థానిక బీజేబీ నగర్ ప్రాంతంలో నివసిస్తోంది. వీసా పునరుద్ధరణ కోసం చేసిన దరఖాస్తులు తిరస్కరించిన తర్వాత ఆమె ఇటీవలే విజిటర్ వీసా పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విజిటర్ వీసా గడువు ముగియడానికి కొన్ని రోజుల ముందుగా ఆమె కమిషనరేట్ పోలీస్లోని విదేశీయుల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఆ దరఖాస్తు పెండింగ్లో ఉంది. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ పచ్చిక బయళ్లలో పర్యాటకులపై జరిగిన దారుణమైన దాడిలో 26 మంది మరణించిన తర్వాత కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆమె దేశం విడిచి వెళ్లమని కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తును ఆమోదించింది. 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లమని ఆమెకు నోటీసు ఇచ్చింది. సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కొరాపుట్: సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని దసరాపొద నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లే మార్గంలో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు సంఘం అధ్యక్షుడు రాధా నాధ్ బెహరా ఆదివారం ప్రారంభ పూజలు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి భూమి పూజ చేశారు. గత ఎమ్మెల్యే సదాశివ ప్రదాని తన కోటా నిధులు రు.4 లక్షలు ఇవ్వగా ప్రస్తత ఎమ్మెల్యే గౌరీ మరో రు.4 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ భవనం కోసం ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఇంటికి కూరలు తేవాలి కదా..! కొరాపుట్: దేశానికి రాజైనా ఇంటికి యజమానే కదా. సోమవారం నబరంగ్పూర్ ఎంపీ బలబద్ర మజ్జి రాయగడ జిల్లా పర్యటనకి పయనమయ్యారు. మార్గ మధ్యంలో ఆకు కూరలు కనిపించాయి. తన కాన్వాయ్ ఆపించి వాటిని బేరమాడి కొనుక్కున్నారు. నిత్య ప్రజా జీవితంలో సతమతమవుతున్నప్పటికీ తాను కూడా ఒక ఇంటికి యజమాని అని గుర్తుకు తెచ్చుకొని ఆ ఆకుకూరలు సంచిలో వేసుకొని బయలు దేరారు. -
విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులు
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. 12 గంటలు గడిచినా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు విమానాశ్రయం గేట్ల ముందు గందరగోళం సృష్టించారు. వాతావరణం సమస్యల కారణంగా శనివారం రాత్రి ఢిల్లీ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసరంగా స్థానిక విమానాశ్రయంలో ఆగింది. వాతావరణం మెరుగుపడినప్పటికీ ఆ విమానయాన సంస్థల విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించలేదనే ఆరోపణతో ప్రయాణికులు నిరసన ప్రదర్శించారు. వాతావరణ మార్పు కారణంగా 8 విమానయాన సంస్థల విమానాలు స్థానిక విమానాశ్రయంలో నిలిచి పోయాయి. వాతావరణం కుదుట పడిన తర్వాత 6 విమానాలు తమ ప్రయాణికులతో పాటు గమ్య స్థానాలకు బయల్దేరాయి. మిగిలిన రెండు విమానాలు బయల్దేరక పోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 12 గంటలకు పైగా చిక్కుకుపోయిన తర్వాత ప్రయాణికులు సమస్యలను ఎదుర్కొనడంతో గొడవకు దిగారు. ఆగ్రహించిన ప్రయాణికులను విమానాశ్రయ అధికారులు బుజ్జగించి శాంతింప జేశారు. ప్రయాణికులను త్వరగా బయలుదేరేలా హామీ ఇచ్చి కోల్కతాకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. -
సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ
జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సమస్యలు పరిష్కరించాలని కేసీసీ బ్యాంక్ ఉద్యోగులు పట్టణ ప్రధాన మార్గాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. హోటల్ ఉడ్ నుంచి ప్రారంభించన ర్యాలీ బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి చేరింది. కార్యాలయ సభాగృహంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సాధారణ కార్యదర్శి కామ్రెడ్ కె.వి.ఎస్ రవికుమార్ పాల్గొన్నారు. యూనియన్ పతాకాన్ని ఎగురవేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జయపురం అధ్యక్షుడు దిగంబర నాయక్ ఉద్యోగుల సమస్యలపై ప్రసంగించారు. సాధారణ కార్యదర్శి అరుణ కుమార్ సాహు యూనియన్ వార్షిక నివేదికను సభకు సర్పించారు. కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రహి, సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళోలు ప్రసంగిస్తూ.. బ్యాంక్ ఉన్నతికి ఉద్యోగులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సాధారణ కార్యదర్శి కామ్రెడ్ కె.వి.ఎస్.రవికుమార్, సహాయ కార్యదర్శి అఖిల ఒడిశా సహకార బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సాధారణ కార్యదర్శి ప్రభోద్ కుమార్ మిశ్ర, ప్రెసిడెంట్ సంజీవ్ పతి, కార్యదర్శి బిష్ణు ప్రసాద్ మహాపాత్రో తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. -
భక్తిశ్రద్ధలతో హనుమాన్ మందిర ప్రతిష్ట
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి దమణహండిలో శనివారం హనుమాన్ మందిర ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజులుగా నిర్వహించిన మందిర ప్రతిష్ట వేడుకల్లో భాగంగా కలశ జాత్ర, గోపూజ, పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 26వ జాతీయ మార్గంలో గల దమణ హండిలో నిర్వహించిన హనుమాన్ మందిర ప్రతిష్ట ఉత్సవాల్లో స్థానికులే కాకుండా సరిహద్దున గల ఛత్తీష్గఢ్ రాష్ట్ర సుకుమ రాజ కుమార్ జయదేవ్, అతని కుమారుడు బిదిత దేవ్, జయపురం రాజమాత సబితా దేవి, కొట్పాడ్ ఎమ్మెల్యే రూసు భోత్ర, కొట్పాడ్ సమితి బీడీఓ బిక్రమ దొర, ఎంపీ ప్రతినిధి రామేశ్వర జెన, కొట్పాడ్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్ కుమార్ పట్నాయక్, కొట్పాడ్ సమితి ఉపాధ్యక్షుడు బాబులి పాణిగ్రహి పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా గ్రామాల నుంచే కాకుండా ఛత్తీష్గఢ్ రాష్ట్ర ప్రజలు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. తాపస్ కుమార్ పాడీ, సంజీవ కుమార్ బిశాయి, ఉమేష్ చంద్ర బ్రహ్మ, తీర్థబాసి చౌదరి, గౌరవ కుమార్ పర్యవేక్షించారు. -
సహకార బ్యాంక్ల అభివృద్ధికి కృషి చేయాలి
కొరాపుట్: సహకార రంగ బ్యాంక్ల అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలని కొరాపుట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రాహి పిలుపునిచ్చారు. ఆదివారం జయపూర్ కేసీసీ బ్యాంక్ ఆవరణలో జరిగిన రాష్ట్ర సహకార సంఘ బ్యాంక్ ఉద్యోగుల జనరల్ బాడీ సమావేశంలో ప్రసంగించారు. ప్రైవేట్ రంగ బ్యాంక్ల నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సహకార బ్యాంక్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తొలుత పెహల్గాం మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యాక్రమంలో ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరి కె.వి.ఎస్.రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శులు ప్రభాత్ మిశ్ర, కేసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ దిగంబర్ నాయక్, కార్యదర్శి అరుణ్ మిశ్ర, 17 బ్యాంక్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సాహిత్య సేవలు ప్రశంసనీయం
జయపురం: ప్రముఖ ఒడియా దినపత్రిక సంబాద్ ద్వారా నిర్వహిస్తున్న సంబాద్ సాహిత్య ఘర్ ఒడియా సాహిత్య ప్రగతికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. ఆదివారం స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సంబాద్ సాహిత్య ఘర్ ఎనిమిదో వార్షకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సంబాద్ సాహిత్య ఘర్ జయపురం అధ్యక్షులు ఉదయ శంకర జాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాహిణీపతి ప్రసంగింస్తూ సంబాద్ గ్రూపు అధినేత, మాజీ ఎంపీ సౌమ్యరంజన్ పట్నాయక్ సాహిత్య ప్రగతి, పరిరక్షణకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అంతేకాకుండా రక్త సేకరణకు ప్రత్యేక ఉద్యమం చేపట్టి సమాజానికి అనేక సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సంబాద్ సాహిత్య ఘర్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ శుభశ్రీ లెంక, సంబాద్ మీడియ సంస్థల అధినేత, మాజీ ఎంపీ సౌమ్యరంజన్ పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు, సాహితీప్రియుడు మాధవ చౌధురిని సత్కరించారు. -
యోగాతో మానసిక వికాసం
జయపురం: యోగాతో మానసిక వికాసం సాధ్యమని వక్తలు అన్నారు. జయపురం అరవిందనగర్ని సరస్వతీ శిశు విద్యామందిర ప్రాంగణంలో యోగా మహోత్సవ సమితి ఒడిశా ప్రాంతీయ యోగ శిక్షణ శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. శిబిరంలో ఒడిశా పశ్చిమ ప్రాంతంతో జిల్లాలు, కొరాపుట్ జిల్లాతోపాటు ఆరు జిల్లాల యోగా కోఆర్డినేటతో పాటు 50 మందికి పైగా యోగా శిక్షకులు హాజరయ్యారు. వారు ఉత్తమ యోగా శిక్షణ పొందారు. శిక్షకులకు శిక్షణ ఇచ్చిన వారు భారతీయ యోగా ప్రదర్శనలో అమూల్య ప్రతిభ ఉన్న వారు అని యోగా మహోత్సవ సమితి ప్రాంతీయ అధికారి, సాధారణ కార్యదర్శి డాక్టర్ దేవకాంత బెహర వెల్లడించారు. యోగాతో శారీరక, మానసిక వికాసంతో పాటు ఆధ్యాత్మక భావాలు కలుగుతాయన్నారు. యోగాపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. యోగా శిక్షకులు సరోజ్ కాంత మహాపాత్రో, ప్రాంతీయ కోఆర్డినేటర్ అమియ దాస్, కొరాపుట్ జిల్లా యోగా మహోత్వవ సమితి కోఆర్డినేటర్ సురేష్ నంద పాల్గొన్నారు. యోగా శిక్షణ శిబిరంలో మనోరంజన్ ప్రధాన్, జానకీ పాణిగ్రహి ప్రసంగించారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
రాయగడ: క్రీడలతొ ఉజ్వల భవిష్యత్ సాధ్యమని రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు అన్నారు. సదరు సమితి పరిధిలోని బొడొచాందిలి గ్రామంలో మార్చి 26 నుంచి ప్రారంభమైన ఫెండ్రీ క్రికెట్ టోర్నమెంటు ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వారి ప్రతిభను చాటుకోవడంతో పాటు భవిష్యత్ను ఉజ్వలంగా మార్చుకునేందుకు ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదివాసీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంటుల్లో వివిధ ప్రాంతాల నుంచి 32 జట్లు పాల్గొన్నాయని నిర్వాహకులు పెద్దింటి తపన్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్లో భాగంగా సెరిగడు, ఎస్ పితేసు జట్లు తలపడగా సెరిగుడ విజేతగా నిలిచిందన్నారు. జేకేపేపర్ మిల్ సౌజన్యంతో కొనసాగిన టోర్నమెంటులో విజేత జట్టుకు ట్రోఫీతో పాటు 30 వేల రూపాయల నగదు, రన్నర్ జట్టుకు ట్రోఫీ, రూ. 20 వేలు ముఖ్యఅతిథిగా హాజరైన నెక్కంటి అందించారు. మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, బీజేడీ సీనియర్ నాయకుడు దూడల శ్రీనివాస్రావు పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి -
నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలో టాపర్ యష్ జైన్
భువనేశ్వర్: బొలంగీర్ జిల్లా కంటాబంజీకి చెందిన యష్ జైన్ నీట్ సూపర్ స్పెషాలిటీ (ఎస్ఎస్) పరీక్షలో అగ్రస్థానంలో నిఉత్తీర్ణత సాధించాడు. ఆయన జనరల్ సర్జరీలో స్పెషలిస్ట్. ముంబైలోని కేఈఎం హాస్పిటల్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత నాగ్పూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశాడు. గత మూడేళ్లుగా ఆ ఆస్పత్రిలో రోగులకు సేవ చేస్తున్నాడు. నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలో కంటాబంజికి చెందిన యష్ కుమార్ జైన్ కు విపక్ష నేత నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. తన వృత్తి జీవితంలో మరింత ప్రకాశవంతంగా ప్రకాశించి రాష్ట్రం గర్వపడేలా చేయాలని నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. -
పర్లాకిమిడిలో ట్రాఫిక్ కంట్రోల్పై చర్యలు
పర్లాకిమిడి: ట్రాఫిక్ సమస్యపై ఏప్రిల్ 18న సాక్షి ప్రచురించిన కథనంపై జిల్లా పోలీసుశాఖ స్పందించింది. శుక్రవారం నుంచి పాత కోర్టు జంక్షన్, మార్కెట్, హైస్కూల్ జంక్షన్, అగ్నిమాపక కేంద్రం జంక్షన్, రాజవీధి దిగువన వన్వే ట్రాఫిక్ను అమలు చేశారు. పర్లాకిమిడిలో వాహనదారులు అస్తవ్యస్తంగా వాహనాలు నడుపుతుండటంతో అనేక మందికి గాయాలవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కూడలి వద్ద ట్రాఫిక్ కంట్రోల్ పోస్టును ఏర్పాటు చేశారు. అలాగే వన్వే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రోడ్డు మధ్య డివైడర్లను ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని సైన్బోర్డులు ఏర్పాటుచేశారు. -
అనాథాశ్రమం ప్రారంభం
పర్లాకిమిడి: అనాథ పిల్లలను చేరదీసి వారికి ఆహారం, ప్రాథమిక వైద్యం, విద్యను అందించేందుకు అనాథాశ్రమాన్ని పీపుల్ ఫార్వర్డ్ ఫౌండేషన్ సంస్థ గజపతి జిల్లా రాయఘడ బ్లాక్లో డోంబాల్ పంచాయతీ మండల సాయి వద్ద ఆదివారం జిల్లా ఎస్పీ జ్యోతింద్ర నాథ్ పండా ప్రారంభించారు. ఈ అనాథ ఆశ్రమం ప్రారంభోత్సవానికి డోంబాలో పంచాయతీ సర్పంచు బిశ్వనాథ భుయ్యాన్, సంస్థ అధ్యక్షురాలు బినీతా పండా, కార్యదర్శి సత్యజిత్ బరువా, జిరంగో పొలీసుస్టేషన్ అధికారి బి.రమణ, స్థానికులు పాల్గొన్నారు. గజపతి జిల్లా నుంచి వచ్చిన అనాథ పిల్లలను భువనేశ్వర్లో పీపుల్ ఫార్వర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలుత ప్రారంభించారు. అనంతరం గజపతిజిల్లా రాయఘడ బ్లాక్ మండల సాయిలో ప్రారంభిస్తున్నందుకు జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా అభినందించారు. ప్రస్తుతం మండల సాయి అనాథ హోస్టల్లో 20 మంది బాలలు ఉంటున్నారు. వారికి అన్నివిధాలా సహాయ సహాకారాలు అందిస్తామని జిల్లా ఎస్పీ పండా అన్నారు. ఆయుష్మాన్ కార్డులు పంపిణీ కొరాపుట్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ఆయుస్మాన్ ఆరోగ్య బీమా కార్డుల పంపిణీ ప్రక్రియ జోరుగా జరుగుతోంది. ఆదివారం కొరాపుట్ జిల్లా సునాబెడా పట్టణంలోని 18వ వార్డులో పంపిణీ చేపట్టారు. కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. గతంలో ఉన్న బీజూ ఆరోగ్య బీమా కార్డులను తొలగించి కొత్త ప్రభుత్వం వీటిని అమలు లోనికి తెచ్చింది. ఈ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల వరకూ వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జి బి.జానకిరామ య్య ఆదివారం చెప్పారు. శ్రీకాకుళం, టెక్కలి రెండు డివిజన్లలో పరీక్ష నిర్వహణ ఈ నెల 30న ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం డివిజన్లో 25 పరీక్ష కేంద్రాల్లో 6952 మంది, టెక్కలి డివిజన్లో 14 పరీక్ష కేంద్రాల్లో 4500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నా రని చెప్పారు. జిల్లాలో మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో 11,452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. రేపు జిల్లా స్థాయి అండర్–23 బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు శ్రీకాకుళం అర్బన్: జిల్లాస్థాయి అండర్–23 బాలబాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు ఈనెల 29వ తేదీన జరుగుతాయని బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎంపికలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొ న్న బాల, బాలికలు 23 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. బాస్కెట్బాల్ కోచ్ జి.అర్జున్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికలలో పాల్గొన్న క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9949291288 నంబర్ను సంప్రదించాలని వారు కోరారు. -
42 కిలోల గంజాయి స్వాధీనం
● నలుగురి అరెస్టు రాయగడ: జిల్లాలోని రామనగుడ పోలీసులు శనివారం నిర్వహించిన దాడుల్లో 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో జిల్లాలోని గుడారి పోలీస్ స్టేషన్ పరిధిలో మిచికిలింగి గ్రామానికి చెందిన బాసుదేవ్ బిడిక, అజయ్ కడ్రక, మహారాష్ట్రకు చెందిన తుషార్ దీపక్ ఒఘాడేతో సహా మరో మైనర్ బాలుడు ఉన్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పెనకాం పంచాయతీలోని తమింగి గ్రామం సమీపంలో నలుగురు వ్యక్తులు రెండు బస్తాలు మోసుకుంటూ వెళుతుండగా వారిని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. ఈ మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టుకు తరలించారు.ఆంధ్రా పేకాటరాయుళ్లు అరెస్టు కొరాపుట్: ఒడిశాలో ఆంధ్రా పేకాట రాయుళ్లు అరెస్టయ్యారు. ఆదివారం కొరాపుట్ జిల్లా బంధుగాం సమితి అలమండ గ్రామ సమీపంలో చీడి వలస అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట జరుగుతున్నట్లు లక్ష్మీపూర్ ఎస్డీపీఓ బిరంచి నారాయణ్ జగత్కి సమాచారం వచ్చింది. వెంటనే బందుగాం పోలీసులు దాడి చేసి 14 మందిని అరెస్ట్ చేసి బందుగాం పోలీస్ స్టేషన్కి తరలించారు. వీరి నుంచి రెండు కార్లు, 14 సెల్ ఫోన్లు, 10 బైక్లు, రూ.75 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా వాసులుగా గుర్తించారు. 206 మందికి వైద్య సేవలురాయగడ: స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కొలనార సమితి దొందిలి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణుడు ఎం.సురేష్ కుమార్, వైద్యులు జి.వి.రమణ, లోక్నాథ్ రాజు, సౌమ్య రంజన్ నాయక్, హిరాచంద్ పట్నాయక్, మధుస్మిత జైన్, ఫార్మాసిస్టులు ఎ.మురళీ ధర్ బెహర, ప్రమోద్ కుమార్ సాహు, మినకేతన్ కొండగిరి, తదితరులు పాల్గొన్నారు. దొందిలి పరిసర గ్రామాలకు చెందిన 206 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి మందులను అందించారు. ఇందులో 26 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ల కోసంసం పితామహాల్ వద్ద గల ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తరలించినట్లు శిబిరం నిర్వాహకులు డాక్టర్ ఎల్.ఎన్.సాహు తెలియజేశారు. జోషితకు డీఈఓ అభినందనలు మందస: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించిన హరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కంచరాన జోషితను డీఈఓ ఎస్.తిరుమల చైతన్య ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించి జిల్లా ఖ్యాతిని పెంచిందని అన్నారు. తల్లిదండ్రులు లేపాక్షి, మాధవరావులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ఆదర్శప్రాయమన్నారు. ఈ సందర్భంగా జోషితకు రూ.10వేలు నగదు బహుమతి అందజేశారు. విజయానికి కారణమైన హరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. భావనపాడు తీరం సందర్శన సంతబొమ్మాళి: భావనపాడు తీర ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ట్రీ ఫౌండేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం 420 తాబే లు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. కార్యక్రమంలో భావనపాడు సర్పంచ్ బుడ్డ మోహన్రెడ్డి, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సోమేశ్వరరావు, ఫారెస్ట్ సెక్షన్ అధికారి నరేంద్ర, బీట్ అధికారి జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా కలర్ బెల్ట్ ప్రమోషన్
పర్లాకిమిడి: జిల్లా తైక్వాండ్ అకాడమీ తరఫున స్థానిక గుండిచా మందిరంలో కలర్బెల్ట్ ప్రమోషన్ పరీక్షలు ఆదివారం అకాడమీ కార్యదర్శి కార్తీక్ చంద్ర మహాపాత్రో ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా బరంపురం తైక్వాండో అకాడమి నుంచి సత్యన్నారాయణ త్రిపాఠి, రాయగడ జిల్లా గుణుపురం నుంచి గణేష్ చంద్ర మహాపాత్రో వ్యవహరించారు. మొత్తం 99 మంది క్రీడాకారులు వైట్బెల్టు, ఎల్లో స్ట్రిప్, గ్రీన్, బ్లూ స్ట్రిప్లకు పోటీపడ్డారు. వారిలో 89 మంది ఆర్హత సాధించినట్టు అకాడమీ కార్యదర్శి కార్తీక్ మహాపాత్రో తెలిపారు. విద్యార్థులకు వచ్చేనెల నాలుగో తేదీన బెల్టులు ప్రదానం చేస్తామన్నారు. -
రెడ్క్రాస్ శిక్షణ శిబిరం ప్రారంభం
జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్రస్థాయిలో మూడు రోజుల జూనియర్ రెడ్ క్రాస్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. సెమిలిగుడ బ్లాక్ విద్యాధికారి చమేలి ముజుందార్ అధ్యక్షతన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఉపాధ్యాయురాలు నివేదిత మహోదయ అతిథులకు స్వాగతం పలికి శిక్షణ శిబిరం ప్రాధాన్యతను వివరించారు. ఈ శిబిరంలో వివిధ ప్రాంతాల నుంచి 51 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెడ్క్రాస్ అధికారి హరికృష్ణ మహరాణ జూనియర్ రెడ్క్రాస్ శిక్షకులకు రెడ్ క్రాస్ చరిత్ర, ప్రాథమిక చికిత్స ప్రాధాన్యం, ట్రాఫిక్ నియమాలు, వివిధ సమాజ సేవా కార్యక్రమాలు వివరించారు. గౌరవ అతిథిగా రాష్ట్ర జూనియర్ రెడ్క్రాస్ అధికారి లక్ష్మణ స్వై, కొరాపుట్ జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ అధికారి సంజీవ కుమార్ దాస్, రెడ్క్రాస్ సాధన శిక్షకురాలు శుశ్మిత సాహు, రెడ్క్రాస్ మౌలిక సూత్రాలను వివరించారు. విద్యాలయాలలో జూనియర్ రెడ్క్రాస్ భూమికను తెలియజేశారు. సాధన శిక్షకులు సుజిత్ కుమార్ నాయక్ ప్రకతి వైపరీత్యాలలో జూనియర్ రెడ్క్రాస్ భూమికను వివరించారు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అధునాతన అగ్నిమాపక యంత్రాలపై శనివారం అవగాహన కల్పించారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది పలు యంత్రాలను ప్రదర్శనాత్మకంగా పని చేసి చూపించారు. జయపూర్ ఫైర్ అఫిసర్ సురేష్ చంద్ర బారిక, సిబ్బంది పాల్గొన్నారు. కాశీనగర్లో కృష్ణచంద్ర గజపతి విగ్రహావిష్కరణపర్లాకిమిడి: మహారాజా కృష్ణచంద్రగజపతి జయంతి పురస్కరించుకుని కాశీనగర్ ఫారెస్టు జంక్షన్ వద్ద ఆయన విగ్రహాన్ని బరంపురం ఎంపీ ప్రదీప్కుమార్ పాణిగ్రాహి శనివారం ఉదయం ఆవిష్కరించారు. గత కొన్నేళ్లుగా కాశీనగర్లో గజపతి విగ్రహాన్ని ఆవిష్కరించాలని స్థానికుల డిమాండ్ ఉంది. కాశీనగర్ ఎన్ఏసీ అధ్యక్షురాలు ఎం.సుధారాణి, పట్టణ బీజేపీ అధ్యక్షుడు బి.చలపతి, నళీనీ పాత్రో, ఎల్.చంద్రరావు, రొక్కం సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిరక్షించాలి శ్రీకాకుళం అర్బన్: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి రాజ్యాంగ మౌలిక సూత్రాల రక్షణ అవసరమని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.గేయానంద్ అధ్యక్షతన సమావేశం వహించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవాడలోని ఎంబీవీ కేంద్రంలో ఏప్రిల్ 26, 27లలో జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడరలిజంలపై జరుగుతున్న దాడిని ప్రజాసైన్స్ ఉద్యమం ద్వారా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీడీఎఫ్ పూర్వ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్ఎన్) కార్యవర్గ సభ్యులు జి.మురళీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.త్రిమూర్తులు రెడ్డి, వైస్ నాగేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, సమత రాష్ట్ర కన్వీనర్ జి.నిర్మల, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సీహెచ్.జయప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ ఖాలీషా బాషా, బి.మాణిక్యం శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన పౌరాణిక ప్రదర్శనలు
శ్రీకాకుళం కల్చరల్: పౌరాణిక కళాకారుడు మోహనరావు ప్రదర్శనలను 40 ఏళ్లుగా ఇప్పటికీ ఆదరిస్తుండటం గొప్ప విషయమని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో మహాలక్ష్మీ ఆధ్యాత్మిక సామాజిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో హార్మోనియం కళాకారుడు బి.ఎ.మోహనరావు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు పౌరాణిక ప్రదర్శనలు శనివారం ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన పౌరాణిక నటులు ధూపం రామకృష్ణ దంపతులను సత్కరిస్తూ ‘గాన కిరీటి’ బిరుదు ప్రదానం చేసి వెండి కిరీటం, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రదర్శించిన కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో పద్మశ్రీ యడ్ల గోపాలరావు, గండ్రెటి బలరాం, రిటైర్డ్ జడ్జి జి.వి.రమణ, రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, నిక్కు అప్పన్న, సూర శ్రీనివాసరావు, గజల్ వాసుదేవాచారి, హైదరాబాద్కు చెందిన పౌరాణిక కళాకారులు కన్నేపల్లి సుబ్బారావు, ధర్మపురి గౌరీశంకర శాస్త్రి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య, పెదపెంకి శ్రీరామ్, సాయిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయులు
శ్రీకృష్ణచంద్ర గజపతి రాయగడలో.. రాయగడ: పర్లాకిమిడి మహారాజు కృష్ణచంద్ర గజపతి జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక తృప్తి కూడలిలో గల గజపతి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీనియర్ పాత్రికేయుడు అమూల్య రత్న సాహు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మనోజ్ రొథొ, మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా అదనపు కలక్టర్ రమేష్ చంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటకు గజపతి అందించిన సేవలను కొనియాడారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్ర పండ, సెంచురియన్ డైరక్టర్ రాజేష్ పాడి, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి: మహారాజా శ్రీకృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ 134 వ జయంతి వేడుకలు పట్టణంలో మార్కెట్, చిత్రకారవీధి జంక్షన్ వద్ద ఘనంగా జరిగాయి. బరంపురం ఎంపీ డాక్టర్ ప్రదీప్ కుమార్పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన స్మృతి చిహ్నం వద్ద పుష్పాంజలి అర్పించారు. అలాగే కలెక్టర్ బిజయకుమార్ దాస్, పురపాలక ఈఓ లక్ష్మణ మురుమ, సరస్వతీ శిశు మందిర్ ఉపాధ్యాయులు ఆయన మూర్తికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్ నిర్మలా శెఠి మహారాజా విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక మృదంగం వీధి వద్ద ఉన్న కృష్ణచంద్రగజపతి సమాధి వద్ద గజపతి వంశీయురాలు కల్యాణి దేవి గజపతి తొలుత పుష్పమాలలు వేసి స్మరించారు. కృష్ణచంద్ర గజపతి నారాయణదేవ్ సేవలు అనీర్వచనీయం పర్లాకిమిడి: ప్రత్యేక ఒడిశా కోసం పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ చేసిన సేవలు అనిర్వచనీయం అని బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి అన్నారు. కలెక్టరేట్ వద్ద గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాలులో కృష్ణచంద్రగజపతి 134 జయంతి వేడుకలపై జరిగిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడిశా ప్రత్యేక రాష్ట్రం కోసం తన సొంత నిధులు ఖర్చుపెట్టడమే కాకుండా విలువైన సమయాన్ని వెచ్చించి ప్రత్యేక స్వతంత్ర ఒడిశా ఏర్పాటుకు పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణదేవ్ కృషి చేశారని గుర్తు చేశారు. ఒడిశాలో ఏ జిల్లాకు లేని పంట పొలాలకు అనేక ఎత్తిపోత పథకాలు, ఆయకట్టలు, సాగరాలు నిర్మించారని తెలిపారు. ఇంగ్లండ్లోని బంకింగ్హామ్ ప్యాలస్ నమూనా తీసుకుని పర్లాకిమిడిలో గజపతి ప్యాలెస్ను నిర్మించారని అన్నారు. కొరాపుట్లో.. కొరాపుట్: పర్లాకిమిడి మహరాజు కృష్ణచంద్ర గజపతి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో ప్రభుత్వం తరఫున అధికారికంగా సభలు, సమావేశాలు నిర్వహించారు.కవులు,మేదావులు పెద్ద ఎత్తున్న నివాళులు అర్పించారు. -
కుందేళ్ల కళేబరాలు గుర్తింపు
రాయగడ: స్థానిక చెక్కాగుడ సమీపంలోని ప్రేమ్ పహాడ్ వద్ద తాజాగా మరో మూడు కుందేళ్ల కళేబరాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం 5 కుందేళ్ల కళేబరాలు ఇక్కడ లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది గురువారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టడంతో వేర్వేరు ప్రాంతాల్లో మరో మూడు కుందేళ్ల కళేబరాలను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు 8 కుందేళ్ల కళేబరాలు లభ్యమయ్యాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, లేదా ఎవరైనా వీటిని చంపి ఇక్కడ పడేశారా అన్న కోణంలో అటవీ శాఖ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ వన్యప్రాణులకు రక్షణ కరువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా లభ్యమైన కుందేలు కళేబరం -
మావో డంప్ స్వాధీనం
మల్కన్గిరి: జిల్లాలో చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియాలోని కేందుగూడ గ్రామ సమీప అడవిలో 177 బెటాలియాన్కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. అయితే వారు తిరిగి వస్తున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మావో డంప్ గుర్తించారు. దీంతో వెంటనే దానిని వెలికితీశారు. అందులో నాలుగు టిఫిన్ బాంబులు, ఒక 12 వోల్ట్స్ బ్యాటరీ, ఎలక్ట్రికల్ వైర్లు, పెద్ద ప్లాస్టిక్ డ్రమ్, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ సామగ్రిని స్వాధీనం చేసుకొని బీఎస్ఎఫ్ క్యాంపుకు తరలించారు. -
మే 20 నుంచి ధాన్యం మండీలు ప్రారంభం
కొరాపుట్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు (మండీలు) మే 20వ తేదీ నుంచి నబరంగ్పూర్ జిల్లాలో ప్రారంభమవ్వనున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అశోక్ మెహతా కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో నేతృత్వంలో జిల్లా ప్రోక్రిమెంట్ సమావేశం జరిగింది. మండిల్లో రైతులకు విద్యుత్, తాగునీరు, టార్పాలిన్లు, షెల్టర్, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి అదేశించారు. మొత్తం 40,359 మంది రైతులు తాము పండించిన ధాన్యం విక్రయించనున్నారు. సుమారు 25 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకున్నామని అధికారులు ప్రకటించారు. సమావేశంలో రాజ్యసభ ఎంపీ ప్రతినిధి రబి పట్నాయక్, లోక్సభ ఎంపీ ప్రతినిధి దేవదాస్ మహంకుడో, మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ప్రతిప్ మిశ్ర, జడేశ్వర్ ఖడంగా తదితరులు పాల్గొన్నారు. -
‘నాగేశ్వరి గుహల్లో తవ్వకాలు అంగీకరించబోము’
నాగేశ్వరి గుహలలో మాజీ ఎంపీ జయరాం పంగి కొరాపుట్: గిరిజనుల ఆరాధ్య దైవం ఉన్న నాగే శ్వరి గుహలపై తవ్వకాలు అంగీకరించబోమని కొరాపుట్ మాజీ ఎంపీ జయరాం పంగి ప్రకటించారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి బల్దా గ్రామ పంచాయతీ నాగేశ్వరి గుహలను సందర్శించారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాగేశ్వరి గుహలను ఎకో టూరిజం ప్రాజెక్ట్ కింద శంకుస్థాపన చేశారని తెలిపారు. అలాంటి టూరిజం ప్రాజెక్ట్ని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ఈ గుహలను తవ్వి బాకై ్సట్ తవ్వకాల కోసం అదానీ కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. స్థానిక గిరిజనులు ఈ తవ్వకాలకు పెద్ద ఎత్తున్న వ్యతిరేక పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పంగి ఆరోపించారు. -
రాష్ట్రంలో తొలి రోబోటిక్ మోకాలి మార్పిడి విజయవంతం
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి రోబోటిక్ మోకాలి మార్పిడి విజయవంతమైంది. స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం ఈ విజయవంతమైన శస్త్ర చికిత్స నిర్వహించింది. ఒడిశా, తూర్పు భారత దేశ ప్రభుత్వ రంగ వైద్య సంస్థల్లో ఇదే మొట్టమొదటి రోబోటిక్ మోకాలి మార్పిడి విధానం కావడం విశేషం. అత్యాధునిక రోబోటిక్ మోకాలి మార్పిడి సౌకర్యాన్ని ప్రవేశపెట్టి ఎయిమ్స్ భువనేశ్వర్ మైలురాయిని ఆవిష్కరించింది. ఈ ప్రాంతంలో అధునాతన వైద్య సంరక్షణకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. స్థానిక ఎయిమ్స్ ఆర్థోపెడిక్స్ విభాగం వైద్య నిపుణుల బృందం 66 ఏళ్ల మహిళా రోగిపై మొదటి రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సని విజయవంతంగా నిర్వహించడం అత్యద్భుతమని వైద్య నిపుణుల వర్గం హర్షం వ్యక్తం చేసింది. కచ్చితత్వం, అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించిన ఈ ప్రక్రియ సజావుగా సాగింది మరియు ఆపరేషన్ తర్వాత రోగి ఇప్పుడు స్థిరంగా ఉన్నట్లు ఎయిమ్స్ భువనేశ్వర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ బిశ్వాస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోబోటిక్ శస్త్ర చికిత్స సౌకర్యం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఇది సమాజంలోని అన్ని వర్గాలకు అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేలా చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. -
కస్తూరి రంగన్ మృతికి గవర్నర్ సంతాపం
భువనేశ్వర్: భారత అంతరిక్ష ప్రయాణానికి రూపశిల్పి, దార్శనిక శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ మరణవార్త విన్న రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిశోధన రంగంలో ఆయన చేసిన విశేష కృషి యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీజగన్నాథునికి మహాస్నానం భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న వేదికపై కొలువుదీరిన శ్రీజగన్నాథ స్వామివారికి శుక్రవారం అర్ధాంతరంగా మహా స్నానం చేయించారు. ప్రధాన ఆలయ ప్రాంగణం జయ, విజయ ద్వారం ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి వాంతి చేసినట్లు దృష్టికి రావడంతో స్వామివారికి మహాబింబ స్నానం చేయించాల్సి రావడం గమనార్హం. ఈ సందర్భంగా శ్రీమందిరంలో భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిచిపోయింది. యువతి ఆత్మహత్య మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా పోడియ సమితి సిమిలిబంచో పంచాయతీ ఎంవీ 61 గ్రామంలో శుక్రవారం ఓ 18 ఏళ్ల యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంవీ 61 గ్రామానికి చెందిన రింకీ మండాల్ గ్రామానికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరికి వేలాడుతూ శుక్రవారం ఉదయం స్థానికులకు కనిపించింది. దీంతో వారు పొడియా పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని కిందకు దించి గ్రామస్తులను విచారించారు. తండ్రిని చిన్నప్పుడే కోల్పోవడం, తల్లి చదువు మాన్పించడం, ఓ యువకుడితో ప్రేమ సజావుగా సాగకపోవడం వంటి కారణాలు ఈ అఘాయిత్యానికి ఉసిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అనూప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అవినీతి కాంట్రాక్టర్ అరెస్ట్ కొరాపుట్: అవినీతి కాంట్రాక్టర్ను విజిలెన్స్ విభాగం అరెస్ట్ చేసింది. నువాపడ జిల్లాలో 22 చెక్ డ్యామ్ల నిర్మాణంలో రూ..57 లక్షల నిధులను కాంట్రాక్టర్ లక్ష్మీధర రౌత్రాయ్ మళ్లించాడు. శుక్రవారం ఈ విషయం గమనించిన కొరాపుట్ విజిలెన్స్ విభాగం అతడిని అరెస్ట్ చేసి భవాని పట్న విజిలెన్స్ కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించింది. అక్రమంగా తరలిస్తున్న తాబేళ్ల పట్టివేత మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీ శాఖ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. ముందుగా అక్రమ రవాణాపై ఫారెస్టర్ రస్మీరంజన్ స్వాయ్కు సమాచారం వచ్చింది. దీంతో మోటు రేంజర్ మురళి అనూగులియాతో చర్చించి వాహనాల తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా 13 బస్తాల్లో తరలిస్తున్న 473 తాబేళ్లను గుర్తించారు. వాహనంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. తాబేళ్లను ఎంవీ 79 గ్రామం వద్దనున్న అటవీ కార్యాలయానికి తరలించారు. -
88 కిలోల గంజాయి పట్టివేత
జయపురం: సరుకులు రవాణా చేసే ఒక టాటా మేజిక్ వాహనంలో 88 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి రక్ష్మీరంజన్ ప్రధాన్ శుక్రవారం వెల్లడించారు. ఒక టాటా మేజిక్ వాహనంలో రాత్రిళ్లు గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో.. గురువారం సాయంత్రం పోలీసు అధికారి ఆదేశం మేరకు సబ్ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ బెహర నేతృత్వంలో పోలీసు టీమ్ ఖొరాగుడ గ్రామ ప్రాంతంలో పెట్రోలింగ్ జరిపింది. దీంతో అటుగా వస్తున్న టాటా మేజిక్ వాహనం పోలీసులను గమనించడం.. బండిని అక్కడే వదిలి వాహనంలో ఉన్నవారంతా పారిపోయారు. వాహనం వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. గంజాయి దొరికింది. వెహికల్ నంబర్ ఆధారంతో గంజాయి వ్యాపారం చేస్తున్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారి వెల్లడించారు. -
సీఎం పర్యటనకు 1500 మంది పోలీసులతో బందోబస్తు
ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడగుట్లపాలెంలో శనివారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చెప్పారు. బుడగుట్లపాలెంలో పోలీస్ అధికారులతో శుక్రవారం భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ముఖ్యమంత్రి వచ్చిన నుంచి పర్యటన పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలు పార్కింగ్, తనిఖీ లు వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. నలుగురు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలతో కూడిన అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తారని చెప్పారు. 17 రోప్, స్పెషల్, క్యూఆర్డీ టీంలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. హెలీప్యాడ్, సభావేదిక, ఆలయ దర్శనం, లబ్ధిదారులతో ముఖా ముఖి వంటి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. -
గొట్టా.. ముప్పు ఆగేదెట్టా..?
● వరదల ధాటికి పాడైన గొట్టా బ్యారేజీ రాతి కట్టడాలు ● పనులు పూర్తి చేయకుంటే బ్యారేజీకే ముప్పు ● ఆందోళన చెందుతున్న రైతులు ● సీఈకి ప్రతిపాదనలు పంపించాం హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద ఏప్రాన్ పూర్తిగా పాడై ఉంది, పను లు చేసేయాలని ఇటీవల జిల్లాకు వచ్చిన జలవనరుల శాఖ మంత్రి చె ప్పారు. టెండర్లు పిలిచేందుకు కావాల్సిన దస్త్రాలను సీఈకి ప్రతిపాదనలు పంపించాం. త దుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాం. ఈ సీజన్లో దాని వల్ల ఎలాంటి ముప్పు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. వచ్చే సీజన్కు తప్పనిసరిగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నం చేస్తాం. – పీవీ తిరుపతిరావు, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు, ఎస్ఈ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కాలం గడుస్తున్న కొద్దీ గొట్టా బ్యారేజీ ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతోంది. జిల్లాకు జీవనాడి వంటి బ్యారేజీ పరిరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. వంశధార స్టేజ్–1, ఫేజ్–2 పనులకు జలయజ్ఞంలో భాగంగా రూ.933కోట్లతో పనులు ప్రారంభించారు. అప్పట్లో వంశధార గట్లు పటిష్టం చేయడం, హిరమండలం రిజర్వాయర్ నిర్మాణం, ప్యాకేజీ–87, 88లకు శ్రీకారం చుట్టారు. వంశధార నదిలో నీటిని ఒడిసిపట్టి జిల్లాలో 2.55లక్షల హె క్టార్లలో రెండు పంటలకు నీరందించాలంటే అది ఒక్క వంశధార నదిలో నీరు వృధా కాకుండా అడ్డుకట్ట వేయడంతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి ధర్మాన ఇంజినీర్లతో కలిసి డిజైన్ చేశారు. నదిలో వచ్చే నీటిని నిల్వచేసేందుకు గొట్టాబ్యారేజీ వద్ద గేట్లు ఏర్పాటు చేసి కొంతమేర రైతుల అవసరాలను బట్టి నీటిని వదిలేవారు. నీరు నిత్యం పారుతుండడంతో గొట్టా బ్యారేజీకి ది గువ భాగాన ఉన్న రాతి కట్టడాలు వరదలకు నీటి లో కొట్టుకుపోయాయి. ఆ తర్వాత వచ్చిన వర్షాలు, వరదలకు ఏటా కొంచెం, కొంచెంగా ఇసుక మేటలు వేసి రాళ్లు కొట్టుకుపోయి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాతి కట్టడాలు సరిగా లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. వాస్తవానికి వంశధార ఎడమ కాలువ పనులు చేసేందుకు ఆప్పట్లో ఆధునికీకరణ పూర్తిచేసేందుకు రూ.380 కోట్లు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు దాని పని అంచనా విలువ బాగా పెరిగిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో రూ 12.91కోట్లు మంజూరు వైఎస్ జగన్ హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో హిరమండలం గొట్టా బ్యారే జీ వద్ద ఏప్రాన్ (రాతికట్టడాల) పనులు చేసేందుకు గాను రూ.12.91కోట్లు నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే హిరమండ లం రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్కు రూ 176.35 కోట్లు, ఉద్దానం ప్రాంతానికి తాగునీరు సౌకర్యం కల్పించడానికి రూ.700కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, ఆఫ్షోర్ ప్రాజెక్టుకు రూ 852.45కోట్లు, వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించేందుకు రూ.216.71కోట్లు, పాతపట్నం నియోజక వర్గంలో రెండు మండలాలకు మంచినీటి ప్రాజెక్టు కింద రూ.250కోట్లు మంజూరు చేశారు. ఏప్రాన్ పనులు ప్రారంభించేలోపే ఎన్నికల కోడ్ రావడంతో అర్ధంతరంగా టెండర్ల దశలోనే ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 11నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వెయ్యకపోవడం దారుణమని రైతులు, నదీపరివాహక ప్రాంత వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల జలవనరుల శాఖమంత్రి రామానాయుడు జిల్లాకు వచ్చినా ఎమర్జెన్సీగా చేయాల్సిన పనులేవీ చూడకుండా అచ్చెన్న ఇలాకాలో పనులు మాత్రమే చూసి తూతూమంత్రంగా వెళ్లిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో పనులు చేసేందుకు టెండర్లు పిలిచేందుకు ఆదేశాలిస్తారో లేదో వేచి చూడాలి. -
ఉపాధి కూలీలపై కక్ష సాధింపు
ఎచ్చెర్ల: లావేరు మండలం తాళ్లవలస గ్రామంలో అధికార పార్టీ మేట్లు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉపాధి కూలీలు వాపోయారు. గ్రామంలో 78 మంది వరకు ఉపాధి పనులు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొందరు అధికార పార్టీ వారిని మేట్లుగా వేశారు. అందులో భాగంగానే తాళ్లవలసలో రాధను నియమించారని కూలీలు తెలిపారు. ఈమె రాజకీయ కక్షతో కొందరి కి మస్టర్ వేయకుండా వేధిస్తోందని, కాసేపు బయటకు వెళ్లినా మస్టర్ వేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గురువారం ఫీల్డ్ అసిస్టెంట్ రాకపోవడంతో కొన్ని గ్రూపుల కూలీలకు మస్టర్లు వేయడానికి వేరే వాళ్లను పంపించారు. దీంతో మస్టర్లు చదివే సమయంలో గొడవ జరిగింది. శుక్రవారం పలువురిని పనిలోకి రావద్దని చెప్పడంతో వారంతా ఏపీఓ సత్యవతిని కలిసి మాట్లాడారు. ఏపీఓ మాట్లాడు తూ ప్రతి రోజు మీరు ఘర్షణ పడుతున్నారని అందువలన రెండురోజులు పనిని నిలుపుదల చేయాలని చెప్పారు. అందరికీ సమానంగా పనిని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాధ అనే మేట్ ఉంటే తాము పనిచేయలేమని, ఆమె తమను పనిచేయనివ్వరని వారు ఫిర్యాదు చేశారు. -
బిసి ప్రాస్క గ్రామంలో దాహం కేకలు
రాయగడ : జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సెరిగుమ్మ పంచాయతీలోని బీసీ ప్రాస్క గ్రామంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. బిందెడు నీటి కోసం మైళ్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో 20 కుటుంబాలకు చెందిన వంద మందికి పైగా ఆదివాసీలు నివసిస్తున్నారు. ఉన్న ఒక్క గొట్టపు బావి పాడైపొవడంతో సుమారు కిలోమీటరు దూరంలో గల సునాజొర్ తోట సమీపంలో ఉన్న నది నుంచి నీటతిని సేకరించి వాటిని తాగేందుకు వినియోగించాల్సి వస్తోందని గ్రామస్తులు అంటున్నారు. గత కొద్ది రోజుల కిందట కళ్యాణసింగుపూర్ సమితిలో జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఇదే సమస్యకు సంబంధించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇంతవరకు స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
చలివేంద్రం ఏర్పాటు
జయపురం: జయపురం సబ్కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో తాగునీటి సౌకర్యం కోసం కోల్డ్ డ్రింకింగ్ వాటర్ ఫ్రిజ్ను శుక్రవారం ఏర్పాఉట చేశారు. సబ్కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సబ్కలక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి ప్రారంభించారు. సబ్కలెక్టర్ కార్యాయంలో చలివేంద్రాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్, ఎస్బీఐ జయపురం చీఫ్ మేనేజర్, జయపురం మైన్ బ్రాంచ్ మేనేజర్, తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోల్డ్ డ్రింకింగ్ వాటర్ ఫ్రిజ్ -
తాగునీటి సమస్య పరిష్కరించండి
రాయగడ: కొలనార సమితి పరిధిలో గల తెరువలి పంచాయతీలోని మూడో వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారీని కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వార్డులో సుమారు 25 కటుంబాలకు చెందిన వంద మందికి పైగా జనాభా నివసిస్తున్నామన్నారు. ఆరు నెలలుగా తాగనీటి సమస్య ఉందన్నారు. సమస్యను సంబంధిత పంచాయతీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని వివరించారు. వేసవి తీవ్రత రోజుజోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య కూడా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం వార్డులో గల రెండు గొట్టపు బావులు పనిచేయడంలేదని, తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. -
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు మండలాలకు అనుకు ని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, శిరడా, గురిసింగి గూడ, నేరడి గూడ పరిసరాల్లో 1,120 లీటర్ల నాటు సారా, 10,600 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు తెలిపారు. మలేరియాపై అవగాహన ర్యాలీ అరసవల్లి: మలేరియాను జయించండి.. జీవితం నిలపండి అని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియాను సరైన జాగ్రత్తలు పాటించి నివారించుకోవచ్చునని, గత ఐదేళ్లలో మలేరియా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. అయితే ప్రతి ఇంట్లో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రథమ కర్తవ్యంగా మారుచకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్యశాఖ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సత్యన్నారాయణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ మేరీ కేథరిన్, అడిషినల్ డీఎంహెచ్ఓ తాడేల శ్రీకాంత్, ప్రోగ్రాం కన్సల్టెన్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు. అరసవల్లి ఇన్చార్జి ఈఓగా శోభారాణి అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఇన్చార్జి ఈఓగా కె.శోభారాణిని నియమించారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె విశాఖ కనక మహాలక్ష్మి ఆలయంలో ఈఓగా పనిచేస్తూ.. అరసవల్లి ఇన్చార్జి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈఓ వై.భద్రాది మెడికల్ లీవులో వెళ్లినందున జిల్లా దేవదాయ శాఖ అధికారి(ఏసీ)తో పాటు అరసవల్లి ఆలయ ఈఓ బాధ్యతలు కూడా శోభారాణి చూడనున్నారు. వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ హామీ ఏమైంది? శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని ప్రాజెక్టుల నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేర కు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కొత్తూరు మండల కేంద్రంలో నిర్వాసితుల ఉద్దేశించి మాట్లాడారని, టీడీపీ అధికారంలోకి వస్తే నిర్వాసితులందరికీ స్పెషల్ ప్యాకేజీ ఇప్పిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గతంలో మీ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ గంపెడు ఆశలతో మీ ప్రభుత్వాన్ని గెలిపించారని అధికారంలోకి వచ్చి సంవత్సర కా లం కావస్తున్నా నిర్వాసితులకు ఇచ్చిన హామీ ఏమైందో తెలియడం లేదన్నారు. ‘ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే’ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాకు ప్రత్యేకంగా ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలుచేయలేదని, ఇప్పుడైనా అమలు చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్య దర్శి వర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామన్న హామీలు నేటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. జిల్లాలో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టాలని, కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి 50 ఏళ్లు పూర్తి కావస్తోందని ఆధునికీకరణకు రూ. 1600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2007లో ప్రారంభించిన ఆఫ్షోర్ రిజర్వాయర్కు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని రిజర్వాయర్కు నిధులు కేటాయించాలన్నారు. -
జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపిక
పర్లాకిమిడి: న్యూఢిల్లీలో ఏప్రిల్ 30 నుంచి మే 5 వరకూ జరగనున్న జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు కాశీనగర్ సమితి సిధ్ధమణుగు గ్రామానికి చెందిన పలకల కార్తీక్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఇండియా (యస్.జి.ఎఫ్.ఐ.)భువనేశ్వర్ టీంకు ప్రాతినిధ్యం వహించనున్నట్టు జిల్లా శారీరక క్రీడాఽధికారి సురేంద్ర పాత్రో తెలియజేశారు. గజపతి జిల్లా రోలర్ స్కేటింగ్ అకాడెమీ (జి.డి.యస్.ఎ.)లో కార్తీక్ ఏడాదిన్నరగా శిక్షణ పొందాడు. గత ఏడాది నవంబరు 26, 27లో భువనేఽశ్వర్లో జరిగిన రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో పాల్గొని అర్హత సాధించాడు. -
ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
కొరాపుట్: పంచాయతీరాజ్ దినోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని సాయి కల్యాణ మండపంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మైనారిటీ, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులు చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో నబరంగ్పూర్ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శుభంకర్ మహాపాత్రో, నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తదితరులు పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవంలో ఉత్తమ బ్లాక్గా జయపూర్ను ప్రకటించారు. జయపూర్ బీడీఓ శక్తి మహాపాత్రోకు అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, తదితరులు పాల్గొన్నారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో సమితి కార్యాలయ మైదానంలో గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కర్యక్రమాన్ని జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్ర శభరో ప్రారంభించారు. సీఎం మోహన్ చరణ్ మాఝి పూరీ జిల్లాలో ముందుగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 6 లక్షలు మంది అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్కన్గిరి సమితిలో 64 మందికి, పురపాలకలోని 49 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. జిల్లా ఉన్న 7 సమితుల్లో బలిమెలలో 16 మందికి, మత్తిలిలో 36 మందికి, కలిమెలలో 161 మందికి, ఖోయిర్పూట్ 25 మందికి, కోరుకొండా 58 మందికి, పోడియా 34 మందికి, చిత్రకొండ 26 మందికి రేషన్ కార్డులు అందజేశారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జిల్లా అధికార యంత్రాంగం గజపతి స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. డీఆర్డీఏ. ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్ కెరకెటా, అదనపు అధికారి పృథ్వీరాజ్ మండల్, పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము, బ్లాక్ ఫైనాన్స్ అధికారి గజేంద్ర బెహరా, ఈఓ జిల్లా పంచాయతీ అధికారి అశోక్కుమార్ పట్నాయక్, గుమ్మా జెడ్పీటీసీ రేణుకా పాత్రో తదితరులు విచ్చేశారు. కాశ్మీర్లో ఉగ్రదాడిలో మరణించిన 26 మంది ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ కలిసి పనిచేస్తే పంచాయతీ, గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. 234 మందికి కొత్త రేషన్ కార్డులను అందజేశారు. సామాజిక సురక్షా, అంగవికలాంగులు నలుగురికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పీఎం ఆవాస్ యోజనా పథకం కింద మూడు గ్రామ పంచాయతీలకు రివార్డులను అందజేశారు. జిల్లా పరిషత్తు అసిస్టెంట ఇంజినీర్ వెంకటరావు ఆచారి, ఓ.ఎల్.ఎం.డి.పి.ఎం టెమోన్ బోరా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, తదితరులు పాల్గొన్నారు. కొరాపుట్: వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిత్యానంద గొండో, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, కలెక్టర్ శుభంకర్ మహాపాత్రో -
నలుగురు దొంగల అరెస్టు
జయపురం: పలు దొంగతనాల్లో నిందితులైన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్డివిజనల్ పోలీసు అధికారి పార్థజగదీష్ కాశ్యప్ గురువారం తెలిపారు. స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ సభాగృహంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వారిపై జయపురం పట్టణ, సదర్ పోలీసు స్టేషన్లలో మూడు కేసులు మల్కన్గిరి, మత్తిలి, బొయిపరిగుడ, బొరిగుమ్మ, కొరాపుట్ దమంజొడి మొదలగు పోలీసు స్టేషన్లలో 10 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. -
పల్లెనిద్రలో ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ
సాక్షి టాస్క్ఫోర్స్ : బూర్జ గ్రామంలో ఈ నెల 21న జరిగిన పల్లె నిద్ర కార్యక్రమానికి హాజరై న ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్కు బొమ్మాళి రేవతి అనే మహిళ సమస్యలపై నిలదీసింది. ఉపాధి పనులు చేపట్టినప్పుడు సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని, సకాలంలో బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. పార్టీలకతీతంగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయాలన్నారు. పాలిసెట్ హాల్టికెట్లు సిద్ధం ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవే శాలకు సంబంధించి ఏపీ పాలిసెట్ – 2025కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశా ల కన్వీనర్ బి.జానకిరామయ్య కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశా రు. పీవోఎల్వైసీఈటీఏపీ.ఎన్ఐసీ.ఐఎన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాల ని సూచించారు. ఈ నెల 30న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కూర్మనాథాలయ ఈఓగా నరసింహనాయుడు గార: శ్రీకూర్మంలోని కూర్మనాథాలయ ఈవోగా కె.నరసింహ నాయుడు గురువా రం బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లు గా శ్రీకూర్మంతో పా టు రావివలస, పలా స గ్రూప్ ఆఫ్ టెంపుల్స్కు ఇన్చార్జి ఈవోగా గురునాథరావు వ్యవ హరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాబేళ్లు దహనం ఘటన చోటుచేసుకోవడంతో దేవదాయశాఖ ఎట్టకేలకు రెగ్యులర్ ఈఓ నియామ కం చేపట్టింది. ఈ సందర్భంగా నరసింహనాయుడు తాబేళ్ల పార్కు, ఆలయ క్యూలైన్లు, నిత్యాన్నదాన సత్రాలను పరిశీలించారు. 10, 11వ తేదీల్లో సాహితీ సంబరాలు ఎచ్చెర్ల క్యాంపస్: ఏలూరులో శ్రీ శ్రీ కళావేదిక సంస్థ ఆధ్వర్యంలో మే 10, 11వ తేదీల్లో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలకు సంబంధించి స్వగత పత్రాలను గురువారం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బా లాజీ ఆవిష్కరించారు. సంబరాల్లో పాల్గొంటు న్న వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపా రు. కార్యక్రమంలో ఏవో ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, ప్రొఫె సర్ కొర్ల మోహన్కృష్ణ చౌదరి, సంక్షేమ డీన్ ర వి, తెలుగు బోధకులు పెద్దింటి ముకుందరా వు, పి.చిరంజీవిరావు, రాకోటి శ్రీనివాసరావు, కళావేదిక ఉత్తరాంధ్ర అధ్యక్షుడు వేమన, రచ యిత జంధ్యాల శరత్బాబు పాల్గొన్నారు. సీఎం భద్రతా ఏర్పాట్ల సమీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: ఈ నెల 26న ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు సమీక్ష నిర్వహించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్పై సీఎం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ ఎస్పీ ఎ.వి.రమణతో చర్చించారు. హెలిప్యాడ్, డయాస్, సభ నిర్వహణపై సమీక్షించారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. -
అగ్నికి ఆహుతైన ఎర్రచందనం చెట్లు
టెక్కలి: కోటబొమ్మాళి మండలం శ్రీజగన్నాథపురం పంచాయతీ బిర్లంగిపేట గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు నూక సత్యరాజ్కు చెందిన సుమారు 2 ఎకరాల ఎర్ర చందనం తోటలో గురువారం రాత్రి అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్క సారిగా మంటలు వ్యాపించి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, కోటబొమ్మాళి మండల కన్వీనర్ సంపతిరావు హేమసుందర్రాజు, జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, నాయకులు పేడాడ వెంకటరావు, సత్తారు సత్యం తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడు సత్యరాజ్కు అండగా నిలిచారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఇలా వికృత చేష్టలకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేసి బాధితుడికి న్యాయం చేయాలని నాయకులు కోరారు. -
ప్రేమ్ పహాడ్ వద్ద కుందేళ్ల కళేబరాలు
రాయగడ: స్థానిక చెక్కాగుడ సమీపంలో గల ప్రేమ్పహాడ్ వద్ద 5 కుందేళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకే చోట కుందేళ్ల మృతదేహాలు పడి ఉండటం పై పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రొజు ప్రేమ్ పహాడ్ వద్దకు వచ్చి వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇంత వరకు ఈ ప్రాంతంలో ఒక్క కుందేలును కూడా తాము చూడలేదని వాకర్స్ క్లబ్ సభ్యులు శంకర్షన్ మంగరాజ్ చెప్పారు. ఇదే విషయమై ఫారెస్ట్ రేంజర్ కామేశ్వర్ ఆచారి దృష్టికి తీసుకువెళ్లగా ప్రేమ్ పహాడ్ వద్ద కుందేళ్ల సంచారం చేసే విషయం ఎప్పుడూ తమ దృష్టికి రాలేదని అన్నారు. అయితే ఒకే ప్రాంతంలో కుందేళ్ల మృతదేహాలు పడి ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామని అన్నారు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పర్లాకిమిడి: పాటికోట గ్రామానికి చెందిన శాసనం ఫాల్గుణ రావు (48) గురువారం ఉదయం గంజాం జిల్లా గోలంతర వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన పర్లాకిమిడి నుంచి భువనేశ్వర్కు సెంచూరియన్ వర్సిటీ పనిమీద వెళుతుండగా హైవే వద్ద కారుకు పెట్రోలు కొట్టించుకుని ఫోనులో మాట్లాడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయనకు బలమైన గాయాలు కావడంతో దగ్గరలో ఉన్న బరంపురం ఎం.కె.సి.జీ మెడికల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఐదుగురు అన్నదమ్ములు, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫాల్గుణ రావు మరణంతో పాటికోట గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన సెంచూరియన్ వర్సిటీ జనరల్ మేనేజర్ (అడ్మిషన్) విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన మృతికి సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, సిబ్బంది సంతాపం ప్రకటించారు. -
వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: వక్ఫ్ సవరణ చట్టం– 2025కు వ్యతిరేకంగా గురువారం జిల్లా ముస్లింల ఐక్య సమాఖ్య జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ముందుగా కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు నివాళులు అర్పించారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం ఏడు రోడ్ల కూడలిలో బయలు దేరి కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటే శ్వరరావుకు జిల్లా ముస్లిం ఐక్య సమాఖ్య జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, సలీం, హాజీ అమీరుల్లా బేగ్, రఫీ, మహీబుల్లా ఖాన్, ముజీబ్, అక్బర్బా షా, మహిళా సోదరీమణులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త చట్టం ముస్లింల హక్కులను కాలరాస్తుందన్నా రు. భవిష్యత్తులో ముస్లింల మనుగడకే ఇబ్బందిగా మారే చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ముస్లింల ర్యాలీకి అన్ని రాజకీయా పక్షాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు, సీఐటీయూసీ, ఏఐటీయూసీ నాయకులు సంఘీబావం తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
లిఫ్టులో చిక్కుకుని రోగి మృతి
భువనేశ్వర్: చికిత్స కోసం తరలిస్తున్న రోగి లిఫ్టులో చిక్కు కుని అకాల మరణానికి గురయ్యారు. ఈ విచారకర సంఘటన భద్రక్ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలు భద్రక్ జిల్లా రాండియా పంచాయతీ నర్సింగపూర్కు చెందిన మీనతి పరిడాగా గుర్తించారు. మీనతి పరిడాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను భద్రక్ జిల్లా ప్రధాన వైద్య ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆమెను మహిళా వైద్య వార్డుకు తీసుకెళ్లమని డాక్టర్ సలహా ఇచ్చారు. వైద్యుని సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆమెను లిఫ్ట్లోని మహిళా వైద్య వార్డుకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో విషాదం చోటు చేసుకుంది. రోగిని లిఫ్ట్లో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా పైకి కదిలింది. దీంతో రోగి నుజ్జునుజ్జు అయి చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనతో ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత వర్గాన్ని బుజ్జగించి పరిస్థితిని చక్కదిద్దారు. ఉగ్రమూకలను అణిచివేయాలి రాయగడ: జమ్మూ–కాశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై దాడులకు తెగబడిన ఉగ్రమూకలను అణిచివేయాలని స్థానిక హిందూ ఐక్యతా సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ మేరకు స్థానిక జగన్నాథ మందిరం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు పట్టణంలో ర్యాలీలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరు తూ వినతిపత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి రాయగడ: గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఫరూల్ పట్వారి తెలియజేశారు. స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో గురువారం జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీలను అభివృద్ధి చేస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు పంచాయతీల్లోని వివిధ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, జిల్లా అదనపు ఎస్పీ విష్ణు ప్రసాద్ పాత్రో, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతీ మాఝి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుభద్ర యోజనలో భాగంగా లబ్ధిదారులు ఆర్థిక సహకారం అందజేశారు. హత్య కేసులో 28 మంది అరెస్టు రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసుస్టేషన్ పరిధి హటొపొదొరొ వీధిలో నివసిస్తున్న భైరవ సాహు అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వీధిలోని కొందరు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు 28 మందిని గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరైస్టెనవారిలో ఏడుగురు మైనర్లు కావడంతో వారిని జిల్లా కేంద్రంలోని ఫోకస్ కోర్టుకు తరలించారు. అదేవిధంగా సంఘటన జరుగుతున్న సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై దాడి చేసిన విషయమై మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన వారిలో కొంతమంది ఉండగా, మరి కొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ముమ్మరంగా ఎకై ్సజ్ దాడులు
రాయగడ: ఒడిశా – ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన ఎకై ్సజ్ శాఖ అధికారులు బుధవారం ముమ్మరంగా దాడులు చేపట్టారు. సరిహద్దు ప్రాంతాలైన శశిఖాల్, తంబలబాయి, సందుబడి, సనొ సందుబడి, పాణి ఛత్తర్, జొరుడి తదితర గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో భాగంగా తంబలబాయి గ్రామంలో 3,500 లీటర్ల ఊట, 300 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పాణిఛత్తర్ గ్రామంలో 1,200 లీటర్ల ఊట, 80 లీటర్ల నాటుసార, జొరుడి గ్రామంలో 800 లీటర్ల ఊట, 40 లీటర్ల నాటుసారా, సందుబడి గ్రామంలో నిర్వహించిన దాడుల్లో 7 వేల లీటర్ల ఊట, 400 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అదేవిధంగా నాటుసార తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విప్పపూవు స్వాధీనం నాటుసారా తయారీకి వినియోగించే 3 వేల కిలోల విప్పపువ్వును అధికారులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో జయానంద్ బచేలి, సబొజాన్ బచేలిలు ఉన్నారు. సందుబడి గ్రామంలో అక్రమంగా వ్యాన్లో విప్పపువ్వు తరలిస్తుండగా పట్టుబడ్డారు. -
తాగునీరు
త్వరలో ప్రతి గ్రామానికి ..భువనేశ్వర్: 2026 నాటికి అన్ని గ్రామాలకు తాగు నీటిని అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ హామీ ఇచ్చారు. పూరీలో గురువారం జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది ప్రజలు ఇప్పటికీ తాగునీరు, విద్యుత్ సరఫరా, పక్కా ఇల్లు, రహదారులు వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరంగా ఉన్నారని అన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం వికసిత్ గాంవ్, వికసిత్ ఒడిశా (అభివృద్ధి చెందిన ఒడిశా కోసం అభివృద్ధి చెందిన గ్రామం) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ ప్రత్యేక కార్యక్రమానికి రూ. 10,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. 2026 నాటికి ప్రతి గ్రామానికి తాగునీరు, రోడ్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందరికీ పక్కా ఇళ్లు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అభయం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంత్యోదయ గృహ జోజన (ఏజీజే) కింద నిరాశ్రయులు, దివ్యాంగులు, ప్రకృతి వైపరీత్య బాధితులు వంటి పేదలు, నిరుపేదలకు 5 లక్షల ఇళ్లను అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం అంత్యోదయ గృహ యోజన కోసం బడ్జెటులో రూ. 2,600 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో ఈ పథకం కింద మొత్తం రూ.7,550 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 314 మండలాల్లో రూ. 4,124 కోట్ల వ్యయ ప్రణాళికతో స్టేడియంల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సుభద్ర యోజన కింద 2 లక్షలకు పైగా మహిళా లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా ఆయన రూ. 200 కోట్ల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ మహిళలు 2 విడతల కింద సమగ్రంగా రూ.10,000 ఆర్థిక సాయం పొందారు. మహిళల ఆకర్షిత సుభద్ర యోజన పథకం కింద 2.09 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, తాగునీటి శాఖకు చెందిన 3 పోర్టల్లు ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, పంచాయతీ మానిటరింగ్ సిస్టమ్ మరియు ఈ–పంచాయత్ సభ పోర్టల్లు ఉన్నాయి. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన లబ్ధిదారులకు సబ్సిడీలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.78,000 సబ్సిడీని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 60,000 సబ్సిడీని అందజేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 613 పంచాయతీలకు ఐదో రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు కింద రూ. 32 కోట్లు పంపిణీ చేశారు. ● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి -
స్వగ్రామంలో ప్రశాంత్ శతపతి అంత్యక్రియలు
భువనేశ్వర్: జమ్ము కశ్మీరు పెహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ప్రశాంత్ శతపతి మృతదేహం బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ నుంచి గురువారం ఉదయం బాలాసోర్ జిల్లా ఇసాణి గ్రామానికి చేరుకుంది. గ్రామమంతా విషాద వాతావరణం నెలకొంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకులు, సీనియర్ పోలీసు అధికారుల వరకు అందరూ రాత్రి పొద్దుపోయే వరకు విమానాశ్రయంలో వేచి ఉన్నారు. పెహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రశాంత్ శతపతి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో గురువారం నిర్వహించారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, స్థానిక లోక్ సభ సభ్యుడు ప్రతాప్ చంద్ర షడంగి బాధిత కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి సంతాపం ప్రకటించారు. పుష్ప గుచ్ఛంతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబీకులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. దివంగత ప్రశాంత శత్పతి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. కుమారుని విద్యాభ్యాసం బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వీటితో బాధిత కుటుంబీకులకు రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రశాంత్ మృత దేహం స్థానిక విమానాశ్రయం చేరడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్, రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, సీనియర్ పోలీసు అధికారులు నివాళులర్పించారు. ఆ తర్వాత మృతదేహం బాలాసోర్ జిల్లాలోని అతని స్వగ్రామం ఇసాణి గ్రామానికి తరలించారు. బాలాసోర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రశాంత్ శతపతి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుని మైనరు కుమారుడు ముఖాగ్ని పెట్టి తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రత్యక్షంగా అంత్యక్రియలకు హాజరయ్యారు. -
‘ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే’
పలాస: దండకారణ్యంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని ప్రగతిశీల కార్మిక సమాఖ్య డిమాండ్ చేసింది. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో బుధవారం మేడే కరపత్రాల ను ఆవిష్కరించారు. అన్ని ఊరూవాడల్లో కార్మిక పతాకాలను ఆవిష్కరించి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయా లని కోరారు. అలాగే కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలన్నారు. కనీసం వేతనం రూ.26వేలు చెల్లించాలని, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతి శీల కార్మిక సమాఖ్య జిల్లా కార్యదర్శి పుచ్చ దుర్యోధనరావు, అధ్యక్షుడు మద్దిల ధర్మారావు, దాసరి నారాయణమూర్తి, మామిడి గణపతి, గూడ మన్మధ, డొక్కర లక్ష్మణ, తామాడ గంగయ్య, మురిపింటి గంగయ్య, దాసర దానేశు తదితరులు పాల్గొన్నారు. -
ఆరు అడుగుల పుస్తకం ఆవిష్కరణ
గార: తెలుగు భాషా విజ్ఞానానికి సంబంధించి ఆరు అడుగుల పెద్ద పుస్తకాన్ని బుధవారం ఉపాధ్యాయు లు, విద్యార్థులు ఆవిష్కరించారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా అంపోలు పంచాయతీ ఆడవరం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం భోగెల ఉమామహేశ్వరరావు ఈ పుస్తకాన్ని తయారు చేశారు. వీటిలో అక్షర వర్ణమాల, గుణింత పేర్లు, పదాలు, పద్యాలు, గురజాడ, గిడుగు, వేమన వంటి సాహిత్య కవుల చరిత్రలు, పాఠశాల ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. పుస్తక జ్ఞానంలో మనిషి విద్యావంతుడు అవుతాడన్నారు. -
ఉగ్రదాడి హేయకరమైన చర్య
భువనేశ్వర్: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద సంఘటనలో రాష్ట్రానికి చెందిన ప్రశాంత శత్పతి మరణం పట్ల రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి సమావేశం వాయిదా వేసినట్లు అధ్యక్షడు భక్త చరణ్ దాస్ ప్రకటించారు. ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను దారుణంగా హత్య చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ దుఃఖ సమయంలో బాలసోర్ రెముణాకు చెందిన ప్రశాంత్ శత్పతి కుటుంబానికి పీసీసీ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ లల్లూ, పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, పీసీసీ మాజీ అధ్యక్షులు నిరంజన్ పట్నాయక్, జయదేవ్ జెనా, శరత్ పట్నాయక్, ప్రసాద్ హరిచందన్, శ్రీకాంత్ జెనా తదితరులు పాల్గొన్నారు. జయపూర్ ఎయిర్పోర్టులో అప్రమత్తత కొరాపుట్: టెర్రరిస్ట్ దాడుల నేపథ్యంలో జయపూర్ ఎయిర్ పోర్టులో ముందస్తు అప్రమత్తత ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఎయిర్పోర్టులో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడులు, విమానాల హైజాక్ వంటి ఘటనల సమయంలో ఎలా వ్యవహరించాలో ప్రయాణికులకు తెలియజేశారు. కొట్పాడ్లో అమరులకు నివాళులు.. పెహల్గాంలో టెర్రరిస్ట్ దాడుల్లో మృతి చెందిన వారికి కొరాపుట్ జిల్లా కొట్పాడ్ పట్టణంలో నివాళులు అర్పించారు. సిద్దార్ధ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. -
ఫిట్లెస్ సెంటర్
శ్రీకాకుళం రూరల్: ఇటీవల ఓ ప్రైవేట్ బస్సు కొందరు పాసింజర్లతో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తుండగా మార్గమధ్యంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో తుప్పల్లోకి దూసుకుపోయింది. దీంతో ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలయ్యాయి. అంతకు వారం రోజు ల కిందటే బస్సుకు ఫిట్నెస్ పరీక్ష చేయించినట్లు డ్రైవర్ తెలిపారు. ఆరా తీస్తే ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది శ్రీకాకుళం శివారులోని ఓ ఫిట్నెస్ సెంటర్ అని తెలిసింది. ఎవరూ టెస్ట్ డ్రైవ్ చేయకుండా, మిషన్లతో పూర్తిస్థాయిలో పరీక్షించకుండా కేవలం మాన్యువల్గా పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇదే ప్రమాదానికి కారణం. ఆర్టీఏ అధికారులెక్కడ..? ఒకప్పుడు బస్సుకు గానీ, లారీలకు గానీ చివరికి ఆటోలకు సైతం ఫిట్నెస్లు చేయించాలంటే నేరు గా అనుభవం ఉన్న ఆర్టీఏ అధికారి ఆ వాహనాన్ని కొంతమేర డ్రైవింగ్ చేసేవారు. తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రైవేట్ యాజమాన్య సంస్థలు లోపాలు గుర్తించడం లేదు. నామమాత్రంగా కొన్ని టెస్టులు చేసి అనుమతులు ఇచ్చేస్తున్నారు. నగరంలోని నాగావళి నదీ తీరాన, ఫాజుల్బేగ్ ప్రాంతం అగ్రికల్చర్ కార్యాలయం పరిధిలో వాహ న ఫిట్నెస్ సెంటర్లకు కొన్ని నెలల కిందట అనుమతులు ఇచ్చారు. ఇక్కడ వివిధ రకాలైన ట్రాన్స్పోర్టు (ఎల్లోబోర్డు) వాహనాలన్నింటికీ మిషనరీతోనే బండి కండీషన్లకు పర్మిషన్లు ఇస్తున్నాయి. ఇక్కడ అనుభజ్ఞులైన ఆర్టీఏ అధికారులంటూ ఎవ్వరూ లేరు. ప్రైవేట్ యాజమాన్య సంస్థ పెట్టుకున్న సిబ్బందితోనే తూతూ మంత్రంగా వాహనాలకు ఫిట్నెస్లు జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆటో నుంచి తోక లారీ వరకూ ఎలాంటి వాహనానికై నా ఫిట్నెస్కు సంబంధించిన అన్ని అనుమతులు ఆ ప్రైవేట్ యాజమాన్య సంస్థే ఫిట్నెస్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఆర్టీఎ అధికారుల పాత్ర, అప్రూవుల్ అంటూ ఏమీ లేకుండా పోయింది. ఏజెంట్లకు పండగే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఏజెంట్ల ఆశలు చిగురించాయి. వారు ఇచ్చిన టోకెన్ నంబర్ ఆధారంగానే ఏదైనా బండికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు త్వరితగతిన వచ్చేస్తున్నాయి. పొరపాటున నేరుగా ఆన్లైన్ ద్వారా ఎఫ్ఫీకు సంబంధించిన స్లాట్ను వాహన యజ మాని బుక్ చేసుకుంటే అది పూర్తిగా ఫెయిల్ అవ్వాల్సిందే. ప్రభుత్వ ఆధీనంలో ఫిట్నెస్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒకసారి స్లాట్ బుక్ చేసుకుంటే రెండోరోజుకు కూడా మా ర్చుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఫిట్నెస్ సెంటర్లో ఆ పరిస్థితి లేకుండా పోయింది. భారీ దోపిడీ కేంద్రంలో వివిధ రకాలైన వాహనాలపై భారీ దోపిడీ జరుగుతోంది. ఇదంతా ఏజెంట్ల ద్వారానే కమిషన్ పద్ధతిలో నడుస్తోంది. స్థానికంగా ఏర్పాటు చేసిన రేట్లు కంటే అధిక రేట్లకు ముందస్తుగానే ఏజెంట్ ద్వారా డబ్బులు లాగేస్తున్నారు. ఒక్క రోజులోనే నంబర్ ప్లేట్ల జారీ వాస్తవంగా ఏదైనా బండి ఫిట్నెస్ కేంద్రానికి వెళ్తే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి. ఇది బండి కొన్న నెలరోజులకే షోరూంకు వస్తుంది. కానీ ఫిట్నెస్ కేంద్రంలో ఒక్క రోజులోనే నంబర్ ప్లేట్ను ఏర్పాటు చేస్తూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు రూ. 20 విలువ చేసే రిఫ్లెక్టివ్ రెడ్ టేపును బండికి అంటించడానికి రూ. 300 నుంచి రూ.500 వరకూ దోచేస్తున్నారు. శ్రీకాకుళం శివారులో వాహన ఫిట్నెస్ సెంటర్ ఏజెంట్ కోడ్తో బుక్ చేసుకుంటేనే ఫిట్నెస్ మంజూరు ఆర్టీఏ అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థ పేరుతో పత్రాల జారీ పట్టించుకోని రవాణాశాఖ అధికారులు ఫిర్యాదులు మా దృష్టికి వస్తున్నాయి ఫిట్నెస్ కేంద్రంపై ఫిర్యాదులు వస్తున్నాయి. గ తంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నపుడు బండి కండీషన్ చూస్తూ ఫిట్నెస్ సర్టిఫికేట్లు అందించేవాళ్లం. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ప్రైవేట్ పరం చేశారు. మా పాత్ర అంటూ ఏమీ లేదు. – విజయ సారథి, డీటీసీ టోకెన్ తీసుకున్నాం ఆటో ఫిట్నెస్ కోసం ఏజెంట్కు రూ.3000 డబ్బులు ఇచ్చి ఫిట్నెస్ టోకెన్ తీసుకున్నాం. ఉదయం 10 గంటలకు ఫిట్నెస్ కేంద్రంలో బండి పెట్టాను. మధ్యాహ్నం 3 గంటలకు బండి ఇచ్చారు. గతంలో ప్రభుత్వ ఆధీనంలో బండి ఫిట్నెస్ చేసుకుంటే రూ.1000తోనే సరిపోయేది. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక్కడ ప్రతి దానికి అధికంగా డబ్బులు కట్టాల్సిందే. – మురళి, ఆటో డ్రైవర్ -
అంబులెన్స్లో ప్రసవం
మందస: మందస మండలం కుడుమాసాయ్ గిరిజన గ్రామంలో ఓ మహిళ అంబులెన్స్లో ప్రసవించారు. ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. అంబులెన్స్లో ఆమెను తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో నొప్పులు అధికం కావడంతో వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇద్దరినీ హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. 108 సిబ్బంది ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలెట్ రామచంద్రారెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెంలో ఈ నెల 26వ తేదీన పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం పర్యవేక్షించారు. గ్రామంలో ఏర్పాటు చేయనున్న సభ, హెలీప్యాడ్ ఏర్పాటు, వాహ నాలు పార్కింగ్, మత్స్యకారులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. పుస్తక ప్రదర్శన శ్రీకాకుళం అర్బన్: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ కా ర్యదర్శి బి.కుమార్రాజు మాట్లాడుతూ పుస్తకం మంచి నేస్తం వంటిదని అన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పించడం జరిగిందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాని సూచించారు. ఈ ప్రదర్శనలో రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, నాటికలు, ఇయర్ బుక్స్, నిఘంటువులు, పోటీ పరీక్షలకు సంబంధించిన 200 రకాల పుస్తకాలు ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప గ్రంథాలయాధికారి వీవీజీఎస్ శంకరరావు, పై.మురళీ కృష్ణ, యు.కల్యాణి, టి. రాంబాబు, పి.రామ్మోహన్ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. కందుకూరి పురస్కార గ్రహీతలకు సత్కారాలు శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని వాసవీ కల్యాణ మండపంలో సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో ఇటీవల కందుకూరి పురస్కారాలు అందుకున్న కళాకారులను బుధవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. పురస్కారాలు అందుకున్న మెట్ట పోలినాయుడు, గుత్తు చిన్నారావులకు జ్ఞాపికలు, సన్మాన పత్రాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సమాఖ్య సభ్యులు, సుమిత్రా కళాసమితి సభ్యులు పాల్గొన్నారు. ఇంటి బాట.. టెక్కలి: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులంతా ఇంటి బాట పట్టారు. బుధవారం తరగతుల నిర్వహణ చివరి రోజు కావడంతో, సుదూర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులంతా వసతి గృహాల వద్దకు చేరుకుని వారి పిల్లలకు సంబంధించి సామ గ్రితో ఇంటి బాట పట్టారు. మళ్లీ జూన్ 12 న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. -
పునరావృతం కాకుండా చూడాలి
గార: శ్రీకూర్మం క్షేత్రంలో తాబేళ్లు దహనం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బీజేపీ నాయకులు అధికారులను కోరారు. బుధవారం కూర్మనాథాలయానికి జనసేన నాయకుల తో కలసి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాబేళ్ల మరణానికి గల కారణాలు విశ్లేషించాలని, దహనం చేయడంలో ఎవరు చేశారన్నది త్వరగా విచారించాలని కోరారు. కార్యక్రమంలో పైడి వేణుగోపాలరావు, శివ్వాన ఉమామహేశ్వరి, బిర్లంగి ఉమామహేశ్వరరావు, పండి యోగీశ్వరరావు, పైడి సిందూర, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
భారీగా ఆవుల అక్రమ రవాణా
కొరాపుట్: ఆవుల అక్రమ రవాణాని ప్రజలు అడ్డుకున్నారు. మంగళవారం సాయంత్రం జయపూర్ పట్టణం లో జయనగర్ మీదుగా వరుసగా వాహనాలతో ఆవులు తరలించడాన్ని స్థానికులు గమనించారు. ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి వాహనాలు అడ్డగించారు. అప్పటికే రెండు వ్యాన్లు ప్రజలను చూసి వేగంగా వెళ్లిపోయాయి. వెనుక ఉన్న 9 వ్యాన్లను ప్రజలు అదుపులోకి తీసుకున్నారు. వాటిని నడుపుతున్న డ్రైవర్లపై దాడికి దిగారు. ఇది తెలిసి హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళకు దిగారు. పోలీసు బలగాలు చేరుకుని ప్రజల నుంచి వాహన డ్రైవర్లను రక్షించారు. ఈ వాహనాలు కొరాపుట్ జిల్లాలోని జయంత్ గిరి నుంచి ఆంధ్రా బోర్డర్ లోని పాడువకి తరలిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. -
ప్రకృతి వ్యవసాయంతో నేలకు మేలు
పాతపట్నం: ప్రకృతి సాగుతో అటు నేలకు, ఇటు పంటకు ఎంతో మేలు జరుగుతుందని తద్వారా రైతుకు ఆదాయం సమకూరుతుందని ప్రకృతి వ్యవసాయం అడిషనల్ డీపీఎం ధనుంజయ అన్నారు. మండలంలోని మెట్టుపేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి సహజ సిద్ధ ఆహారంపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి నుంచి పండించే బెల్లం, వేరు శనగ, కొర్రెలు, కారం, రాగులు, చింతపండు వంటి పదార్థాలు తీసుకోవడం వద్ద కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. ప్రకృతి వ్యవసా యం చేస్తూ మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని రైతులకు, మహిళా సంఘాలకు వివరించారు. కార్యక్రమంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ రేణుక, గోవిందరెడ్డి, శివాజీ, సువర్ణరావు, శ్రావ్య, భారతి, రైతులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం ప్రారంభం
కొరాపుట్: కేంద్ర, రాష్ట్రాలలో మత సామరస్యమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీకి చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మైనారిటీ, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో ప్రకటించారు. జయపూర్ పట్టణంలోని సంధ్యా పంక్షన్ హాలులో హజ్ యాత్రికుల శిక్షణా శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో తొలిసారిగా కొరాపుట్లో ప్రభుత్వం హజ్ యాత్రికుల శిక్షణా శిబిరం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 36 మంది యాత్రికులకు ప్రభుత్వం తరఫున శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జయపూర్ ముస్లిం అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ మీర్జా ముస్తాఫా బేగ్, బీజేపీ నేత హిమాంశు మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
భువనేశ్వర్ – పూరీ హైవే విస్తరణ
భువనేశ్వర్: భువనేశ్వర్–పూరీ హైవే విస్తరణకు మార్గం సుగమం అయింది. ఈ మార్గం 6 వరుసలుగా విస్తరించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం మేరకు ఈ విస్తరణ వ్యయ ప్రణాళిక రూ.1,200 కోట్లు. దీని వల్ల ఈ మార్గంలో ప్రయాణ సమయం ముప్పావు గంటకు పరిమితం అవుతుంది. ఈ మార్గం 8 వరుసల విస్తరణతో సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనివల్ల భువనేశ్వర్ పూరి మధ్య ప్రయాణ సమయం 90 నిమిషాల నుంచి 45 నిమిషాలకు తగ్గుతుంది. రాష్ట్ర రహదారులు త్వరలో అత్యున్నత నాణ్యత, స్థాయిలో అమెరికా రహదారులకు సమానంగా ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భువనేశ్వర్, పూరీ మధ్య 8 లైన్ల రహదారి రాబోయే 100 ఏళ్ల అవసరాలను తీర్చగలదు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు ప్రతిపాదిత తీరప్రాంత రహదారిని 4 వరుసలుగా విస్తరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. -
ఘటమెత్తిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కేంద్రంలో జరిగిన ముత్యాలమ్మ ఘట జాతరలో స్థానిక ఎమ్మెల్యే పవిత్ర శాంత ఘటం ఎత్తారు. ముగింపు ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. మొక్కుబడిగా ఘటం మోశారు. స్థానిక కళాకారులతో కలిసి నృత్యం చేశారు. పూరీలో పర్యటన కొరాపుట్: కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పూరిలో పర్యటిస్తోంది. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క నేతృత్వంలో కమిటీ ఆయా ప్రాంతాలను సందర్శించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణా ప్రాంతాల్లో అమలవుతున్న తీరుపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. దివ్యాంగులకు బ్రెయిలీ ఉపకరణాలు కొరాపుట్: దివ్యాంగులకు బ్రెయిలీ డివైజ్ల పంపిణీ జరిగింది. సోమవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని కలక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో స్వయంగా దివ్యాంగ బాలలకు అందజేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాయంతో అన్నై స్మార్ట్ బ్రెయిలీ డివైజ్లను ఉచితంగా పంపిణీ చేశారు. -
మహేంద్రతనయలో పడి వృద్ధుడు మృతి
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి మచ్చమర గ్రామంలో మహేంద్రతనయ నదిలో బుధవారం మధ్యాహ్నం ఒక వృద్ధుడు స్నానానికి వెళ్లి మునిగి మృతిచెందాడు. ఉప్పలాడ పంచాయతీ మచ్చమర గ్రామానికి చెందిన హనుమంత బాలకృష్ణ (62) నదికి స్నానం కోసం వెళ్లి మునిగి మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న గురండి పోలీసు ఐఐసీ ఓం ప్రకాష్ పాత్రో మచ్చమర గ్రామానికి విచ్చేసి అగ్నిమాపక దళం సిబ్బంది ద్వారా మృతదేహాన్ని బయటకు తీయించి పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిర్మాణ ప్రాజెక్ట్ మానిటరింగ్ డాష్బోర్డు ప్రారంభం భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి పనుల శాఖ ప్రాజెక్ట్ మానిటరింగ్ డాష్బోర్డ్’ను బుధవారం ప్రారంభించారు. ఇది వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వాస్తవ కార్యాచరణ (రియల్–టైమ్) పర్యవేక్షణకు వీలు కల్పిస్తుంది. ప్రాజెక్టుల దోషరహిత అమలును నిర్ధారించి సామర్థ్యం మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అధునాతన ఏఐ డాష్బోర్డ్ అన్ని ప్రధాన ప్రాజెక్టులతో సహా ప్రభుత్వ ఆస్తులు, కొనసాగుతున్న ప్రాజెక్టుల తాజా వీక్షణను అందిస్తుంది. జిల్లా, మండల స్థాయిలో ప్రాజెక్టుల గురించి వివరణాత్మక సమాచారం అనుక్షణం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు కచ్చితమైన స్థానాలను గుర్తించడానికి సమాచారానికి సంబంధించిన ఉపగ్రహ పటాలు చూసేందుకు వీలవుతుంది. -
రైల్వే ప్రాజెక్టుల వేగవంతంపై దృష్టి
మల్కన్గిరి: రైల్వే ప్రాజెక్టుల వేగవంతానికి అధికారులు కృషి చేయాలని నవరంగపూర్ ఎంపీ బోలభద్ర మాఝి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి కార్యకలాపాల సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టాంగులు, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, జిల్లా అదనపు ఎస్పీ తాపాన్ నారాయణ్ రోతో, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రతాప్ కొత్తపల్లి, జిల్లా అదనపు కలెక్టర్ వేద్భర్ ప్రధాన్, జిల్లా అబివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర సభరో, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి తదితరులు పాల్గొన్నారు. -
బావిలో మునిగి ఇద్దరు యువకుల దుర్మరణం
రాయగడ : బావిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందారు. మృతులు చంద్రపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బందిరి గ్రామంలో బుధవారం తేతే టంగరంగ(25), చిత్తరంజన్ టంగరంగ(28)లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకుతీశారు. కలిమావీధిలోని తాగునీటి బావిలో చెత్త పేరుకుపోవడంతో శుభ్రం చేసేందుకు చిత్తరంజన్, తేతేలు లోపలికి దిగారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఊపిరాడక విలవిల్లాడారు. బయటకు రాలేకపొవడంతో మృతి చెందారు. ఎప్పటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . -
తాగునీటి కష్టాలను పట్టించుకోరా?
రాయగడ : ఓ వైపు భానుడి ప్రతాపం..మరోవైపు తాగునీటి ఎద్దడితో ప్రజలు విలవిల్లాడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తగదని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. ఈ మేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు లేఖ పంపించారు. కొద్దిరోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి మండుతున్న ఎండల నేపథ్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారని, అయినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మిరావలి గ్రామంలోని ఆదివాసీ, గౌడ వీధుల్లో సమస్య మరింత తీవ్రంగా ఉందన్నారు. గొట్టపు బావులు పాడై నెలలు గడిచినా పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
యువజన కాంగ్రెస్ నేతలకు పరామర్శ
కొరాపుట్: భువనేశ్వర్ జైలులో ఉన్న యువజన కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పరామర్శించారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ముట్టడి నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఈ నేపథ్యంలో క్యాడర్లో మనోధైర్యం పెంచడానికి ముఖ్య నాయకులు జైలును సందర్శించారు. అనంతరం పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అజయ్కుమార్ లలూ మాట్లాడుతూ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. అంతకుముందు లలూకు భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో సీఎల్పీ నాయకుడు రాం చంద్ర ఖడం, జయదేవ్ జెన్నాలు స్వాగతం పలికారు. జయపూర్ యువతికి సివిల్స్లో 48వ ర్యాంక్ కొరాపుట్: సివిల్స్ ఫలితాలలో జయపూర్కు చెందిన రిథిక రథ్కు 48వ ర్యాంక్ వచ్చింది. ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కొరాపుట్ కలెక్టర్కు అభినందన కొరాపుట్: కొరాపుట్ కలెక్టర్ను సీఎం మోహన్ చరణ్ మఝి, ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా అభినందించారు. బుధవారం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో సీఎం, డిప్యూటి సీఎంలను కలెక్టర్ వి.కీర్తివాసన్ మర్యాద పూర్వకంగా కలిశారు. కొరాపుట్ జిల్లాకు ప్రధాన మంత్రి అవార్డుని పీఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా కలెక్టర్ అందుకున్న విషయం విధితమే. ఈ అవార్డుతో కలెక్టర్ వచ్చారు. దీంతో కలెక్టర్ను సీఎం, డిప్యూటీ సీఎంలు అభినందించారు. పెహల్గామ్ మృతులకు నివాళులు రాయగడ: జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రమూకల దాడిలో చనిపోయిన వారికి స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు, వాణిజ్య, నాగరిక మంచ్ తదితర సేవా సంస్థలు నివాళులు అర్పించాయి. ఈ మేరకు గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. కళింగ వైశ్యసంఘానికి చెందిన సభ్యులు క్యాండిల్ వెలిగించి నీరాజనాలు పలికారు. ఉగ్రమూకల ఉన్మాదాన్ని ప్రముఖులు ఖండించారు. విషం తాగి మహిళ మృతి మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి మారివాఢ పంచాయతీ ఎంవీపీ 18 గ్రామానికి చెందిన సంజయ్ బిశ్వాస్ భర్య అపరజితా బిశ్వాస్ (32) మంగళవారం రాత్రి విషం తాగి మృతి చెందారు. సోమవారం సంజయ్కు అపరాజితకు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె మంగళవారం విషం తాగేశారు. భర్త స్థానికుల సాయంతో ఆమెను కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మల్కన్గిరి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. అయితే అపరాజిత తండ్రీ విద్యాన్ మండల్ మాత్రం భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఐసి హిమాంశు శేఖర్ బారిక్ కేసు నమోద్ చేసి దర్యాపతు చేస్తున్నారు. పోస్టుమార్టం అయ్యాక వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. -
మరణించిన మూడు రోజులకు అంత్యక్రియలు
కొరాపుట్: ఓ గర్భిణి మరణించిన మూడు రోజులకు అంత్యక్రియలు జరిగాయి. మంగళవారం రాత్రి కొరాపుట్ జిల్లా దఽశమంత్పూర్ సమితి లుల్లా గ్రామ పంచాయతీ నెర్కాగుడ గ్రామానికి చెందిన మహేశ్వర్ పరజ భార్య ధనుమతి ముదలి (27) అంత్యక్రియలు జరిగాయి. ఈ నెల 16వ తేదీన 5నెలల గర్భిణి అయిన ధనుమతి పై భర్త మహేశ్వర్ తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ధనుమతి పరిస్థితి విషమించింది. దాంతో భయపడి ఆమెని దశమంత్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ కోలుకోకపోవడంతో కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య శాలలో చేర్పించాడు. ఈ నెల 20వ తేదీన ధనుమతి మృతి చెందింది. 21న మృతదేహాన్ని గ్రామానికి తెచ్చిన మహేశ్వర్ గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో గ్రామ సరిహద్దులో మృతదేహం వదలి పారిపోయాడు. గ్రామస్తులు మృతదేహంతో గ్రామంలో ఆందోళనకి దిగాడు. చివరకు పోలీసులు చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో మంగళవారం రాత్రి అంత్యక్రియలు జరిగాయి. -
ఒడిశా వాసి మృతి
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పెహల్గామ్లో..భువనేశ్వర్: కాశ్మీర్లో సంభవించిన ఉగ్రవాదుల ఊచకోతలో రాష్ట్రానికి చెందిన శత్పతి (41) మృతి చెందారు. బైసరన్ గడ్డి మైదానంలో తన భార్య, తొమ్మిదేళ్ల కొడుకు కళ్ల ఎదురుగా ఉగ్రవాదులు ఆయనని కాల్చి చంపడంతో విషాదం నుంచి కోలుకోలేని పరిస్థితిలో కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. బాలాసోర్ జిల్లాలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)లో అకౌంట్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రశాంత్ శత్పతి ఎల్టీసీపై తన భార్య, కొడుకుతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ప్రశాంత్ బాలసోర్ జిలా రెముణ మండలం ఇషానీ గ్రామస్తుడు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. బైసారన్లోని రోప్వే నుంచి కుటుంబీకులతో కలిసి దిగుతుండగా ప్రశాంత్ శత్పతి తలకు గురి పెట్టి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గంట తర్వాత సైన్యం వచ్చింది అని అతని భార్య ప్రియ దర్శిని ఆచార్య తెలిపారు. ఊచకోతకు ఏబీవీపీ ఖండన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన క్రూరమైన దాడిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రశాంత శత్పతి మృతిపై ఏబీవీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు. స్థానిక ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ఆవరణలో గుమిగూడి ఉగ్రవాద చర్యల పరిస్థితిని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం త్వరగా, సమర్థంగా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు నినాదాలు చేశారు. బాధితులకు సంఘీభావం తెలిపారు. న్యాయం జరిగేలా భారత ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.న్యూస్రీల్ -
ఉత్తరాంధ్ర సాగునీటి కల సాకారమే లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర జిల్లాల సాగునీటి భవితవ్యాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పాత, కొత్త ప్రాజెక్టులన్నింటినీ సమాన ప్రాధాన్యతతో పూర్తి చేసి, ప్రతి చివరి భూమికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జలవనరుల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వంశధారపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నేరడి సైడ్ వియర్ వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలను వెంటనే తొలగించి, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా హిరమండలం రిజర్వాయర్కు నిరంతరాయంగా నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పనులు ఆలస్యం చేస్తున్న ఏజెన్సీలకు తక్షణమే నోటీసులు జారీ చేసి, టెండర్ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులకు నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, పనులు నెమ్మదిగా సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొట్ట ఎత్తిపోతల పథకం పూర్తయితే 12 టీఎంసీల నీరు హిరమండలం రిజర్వాయర్కు తరలించవచ్చని, ఇది కీలకమైన ప్రాజెక్టు అని మంత్రి తెలిపారు. గొట్ట బ్యారేజ్ ఆప్రాన్ పనుల కోసం రూ.12.81 కోట్ల టెండర్లను వెంటనే పిలవాలని ఆదేశించారు. షట్టర్ల కుంభకోణంపై చర్చ సందర్భంగా, కోర్టు అనుమతి పొంది వెంటనే షట్టర్లను స్వాధీనం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. నాగావళి–వంశధార నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. రణస్థలం పైడి భీమవరం పారిశ్రామికవాడకు సాగునీటి ప్రాజెక్టుల నుంచి నిరంతరాయంగా నీటి సరఫరా ఉండేలా చొరవ చూపాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు కోరారు. కళింగపట్నం, అంబల్లవలస ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంత్రిని కోరారు. -
మహిళల మనస్తత్వాన్ని మార్చలేం
● చెత్తను బయటపడేస్తారు.. కుళాయిలు విరిచేస్తారు.. ● జెడ్పీ స్థాయి సంఘ సమావేశంలో ఎమ్మెల్యే కూన వ్యాఖ్యలు శ్రీకాకుళం: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయమై మాట్లాడుతూ మహిళలు ఇంట్లో చెత్తను తీసుకువచ్చి బయట పడేస్తున్నారని, పరిసరాలు ఎలా ఉన్నా వారికి అనవసరమని చెప్పారు. తాగునీటి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు వీధి కుళాయిలు వద్దని, ఇంటింటి కుళాయిలే మంచివని చెబుతూ ఆడవాళ్లు కుళాయిల ట్యాపులు కట్టకుండా వదిలేసి వెళ్లిపోతారని, అవసరమైతే కుళాయిలను విరిచేస్తారని చెప్పారు. ఈ రెండు వ్యాఖ్యానాలు చేసిన అనంతరం మహిళలను కించపర్చటం తన ఉద్దేశం కాదంటూనే వారి మనస్తత్వం ఇలా ఉంటుందని, వారిని మార్చటం సాధ్యం కాదన్నారు. గ్రంథాలయ వ్యవస్థ వృథా.. పంచాయతీలకు వచ్చే ఆదాయంలో గ్రంథాలయ పన్ను పోతుందని అంటూ గ్రంథాలయ వ్యవస్థే పనికిరానిదని కూన పేర్కొన్నారు. ఆ వ్యవస్థకు ఒక చైర్మన్, జీతం, ఇతర ఖర్చులు కూడా వృథాయేనని చెప్పారు. ఈ వ్యవస్థ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ప్రగతి పథంలో నడిపించాలి.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో రాజకీయాలకు అతీతంగా పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో చేపడుతున్న సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ, పింఛన్లు తదితర ఖర్చుల వివరాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. పన్నులు వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహనరావు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
రాజధానిలో కిడ్నాప్ కలకలం
భువనేశ్వర్: నగరంలో మంగళవారం ఉదయం సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో బెదిరించి మైనరు బాలుడిని దుండుగులు అపహరించుకు పోయారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్రంగా కలవరపడ్డారు. స్థానిక ఎయిర్ ఫీల్డ్ పోలీస్ ఠాణా పరిధిలోని పంచగావ్ సమీపంలో తుపాకీతో బెదిరించి పిల్లవాడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు తలపై తుపాకీతో బెదిరించి బాలుడిని బలవంతంగా నల్లటి కారులోకి ఎత్తుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత కిడ్నాపర్లు ఆ చిన్నారి కుటుంబానికి ఫోన్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లిస్తే బాలుడిని సురక్షితంగా అప్పగిస్తామని చెప్పారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక నిఘా, స్థానిక నిఘా, వాహన ట్రాకింగ్ వ్యవస్థలను ప్రయోగించి చిన్నారిని సురక్షితంగా గుర్తించారు. పోలీసుల రాక గుర్తించి కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకోవడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. తుపాకీతో బెదిరించి బాలుడిని అపహరించిన దుండగులు రంగంలోకి దిగిన పోలీసులు బాలుడ్ని వదిలి పరారైన కిడ్నాపర్లు -
చరిత్ర తిరగరాద్దాం!
పుస్తకం తిరగేద్దాం.. శ్రీకాకుళం కల్చరల్: నేటి సాంకేతిక యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడంతో పుస్తకాలు చదివేవారు బాగా తగ్గిపోయింది. మనలో ఒంటరితనాన్ని పోగొట్టి మరో ప్రపంచంలోకి విహరింపజేసే పుస్తకాలే మనకు నిజమైన నేస్తాలని విద్యావేత్తలు చెబుతున్నారు. రోజులో కొంత సమయమైనా పుస్తక పఠనానికి కేటాయించాలని కోరుతున్నారు. నేటి తరంవారికి పుస్తకాలు చదవడం అంటే కేవలం పాఠ్య పుస్తకాలు చదవడం అనే అభిప్రాయం ఉంది. అందుకే సాధారణ పుస్తకాల చదవడం మానేశారు. ఇంకొందరు మాత్రం పుస్తకాలపై ప్రేమ చూపుతునే ఉన్నారు. తాము కొనుగోలు చేసిన, సేకరించిన పుస్తకాలతో ఇంట్లోనే లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజులో సగభాగం అందులోనే గుడుపుతుంటారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. జ్ఞాపిక శక్తి, భాషా పరిరక్షణకు పుస్తకాలే కీలకం పుస్తక పఠనం పెరగాలంటున్న విద్యావేత్తలు నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం ఏకాగ్రత కోసం.. ఏకాగ్రత కోసం పుస్తక పఠనం అవలవాటు చేసుకోవాలి. పుస్తకాలు మన ఆలొచనా దృక్పథాన్ని పెంచుతాయి. నేటి తరం యువత కూడా సాహిత్యం చదవడంపై శ్రద్ధ పెంచాలి. – ముట్నూరు ఉపేంద్రశర్మ, ప్రభుత్వ అధ్యాపకుడు, శ్రీకాకుళం ఏకై క నేస్తం.. మన వ్యక్తిత్వానికి, వికాసానికి అద్దం పట్టేది పుస్తకం. పుస్తక పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చు. అత్యంత ఉత్తమ సమాచార, ప్రచార, ప్రసాద సాధనం, మాధ్యమం పుస్తకమే. – జంధ్యాల శరత్బాబు, రచయిత -
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
● అనుమానాస్పదంగా విద్యార్థి మృతి ● లొద్దపుట్టి ఆర్హెచ్ కాలనీలో విషాదం ఇచ్ఛాపురం రూరల్: ‘అమ్మా...ఈ రోజు ఇంటికి వస్తున్నాను...’ అని కన్న కొడుకు తల్లికి ఫోన్లో సమాచారం అందించాడు. దీంతో ఆ తల్లి కొడుకుకు ఇష్టమైన వంటకాలు చేసి వేయి కళ్లతో ఎదురు చూడటం ప్రారంభించింది. ఉదయం ఫోన్ చేసిన కొడుకు రాత్రి పన్నెండు గంటలైనా ఇంటికి చేరకపోవడంతో ఫోన్ చేసింది. స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైంది. తెల్లారితే... కొడుకు చదువుతున్న కళాశాలకు ఫోన్ చేస్తే మృతి చెందాడన్న పిడుగులాంటి వార్తను చేరవేయడంతో ఆ తల్లి గుండె పగిలేలా విలపించింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామం ఆర్హెచ్ కాలనీకి చెందిన నెయ్యిల నీలాద్రి(లడ్డూ), ఢిల్లేశ్వరీల కుమారుడు గోపాల్(19). విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో సెకెండియర్ చదువుతున్నాడు. తండ్రి నీలాద్రి గల్ఫ్లో కూలి పనులు చేస్తున్నాడు. సోమవారం తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా....ఈ రోజు ఇంటికి వస్తున్నాను’ అంటూ చెప్పిన గోపాల్ అర్థరాత్రి వరకు ఇంటికి చేరక పోవడంతో మంగళవారం ప్రిన్సిపాల్కు ఫోన్ చేసింది. గోపాల్ విజయనగరంలోని రైలు కింద పడి మృతి చెందినట్లు చెప్పడంతో తల్లి కుప్పకూలిపోయింది. కుమారుడు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసేకునేంత పిరికి వాడు కాదని, కుమారుడు మృతి వెనుక కుట్రదాగి ఉందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యార్థి గోపాల్ మృతితో గ్రామంలో విషాధ చాయలు అలముకున్నాయి.