Odisha Latest News
-
‘పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించండి’
జయపురం: కళలు, క్రీడలు నేర్పే శిక్షకులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఒడిశా కళా, క్రీడా శిక్షక సంఘం జయపురం సబ్డివిజన్ శాఖ డిమాండ్ చేసింది. గురువారం కళా, క్రీడా శిక్షక సంఘం జయపురం నేతృత్వంలో పలువురు శిక్షకులు జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా వారు బీఈఓకు వినతి పత్రాన్ని అందజేయడానికి వెళ్లి ఆయన లేకపోవడంతో అదనపు బీఈఓకు అందజేశారు. 2013లో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న కళ, క్రీడా ఉపాధ్యాయుల నియుక్తికి ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందని, అప్పట్లో అభ్యర్థులు పరీక్షలు రాశారని, అందులో ఉత్తీర్ణులైన వారిని తాత్కాలిక టీచర్లుగా నియమించారని గుర్తు చేశారు. తమను పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని కోరారు. పన్నెండేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన బాట పడతామన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఉపాధ్యాయులు పద్మిణీ బెహర, సురేష్ కుమార్ నాయిక్,రాజేంధ్ర కుమార్ పట్నాయిక్,స్మిత రథ్,బబుల సాహు,మృత్యంజయ భొయ్, జ్యోతిర్మయి మిశ్రా, శిశిర కుమార్ డాకువ, మణికుమార్ మహాపాత్రో, సుజాత బారిక్, సపన నాయిక్, పద్మ చరణ చౌధురి, నర్సింగ ప్రసాద్ షొడంగి తదితరులు పాల్గొన్నారు. -
స్వగ్రామానికి వలస కార్మికుని మృతదేహం
జయపురం: పూనే–ట్రోన్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ నెల 16న రైలు నుంచి జారి కిందపడి మరణించిన వలస కార్మికుని మృతదేహం బుధవారం అతని స్వగ్రామం బొయిపరిగుడ సమితి బొదాపుట్ గ్రామ పంచాయతీ కురకుటి గ్రామం చేరింది. కురుకుటి గ్రామ వాసి బినోద్ ఖొడ (43)ఎంతో కాలంగా మహారాష్ట్రలోని లునావాలా గ్రామంలో ఒక ఒక కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట స్వగ్రామం వచ్చాడు. తిరిగి మహారాష్ట్ర వెళ్లేందుకు విశాఖపట్నంలో మహారాష్ట్ర లునావాల్కు రైలులో బయల్దేరాడు. ఈ నెల 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలోపూనే–ట్రోన్ రైలు మార్గంలో రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ట్రోన్ రైల్వే స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని గ్రామానికి రప్పించే విషయలో వారు బొయిపరిగుడ పోలీసులను సహాయం కోరారు. అనంతరం వారు కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చను ఆశ్రయించారు. మచ్చ వెంటనే ముంబాయి పోలీసులకు ఫోన్ చేసి మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేశారు. -
తీగ లాగితే..
జయపురం: జయపురం హటపోదర్లో ఒక ట్రాక్టర్ షోరూంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను కదిలిస్తే.. దొంగతనాల చిట్టా బయటపడింది. కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ గురువారం జయపురం సబ్డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7.30 గంటల సమయంలో జయపురం హటపొదర్ ప్రాంతంలో గెంబలి సోమేశ్వర రావు కుమారుడు గెంబలి వసంతరావు కోణార్క్ ఎంటర్ప్రైజర్స్ యజమాని పట్టణ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. 17వ తేదీ తెల్లవారు జాము 2.30 గంటలు–3 గంటల మధ్య కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు తన జాన్ డియర్ ట్రాక్టర్ల షోరూంలో ఐరన్ సేఫ్టీ లాకర్ను దొంగిలించారని, ఆ లాకర్లో రూ.2 లక్షల 50 వేల నగదు తో పాటు విలువైన లేండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు షోరూం టాప్ పై ఉన్న రూఫ్ను తొలగించి పై నుంచి తాళ్లతో ఐరన్ సేఫ్టీ లాకర్ ను బయటకు తీసి దొంగిలించారని నిర్ధారించారు. ఎస్ఐ ఎస్కే బెహరా తన పోలీసు సిబ్బందితో దర్యాప్తు జరుపుతూ దొంగల క్లూ తెలుసుకున్నారని, పోలీసులు రింకు బెనియ అనే వ్యక్తి ఇంటిపై రైడ్ చేసి దొంగను అదుపులోనికి తీసుకున్నారని ఎస్పీ తెలిపారు. పోలీసు స్టేషన్లో అతడిని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించాడని, ఆ దొంగతనంలో మరో ముగ్గురు ఉన్నారని వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడు రింకు బెనియ మరికొన్ని దొంగతనాలు వివరాలు కూడా వెల్లడించాడు. హటపోదర్లో గల స్టోన్ వరల్డ్ మార్బుల్ షోరూంలో ఒక ప్రింటర్తో పాటు క్యాష్ కౌంటింగ్ యంత్రాన్ని, మొబైల్ ఫోన్లు దొంగిలించాడు. అలాగే జయపురం ఎన్కేటీ రోడ్డులో సారవతీ ఏజన్సీస్ కొకొకొలా షోరూంలో రెండు పెద్ద సంచులలో డైరీ మిల్క్ చాకెట్లు దొంగిలించాడు. వీటి విలువ రూ.92,261లు ఉంటుంది. అలాగే హటపొదర్లో ఒక కాజు ఫ్యాక్టరీలో రూ.10 వేల నగదు దొంగిలించినట్లు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. జయపురం బైపాస్ రోడ్డులో ఒక గ్రాసరీ షాపులో ఒక మిక్చర్ బేగ్, ఒక హోమ్ థియేటర్లను దొంగిలించినట్లు వెల్లడించాడని తెలిపారు. అలాగే బరిణిపుట్ గ్రామంలో యమహా షోరూంలో 31 స్మార్ట్ వాచ్లు దొంగిలించాడు. నిందితుడు ఇచ్చిన వివరణ ఆధారంగా పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి గాంధీ చౌక్ సమీప కెనాల్లో వెతికించగా 6 గంటలు గాలించిన తర్వాత ఐరన్ సేఫ్టీ లాకర్ బయటపడింది. తర్వాత మరో నిందితుడు కను ముదులి ఇంటిపై పోలీసులు దాడి జరిపినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు దొంగిలించిన సామానులు పారాబెడ లో ఎల్ఎన్ స్టోర్స్ యజమాని జి.సూర్యనారాయణ పాత్రోకు అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. ఆ సామాన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ దొంగతనాల్లో నిందితులు బిజయ బెనియ ఉరఫ్ రింకు బెనియ(23)కను ముదులి (19)జి.సత్యనారాయణ పాత్రో(26) లపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పత్రికా ప్రతినిధు సమావేశంలో ఎస్.పివర్మ తో పాటు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి అంకిత కుమార్ వర్మ, జయపురం పట్టణ పోలీసు ఇన్చార్జ్ ,సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంధ్ర తండి పాల్గొన్నారు. -
హరా..కనరా
● సమస్యల వలయంలో గుప్తేశ్వర్ పుణ్యక్షేత్రంజయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి గుప్తేశ్వర్ పుణ్యక్షేత్రం సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతోంది. మహాశివరాత్రి కేవలం 6 దినాలే ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు గుప్తేశ్వరలో మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సమస్యలను విస్మరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బొయిపరిగుడ నుంచి గుప్తేశ్వర్ వరకు గల 35 కిలోమీటర్ల పొడుగునా రోడ్డు ఇరుపక్కల వేలాది చెట్లు ఉన్నాయి. వాటిలో అత్యధికం పడిపోయే స్థితిలో ఉన్నాయి. ఎండి పడిపోయే స్థితిలో ఉన్న చెట్లు తొలగించకపోతే భక్తులకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇదే మార్గంలో డొకిరీ,డొకరా ఘాట్లు ప్రమాదాలకు అడ్డాలుగా మారాయి. ఆ ప్రాంతాల్లో భక్తుల భధ్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. శబరీ నది ఘాట్ రోడ్డు అతి శోచనీయంగా ఉందని, అలాగే గుప్తేశ్వర్లో చెత్త కుప్పలు దుర్గంధాన్ని వెదజలుతున్నాయని వాటిని తొలగించి పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. గుప్తేశ్వర్లో టెలిఫోన్ నెట్వర్క్ పాడైపోయిందని 6 నెలల కిందట నెట్వర్క్ టవర్ బ్యాటరీ కాలిపోవటంతో నెట్వర్క్ పనిచేయటం లేదని అందువలన ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారని, నెట్వర్క్ పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. గుప్తేశ్వర్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, శిఱిగుడలో ఉన్న ఒక బోర్వెల్ నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారని, ఒక వేళ విద్యుత్కు అంతరాయం ఏర్పడితే తాగునీటి సరఫరా నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు. భక్తులకు రక్షిత తాగునీటి వనరులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే విద్యుత్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కేవలం 25 శౌచాలయాలు మాత్రం ఏర్పాటు చేస్తున్నారని, అవి భక్త జనాలకు సరిపోవని అందువల్ల మరికొన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. గుప్తేశ్వర్లో 40 దుకాణాలు ఉన్నాయి. మరో 80 స్టాల్సు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని వెంటనే పూర్తి చేయక పోతే భక్తులకు పూజా సామగ్రి, ఆహార దినుసులు అమ్మే వ్యాపారులు ఇబ్బందులు పడతారని అందువలన భక్తులకు అవసరమైన వస్తువులు లభించవని, అందుచేత వ్యాపారులకు అవసరమైన స్టాల్సు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. శబరీ నదిపై తాత్కాలిక వంతెన భక్తులు నది దాటేందుకు ఉందని, ముఖ్యంగా చత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చే వేలాది మంది భక్తులు తాత్కాలిక వంతెనే ఆధారమని, ఇకనైనా పర్మినెంట్ వంతెన చేయాలని సూచించారు. భక్తలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు తగినన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తుల కోసం జయపురం నుంచి తగినన్ని బస్సులు వేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
అర్ధశతాబ్దపు అద్భుతం
కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. కాలేజీ గోల్డెన్ జూబ్లీని శుక్రవారం నిర్వహించేందుకు సిబ్బంది సర్వం సిద్ధం చేశారు. 1974లో కాలేజీ ఏర్పాటైంది. కాలేజి మొదటి ప్రిన్సిపాల్ ఎద్దు గోపాలదాసు నాయుడు. ప్రస్తుతం కాలేజీలో 300 మంది వరకు చదువుతున్నారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన ఘనతను ఈ కాలేజీ సొంతం చేసుకుంది. ఇక్కడ చదువుకున్న వారు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొత్తూరులో కాలేజీ ఏర్పాటు కోసం స్థానిక నాయకుడు లోతుగెడ్డ చంద్రయ్య నాయుడు, మాజీ మంత్రి గొర్లె శ్రీరాములు నాయుడు కృషి చేశారు. 1972 ఏడాది నుంచి కాలేజీ కోసం ప్రయత్నాలు చేయగా 1974లో ఏర్పాటైంది. మొదట ఉన్నత పాఠశాల గదుల్లో తరగతులు ప్రారంభించారు. కొత్తూరు, భామిని, హిరమండలం, సీతంపేట, ముమ్మలక్ష్మిపురంతో పాటు పలు ప్రాంతాలకు ఈ కాలేజీ ఎంతో కీలకంగా నిలిచింది. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితి పోలీసుస్టేషన్ పరిధి గోవిందపల్లి పంచాయతీ నూవగూడ గ్రామం అడవి మార్గంలో చెట్టుకు వేలాడుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. దీంతో స్థానికులు వెంటనే మత్తిలి పోలీసులకు సమాచారం అందజేశారు. మత్తిలి ఐఐసీ దేవదత్తు మల్లిక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే మల్కన్గిరి ఎస్డీపీవో సచిన్పటేల్ కూడా వెళ్లి మృతదేహంపై విచారణ చేపట్టారు. అయితే అక్కడ ఎవరికీ తెలియదని చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. 43 కేజీల గంజాయి పట్టివేత మల్కన్గిరి: జిల్లాలోని మల్కన్గిరి సమితి చలాన్గూడ గ్రామం వద్ద 43 కేజీల గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీష్గడ్ రాష్ట్రం బస్తర్ జిల్లాకు చెందిన తనీష్ బాగెల్, దినేష్ కశ్యప్, నాగేశ్ యాదవ్, పుష్పరాజ్ బట్టిలు మల్కన్గిరి ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం తిరిగి బస్తర్ వెళ్తున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు అతివేగంగా వెళ్లడం గమనించి చలాన్గూడ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎకై ్సజ్ పోలీసులు ఆపారు. అనంతరం బైక్లపై ఉన్నటువంటి బస్తాలను తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో వెంటనే వారిని అరెస్టు చేశారు. అలాగే వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, ఆధార్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. 43 కేజీల గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ.4.40 లక్షలు మల్కన్గిరి ఎకై ్సజ్ ఎస్ఐ ఆశిష్ కుమార్ బోయి తెలిపారు. చోరీ కేసులో దొంగలు అరెస్టు కొరాపుట్: ఒక చోరీ కేసుకు సంబంధించి దొంగలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీసుస్టేషన్ ఐఐసీ సంబిత్ కుమార్ బెహర ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 22వ తేదీన రంగమట్టిగుడ గ్రామానికి చెందిన కై లాస్ కుమార్ చౌదరి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో బీరువాలు పగలుగొట్టి 15 గ్రాముల బంగారు, 40 గ్రాముల వెండి వస్తువులు, రూ.40 వేల నగదు దోచుకెళ్లారు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో దసరా పొద ప్రాంతానికి చెందిన అంజు హరిజన్, ధనుర్జయ హరిజన్లు దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. కేసును ఎస్ఐ కులభూషణ్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు. జిమిడిపేటను సమితిగా గుర్తించాలి రాయగడ: సదరు సమితి పరిధిలోని జిమిడిపేట పంచాయతీని సమితిగా గుర్తించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఫరూల్ పట్వారీకి వినతిపత్రం గురువారం అందజేశారు. జిమిడిపేటకు సమీపంలోని కెరడ, హటోశశిఖాల్, గజ్జిగ, ఇరుకుబడి, బైరాగి హలువ వంటి పంచాయతీలతో కూడిన సమితిగా జిమిడిపేటను గుర్తించగలిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆరు పంచాయతీల్లో సుమారు 50 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో వారి ఆర్థిక, సామాజిక రంగాలు కూడా ఎంతో మెరుగుపడే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మితా పువల తదితరులు పాల్గొన్నారు. -
గోవుల వాహనాలు సీజ్
సరుబుజ్జిలి: కబేళాకు మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 28 గోవులను పట్టుకున్న ట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు. హిరమండ లం నుంచి వాహనాల్లో పశువుల రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో గురువా రం సరుబుజ్జిలి జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. మూడు వాహనాల్లో ఉన్న 8 మందిని విచారణ చేయగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గోవుల ను కొనుగోలుకు చేసి కబేళాకు తరలించినట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. వీరిపై కేసు లు నమోదు చేసి వామనాలను సీజ్ చేసి ఆమ దాలవలస జూనియిర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. గోవులను విజయనగరం జిల్లా గుర్జంగివలస గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా జగన్నాయకులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అదనపు జడ్జి కోర్టు, జిల్లా ఫ్యామిలీ కోర్టు ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సోంపేట కోర్టు పీపీ దువ్వు జగన్నాయకులు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టుకు వచ్చిన ఈయన న్యాయమూర్తులను, బార్ సభ్యుల ను, ఇప్పటి వరకు పీపీ బాధ్యతలు నిర్వర్తించి న వాన కృష్ణచంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బార్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ని సూర్యారావు, జిల్లా బార్ ప్రతినిధులు మరిసర్ల అన్నంనాయుడు, బీసీ న్యాయ వాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వరరావు, ఎన్.శ్రీరామమూర్తి, బొత్స సుదర్శన్, టి.రామారావు, ఎన్.దుర్గా శ్రీనివాసరావు, జి.వెంకటేష్ పాల్గొన్నారు. పట్టుబడిన వాహనం -
మార్చి 15లోగా పనులు పూర్తి
పర్లాకిమిడి: స్థానిక రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మార్చి 15వ తేదీలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈస్టుకోస్టు వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు అన్నారు. పనులను పరిశీలించేందుకు గురువారం ఆయన పర్లాకిమిడి విచ్చేశారు. భారత్ అమృత్ స్టేషన్ల నవీకరణలో భాగంగా పర్లాకిమిడి రైల్వేస్టేషన్లో సుమారు రూ.20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో స్టేషన్లో ఓవర్ బ్రిడ్జి, రైల్వే కేటరింగ్ సర్వీసెస్, టాయిలెట్స్, కింగ గ్రామ రోడ్డు వద్ద లైటింగ్, ప్లాట్ ఫారం పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్ఎం మనోజ్ కుమార్ రైల్వే ఇంజినీర్లుతో మాట్లాడి తిరిగి విశాఖపట్నం బయల్దేరారు. ఆయనతో పాటు సీనియర్ డివిజనల్ మేనేజర్(విశాఖపట్నం) అరుణ్ కుమార్ మహారాణా తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ పోలీసు స్టేషన్ కెరాపుట్ గ్రామ సమీప రోడ్డులో పార్క్ చేసి ఉన్న ఒక నీలగిరి కలప ట్రక్కును వెనుక నుంచి ఒక బైక్ ఢీకొనటంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తులు బొదాగుడ గ్రామానికి చెందిన లక్ష్మణ పొరజ, కుమ పోరజ అని పోలీసు అధికారి సూరత్ ప్రధాన్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి బొదాగాం వాసి పూర్ణ అని, వెంటనే అతడిని బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. పోస్టు మార్టం జరిపిన తరువాత వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పజెప్పారు. బొరిగుమ్మ పోలీసు అధికారి సూరత్ ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం బొదాగుడ ప్రాంత నుంచి లక్ష్మణ పోరజ, కుసు పొరజ, పూర్న పొరజలు ఒక బైక్పై బిజసింగపూర్లో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. వారు రాత్రి తిరిగి తమ గ్రామానికి వస్తుండగా కెరాపుట్ గ్రామ సమీపంలో నీలగిరి కలప రవాణా చేస్తున్న ఒక ట్రక్కు నిలిపి ఉంది. ఆ విషయం తెలియని బైక్ నడుపుతున్న వ్యక్తి నేరుగా ట్రక్కు వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలం వద్దే లక్ష్మణ, కుములు మరణించారని పోలీసు అధికారి వెల్లడించారు. మరో వ్యక్తి పూర్ణ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని పూర్ణను బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రెండు వాహనాలను సీజ్ చేశారు. -
నిందితుడి అరెస్ట్
● తక్కువ ధరకే బొలెరో ఇప్పిస్తానని చెప్పి మోసం.. కొరాపుట్: బొలెరో తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిని కొరాపుట్ జిల్లా పొలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కొరాపుట్ ఎస్ఐ కృష్ణకుమారి ప్రదాన్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 27వ తేదీన కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలాబ్నగర్కు చెందిన ఎస్.జయసేన్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కటక్ చెందిన ప్రదోష్ పాత్ర తనకు తక్కువ ధరకే బొలెరో వాహనం విక్రయిస్తానని మోసం చేశారు. తమ సంస్థ వివిధ వేలం పాటలలో పాల్గొని తక్కువ ధరకే వాహనాలు కొని స్వల్ప లాభానికే విక్రయిస్తుంటామని చెప్పాడు. అందుకు తగిన ఫొటోలు చూపించాడు. ప్రదోష్ మాటలు నమ్మిన జయసేన్ రూ.6.35 లక్షలు ఇచ్చాడు. కొన్నిరోజుల తర్వాత ప్రదోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అతని నివాసం వద్దకు వెళ్లి చూసేసరికి ఖాళీ చేసి ఉంది. మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు గతంలో ఉపయెగించిన ఫోన్ నంబర్లు, సీడీఆర్, ఐఎంఈఐల ద్వారా కొత్త ఫోన్ నంబర్ కనిపెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ..2 లక్షల నగదు, 7 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. -
పర్లాకిమిడిలో చిరుజల్లులు
పర్లాకిమిడి: గురువారం సాయంత్రం పట్టణంలో కొంతసేపు చిరుజల్లులు కురిశాయి. రాష్ట్రంలో రాజధానితో పాటు జగత్సింగ్పూర్, భద్రక్, కొరాపుట్, రాయగడ, గంజాం జిల్లాలో ఆరెంజ్ వార్నింగ్, గజపతి జిల్లాలో ఎల్లో వార్నింగ్ను ఐఎండీ జారీ చేసింది. నాలుగు రోజుల పాటు గజపతి జిల్లాలో చిరుజల్లులు లేదా అక్కడక్కడ వడగళ్ల వాన కురవనున్నట్టు వాతావరణ శాఖ నిపుణులు ప్రకటించారు. రిమ్స్ సమస్యలపై కలెక్టర్ ఆరా శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల సమస్యలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. ‘రిమ్స్ విద్యార్థుల ఆకలి కేకలు, రిమ్స్ హాస్టల్లో కాలకృత్యాలుకూ కష్టమే’ శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. తొలుత విద్యార్థి నాయకులను పిలిపించి మాట్లాడారు. హాస్టల్లో మెస్ విద్యార్థుల ఆధ్వర్యంలో నడుస్తోందని, వారు సరైన ఆహారం సరఫరా చేయని పక్షంలో వారిని మార్చే వెసులుబాటు ఉందన్నారు. విద్యార్థులంతా సమావేశమై ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రిన్సిపాల్, వార్డెన్లతో మాట్లాడి సరైన ఆహారం సరఫరా అయ్యేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ఏపీఎంహెచ్ఐడీసీ అధికారులను పిలిపించి మరుగుదొడ్ల సమస్య లేకుండా చూడాలన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, తాగునీరు సమస్య పరిష్కరించాలని సూచించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి టెక్కలి: కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారిలో పెద్దబమ్మిడి సమీపంలో ఈ నెల 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావుపేట గ్రామానికి చెందిన బాన్న ప్రత్యుష(29) గురువారం మృతి చెందింది. తన భర్త నడుపుతున్న ఆటోలో ప్రయాణిస్తూ కారును ఢీకొనడంతో ప్రత్యుష తీవ్రంగా గాయపడింది. భార్యభర్తలు ఇరువురు డాన్సు మాస్టర్లుగా పని చేసేవారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఎస్ఐ వి.సత్యన్నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మృతదేహం నగర వాసిదే శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని హయాతినగరం సమీప నాగావ ళి నదీ తీరంలో బుధవారం కలకలం రేపిన మృతదేహం వివరాలను పోలీసులు గుర్తించారు. మీడియాలో కథనాలు చూసి కుటుంబ సభ్యులే గుర్తుపట్టి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని తోటపాలెం జంక్షన్ సమీప నీలమ్మకాలనీకి చెందిన దండు త్రినాథరావు (45) మద్యానికి బానిసయ్యాడు. ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బయటకెళ్లి కొన్నాళ్ల తర్వాత తిరిగొచ్చేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14న ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఇలా జరుగుతుందని అనుకోలేదని భార్య వెంకటలక్ష్మి వాపోయారు. త్రినాథరా వు పీఎస్ఎన్ఎం స్కూల్ సమీప దుకాణంలో కమ్మరి పనిచేస్తుండేవాడు. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా వినాయకం బాధ్యతల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కుడిమి వినాయకం గురు వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన గతంలో పల్నా డు జిల్లాలో రెవెన్యూ డివిజనల్ అధికారిగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ అందజేసేలా కృషి చేస్తానన్నారు. -
వివాహ వేడుక
పర్లాకిమిడి: ‘కహానా’ చారిటబుల్ ట్రస్టు (బరంపురం) 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గీతాభవన్లో గురువారం పేద వధూవరులకు సామూహిక వివాహ వేడుకను నిర్వహించారు. గంజాం జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన ఎనిమిది జంటలను ఎంపిక చేసి వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు బరంపురం గీతా భవన్లో ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు ముఖ్యఅతిథిగా అరూత్, ట్రస్టు అధ్యక్షుడు రంజనా మిశ్రా విచ్చేశారు. నూతన వధూవరూల తరఫున పెద్ద సంఖ్యలో బంధువులు హాజరయ్యారు. సంప్రదాయ సిద్ధంగా కానుకలు చదివించారు. నూతన వధూవరులకు హిందూ సంప్రదాయం ప్రకారం బహుమతులు, గృహోపకరణాలను ట్రస్టు సభ్యులు అందజేశారు. -
ఒకటే గమనం.. గమ్యం
శ్రీకాకుళం న్యూకాలనీ: నేషనల్ మీట్కు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్స్ పురుషులు, మహిళల జట్లకు శిక్షణా శిబిరాలు గురువారంతో ముగిశాయి.జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా సాగిన ఈ శిబిరాల్లో రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులు పాల్గొని నాలుగు రోజులుగా కఠోర సాధన చేశారు. గేమ్లో మెలకువలతోపాటు ఫిట్నెస్పై తర్ఫీదు పొందారు. జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్లు పతకమే లక్ష్యంగా ఇక్కడ సాధన కొనసాగింది. ఏపీ సాఫ్ట్బాల్ పురుషుల జట్టుకు ఎంపికై న ఆరుగురు అంతర్జాతీయ క్రీడాకారులు ఈ శిబిరాల్లో పాల్గొనడం విశేషం. ఆతిథ్య శ్రీకాకుళం జిల్లా నుంచి మొ త్తం ముగ్గురు(ఇద్దరు పురుషులు, ఒక మహిళ) క్రీడాకారులు ఏపీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.50 మందితో రెసిడెన్షియల్ క్యాంప్..ఏపీ రాష్ట్ర జట్లకు ఎంపికై న క్రీడాకారులు, కోచ్లతో కలిపి మొత్తం 50 మందితో ఇక్కడ సాఫ్ట్బాల్ సంఘం తరఫున రెసిడెన్షియల్ కోచింగ్ పొందారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలిదిండి నరసింహరాజు, కన్వీనర్ వెంకటరామరాజు, ప్రధాన కార్యదర్శి సిగిలిపల్లి లక్ష్మిదేవి, కార్యనిర్వాహక కార్యదర్శి మొజ్జాడ వెంకటరమన పర్యవేక్షించారు. క్రీడాకారులకు సీనియర్ ఏపీ సాఫ్ట్బాల్ కోచ్ ఎం.బద్రీనారాయణ(గుంటూరు), కోచ్ కమ్ నేషనల్ రిఫరీ జి.మహేష్ (నెల్లూరు), సీనియర్ ప్లేయర్ కమ్ కోచ్ ఇ.ఉమామహేశ్వరి (కర్నూలు), జిల్లాకు చెందిన పలువురు పీడీలు శిక్షణ అందించారు. మహారాష్ట్రలోని అమరావతి వేదికగా ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనున్న 46వ ఆలిండియా సీనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్–2025 పోటీల్లో వీరంతా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు గురువారం క్రీడాకారులు పయనమయ్యారు.సిక్కోలు క్రీడాకారులు..శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ సీనియర్స్ జట్టకు ముగ్గురు ఎంపికయ్యారు. పురుషుల జట్టుకు సిద్దార్ధ మహరాణ (మందస), బుడుమూరు రామ్మోహన్ (కేశవరావుపేట గ్రామం– ఎచ్చెర్ల మండలం), మహిళల జట్టుకు గురుగుబెల్లి దు ర్గాప్రశాంతి (కేశవరావుపేట) ఎంపికయ్యారు. వీరు ముగ్గురు పలు జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించారు.ఈ ఆరుగురు అంతర్జాతీయ క్రీడాకారులే..కోచ్ బద్రీనారాయణతో కలిసి కనిపిస్తున్న వీరంతా అంతర్జాతీయ క్రీడాకారులే. పి.జయవర్ధన్ (అనంతపురం), బి.ఫృథ్వీరాజ్ (అనంతపురం), ఆర్.లోకేష్ (చిత్తూరు), ఎం.బద్రీనారాయణ (కోచ్–గుంటూరు), బి.మహేష్ (అనంతపురం), బి.రాంబాబు (గుంటూరు), పి.గౌతమ్రాజ్ (కర్నూలు)జపాన్, నేపాల్, హాంకాంగ్ వేదికగా జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్బాల్ టోర్నమెంట్లలో భారత జట్లకు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించారు. -
చికెన్ వినియోగంపై అపోహలు వద్దు
● జిల్లాలో బర్ట్ ఫ్లూ వ్యాధి లక్షణాలు లేవు ● హెూటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావువిజయనగరం: జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు లేనని, చికెన్ వినియోగంపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా హోటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నగరంలోని మయూర హోటల్లో జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా పాల్గొని ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు మీడియా సహకారం కావాలని కోరారు. కేవలం రాష్ట్రంలోని రెండు మూడు జిల్లాల్లో మాత్రమే బర్డ్ఫ్లూలక్షణాలు కనిపించాయని, విజయనగరం జిల్లాలో ఎటువంటి లక్షణాలు లేవన్నారు. హోటల్స్ పరంగా తాము నిత్యం దాడులు నిర్వహిస్తున్నామని, ఎవరైనా కల్తీ చేసినట్లు నిరూపితమైతే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. హోటల్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ పుకార్లు రావడంతో హోటల్స్ వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయన్నారు. ప్రజలు చికెన్ వినియోగింవచ్చన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నవీన్, శ్రీనివాసరావు, కాళ్ల సునీల్, మహమ్మద్ అకితుల్లా, రోహిత్, ఈశ్వర్, పఠన్, చందు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి అక్రమ రవాణా నిందితుడి అరెస్టు
రామభద్రపురం: 2019లో ఐషర్ వ్యాన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పరారైన నిందితుడు డ్రైవర్ కిల్లో చిరంజీవి స్థానిక బైపాస్ రోడ్డులో పోలీసులకు గురువారం పట్టుబడ్డాడు. ఈ మేరకు సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. ఈ సందర్భంగా సీఐ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొట్టక్కి పెట్రోల్ బంకు సమీపంలో కాకర్లవలస జంక్షన్ వద్ద సాలూరు మీదుగా రామభద్రపురం వైపు వస్తున్న గంజాయితో ఉన్న వ్యాన్ 2019 జూన్ 17వ తేదీన స్థానిక పోలీసులకు పట్టుబడింది. అప్పట్లో అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబూరుగు మండలం తామర వీధి గ్రామం నుంచి 266 కిలోల గంజాయిని ఐషర్ వ్యాన్తో అక్రమంగా తరలిస్తుండగా కొట్టక్కి పెట్రోల్ బంకు సమీపంలో ఎస్సై బి.లక్ష్మణరావు, సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యాన్ను స్వాధీనం చేసుకోగా డ్రైవర్ కిల్లో చిరంజీవి పరారవడంతో క్లీనర్ వెల్లంగి రమేష్కుమార్ను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేిశారు. ఇన్నాళ్ల తరువాత స్థానిక బైపాస్ రోడ్డులో అప్పటి నిందితుడు సంచరిస్తున్నాడన్న సమాచారం మేరకు గురువారం పోలీసులు చిరంజీవిని అదుపులోకి తీసుకుని ఆరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. -
ఫొటోలు తీసి.. మార్ఫింగ్ చేసి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ఒళ్లు గగుర్పాటు కలిగించే విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థినితో చనువు పెంచుకున్న ఓ యువకుడు ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఏకంగా పోర్న్ వెబ్సైట్లో పెట్టిన అకృత్యాన్ని పోలీసులు పసిగట్టారు. మరొక యువకుడు ఇలాగే మార్ఫింగ్ వీడియోలను టెలిగ్రామ్లో షేర్ చేసి సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. విద్యార్థిని ఈ నెల 11న రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థినికి తెలియకుండానే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన షేక్ మహ్మద్ సోయెల్కు జిల్లాలో చదువుతున్న విద్యార్థినితో పరిచయం ఉంది. ఆ విద్యార్థినితో చనువుగా ఉంటూ ఆమెకు తెలియకుండానే ఆమె చిత్రాలను, వీడియోలను తీసేవాడు. కొన్నాళ్లకు ఆమె వీడి యోలను, ఫొటోలను న్యూడ్గా మార్ఫింగ్ చేశా డు. తెలియని నంబర్ నుంచి ఆమె వాట్సాప్కు ఫొటోలను, వీడియోలను పంపుతూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ధైర్యంగా ఫిర్యాదు చేసి.. ఇలా ఎవరు చేస్తున్నారో తెలియని విద్యార్థిని మొ దట్లో తీవ్ర వేదన అనుభవించింది. తల్లిదండ్రులకు, పోలీసులకు చెబితే పరువు పోతుందని మొ దట్లో భావించింది. కానీ ధైర్యం చేసి ఈ నెల 11న రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఈశ్వరరావు విచారణ ఆరంభించి పరిచయస్తుల పనే అని భావించి తిరుపతికి చెందిన షేక్ మహ్మద్ సోయెల్ అని తెలుసుకుని నాలుగు రోజుల కిందట తిరుపతిలో ఉంటున్న అతనికి నోటీసులు పంపారు. మరో దొంగ.. సోయల్ను విచారించడం, ఆయన ఫోన్ను క్షు ణ్ణంగా పరిశీలించడంతో విద్యార్థిని ఫొటోలు, వీ డియోలు వెబ్పోర్న్ సైట్లో అప్లోడ్ చేయడం చూశారు. అవే చిత్రాలు, వీడియోలు ఇన్స్టాగ్రా మ్, టెలిగ్రామ్ల్లో సైతం ఎలా అప్లోడ్ అయ్యా యన్నది అర్థం కాక జిల్లా సైబర్ సెల్ బృందాన్ని రంగంలోకి దింపారు. వారు ఇన్స్టా, టెలిగ్రామ్ యాజమాన్యాలకు మెయిల్లో ఫిర్యాదు పంపగా అటునుంచి వారు ఐడీలు, ఫోన్ నంబర్ పంపించారు. అవి కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఉప్పుగళ్ల రఘువిగా గుర్తించి అతనికి నో టీసులు పంపారు. గురువారం రఘు స్టేషన్కు రాగా విచారించారు. ఒప్పుకున్నాడు.. పోర్న్సైట్లో వచ్చిన వీడియోలను అప్లోడ్ చేసు కుని ఇన్స్టా, టెలిగ్రామ్లలో పెట్టింది తానేనని, ఒకసారి లింక్ చేసే ముందు తనకు రూ. 200లు పంపించాలని చెప్పడంతో చాలామంది తనకు డబ్బు పంపారని రఘు చెప్పారు. విస్తుపోయే నిజాలు తెలియడంతో సీఐ ఈశ్వరరావు గురువారం రాత్రి ఇరువురినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మార్ఫింగ్ వీడియోలను పోర్న్ సైట్లో పెట్టిన యువకుడు టెలిగ్రామ్లో వీడియోలు పెట్టి డబ్బులు చేసుకున్న మరో యువకుడు వివరాలు వెల్లడించిన సీఐ పి.ఈశ్వరరావు -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఏఆర్వోలను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ఎన్నిక నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో వ్యవహరించి ఎన్నికను ప్రశాంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సాంకేతికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ అందజేత, స్వీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ ముందు రోజే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలపాలని, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. విశాఖ జిల్లా ఏఆర్వో బిహెచ్.భవానీ శంకర్, అల్లూరి జిల్లా ఏఆర్వో పద్మలత, అనకాపల్లి జిల్లా ఏఆర్వో పీవీఎస్ఎస్ఎన్ సత్యనారాయణ, విజయనగరం జిల్లా ఏఆర్వో శ్రీనివాసమూర్తి, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ఏఆర్వోలు పాల్గొన్నారు. హామీలు అమలు కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం శ్రీకాకుళం న్యూకాలనీ : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేకుంటే ఉద్యమాలు తప్పవని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.రమణమూర్తి అన్నారు. శుక్రవారం నగరంలోని క్రాంతి భవన్లో అత్యవసర కార్యవర్గ సమావే శం నిర్వహించారు. అప్పటి ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడు ఉపాధ్యాయ ఉద్యోగవర్గాల కు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి ఎస్టీయూ సంఘం తరఫున పోస్టుకార్డులు పంపే ఉద్యమాన్ని ప్రారంభించారు. వెంటనే పీఆర్సీని అమలుపర్చేలా చర్యలు చేపట్టాలని, ఐఆర్ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు, పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ, శ్రీనివాసరావు, రామారావు, శ్రీధర్, తేజ, లక్ష్మణరావు, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. -
మహాశివరాత్రికి రామతీర్థంలో గట్టి పోలీస్ బందోబస్తు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26 నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ జి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు రామతీర్థంలో బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యూల నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తదితర అంశాలపై దేవస్థానం సిబ్బందితో చర్చించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..రెండు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేసే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక వ్యాపారులు భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా తమ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నుంచి వచ్చే భక్తులకు దన్నానపేట జంక్షన్ వద్ద, విజయనగరం వైపు నుంచి వచ్చే భక్తులకు సీతారామునిపేట జంక్షన్ వద్ద పార్కింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో జాతరలో నిరంతర నిఘా ఉంటుందని, డ్రోన్స్ను వినియోగించి గస్తీ నిర్వహిస్తామన్నారు. ఆకతాయల కదలికలపై నిఘా పెడతామని, అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతర విజయవంతానికి భక్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై గణేష్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. సీఐ రామకృష్ణ -
వైఎస్సార్సీపీలో సంస్థాగత నియామకాలు
విజయనగరం: రాష్ట్రంలో బాధ్యతగల ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్పార్సీపీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీలో నూతన నియామకాలు చేపడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. నూతనంగా నియామకమైన నాయకులు రానున్న నాలుగు సంవత్సరాల పాటు పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. నూతన నియామకాలు ఇవే.. నూతన నియామకాల్లో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజాంకు చెందిన టంకాల అచ్చంనాయుడు, బొబ్బిలి నుంచి చొక్కాపు లక్ష్మణరావు, నెల్లిమర్ల నుంచి పతివాడ అప్పలనాయుడు, విజయనగరం జిల్లా కేంద్రం నుంచి సీనియర్ కార్పొరేటర్ శెట్టి వీర వెంకట రాజేశ్వరరావు, గజపతినగరం నుంచి పాండ్రంకి సంజీవరావు, చీపురుపల్లి నుంచి శిరవూరు వెంకటరమణ రాజు, ఎస్ కోట నుంచి నూకల కస్తూరి నియామకమయ్యారు. జిల్లా పార్టీ కోశాధికారిగా రాజాం నియోజకవర్గానికి చెందిన సిరిపురపు. జగన్ మోహన్ రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గజపతినగరం నుంచి వర్రి నరసింహమూర్తి, నెల్లిమర్లకు చెందిన అల్లాడ సత్యనారాయణమూర్తి, చీపురుపల్లి నుంచి ఇప్పిలి అనంత్ , విజయనగరం నుంచి సంగంరెడ్డి.బంగారు నాయుడు, బొబ్బిలి నుంచి తమ్మిరెడ్డి దామోదర్ రావులు నియమితులయ్యారు. అదేవిధంగా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా విజయనగరం నుంచి బొద్దాన అప్పారావు, కిలారి రాంబాబు, గజపతినగరం నుంచి తొత్తడి సత్తిబాబు, సుంకరి రామునాయుడు, బొబ్బిలి నుంచి చెలికాని.మురళీకష్ణ, ఆవు సత్యనారాయణ, రాజాం నుంచి కనకాల సన్యాసినాయుడు, కిమిడి ఉమామహేశ్వరరావులను నియమించారు. ఎస్.కోట నుంచి పినిశెట్టి వెంకటరమణ, పినిశెట్టి కష్టప్ప దొర, చీపురుపల్లి నుంచి శీర.అప్పలనాయుడు, నెల్లిమర్ల నుంచి లంక లక్ష్మణరావు, కర్రోతు వెంకటరమణలు నూతన కమిటీలో స్థానం దక్కించుకున్నారు. జిల్లా కార్యదర్శులుగా విజయనగరానికి చెందిన దుప్పాడ సునీత, కునుకు నాగరాజు, గజపతినగరం నుంచి బండారు బంగారమ్మ, సుమల గోవింద, బొబ్బిలి నుంచి సీహెచ్ సత్యనారాయణ, భమిడిపాటి విశ్వనాథశర్మ, రాజాం నుంచి ఎస్.రమేష్ నాయుడు, గడి మధుసూదనరావు, ఎస్.కోట నుంచి ఎం.అప్పారావు, పల్లా భీష్మా, చీపురుపల్లి నుంచి కొణిశి కృష్ణంనాయుడు, కరిమజ్జి శ్రీనివాసనాయుడు, నెల్లిమర్ల నుంచి బుగత రమణ, జి.మురళీమోహనరావులు నియామకమయ్యారు. అదేవిధంగా పార్టీ స్పోక్స్ పర్సన్గా రాజాం నుంచి ఉత్తరావల్లి సురేష్ముఖర్జీ, బొబ్బిలి నుంచి బి.సత్యనారాయణ, చీపురుపల్లి నుంచి రేగిడి లక్ష్మణరావు, గజపతినగరం నుంచి కరణం ఆదినారాయణ, నెల్లిమర్ల నుంచి సముద్రపు రామారావు, విజయనగరం నుంచి కనకల రఘురామారావు, ఎస్.కోట నుంచి గొర్లె రవికుమార్లు నియమితులయ్యారు. -
కార్పొరేట్ సంస్థల చొరవ అభినందనీయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ముఖ్య ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ పరిశ్రమలు, పలు కార్పొరేట్ యాజమాన్య ప్రతినిధులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచినీటి వసతి, సోలార్ లైట్ల ఏర్పాటు, పాఠశాలలు, కళాశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, కిడ్నీ రీసెర్చ్ సెంటర్కు తోడ్పాటు, పలాసలో డయాలసిస్ యూనిట్ల నిర్వహణ, జిల్లాలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం వంటి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. -
విందులో విష సంస్కృతి
చర్యలు లేవుప్లాస్టిక్ వినియోగం ఏదో ఒక రూపంలో ప్రజలను వెంటాడుతోంది. పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా దారి మళ్లించి ప్లాస్టిక్భూతం ప్రజల మధ్యకు వస్తోంది. అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై క్షేత్రస్థాయిలో బాధ్యత వహించాలి, ప్రతి ఒక్క ఉద్యోగికి ప్లాస్టిక్ నిషేధంలో భాగస్వామ్యం కల్పించాలి. ఆర్వీజే నాయుడు, రాజాం పర్యావరణ పరిరక్షణ కమిటీ కన్వీనర్, చర్యలు తీసుకుంటున్నాంరాజాం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాం. తొలుత షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమం చేస్తున్నాం. ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పుల తయారీ పరిశ్రమలపై దృష్టిసారిస్తాం. వాటితో పాటు వాటర్ ప్లాంట్ల వద్ద కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల్లో ఫిర్యాదుచేయాలి. సీహెచ్. ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్, రాజాం ● విచ్చలవిడిగా ప్లాస్టిక్ బఫే ప్లేట్ల వినియోగం ● పుట్టగొడుగుల్లా పరిశ్రమల ఏర్పాటు ● కలుషితమవుతున్న ఆహారపదార్థాలు ● ప్రమాదకరంగా పరిశ్రమల పరిసర ప్రాంతాలు ● పట్టించుకోని అధికార యంత్రాంగం ● వాటర్ ప్లాంట్లుల్లోనూ అదే పరిస్థితిరాజాం: పట్టణాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న విందు భోజనాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. శుభకార్యక్రమాలు, పెళ్లిళ్లు, పూజలు, పేరంటాళ్ల పండగ వంటి కార్యక్రమాల్లో నిర్వహించే సామూహిక భోజన కార్యక్రమాల్లో కొత్త సంస్కృతి ప్రారంభమైంది. గతంలో ఈ భోజనాల్లో అరటి ఆకులు, అడ్డాకులు(విస్తర్లు) వినియోగించేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ బఫే పేట్లు వినియోగంలోకి వచ్చాయి. వాటిని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా వాటిలో భోజనాలు చేసే వ్యక్తులు క్యాన్సర్ వంటి భయానక రోగాలబారిన పడుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వాటితో పాటు ఆయా కార్యక్రమాల వద్ద వినియోగిస్తున్న వాటర్ ప్యాకెట్లు కూడా ప్రమాదకర వ్యాధులను ప్రజలకు అంటగడుతున్నాయి. ఆయా ఫ్యాక్టరీల వద్ద ప్లాస్టిక్ కవర్లు పోగులుగా ఏర్పడి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. అంతా కలుషితమే ఇప్పుడు ప్రతి గల్లీలో పేపర్ ప్లేట్ల పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటికోసం వినియోగిస్తున్న ముడిసరుకు చాలా ప్రమాదకరంగా ఉంది. వాటితయారీ అనంతరం వచ్చిన వ్యర్థాలు ఆయా పరిశ్రమల పక్కన పొలాల్లో, చెరువుల్లో పడేయడంతో ఆయా ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. వాటిని అన్నసంతర్పణలు, భోజనాల్లో వినియోగించిన తరువాత ప్లేట్లను ప్రధాన రహదారులు, చెరువుల పక్కన వదిలేయడంతో ఆయా ప్రాంతాలు ప్రమాదకర రసాయనాలతో కలుషితంగా మారుతున్నాయి. మానవుని ఆరోగ్యంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలిన ఆహార పదార్థాలు తినడం ద్వారా పశువులు సైతం రోగాల బారిన పడుతున్నాయి. అలాగే ఆయా కార్యక్రమాల వద్ద వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ వినియోగం ప్రమాదరంగా మారుతోంది. అవి ఏళ్ల తరబడి భూమిలో కలవడంలేదు. వాటిని పడేస్తున్న పంటపొలాలు, చెరువులు ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో పర్యావరణం కలుషితమై చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రమాదకర రసాయనాలు పేపర్ ప్లేట్లు, కప్పుల్లో ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయి. హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొరను వాటి తయారీలో వినియోగిస్తున్నారు. మోట్రో సోమిన్, బిస్పినాల్, బార్డ్ ఇథనాల్ డాక్సిన్ వంటి కెమికల్స్ ఈ ప్లేట్లు, కప్పుల్లో ఉంటున్నాయి. వాటిలో వేడి వేడి ఆహార పదార్థాలు వేసిన వెంటనే కరిగి ఆయా ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి చేరుతాయి. దీంతో చర్మసంబంధిత వ్యాధులతో పాటు ప్రమాదకర క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. -
జోరుగా నకిలీ స్టాంపుల విక్రయాలు
వీరఘట్టం: వీరఘట్టంలో కొంతమంది వ్యక్తులు నకిలీ స్టాంపుల విక్రయాలకు పాల్పడుతున్నారు. గతంలో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొనుగోలు చేసిన రూ.10, రూ.50 స్టాంపు పేపర్లను పోలిన మాదిరిగానే కలర్ జిరాక్స్లు తీసి అడ్డుగోలు వ్యాపారానికి తెరతీశారు. భూముల కొనుగోళ్లు, ఇతర లావాదేవీల కోసం ఈ స్టాంపు పేపర్లు అవసరమైన వారు అవి నకిలీ అని తెలియక కొనుగోలు చేస్తున్నారు.ఈ నకిలీ స్టాంపుల వ్యవహారంపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పూరిల్లు దగ్ధందత్తిరాజేరు: మండలంలోని టి.బూర్జవలసలో చింతగడ ప్రసాద్కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైనట్లు సర్పంచ్ మంత్రి క్రాంతికుమార్, ఎంపీటీసీ మంత్రి అప్పలనాయుడు గురువారం తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో వచ్చి మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారని చెప్పారు. నిరుపేద అయిన ప్రసాద్కు చెందిన ధాన్యం, బియ్యం, పప్పు దినుసులు టీవీ ఇతర ఇంటి సామగ్రి బట్టలు, ఈ ప్రమాదంలో కాలి బూడిదవడంతో కటుంబసభ్యులు రోడ్డున పడ్డారని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మాజీ ఎంపీటీసీకి తీవ్రగాయాలురామభద్రపురం: మండలంలోని దుప్పలపూడి గ్రామం సమీపంలో గురువారం బైక్పై వెళ్తున్న మాజీ ఎంపీటీసీని ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొనడంతో మాజీ ఎంపీటీసీకి తీవ్రగాయాలయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతరేగ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పెద్దింటి పైడిపునాయుడు తన అత్తయ్య ఆరోగ్యం బాగులేకపోవడంతో బొబ్బిలి తీసుకెళ్లాడు.అక్కడ వైద్యాధికారికి చూపించి తిరిగి సొంత గ్రామానికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో సరిగ్గా దుప్పలపూడి జంక్షన్కు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టి తప్పించుకుని పరారయ్యాడు. వెంటనే స్థానికులు పైడిపునాయుడిని ప్రథమచికిత్స నిమిత్తం స్థానిక ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై క్షతగాత్రుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు స్పందించిన ఎస్సై వి.ప్రసాదరావు ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరిచారు.ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరనం కొత్తరేగలో వివాహం జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తుండగా ఢీ కొట్టింది తానేనని అదే గ్రామానికి చెందిన చొక్కాపు గౌరీశ్వరరావు ఎస్సై ముందు అంగీకరించాడు. దీంతో ఎస్సై కేసు నమోదు చేశారు. ఎన్డీఏ, ఐఎన్ఏకు సైనిక పాఠశాల విద్యార్థుల అర్హతవిజయనగరం రూరల్: యూపీఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), ఇండియా నేవల్ అకాడమీల్లో (ఐఎన్ఏ) ప్రవేశాలకు కోరుకొండ సైనిక పాఠశాల విద్యార్థులు 8 మంది అర్హత సాధించారని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయగా కోరుకొండ పాఠశాలకు చెందిన 8 మంది ఈ ఏడాది ఎన్డీఏ, ఐఎన్ఏకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ఎన్డీఏ, ఐఎన్ఏల్లో ప్రవేశాలే లక్ష్యంగా అందిస్తున్న శిక్షణ, కార్యకలాపాలే ఈ విజయానికి కారణమన్నారు. ఇంతటి విజయానికి కారకులైన పాఠశాల అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. -
ఉపాధ్యాయసంఘాల మద్దతుతో స్వతంత్రంగా పోటీ
మెరకముడిదాం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను పార్టీల కతీతంగా స్వతంత్రంగా, కేవలం ఉపాధ్యాయ సంఘాల తరఫున పోటీ చేస్తున్నానని గాదెశ్రీనివాసులునాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మెరకముడిదాం మండలంలోని భైరిపురం, గర్భాం, మెరకముడిదాం, ఉత్తరావల్లి, గరుగుబిల్లి, సాతాంవలస జెడ్పీపాఠశాలలతో పాటు మెరకముడిదాం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, గర్భాం ఏపీ మోడల్స్కూల్లో పర్యటించి ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తనను గెలిపించి నట్లయితే చాలాకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికే పనిచేస్తానని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీల జోలికి వెళ్లకుండా కేవలం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే మహిళలకు అవసరమైన మరిన్ని సెలవులను తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనను వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షుడు ఆల్తిరాంబాబు, జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, మండలానికి చెందిన పలు యూనియన్ల నాయకులు ఆర్.సింహాద్రి, టీవీవీఎల్.నరసింహులు, కృష్ణ, సత్తారు రమణ తదితరులు పాల్గొన్నారు. ఎంటీఎస్ ఇప్పించండి కాగా మెరకముడిదాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదెశ్రీ నివాసులనాయుడిని మెరకముడిదాం మండలానికి చెందిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు (పార్ట్టైమ్ ఉద్యోగులు, సీఆర్ఎంటీలు, ఎంఈఓ కార్యాలయం సిబ్బంది) కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత తమకు ఎంటీఎస్ ఇప్పించాలని, అలాగే తమను పార్ట్టైమ్ ఉద్యోగులుగా కాకుండా ఒకేషనల్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం పరిగణించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన గాదె శ్రీనివాసులునాయుడు తాను గెలుపొందిన వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ ఎంటీఎస్ వర్తించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నవీన్కుమార్, శంకర్రావు, సత్యవతి, ఉగాది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు -
అనుమానంతోనే భార్య హత్య
దత్తిరాజేరు: ఈనెల 6న గుచ్చిమి గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో భార్య యాకల గౌరమ్మను అనుమానంతోనే భర్త సత్యం హతమార్చాడని బొబ్బిలి డీఎస్పీ జి.భవ్య తెలిపారు. నిందితుడు పెదమానాపురం బీసీ కాలనీ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్సై జయంతి, సీఐ రమణ పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పెదమానాపురం పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భవ్య వివరాలు వెల్ల డించారు. స్వగ్రామం చుక్కపేట నుంచి పొలం పనులకు వెళ్తుండగా తోట వద్ద కొడవలితో హత్య చేసి అక్కడి నుంచి చెరువులో సెల్ఫోన్ పడేసి రక్తపు మరకలు కడుక్కుని మరడాం, మేడపల్లి, పోరాం, ఉద్దంగి వద్ద జాతీయ రహదారి దగ్గరలో నిందితుడు వేసుకున్న షర్ట్ను విప్పేసి తువ్వాలు కప్పుకుని బొండపల్లి మండలం గొల్లుపాలెంలో ఐదు రోజుల పాటు గొర్రెల కాపరులతో ఉన్నాడు. వారు డబ్బులు ఇవ్వక పోవడంతో పెందుర్తిలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పని చేయగా కూలి రూ.2వేలు రావడంతో ఆ డబ్బులతో బుధవారం సాయంత్రం పెదమానాపురం వచ్చాడు. భార్య మృతి చెందిందా? లేదా? పిల్లలు ఎలా ఉన్నారో? ఊరి పరిస్థితి తెలుసుకోవడానికి నిందితుడు పెదమానాపురం వచ్చిన సమాచారంతో పోలీసులకు పట్టుబడడంతో అరెస్ట్ చేశామని తెలిపారు. -
లలిత క్రీడా వైభవం
విజయనగరం: చైన్నెలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం వేదికగా ఈ నెల 17 నుంచి వరకు జరిగిన 23వ పారా జాతీయస్థాయి చాంపియన్ షిప్ క్రీడా పోటీల్లో జిల్లాకు స్వర్ణపతకం దక్కిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. పోటీల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన కిల్లక లలిత 400 మీటర్ల పరుగు పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. గతం లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించిన లలిత చైన్నెలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్మెడల్ సాధించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించినట్లు చెప్పారు. ఈ విజయం క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింత పెంచిందని, భవిష్యత్లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పారా జాతీయపోటీల్లో పతకం సాధించిన లలితతో పాటు కోచ్ తబరీష్లను కలెక్టర్ డాక్టర్.బీఆర్.అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి వి.రామస్వామిలు అభినందనలు తెలియజేశారు. పారా జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణపతకం -
27న జీఎంఆర్ నైరెడ్లో ఇంటర్వ్యూలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్లో ఈ నెల 27న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. పురుషులకు రిప్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ (75 రోజులు), సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (30 రోజులు), సీసీ టీవీ కెమెరా ఇన్స్టాలేషన్ (13 రోజులు), అలాగే సీ్త్రలకు లేడీస్ టైలరింగ్ (30 రోజులు), కంప్యూటర్ ట్యాలీ అండ్ బేసిక్స్ (30 రోజులు), మగ్గం వర్క్స్ (30 రోజుల పాటు)లో శిక్షణ ఉంటుందన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్కార్డులతో పాల్గొనాలని సూచించారు. జెంట్స్ టైలరింగ్, లేడీస్ టైలరింగ్, మగ్గం వర్క్స్కు హాజరయ్యేవారికి 5వ తరగతి విద్యార్హత ఉంటే చాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9014716255, 9491741129 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
జాతీయ కబడ్డీ పోటీలకు శశికుమార్
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారుడు అర్హత సాధించాడు. ఈనెల 20 నుంచి 23 వరకు కటక్లో జరగనున్న సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన శశికుమార్ ఎంపికయ్యాడు. ఈ క్రీడాకారుడు గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో జరగనున్న పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. శశికుమార్ ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఐవీపీ రాజు, అధ్యక్షుడు రంగారావు, కార్యదర్శి కేవీ ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణరావు, ట్రెజరర్ శివకుమార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు● ఎస్పీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) ఇతర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ వ్యక్తులు, మహిళలు, పిల్లలు, సంస్థలపై హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు రోలింగ్ చేసినా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుదారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టిన, షేర్చేసేవారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత అనవసర పోస్టులు పెట్టి భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దని హితవు పలికారు. నాటిక పోటీలు ప్రారంభం నెల్లిమర్ల: జరజాపుపేట నల్లి సూరిబాబు స్మారక కళాప్రాంగణంలో ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పరిషత్ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రదర్శించిన రైతే రాజు, ఎడారిలో వాన చినుకు నాటికలు ఆహూతులను ఆలోచింపజేశాయి. ప్రారంభోత్సవంలో పాల్గొన్న కూటమి నాయకులు చనమల్లు వెంకటరమణ, సువ్వాడ రవిశేఖర్ మాట్లాడుతూ రంగస్థల నటుడు ఆరిపాక బ్రహ్మానందం కళారంగానికి చేసిన సేవలు మరువలేనివన్నారు.కళలకు కాణాచి అయిన జరజాపుపేటలో నాటక పరిషత్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆరిపాక శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాకారులు ఈపు విజయ్ కుమార్, అవనాపు సత్యనారాయణ, లెంక అప్పలనాయుడు, ఆరిపాక రాము, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి వెటరన్ షటిల్ పోటీలకు పయనం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న వెటరన్స్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా జట్టు గురువారం పయనమైంది. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి మొత్తం 30 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా జట్టుకు కోచ్ అండ్ మేనేజర్లుగా వై.కుసుం బచ్చన్, నున్న సురేష్లు వ్యవహరించనున్నారు. ఈ బృందంలో జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన తొమ్మిది మంది క్రీడాకారులు కుసుం బచ్చన్, టీఎల్.సుబ్బారావు, మల్లికార్జునరావు అపర్ణ బాబా, గణేష్, నవీన్కుమార్, ఖలీ లుల్లా, ఎం. శ్రీను, పైడిరాజు పాల్గొననున్నారు. ఈ బృందానికి జిల్లా గుర్తింపుతో టీ షర్ట్స్ను జిల్లా సంఘం చైర్మన్ ఇందుకూరి రఘురాజు బహుకరించగా, జిల్లా బాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కేఏ నా యుడు జిల్లా సంఘం ద్వారా క్రీడాకారులకు ప్రవేశరుసుము, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లిస్తున్నారు. జి ల్లా జట్టుకు అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపి రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా పేరు ప్రఖ్యాతులు చాటి చెప్పాలని ఆకాంక్షించారు. -
మద్యం దుకాణాలను తరలించాలని వినతి
రాయగడ: పట్టణంలోని మూడు విదేశీ మద్యం దుకాణాలను వేరేచోటకు తరలించాలని, లేదంటే ఆందోళన చేపడతామని వికాస్ మంచ్ డిమాండ్ చేసింది. జిల్లా అబ్కారీశాఖ అధికారికి మంచ్ వికా స్ సభ్యులు బుధవారం వినతిపత్రం అందించారు. పట్టణంలోని 3, 11, 15 నంబర్లతో చెలామణి అవుతున్న మద్యం దుకాణాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జనావాసా ల్లో గల ఈ దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించాలని గత నెల 8న సంబంధిత శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించకపోతే అబ్కారీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాయగడ జిల్లా వికాస్ మంచ్ అధ్యక్షుడు దయానంద ఖడంగ, సభ్యులు మనోజ్ సాహు, రాజు నాయక్, తదితరులు ఉన్నారు. -
197 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
తెర్లాం: ఎటువంటి అనుమతులు లేకుండా 197 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి బుధవారం తెర్లాం ఎస్సై సాగర్బాబు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నందబలగ గ్రామానికి చెందిన ఆనెం శ్రీనివాసరావు తెర్లాం నుంచి 197మద్యం సీసాలు తీసుకువెళ్తుండగా అదే సమయంలో అటుగా వస్తున్న స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులకు గంగన్నపాడు గ్రామం వద్ద మద్యం పట్టుకున్నారు. అనంతరం మద్యం సీసాలను, తీసుకు వెళ్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్స్టేషన్కు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి మద్యం సీసాలను సీజ్ చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టుబొండపల్లి: మండలంలోని వేండ్రాం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ జె.జనార్దనరావు తెలిపారు. గ్రామానికి చెందిన లెంక అప్పలనాయుడు గ్రామంలోని తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై పి.నరేంద్ర కుమార్, హెచ్సీలు జె.బాషా, లోకాభిరామ్, రాజు, గంగాధరుడు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణపై సైకిల్ యాత్ర
మల్కన్గిరి: పర్యావరణ పరిరక్షణపై సంభల్పూర్కు చెందిన శుభం బారిక్ అనే 21 ఏళ్ల యువకుడు సైకిల్పై చేస్తున్న దేశ యాత్ర మంగళవారం రాత్రి మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితికి బుధవారం చేరింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మనిషి–ఒక చెట్టు నినాదంతో ప్రజల్లో అవగహన కాల్పించాలనే ఉద్దేశంతో గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ సైకిల్ యాత్రకు బయలు దేరిన శుభం బారిక్ జర్స్గూఢ, సందర్గూఢ, కేందుజోర్, మయుర్బంజ, బాలేశ్వర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రపోఢ, జగత్సంగ్పూర్, కటాక్, పూరీ, ఖుర్ధా, నయాగఢ్, గంజామ్, గజపతి, రాయగడ, కోరపుట్ ప్రాంతాల్లో పర్యటించి బుధవారంమల్కన్గిరి జిల్లాకు చేరుకున్నారు. మత్తిలి పోలీసులు ఆయనకు స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు. మల్కన్గిరి ఉత్కళ విలేకర్ల సంఘం సభ్యులు కూడా అభినందించారు. -
అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్
శ్రీకాకుళం న్యూకాలనీ: అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ పెట్టిందని విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్మత్స విష్ణుకుమార్రాజు పేర్కొన్నారు. బుధవారం బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఇటీవల ప్రవేశపెట్టిన ప్రజా బడ్జెట్ 2025–26పై మేధావుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్లోని ముఖ్య అంశాలపై పలువురు వక్తలు చర్చించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.అమ్మన్మాయుడు, చార్టర్డ్ అకౌంటెంట్ ఐ.కె.రావు, రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథం, అంబేడ్కర్ యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, కంపెనీ సెక్రటరీ బుర్రా భార్గవ్, విద్యావేత్త నిక్కు అప్పన్న, ఎన్జీవో మణిశర్మ, గురజాడ విద్యాసంస్థల ప్రతినిధి సంయుక్త, విద్యావేత్త జామి భీమశంకర్, జర్నలిస్టు సంఘ నాయకుడు కొంక్యాణ వేణుగోపాల్, డాక్టర్ పైడి సింధూర, బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, కరుణాకరరావు, నరేంద్రచక్రవర్తి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
వన్య ప్రాణులను కాపాడారు
జయపురం: వన్య ప్రాణుల రక్షణకు దృష్టి సారించింది బొయిపరిగుడ అటవీ సిబ్బంది. అడవుల్లో వన్య ప్రాణులను వేటాడే ఆట కట్టించేందుకు అటవీ సిబ్బంది పెట్రోలింగ్ జరిపింది. మంగళవారం రాత్రి బొయిపరిగుడ సమితి టికరపడలో కొంతమంది మూడు అడవి పందులను పట్టుకొని గ్రామానికి తీసుకువెళ్లారని, వాటిని బుధవారం చంపి మాంసం అమ్మేందుకు యోచిస్తున్నారని విశ్వాసనీయ వర్గాల ద్వారా బొయిపరిగుడ సమితి దసంతపూర్ అటవీ అధికారి రంజితా నాయక్కు సమాచారం అందింది. రంజితా నాయక్ ఆధ్వర్యంలో ఓ బృందం టికరపడ గ్రామానికి వెళ్లింది. గ్రామంలో ఒకచోట మూడు అడవి పందులు బంధించి ఉంచడాన్ని గుర్తించారు. వాటిని రక్షించి బొయిపరిగుడ అటవీ విభాగ కార్యాలయానికి తీసుకువచ్చారు. అడవి పందులను బుధవారం వైద్య పరీక్షలు చేపట్టిన అనంతరం అడవిలో విడిచి పెట్టనున్నట్లు రంజితా నాయక్ వెల్లడించారు. మూడు అడవి పందులను పట్టి ఉంచిన వారిని కనుగొని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
పెద్దల సమక్షంలో మెడికల్ షాపు నిర్వాహకుడి హాజరు
సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన మెడికల్షాపు నిర్వాహకుడు తానుచేసిన అప్పులను స్థిరాస్తులు విక్రయించి తీర్చడానికి పెద్దల సమక్షంలో బాదితుల ముందు నిర్ణయించారు. బుధవారం మెడికల్షాపు నిర్వాహకుడితో పాటు అప్పులు ఇచ్చిన బాధితులు పోలీస్టేషన్ను ఆశ్రయించారు. ఉభయులూ కలిపి పెద్దల సమక్షంలో సీతానగరం పోలీస్టేషన్కు చేరుకున్నారు. గ్రామ పెద్దలతో పోలీస్టేషన్కు వచ్చిన ఉభయ వర్గాల వారుల స్టేషన్ ఆవరణలో పంచాయితీ నిర్వహించారు. మెడికల్షాపు నిర్వాహకుడు ఉభయుల శ్రేయస్సు దృష్ట్యా తనకున్న స్థిరాస్థులు విక్రయించి బాధితులకు రుణాన్ని తనకున్నంత మేరకు తీర్చుకుంటానని హామీ ఇవ్వడంతో అందరూ వెనుదిరిగారు. దరఖాస్తుల ఆహ్వనంపార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ పౌరహక్కుల రక్షణ చట్టం, అత్యాచార నిరోధకర చట్టం జిల్లా విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీలో గౌరవ సభ్యులుగా నియమాకం చేయనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి ఎండి.గయాజుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అధికార సభ్యులు ముగ్గురు, అనధికార సభ్యులు ఐదుగురు, స్వచ్ఛంద సేవా సభ్యులు ముగ్గురిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. అధికార సభ్యులు గ్రూపు ‘ఎ’ గెజిటెడ్ ఆఫీసర్స్, అనధికార సభ్యులు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారు, స్వచ్ఛంద సభ్యులు ఇతర కేటగిరిలకు చెందినవారు ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తుతో ఎస్సీ సంక్షేమ సాధికారత కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9492535085 నంబర్ను సంప్రదించాలని కోరారు. వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు● 10 కేసుల నమోదు విజయనగరం: విజయనగరం పట్టణంలో, బొండపల్లి మండలంలో వివిధ ప్రాంతాల్లో పలు రకాల వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎం.దామోదర నాయుడు ఆకస్మికంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు, ఈ తనిఖీల్లో మొత్తం 10 కేసులు నమోదు చేశారు. వాటిలో తూనిక యంత్రానికి సీళ్లు లేకపోవడం గుర్తించి 3 కేసులు, తూనిక యంత్రాలలో లొసుగులు వినియోగించి తూకంలో మోసం చేసిన వారిపై 4 కేసులు, అదేవిధంగా ప్యాకేజీలపై ముద్రించిన అమ్మకపు ధర కంటే అధికంగా విక్రయించిన వారిపై 3 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులతో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తూకంలో గానీ కొలతలో గానీ తేడా లేకుండా విక్రయించాలని, ముద్రించిన ధరకే ప్యాకేజీలు విక్రయించాలని సూచించారు. ఈ తనిఖీల్లో టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిభామిని: మండలంలోని లివిరికి చెందిన బౌరి రాజేంద్ర(32) బుధవారం ఉదయం మరణించాడు. మంగళవారం రాత్రి లివిరి–భామిని మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న బౌరి రాజేంద్ర(32), మరో యువకుడు బౌరి తిరుపతి తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే స్థానికుల సహకారంతో బాధితులను భామిని పీహెచ్సీకి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం లివిరి స్వగ్రామానికి తీసుకువెళ్లి ఇద్దరు బాదితులకు ప్రైవేట్ వైద్యం అందించినప్పటికీ గాయపడిన బాధితుడు బౌరి రాజేంద్ర(32) మృత్యువాత పడి ఉండడాన్ని భార్య ఉషారాణి బుధవారం ఉదయం గుర్తించి భోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించగా లివిరిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయాలి
కొరాపుట్: పాత్రికేయుల సంక్షేమానికి కొత్త ప్రభుత్వం కృషి చేయాలని ఒడిశా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నబరంగ్పూర్ జిల్లా శాఖ అధ్యక్షుడు సుశాంత్ బెహరా కోరారు. బుధవారం నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రం సమీపంలో డీర్ పార్క్ సమీపంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. ఇతర రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలన్నారు. పాత్రికేయులపై దాడులు జరిగితే సంఘాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఒడిశా పాత్రికేయులను ఛత్తీస్గఢ్ పోలీసులు అవమానించినప్పుడు కలిసికట్టుగా పోరాటం చేసిన సంగతిని గుర్తు చేశారు. అర్హులను జర్నలిస్టులకు పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం కార్యదర్శి చిదానంద సాహు, ఉపాధ్యక్షుడు ఫల్గుణి పాత్రో తదితరులు పాల్గొన్నారు. జలాశయంలో మునిగి మహిళ మృతి మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ జలాశయంలో మునిగి ఇచ్చావాతి కిర్సనీ (40 ) అనే మహిళ మునిగి ప్రాణాలు కోల్పోయింది. చిత్రకొండ సమితి పనాస్పూట్ పంచాయతీ, డమ్గూఢ బుద కిర్సానీ భార్య ఇచ్చావాతి కిర్సనీ మంగళవారం మధ్యాహ్నం దుస్తులు ఉతికేందుకు చిత్రకొంత జలాయంలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు కాలు జారి మునిగిపోయారు. సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి గాలించారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో జోడాంబో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్చార్జి సంజాయ్ పడాసేఠి సిబ్బందితో కలిసి జలాశయం వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. టీచర్ వేధింపులు.. చిన్నారులు పరార్ ● అడవిలో రక్షించిన గిరిజనులు కొరాపుట్: ప్రధానోపాధ్యాయురాలి వేధింపులతో చిన్నారులు ఆశ్రమ పాఠశాల నుంచి పరారయ్యారు. బుధవారం నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి గడబకొట్ర అశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మగ్గురు బాలురు మెయిన్ గేటు గెంతి పరారయ్యారు. వీరు దట్టమైన అటవీ ప్రాంతంలో నదులు, కొండలు దాటుకుంటూ 15 కిలోమీటర్లు నడిచారు. వన్య ప్రాణులు తిరిగే దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్నారుల కదలికలను గిరిజనులు గుర్తించి సంరక్షించారు. చిన్నారులు స్పందిస్తూ తమకు ఆశ్రమ పాఠశాలలో పెద్ద తరగతుల విద్యార్థులు వేధిస్తున్నారని, ఈ విషయం చెబితే ప్రధానోపాధ్యాయురాలు మరింత వేధించారని కన్నీరు పెట్టుకున్నారు. తమ స్వగ్రామం జొరిగాం సమితి నువాగుడకి కాలినడక పయనమయ్యామని తెలిపారు. వారికి వెంటనే గిరిజనులు బిస్కెట్లు ఇచ్చి తల్లిదండ్రులు, పాఠశాలకు సమాచారం అందజేశారు. ప్రధానోపాద్యాయురాలి భర్త హుటాహుటిన అక్కడకు చేరుకుని చిన్నారులను ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. -
బారిక బందను పరిశీలించిన తహసీల్దార్
దత్తిరాజేరు: మండలంలోని ఇంగిపలాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 179లో ఎకరా 60 సెంట్లు బారిక బంద దురాక్రమణపై సాక్షిలో వ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు తహసీల్దార్ విజయభాస్కర్ సిబ్బంది బుధవారం చెరువు దగ్గరకు చేరుకుని చుట్టూ వేసిన ఇనుప కంచెను, చెరువు గట్టుపై వేసిన కంచెను తొలగించాలని ఆక్రమించిన ఎన్ఆర్ఐ బంధువులను ఆదేశించారు. రెండు రోజుల్లో ప్రభుత్వ భూమిలో వేసిన కంచెను తీస్తామని రైతులు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని వారు కోరడంతో..రెండు రోజుల్లో తొలగించని పక్షంలో జేసీబీతో తొలగిస్తామని తహసీల్దార్ వారికి చెప్పారు. 200 ఎకరాలకు వెళ్లే దారిని మూసి వేయడంతో రైతులు ఆందోళన చెంది సర్పంచ్ గర్భాపు విజయలక్షి, భర్త శ్రీనివాసరావు ద్వారా పత్రికలో కథనం రావడంతో పొలాలకు వెళ్లే మోక్షం కలింగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కంచె తొలగించాలని ఆదేశాలు -
బీజేపీ జిల్లా అధ్యక్షునికి ఘన స్వాగతం
రాయగడ: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన న్యాయవాది ఎం.గోపి ఆనంద్కు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షునిగా నియమితులైన గోపి పూరి జగన్నాథుని దర్శించుకుని మంగళవారం సాయంత్రం తిరిగి రాయగడకు వస్తున్న సమయంలో రామనగుడ, గుమడ,అమలా భట్ట ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘ నంగా స్వాగతం పలికారు. అనంతరం రాయగడకు చేరుకున్న ఆయనకు స్థానిక సర్క్యూట్ హౌస్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి ఆనందం పంచుకున్నారు. బర్డ్ ఫ్లూ భయం లేదు రాయగడ: జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం లేదని జిల్లా ముఖ్య పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ దేవరాజ్ నాయక్ స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాపించదన్న వదంతులు రావడంతో జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పా టు చేశామన్నారు. ఆంధ్రా నుంచి అత్యధిక శాతం బాయిలర్ కోళ్లు దిగుమతి అవుతున్నా యని, దీంతో అప్రమత్తమై ప్రతీ పౌల్ట్రీలో కోళ్ల ను పరీక్షిస్తున్నామని తెలిపారు. ఇంతవరకు అలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదని చెప్పారు. అయితే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, అధిక శాతం బాయిలర్ చికెన్ని వినియోగించకపోవడమే మంచిదని అన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాపించిందన్న వచ్చిన వదంతులతో స్థానిక చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. ధాన్యం లోడ్తో ట్రాక్టర్ బోల్తా మల్కన్గిరి: జిల్లా కలిమెల సమితి బేజాంగ్వాడ పంచాయతీ ఎంపివి 71 గ్రామం ముఖ్య రహదారిలో బుధవారం ధాన్యం లోడుతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ రహదారిపై రోజు వందాలాది మంది గిరిజనులు నిత్యావాసరాలకు వస్తుంటారు వంతెన పాడవడంతో 5 కిలో మీటర్లు దూరం చుట్టూ తిరిగి వెళ్లాలి. పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఉగాది పురస్కారాల కవితా సంపుటాలకు ఆహ్వానం శ్రీకాకుళం కల్చరల్: వేమన కవితా నిలయం(శ్రీకాకుళం), తపస్వి మనోహరం (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో ఉగాది సందర్భంగా సాహితీ పురస్కార సభ ఏర్పాటు చేస్తున్నట్లు మహ్మద్ రఫీ, తపస్వీ మనోహరం అధినేత నిమ్మగడ్డ కార్తీక్, బుర్రి కుమారరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విశ్వావసు నామ ఉగాది సందర్భంగా మార్చి 23న జరిగే ఈ సభ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు 2023 ఏడాదిలో ముద్రణ జరిగిన కవితా సంపుటి రెండు ప్రతులను మార్చి 15లోగా పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న మూడు పుస్తకాలకు రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6వేలు నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. సభకు హాజరైన వారికి సత్కారం ఉంటుందని పేర్కొన్నారు. కవితా సంపుటాలను పోస్టు లేదా కొరియర్ ద్వారా మహ్మద్ రఫీ (ఈవేమన), ఎస్–1 శారదా అపార్టుమెంట్, లక్ష్మీనగర్, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా 532407 చిరునామాకు పంపించాలని కోరారు. -
నిందితుడు అరెస్టు
జయపురం: ఒక బాలికపై లైంగిక దాడి ఆరోపణల తో జయపురం మహిళా పోలీసులు ఒక యువకుడిని అరెస్టు చేశారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ డాబుగుడ గ్రామానికి చెందిన లక్ష్మణ గౌఢ(18)ని అరెస్టు చేశామని మహిళా పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ ఈశ్వర తండి బుధవారం వెల్లడించారు. ఈనెల 13వ తేదీ రాత్రి బాలిక బహిర్భూమి కోసం బయటకు వెళ్లగా.. అక్కడే ఉన్న లక్ష్మణ గౌడ బాలికను ఎత్తుకుపోయి అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం ఎవరికి తెలిపినా చంపుతానని బాలికను హెచ్చరించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని పట్టుకుని దేహ శుద్ధి చేశారు. మరుసటి రోజు యువకుడి గ్రామానికి చెందిన వారు కర్రలు, గొడ్డళ్లు పట్టుకుని బాధితురాలి గ్రామంపై దాడి చేసి లక్ష్మణ గౌడను విడిపించుకుని వెళ్లిపోయారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసుల ను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశా రు. బాలికను ఆస్పత్రిలో పరీక్షించి ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం నిందితుడు లక్ష్మణ గౌడను అరెస్టు చేశారు. -
కలిమెల సమితిలో ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ ప్రారంభం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి కేంద్రంలోని పూసుగూఢ పెట్రోల్ బంక్ సమీపంలో ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ను జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ బుధవారం ప్రారంభించారు. కలిమెల సమితిలో ఎకై ్సజ్ కేసులు పెరుగుపోతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారం, కిరాణా దూకాణాల్లో విదేశీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఈ స్టేషన్ ఇకపై ఉపయోగపడుతోందని కలెక్టర్ అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి బింబేధర్ పండా, కలిమెల బీడీవో ప్రదీప్ కుమార్ కోర, జిల్లా ప్రధాన అభవృద్ధి, నిర్మాణాధికారి నరేష్ చంద్రశభర పాల్గొన్నారు. -
గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
పార్వతీపురం: WÇf¯]l {V>Ð]l*-ÌZÏ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*-ÌS¯]l$ MýS͵…^ól…-§ýl$MýS$ {糿¶æ$-™èlÓ… AÐ]l$-Ë$ ^ólçÜ$¢¯]l² yîlH&gôæ-iĶæÊi M>Æý‡Å-{MýSÐ]l$… ÐólVýS-Ð]l…-™èl…-V> ^ólĶæ*-ÌS° Isîæ-yîlH ï³K AÔ¶æ$-™ø‹Ù }ÐéçÜ¢Ð]l A«¨M>Æý‡$-ÌSMýS$ B§ól-Õ…^éÆý‡$. D Ðól$Æý‡MýS$ º$«§ýl-ÐéÆý‡… BĶæ$¯]l Isîæ-yîlH M>Æ>Å-ÌS-Ķæ$…-ÌZ yîlH& gôæiĶæÊH M>Æý‡Å-{MýSÐ]l$… {ç³VýS-†Oò³ ÑÑ«§ýl Ô>QÌS A«¨M>Æý‡$-ÌS-™ø çÜÒ$„ìS…^éÆý‡$. ˘ ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరతి ఆబా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(డీఏ–జేజీయూఏ) కార్యక్రమం గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు రూపొందించిందన్నారు. దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమీక్షలో ఆన్లైన్ సబ్కలెక్టర్ యశ్వంత్ కుమార్ పాల్గొనగా, ఇన్చార్జ్ హౌసింగ్ పీడీ పి.ధర్మచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ బి.చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ దుర్గా చక్రవర్తి, ఎస్ఎస్ఏ పీఓ ఆర్.తేజేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.జగన్మోమన్రావు, టీడబ్ల్యూ ఈఈ మణిరాజు, స్కిల్ డెవలప్మెంట్ డీఎస్డీఓ కంచిబాబు, జీసీసీ డీఎం మహేంద్రకుమార్, డీఎఫ్ఓ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొఠియాలో కమ్యూనిస్టు నాయకుల పర్యటన
కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో ఆంధ్రప్రదేశ్కి చెందిన కమ్యూనిస్టు నాయకులు పర్యటించారు. బుధవారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీ దిగువ శెంబి, ఎగువ శెంబి, ధూళి భద్ర గ్రామాల్లో మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు మండలం సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో పర్యటనలు జరిగాయి. ఈ పర్యటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి గంగ నా యుడు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ సమస్య పరిష్కారం చేయడంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్నారు. ఈ సమస్య పై ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చొరవ తీసుకొని ఇరు రాష్ట్రాల మధ్య సమావేశం నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలన్నా రు. ఇరు రాష్ట్రాలు ఇక్కడ అభివృద్ధిలో పొటీ పడాలే గానీ గిరిజనులను ఇబ్బంది పెట్టకూడదని తెలిపా రు. పర్యటనలో ఆ పార్టీ నాయకులు ఎన్వై నాయు డు, కోరాడ ఈశ్వర రావు, మర్రి శ్రీనివాసరావు, తాడంగి సన్నం, సీతయ్య కొంబులు, చోడిపల్లి బీరుసు, చరణ్ మర్రి మహేష్, కునేటి సుబ్బా తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆరిపాక బ్రహ్మానందం స్మారక నాటక పోటీలు
నెల్లిమర్ల: కళలకు కాణాచి, కళాకారుల గ్రామం నగర పంచాయతీలోని జరజాపుపేటలో ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీ ఆరిపాక బ్రహ్మానందం స్మారక రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి. ప్రముఖ నటుడు, కందుకూరి వీరేశలింగం అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్వర్గీయ ఆరిపాక బ్రహ్మానందం మాస్టారి పేరిట ఈ నాటక పోటీలను ఆయన కుటుంబీకులు, గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను గురువారం సాయంత్రం 6 గంటలకు ఎంఎల్ఏ లోకం నాగమాధవి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సభ అనంతరం నాటిక ప్రదర్శన ప్రారంభం అవుతుంది. తొలిరోజు హైదరాబాద్ కళాంజలి కళాకారులు’ రైతే రాజు’ నాటికను తర్వాత కాకినాడ శ్రీ సాయి కార్తీక్ క్రియేషన్న్స్ కళాకారులు ’ఎడారిలో వాన చినుకు’ నాటికను ప్రదర్శిస్తారు. రెండో రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సభా కార్యక్రమానికి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు, భీశెట్టి బాబ్జీ, ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వేమలి త్రినాథరావు హాజరు కానున్నారు. రెండో రోజు రాత్రి 7 గంటలకు శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం కళారారులు ’కొత్త పరిమళం’ నాటికను, తర్వాత విజయనగరానికి చెందిన సౌజన్య కళా స్రవంతి (ఉత్తరాంధ్ర) కళాకారులు దేవరాగం నాటిక ప్రదర్శించనున్నారు. మూడో రోజు శనివారం సాయంత్రం 6గంటలకు సభా కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్ బాబు), మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు హాజరు కానున్నారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్కు చెందిన చైతన్య కళాభారతి కళాకారులు ’చీకటి పువ్వు నాటికను, తర్వాత విశాఖపట్నానికి చెందిన తెలుగు కళాసమితి కళాకారులు ’నిశ్శబ్దమా నీ ఖరీదెంత ’నాటికను ప్రదర్శించమన్నారు. విజేతలకు బహుమతులు కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అతిథుల చేతుల మీదుగా జరజాపు పేటకు చెందిన సీనియర్ కళాకారులను సత్కరించనున్నట్లు పోటీల నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు. నాటక పోటీల విజేతలకు వరుసగా రూ.8వేలు, రూ. 6వేలు, రూ.4 వేలు నగదు బహుమతులతో పాటు శాశ్వత షీల్డ్ లను అందజేయనున్నట్లు చెప్పారు. ఉత్తమ నటులకు వ్యక్తిగత బహుమతులతో పాటు నగదు పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ నాటక పోటీలకు కళాకారులు కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మూడురోజుల పాటు జరగనున్న పోటీలు రెండు రాష్ట్రాల నుంచి ఆరు నాటిక బృందాల రాక -
రేపటి నుంచి మెట్రిక్ పరీక్షలు
● కొరాపుట్ జిల్లానుంచి హాజరుకానున్న 16,218 మంది విద్యార్థులు జయపురం: ఒడిశా రాష్ట్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి మెట్రిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు కొరాపుట్ జిల్లాలో 16 వేల 218 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. వీరిలో 16,137 మంది రెగ్యులర్, 67 మంది ఎక్స్ రెగ్యులర్ విద్యార్థులు కాగా మరో 15 మంది మాధ్యమ పాఠ్యక్రమంలో పరీక్షలు రాస్తారని జయపురం సెకెండరీ బోర్డు కార్యాలయం అధికారులు తెలిపారు. జయపురం నోడల్ సెంటర్ ఆధీనంలో జయపురం పట్టణంలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 1244 మంది రెగ్యులర్, పది మంది ఎక్స్ రెగ్యులర్ పిల్లలు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఆ కేంద్రాల్లో ఒకటైన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 326 మంది రెగ్యులర్, నలుగు ఎక్స్ రెగ్యులర్ విద్యార్థులు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలో 265 మంది, మున్సిపల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 152 మంది రెగ్యులర్, స్థానిక సిటీ ఉన్నత పాఠశాలలో 155 మంది రెగ్యులర్, ఒక ఎక్స్ రెగ్యులర్, బరిణిపుట్ ఉన్నత పాఠశాల కేంద్రంలో 195 మంది రెగ్యులర్, నలుగురు ఎక్స్ రెగ్యులర్ పరీక్షలు రాస్తారు. అలాగే అంబాగుడ ఉన్నత పాఠశాలలో 236 మంది రెగ్యులర్ హరడాపుట్ ఉన్నత పాఠశాలలో 268 మంది రెగ్యులర్, ఒక ఎక్స్ రెగ్యులర్, పంపుణీ ఉన్నత పాఠశాలలో 194 మంది రెగ్యులర్, ముక్త గ్రామ ఉన్నత పాఠశాలలో 15 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జయపురం సెకెండరీ బోర్డు అధికారులు వెల్లడించారు. కాగా ప్రశ్న పత్రాలు ఇప్పటికే జయపురం చేరాయి. వాటిని అత్యంత భద్రత మధ్య 21వ తేదీ ఉదయం అన్ని కేంద్రాలకు చేర్చనున్నట్లు మాధ్యమిక విద్యా పరిషత్ కొరాపుట్ జోన్ అధికారి శంకర నాయిక్ వెల్లడించారు. పరీక్షల్లో అవకతవకలు జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. కంట్రోలు రూంతో అనుసందానం చేశామన్నారు. -
పిల్లలకు పునరావాసం
కొరాపుట్: మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి జైలు పాలు కాగా వారి నలుగురు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. గత నెలలో కొరాపుట్ జిల్లా బందుగాం సమితి గరిడి పంచాయతీలోని దింబగుడ గ్రామంలో రంజన్ కులసిక మద్యం మత్తులో తన భార్యని హత్య చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. అంతవరకు చట్టం తన పని తాను చేసుకుపోయింది. కానీ ఆ దంపతుల నలుగురు పిల్లలు మాత్రం రోడ్డు పడ్డారు. తినడానికి తిండి లేక అలమటించి పోయారు. పిల్లలకు న్యాయం చేయాల్సిన అధికారులు వీరిని పట్టించు కోలేదు. దాంతో గ్రామస్తులే వీరికి అన్నం పెట్టారు. అదే సమయంలో గ్రామానికి వచ్చిన బీడీఓకి చిన్నారుల సమస్యను గిరిజనులు వివరించారు. వీరికి సహాయం చేస్తామని హామీ ఇచ్చిన బీడీఓ కానరాలేదు. పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఈ విషయం మీడియాలోనూ ప్రసారమైంది. ఇది చూసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు బుధవారం ఆ గ్రామానికి చేరుకుని పిల్లలను తామ పోషిస్తామని ముందుకు వచ్చారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో కొరాపుట్ జిల్లా శిశు సంక్షేమ శాఖా అధికారులు హుటాహుటిన ఆ గ్రామం చేరుకుని చిన్నారులను ప్రభుత్వ ఆశ్రమ కేంద్రానికి తరలించారు. చిన్నారులు అధికారుల వెంట వెళ్తున్నప్పుడు ఆ గ్రామ గిరిజనులకు కృతజ్ఞతగా చేతులు ఊపూతూ ముందుకు సాగారు. ఆ దృశ్యం గ్రామస్తులందరికీ కన్నీళ్లు తెప్పించింది. భర్త చేతిలో భార్య హతం రోడ్డున పడ్డ నలుగురు చిన్నారులు పునరావాసం కల్పించిన అధికారులు -
197 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
తెర్లాం: ఎటువంటి అనుమతులు లేకుండా 197 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి బుధవారం తెర్లాం ఎస్సై సాగర్బాబు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నందబలగ గ్రామానికి చెందిన ఆనెం శ్రీనివాసరావు తెర్లాం నుంచి 197మద్యం సీసాలు తీసుకువెళ్తుండగా అదే సమయంలో అటుగా వస్తున్న స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులకు గంగన్నపాడు గ్రామం వద్ద మద్యం పట్టుకున్నారు. అనంతరం మద్యం సీసాలను, తీసుకు వెళ్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్స్టేషన్కు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి మద్యం సీసాలను సీజ్ చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టుబొండపల్లి: మండలంలోని వేండ్రాం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ జె.జనార్దనరావు తెలిపారు. గ్రామానికి చెందిన లెంక అప్పలనాయుడు గ్రామంలోని తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై పి.నరేంద్ర కుమార్, హెచ్సీలు జె.బాషా, లోకాభిరామ్, రాజు, గంగాధరుడు తదితరులు పాల్గొన్నారు. -
ఒడిశాలో హత్య.. పీఎంపాలెంలో నిందితుల అరెస్ట్
పీఎంపాలెం: ఒడిశా రాష్ట్రంలోని సుందర్గఢ్ జిల్లా రాజ్గంగ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని బుధవారం పీఎంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివీ.. ఒడిశాకు చెందిన సుజిత్ బెంగ్రా, మున్నా సన్యాసి ఓ హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులు. పీఎంపాలెం బాబా కాలేజీ ఏరియాలో నిందితుల్లో ఒకరి చెల్లెలు నివసిస్తోంది. ఒడిశా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని రోజులుగా నిందితులు ఆమె వద్ద తలదాచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒడిశా పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల నివాసం గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఒడిశా తీసుకెళ్లారు. -
ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు
చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) పరిధిలో కొన్నేళ్ల క్రితం నియామకాలు జరిగి ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆ సంస్థ ఎం.డి. పి.రమేష్ తెలిపారు. తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలపై సంబంధిత ఉద్యోగులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆర్ఈసీఎస్ పరిధిలో 59 మంది ఎనర్జీ అసిస్టెంట్ల నియామకాలు గతంలో జరిగినట్లు చెప్పారు. వారిలో ఆరుగురు మాత్రమే ఇతర రాష్ట్రాల్లో తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు నమోదైందన్నారు. తాజాగా ఇచ్చిన నోటీసులకు సంబంధిత ఉద్యోగులు ఇచ్చిన సమాధానం ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. జీబీఎస్ వ్యాధిపై ఆందోళన వద్దు విజయనగరం ఫోర్ట్: గులియన్ బర్రీ సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యాధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాధిని ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ, కట్టడిచేయడానికి అవసరమైన ల్యాబ్లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పరిశుభ్రమైన తాగునీరు, ఆహారాన్ని తీసుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తాగునీటి పథకాలను షెడ్యూల్ ప్రకారం క్లోరినేషన్ చేయాలని, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవన రాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యాధి సోకితే కాళ్లు, చేతులు బలహీన పడడం, చలనం తగ్గిపోవడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఈ వ్యాధి 80 శాతం మందికి సహజంగానే తగ్గిపోతుందన్నారు. 15 శాతం మందికి చికిత్స అవసరమని, కేవలం 5 శాతం మందికి మాత్రమే పరిస్థితి విషమంగా మారుతుందన్నారు. -
కష్టార్జితం కాలిపోయింది..
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని తేలుకుంచి గ్రామంలో బుధవారం షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో కిరాణా షాపు దగ్ధమైంది. కష్టపడి దాచుకున్న సొమ్ము కాలిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుడియా బిమ్మో ఇంట్లోనే కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం వేకువజాము ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే అత్తమ్మ వైద్యం కోసం పెట్టెలో భద్రపరిచిన మూడు లక్షల రూపాయల నగదు కాలిపోయాయి. రెండు ఫ్రిజ్లు, కిరాణా సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు మూడున్నర లక్షల రూపాయల సామాన్లు కాలిపోయినట్లు అగ్నిమాపకాధికారులు కె.ప్రశాంత్, సూర్యారావు తెలిపారు. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, సర్పంచ్ పాతిర్ల రాజశేఖరరెడ్డి పరామర్శించారు. షార్ట్ సర్క్యూట్తో షాపు దగ్ధం కాలి బూడిదైన రూ.3 లక్షల నగదు -
మహర్దశ
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025పర్లాకిమిడి రైల్వేస్టేషన్కు.. ● అమృత్స్టేషన్ల నవీకరణలో భాగంగా అభివృద్ధి పనులు ● శరవేగంగా పనుల నిర్వహణ పర్లాకిమిడి: అమృత్ స్టేషన్ల నవీకరణలో భాగంగా పర్లాకిమిడి రైల్వేస్టేషన్కు మహర్దశ పట్టింది. నౌపడ నుంచి పర్లాకిమిడి, గుణుపురం వరకు డబుల్ లైన్స్ వేయడమే కాకుండా పర్లాకిమిడి, గుణుపురం రైల్వేస్టేషన్లను అత్యంత సుందరంగా ఆధునికీకరిస్తున్నారు. మరికోద్ది రోజుల్లోనే స్టేషన్ పనులు పూర్తికానున్నాయి. ప్రస్తుతం పర్లాకిమిడి స్టేషన్లో ఓవర్ బ్రిడ్జిపనులు చురుగ్గా సాగుతున్నాయి. సీనియర్ సిటిజన్ ప్యాసింజర్లు ప్లాట్ఫారం మారడానికి లిఫ్టు సౌకర్యం సైతం కల్పిస్తున్నారు. రైల్వేస్టేషన్ వద్ద రోడ్డు పనులు సైతం శరవేగంతో పూర్తి చేస్తున్నారు. ఇక్కడ రైల్వేస్టేషన్ ఘనత పర్లాకిమిడి మహారాజా శ్రీకృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్కు దక్కుతుంది. నౌపడ నుంచి పర్లాకిమిడికి 91 కిలోమీటర్ల నేరో గేజ్పై స్టీమ్ ఇంజనును అప్పట్లో రూ.96 లక్షల సొంత నిధులు వెచ్చించి వెచ్చించి రైళ్ల రాకపోకలకు శ్రీకారం చుట్టారు. తదనంతరం పర్లాకిమిడి నుంచి గుణుపురం వరకు రైల్వేలైన్ పొడిగించారు. ప్రస్తుతం పర్లాకిమిడి నుంచి గుణుపురం అక్కడి నుంచి పూరీ, భువనేశ్వర్, రూర్కెలా, విశాఖపట్నం వరకు మూడు రైళ్లు నడుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తున్న తరుణంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే నవీకరణకు నడుంబిగించారు. ఒడిషాలో రైల్వేస్టేషన్లు, ట్రాక్స్ ఆధునీకరణకు 2025–26 రైల్వే బడ్జెట్లో రూ.10,599 కోట్ల నిధులు కేటాయించారు. గత పదేళ్లలో 2వేల 46 కిలో మీటర్ల రైల్వే ట్రాక్స్ నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో 59 రైల్వేస్టేషన్లను అమృత్స్టేషన్ల పథకం క్రింద అభివృద్ధి చేస్తున్నారు.న్యూస్రీల్ -
హరిపురంలో వేంకటేశ్వర మందిర ప్రతిష్ట
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి ఖండవ గ్రామ పంచాయితీ హరిపురం గ్రామంలో వేంకటేశ్వరస్వామి మందిర ప్రతిష్టా మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, రోక్కం సతీష్, రామచంద్రుడు, జ్యోతి, అధికసంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. ప్రతిష్టలో భాగంగా యజ్ఞపూజలు జరిగాయి. గుర్తు తెలియని మృతదేహం కలకలం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని హయాతినగరం సమీపంలో నాగావళి నదీ తీరంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. వ్యక్తి ఎడమ చేతి భుజంపై మహిళ బొమ్మ, డి.లక్ష్మి అనే అక్షరాలు పచ్చబొట్టుగా వేసి ఉన్నాయని ఒకటో పట్టణ ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. బాగా కుళ్లిన స్థితిలో ఉండటంతో సుమారు ఐదు రోజులు కిందట వ్యక్తి చనిపోయి ఉంటాడని, వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నామన్నారు. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలిని పరిశీలించామని, పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించామని చెప్పారు. వివరాలు తెలిస్తే ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో తెలియజేయవచ్చన్నారు. విద్యార్థిని ఆత్మహత్య కాశీబుగ్గ: మందస మండలం లోహరిబంద గ్రామంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రి అనూష (14) లోహరిబంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయింది. ఏం జరిగిందో గానీ ఇంటి పక్కనున్న తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని వెతుక్కుంటూ వెళ్లిన ఉపాధ్యాయులు చెట్టుకు వేలాడటం చూసి నిర్ఘాంతపోయారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాకలు పీకేశారు..!
● మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుధ్య కార్మికులు ● భారీగా పోలీసుల మోహరింపుబొబ్బిలి: పట్టణంలోని 29వ వార్డు పాకివీధి సమీపంలో 1.40ఎకరాల స్థలాన్ని పారిశుధ్య కార్మికులకు కేటాయించాలని గత పాలకులు ఇచ్చిన హామీ మేరకు అందులో తాత్కాలికంగా వారు వేసుకున్న పాకలను మున్సిపల్ అధికారులు, పోలీసులు రెండు పొక్లెయిన్లతో తొలగించారు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం పారిశుధ్య కార్మికులు ఇళ్ల వద్ద లేని సమయంలో పాకలు తొలగించడానికి వచ్చిన అధికారులు, పోలీసులను మహిళలు అడ్డుకున్నా వెరవకుండా తొలగించారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న కార్మికులు, సంఘం నాయకులు అంతా ఒక చోట చేరి మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో కార్యాలయ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా ఆక్రమించి మోహరించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర తరువాత కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. పారిశుధ్య కార్మికులకు కేటాయించిన స్థలం కోసం 1991లోనే మున్సిపల్ కార్యాలయానికి రుసుము చెల్లించామని ఆ రశీదులు తమ వద్దే ఉన్నాయని చెప్పారు. ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, సీఐలు కె. సతీష్ కుమార్, నారాయణరావు, ఎస్సై ఆర్.రమేష్ల సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మీకు స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, లేకుంటే ఆ పార్టీలోనే ఉండబోనని టీడీపీ నాయకుడు కాకల వెంకటరావు కార్మికులకు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా కార్మికులు మెమొరాండం సమర్పించగా మున్సిపల్ ఉన్నతాధికారుల లేఖను కార్మికులకు వారు అప్పగించారు. అక్కడ నిర్మించిన పాకలను వెంటనే తొలగించాలని పోలీసులు, అధికారులు కోరారు. పాకలను తొలగించే వరకూ సరేనని, కానీ అక్కడున్న కర్రలను తొలగించేది లేదని చెప్పడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ స్థలంలో కర్రలను తొలగించకపోతే మీపై కేసులు నమోదు చేస్తామని, అరెస్టులుంటాయని హెచ్చరించడంతో కాసేపు తోపులాట జరిగింది. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు సంభవించాయి. ఆరుగురి అరెస్ట్ కేసుల నమోదుఆ సమయంలో కోపోద్రిక్తులైన పోలీసులు ఆరుగురు కార్మిక సంఘం నాయకులు పొట్నూరు శంకరరావు, బంగారి యుగంధర్, ఏడుకొండలు, వడ్డాది శంకర రావు, జి.గౌరీశు, బంగారి వెంకట రమణలను పోలీసు వ్యాన్లోకి ఎక్కించి స్టేషన్కు తీసుకువెళ్లిపోయారు. అక్కడ వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అక్కడి నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ వారిపై బైండోవర్ చేశారు. ఇండ్ల స్థలాలను అడిగితే ఇలా అరెస్టులు, కేసులు ఏమిటని కార్మికులు ప్రశ్నించారు. చర్చల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శ శరత్, కాకల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు చైన్స్నాచర్లు అరెస్టు
జయపురం: మహిళలపై దాడి చేసి మంగళసూత్రాలు, బంగారు గొలుసులను తెంచుకు పోతున్న ముగుర్గు దొంగలను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి బుధవారం తెలిపారు. జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధి సిందిగుడ గ్రామానికి చెందిన కనకదేయి భొత్ర గత ఏడాది అక్కోబర్ మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో కనకదెయి భొత్ర హడియగండగుడ నుంచి సిందిగుడ గ్రామం వస్తుండగా ముఖాలకు మాస్క్లు వేసుకున్న ముగ్గురు గుర్తు తెలియని దుండగులు తెల్లని మోటారు బైక్పై వచ్చి ఆమె మెడలో ఉన్న మంగళ సూత్రాలను బలవంతంగా తెంచుకు పోయారు. దీనిపై మరుసటి రోజున పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. అలాగే ఈ నెల 18వ తేదీన పేపరుమిల్లు జంక్షన్ వాసి ప్రకాశ్ చంద్ర మహంతి కూడా చైన్స్నాచింగ్ జరిగినట్టు ఫిర్యాదు చేశారన్నారు. గత డిసెంబర్ మూడో తేదీన తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో ప్రకాశ్ మహంతి భార్య ప్రమీళ మహంతి ఇంటిముందు వాకిలి పరిశుభ్ర పరుస్తున్న సమయంలో ముగ్గురు దుండగులు మోటారు బైక్పై వచ్చి ఆమె మెడలోని మంగళసూత్రాలతో ఉన్న బంగారు లాకెట్ను తెంచుకు పోయారని ఫిర్యాదులో పేర్కున్నారు. 1.5 తులాల మంగళసూత్రాల విలువ లక్ష రూపాయలకు పైన ఉంటుందని ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఈ రెండు కేసులలో నిందితులు దొంగిలించిన తీరును బట్టి ఒక ముఠాయేనని దర్యాప్తులో వెల్లడైందని వారిని గుర్తించి బుధవారం అరెస్టు చేసామని బుధవారం తెలిపారు. అరెస్టయిన వారిలో కుంద్ర సమితి గొరహండి గ్రామానికి చెందిన నరహరి హరిజన్ కుమారుడు కర్నాల్ హరిజన్, కుంద్ర సమితి భటిగుడ గ్రామం సొమరు హరిజన్ కుమారుడు రమేష్ హరిజన్, కుద్రా సమితి బుటుగుడ గ్రామానికి చెందిన గోపీనాథ్ హరిజన్ కుమారుడు త్రినాథ్ హరిజన్ ఉరఫ్ బుటు హరిజన్ ఉన్నారన్నారు. నిందితుల నుంచి మూడు తులాల బరువున్న రెండు మంగళ సూత్రలు, ఒక మోటారుబైక్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి ఈశ్వర తండి వెల్లడించారు. ముగ్గురిని కోర్టులో హాజరు పరిచామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
మద్యం దుకాణాలను తరలించాలని వినతి
రాయగడ: పట్టణంలోని మూడు విదేశీ మద్యం దుకాణాలను వేరేచోటకు తరలించాలని, లేదంటే ఆందోళన చేపడతామని వికాస్ మంచ్ డిమాండ్ చేసింది. జిల్లా అబ్కారీశాఖ అధికారికి మంచ్ వికా స్ సభ్యులు బుధవారం వినతిపత్రం అందించారు. పట్టణంలోని 3, 11, 15 నంబర్లతో చెలామణి అవుతున్న మద్యం దుకాణాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జనావాసా ల్లో గల ఈ దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించాలని గత నెల 8న సంబంధిత శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించకపోతే అబ్కారీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాయగడ జిల్లా వికాస్ మంచ్ అధ్యక్షుడు దయానంద ఖడంగ, సభ్యులు మనోజ్ సాహు, రాజు నాయక్, తదితరులు ఉన్నారు. -
రైతులకు ఉపయోగపడేలా శిక్షణ
ఆమదాలవలస: రైతులకు ఉపయోగపడేలా యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ బి.ముకుంద రావు సూచించారు. ఆమదాలవలసలోని కృషివిజ్ఞాన కేంద్రంలో బుధవారం కె.వి.కె. ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు అధ్యక్షతన 43వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025– 26 సంవత్సరంలో చేయాల్సిన పరిశీలన క్షేత్రాలు, ప్రదర్శన క్షేత్రాలపై దిశా నిర్దేశం చేశారు. నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.భరత లక్ష్మి, కె.వి.కె. సమన్వయకర్త డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి త్రినాథ స్వామి, జిల్లా మత్స్య అధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆనంద్రావు వివిధ అంశాలపై ప్రంసగించారు. -
వన్య ప్రాణులను కాపాడారు
జయపురం: వన్య ప్రాణుల రక్షణకు దృష్టి సారించింది బొయిపరిగుడ అటవీ సిబ్బంది. అడవుల్లో వన్య ప్రాణులను వేటాడే ఆట కట్టించేందుకు అటవీ సిబ్బంది పెట్రోలింగ్ జరిపింది. మంగళవారం రాత్రి బొయిపరిగుడ సమితి టికరపడలో కొంతమంది మూడు అడవి పందులను పట్టుకొని గ్రామానికి తీసుకువెళ్లారని, వాటిని బుధవారం చంపి మాంసం అమ్మేందుకు యోచిస్తున్నారని విశ్వాసనీయ వర్గాల ద్వారా బొయిపరిగుడ సమితి దసంతపూర్ అటవీ అధికారి రంజితా నాయక్కు సమాచారం అందింది. రంజితా నాయక్ ఆధ్వర్యంలో ఓ బృందం టికరపడ గ్రామానికి వెళ్లింది. గ్రామంలో ఒకచోట మూడు అడవి పందులు బంధించి ఉంచడాన్ని గుర్తించారు. వాటిని రక్షించి బొయిపరిగుడ అటవీ విభాగ కార్యాలయానికి తీసుకువచ్చారు. అడవి పందులను బుధవారం వైద్య పరీక్షలు చేపట్టిన అనంతరం అడవిలో విడిచి పెట్టనున్నట్లు రంజితా నాయక్ వెల్లడించారు. మూడు అడవి పందులను పట్టి ఉంచిన వారిని కనుగొని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి మావోయిస్టు నక్సల్ ప్రభావిత ప్రాంతం జి.మఝిగుడ గ్రామ పంచాయతీ కొటరగుడ సమీప అడవిలో 578 కేజీల గంజాయిని కనుగొన్నట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ బుధవారం వెల్లడించారు. మంగళవారం కొటరగుడ అడవిలో 25 బస్తాలు ఒక చోట పేర్చి ఉండటాన్ని గుర్తించిన్నట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రదాన్ తెలిపారు. గంజాయి బస్తాలను పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లి మెజిస్ట్రేట్ సమక్షంలో తూకం వేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. రాయగడ జిల్లాలో.. జిల్లాలోని గుణుపూర్, పద్మపూర్ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కుర్లిం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు కుర్లిం రహదారి వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు బోలేరోను ఆపి తనిఖీ చేయగా అందులో 630 కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన వ్యక్తి గజపతి జిల్లాలోని బిరికొట్ ప్రాంతానికి చెందిన జయంత్ బెహరాగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10 లక్షల ఉంటుందని అంచనా వేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం కోర్టుకు తరలించారు. పద్మపూర్లో.. పద్మపూర్లో బుధవారం నిర్వహించిన దాడుల్లో భాగంగా బడపల్లి అటవీ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. 40 కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు రాకను పసిగట్టిన గంజాయి అక్రమ రవాణా దారులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. -
గంజాయి నేరగాళ్లపై ఉక్కుపాదం
శ్రీకాకుళం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవారిని, క్రయవిక్రయాలు జరిపేవారిని, సేవించేవారిని గుర్తించి ప్రత్యేక షీట్లు తెరవాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి ఆదేశించారు. రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, నాన్బెయిల్బుల్ వారెంట్ అమలు, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోక్సో కేసులపై సమీక్షించారు. గంజాయి ద్వారా ఆదాయం అర్జించే వారి ఆస్తుల స్వాధీనం చేసుకోవడంతో పాటు పీడీ యాక్టు పెట్టేలా పురోగతి చూపాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా చొరవతీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దారి దొంగల అరెస్ట్
కొరాపుట్: దారి దోపిడీ దొంగలను నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం ఐఐసీ సంబిత్ బెహరా ఈ కేసు వివరాలు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నందాహండి సమితి గరుడ గుడ గ్రామానికి చెందిన త్రినాథ్ బొత్ర నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో దసరాపొద మార్గంలో జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు దాడి చేసి డబ్బులు, మొబైల్, బైక్ తీసుకెళ్లిపోయారు. బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితులు సరాపొదకి చెందిన సిద్దు హరిజన్, టింకు హరిజన్, లోహరా శాలకి చెందిన హుస్సేన్ హరిజన్లను పోలీసులు అరెస్టు చేశారు. బోడజాత్రకు ఏర్పాట్లు మల్కన్గిరి: జిల్లాలో ప్రసిద్ధ బోడ జాత్ర నెల రోజుల పాటు సాగనుంది. గిరిజన సంప్రదాయంలో ముత్యాలమ్మ తల్లితో కలిసి శ్రీకృష్ణుడు కనం రాజుగా, అర్జునుడు బాలరాజ్గా, భీముడు పోతురాజ్గా అమ్మవారితో ఊరేగి ప్రజలకు నెమలి పింఛాలతో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు సౌకర్యాల ఏర్పాటుపై ఒడిశా–ఆంధ్రా అధికారులు సంయుక్తంగా సమావేశమయ్యారు. మార్చి 3న ఆంధ్రాలోని పొల్లేరు గ్రామం నుంచి నదీ స్నానం అనంతరం దేవతలు నౌకా విహారంతో ఒడిశాకు వస్తారు. ఆంధ్రా, ఒడిశా, చత్తీస్గఢ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. -
బాల్య వివాహం నిలిపివేత
కొరాపుట్: జిల్లాలోని సిమిలిగుడ పంచాయతీ మాలిమారువ గ్రామంలో అధికారులు బుధవారం ఓ వివాహ వేడుక జరుగుతోంది. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. భారీ విందు భోజనాలు జరుగుతున్నాయి. కొన్ని క్షణాల్లో పెళ్లి జరగనుంది. సరిగ్గా అదే సమయంలో కొరాపుట్ జిల్లా బాలల సంరక్షణ అధికారిణి రాజశ్రీ దాస్ అక్కడకు పోలీసులతో వెళ్లారు. జరుగుతున్నది బాల్య వివాహమని ఫిర్యాదు రావడంతో.. బాలిక వయసు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి పెళ్లి ఆపాలని సూచించారు. దీంతో గిరిజనులు అధికారుల వాహనాలను చుట్టుముట్టారు. వారిని నచ్చజెప్పి ఇరువర్గాలను కొరాపుట్ తరలించారు. అనంతరం బాలికని శిశు సంక్షేమ వసతి గృహానికి తరలించారు. -
అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఈసెంట్రా 2కే25’ పేరుతో రెండురోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వృత్తి పరమైన నైపుణ్యాలతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని విద్యార్ధులు ఆదిశగా కళాశాల స్థాయి నుంచి తయారు కావాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎన్ఎస్టీఎల్ రిటైర్డ్ సైంటిస్టు బీవీఎస్ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, సెమీ కండక్టర్స్పై నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు అధికమన్నారు. భవిష్యత్లో అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం సావనీర్ను ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టీఎస్ఎన్మూర్తి, ప్రొఫెసర్ కె.బాబులు, కేసీబీరావు, డాక్టర్ గురునాథం, డాక్టర్ నీలిమ, డాక్టర్ బి.హేమ, డాక్టర్ జి.అప్పలనాయుడు, జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ డైరెక్టర్లు, అధ్యాపకులు, వివిధ కళాశాలల నుంచి హాజరైన 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్
శ్రీకాకుళం న్యూకాలనీ: అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ పెట్టిందని విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్మత్స విష్ణుకుమార్రాజు పేర్కొన్నారు. బుధవారం బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఇటీవల ప్రవేశపెట్టిన ప్రజా బడ్జెట్ 2025–26పై మేధావుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్లోని ముఖ్య అంశాలపై పలువురు వక్తలు చర్చించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.అమ్మన్మాయుడు, చార్టర్డ్ అకౌంటెంట్ ఐ.కె.రావు, రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథం, అంబేడ్కర్ యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, కంపెనీ సెక్రటరీ బుర్రా భార్గవ్, విద్యావేత్త నిక్కు అప్పన్న, ఎన్జీవో మణిశర్మ, గురజాడ విద్యాసంస్థల ప్రతినిధి సంయుక్త, విద్యావేత్త జామి భీమశంకర్, జర్నలిస్టు సంఘ నాయకుడు కొంక్యాణ వేణుగోపాల్, డాక్టర్ పైడి సింధూర, బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, కరుణాకరరావు, నరేంద్రచక్రవర్తి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
దత్తిరాజేరు: మండలంలోని కె.కృష్ణాపురంలో మంగళవారం రాత్రి గ్రామంలో జరుగుతున్న పెళ్లి వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా గ్రామానికి చెందిన సుమల పైడిపునాయుడికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ బూర్జవలస ఎస్సై రాజేష్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండలం పాతరేగకు గూడాపు సింహాచలం, గాయాల పాలైన పైడిపునాయుడుల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడితో ఆగకుండా గ్రామ శివారుకు స్కూటీపై సింహాచలం వచ్చి పైడిపునాయుడిపై కత్తితో దాడిచేయగా గాయాలపాలవడంతో ముందుగా బాడంగి ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యం పొందుతున్నాడు. దాడిచేసిన సింహాచలాన్ని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఫ్లోటింగ్ జెట్టీకి గ్రహణం
పూసపాటిరేగ: జిల్లాలో తీరప్రాంతమైన చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం పట్టింది. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచాలన్న గత ప్రభుత్వ ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఎన్నికల ముందు అప్పటి సీఎం వైఎస్ జగన్హమోహన్రెడ్డి సుమారు రూ.23 కోట్లు మంజూరు చేస్తూ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం జెట్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫ్టోటింగ్ జెట్టీకి పరిపాలన, ఆర్థిక అనుమతులపై కనీసం పట్టించుకోకపోవడంతో టెండర్ ప్రక్రియ జరగలేదు. ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవన విధానం మెరుగుపడేది. జెట్టీలేక పోవడంతో వేట సాగక తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం నుంచి సుమారు 6 వేల మంది మత్స్యకారులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. తమిళనాడు, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలకు బతుకు తెరువు కోసం మత్స్యకారులు వలస పోయారు. జెట్టీ నిర్మాణం పూర్తయితే సుమారు 885 బోట్లకు వరకు జెట్టీలో నిలుపుకునే అవకాశం ఉంది. జెట్టీలేక పోవడంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన బోట్లు ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చడంతో లక్షలాది రుపాయల విలువైన బోట్లు తక్కువ కాలంలోనే దెబ్బతింటున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో 27 కిలోమీటర్ల తీరప్రాంతంలో పూసపాటిరేగ, భోగాపురం మండలాలను కలుపుతూ 19 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తుండగా వారిలో వేటపై ప్రత్యక్షంగా 6 వేల మంది, 15 వేల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కూటమి సర్కారు మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించి ఎంతో కాలంగా మత్స్యకారులు కళగా ఉన్న ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తిచేసే విధంగా అడుగులు మందుకు పడాలని మత్స్యకారులు కోరుతున్నారు.ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలిఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి. టెండర్ దశలో ఉన్న ఫ్లోటింగ్ జెట్టీకి అనుమతులు మంజూరు చేసి మత్స్యకారుల సంక్షేమంపై దృషి సారించాలి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి. బర్రి చినఅప్పన్న, జిల్లామత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు విజయనగరం మత్స్యకారుల చిరకాల వాంఛ ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం మత్స్యకారుల చిరకాల వాంఛ. జెట్టీ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుంది. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని జెట్టీ నిర్మాణంపై దృష్టిసారించాలి. బొ.కొర్లయ్య, చింతపల్లి ఆరునెలలుగా ముందుకు సాగని పనులు మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం వేటసాగక ఇబ్బందులు పడుతున్న గంగపుత్రులు -
ఆశ్రమ పాఠశాలలకు కోడిగుడ్డు కట్
సీతంపేట: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో విద్యార్థులకు పోషకాహారం ఎండమావిగా మారుతోంది. కొద్ది రోజుల కిందట అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలు తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో వివిధ ఆశ్రమపాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెనూలో భాగంగా పోషకాహరం అందివ్వడానికి పెట్టే కోడిగుడ్లు నిలుపుదల చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఆదేశించారు. పక్క ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల విద్యార్థులకు ఎగ్స్ పెడుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం నిలిపివేయడం గమనార్హం. అలాగే మిడ్డేమీల్, అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో చిన్నారులకు కోడిగుడ్లు ఇస్తున్నప్పటికీ ఆశ్రమపాఠశాలలకు మాత్రమే నిలుపుదల చేయడమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మిగతా ఐటీడీఏలలో ఎక్కడా కోడిగుడ్లు నిలుపుదల చేయలేదని స్థానిక గిరిజన సంక్షేమశాఖ పరిధిలో మాత్రమే ఆపివేశారని వాపోతున్నారు. సీతంపేట ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో 47 గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో దాదాపు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నెలకు ఐటీడీఏ పరిధిలో అన్ని ఆశ్రమపాఠశాలలు, గురుకులాలకు కలిపి మొత్తం 3,70,000 కోడిగుడ్లు అవసరం. ప్రతిరోజూ ఉడికించిన కోడిగుడ్డు (శనివారం మినహాయించి )ఇచ్చేవారు. చికెన్, కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినవచ్చని ప్రభుత్వం ఒక వైపు ప్రచారం చేస్తోంది. చికెన్ ఎలాగూ బర్డ్ఫ్లూ భయంతో నిలుపుదల చేశారు. కనీసం ఎగ్ కూడా పెట్టకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఏమన్నారంటే..ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నదొర వద్ద సాక్షి ప్రస్తావించగా తుని నుంచి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని, బర్డ్ఫ్లూ వ్యాధి వ్యాప్తి దృష్ట్యా కొద్ది రోజులు నిలిపివేయాలని అన్ని వసతిగృహాలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అంతకు ముందు చికెన్ నిలిపివేత బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నిర్ణయం -
23న ఉత్తరాంధ్ర స్థాయి చెస్ పోటీలు
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఈనెల 23న ఉత్తరాంధ్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కేవీ.జ్వాలాముఖి బుధవారం తెలిపారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకా రులతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం–మన్యం, అనకాపల్లి జిల్లాలకు చెందిన వారు పాల్గొంటారని పేర్కొన్నారు. ఓపెన్ విభాగంతో పాటు అండర్–7,9,11,13,15 వయస్సుల విభాగాల్లోని బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఓపెన్ విభాగంలో విజేతకు రూ.30వేల నగదు బహుమతి ప్రదానం చేయనుండగా..చిన్నారుల విభాగంలో విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ముందుగా ఫోన్ 9703344488 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
పెరిగిన మృతుల సంఖ్య
జయపురం: జయపురం సమితి టంకువ పంచాయతీ ధనముండ వంతెన సమీపంలో ఘోర ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఆటో టిప్పర్ ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదానికి గురైన వారంతా కూలి పనులు చేసుకుంటూ బతికేవారే. రోజ్గార్ పనుల్లో యంత్రాలు వినియోగిస్తుండడంతో జాబ్ కార్డులు ఉన్నా పనులు లభించని ఆ గ్రామ ప్రజలు ఆటోల్లో జయపురం పట్టణంలో కూలి పనులకు వెళ్తుంటారు. అలా వెళ్తుండగానే ప్రమాదం జరిగి లెంజ గ్రామానికి చెందిన అభి పంగి(60), గురు మఝి(18)ఆటో డ్రైవర్ లయిచన్ గొలారి(50) మరణించారు. అభి పంగి సంఘటనా స్థలం వద్దనే మరణించగా లయిచన్ గొలారీ కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్ లో ముందు మరణించారు. తర్వాత చికిత్స పొందుతూ గురు మఝి మరణించినట్లు సమాచారం. ఆటోడ్రైవర్ తండ్రి గుండెలవిసేలా రోదించారు. రెడ్క్రాస్ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.10వేలు సాయం అందజేశారు. -
మూలకు చేరిన నిఘా నేత్రం!
● శ్రీకూర్మం క్షేత్రంలో పనిచేయని సీసీ కెమెరాలు ● పట్టించుకోని పాలకులు గార : విష్ణువు అవతారాల్లో రెండో అవతారం, ప్రపంచంలో ఇంకెక్కడా నిర్మించకూడదని పురాణాలు పేర్కొన్న ప్రముఖ క్షేత్రం శ్రీకూర్మం. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం వద్ద నిఘా మసకబారుతోంది. గతంలో మూలవిరాట్ స్కాన్, తిరునామం పగలగొట్టడం వంటి ఘటనలు నేపథ్యంలో 2012లో హిందుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పలువురు అధికారులు మారినప్పుడు సీసీ కెమెరా వ్యవస్థను పటిష్టం చేశారు. తర్వాత నిర్వహణ కొరవడంతో సీసీ కెమెరా వ్యవస్థ పనిచేయడం లేదు. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో సీసీ ఫుటేజీని పరిశీలించే మానిటర్ వ్యవస్థ పాడైపోయింది. గర్భగుడి లోపలికి, ఆలయానికి వచ్చే భక్తుల రాకపోకలు గమనించేందుకు సీసీలు ఏర్పాటు చేసినప్పటికీ మానిటర్ కొద్దిరోజుల కిందట కాలిపోయింది. ఇప్పటీకీ మరమ్మతులు చేయలేదు. వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన ఈవోకు రావివలస, పలాస గ్రూపు ఆఫ్ టెంపుల్స్తో పాటు శ్రీకూర్మనాథాలయం బాధ్యతల ఉన్నాయి. ఇక్కడ ఈవోతో మొదలుకొని అందరూ ఇన్చార్జిలే. రాత్రిపూట పవళింపు సేవ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఎవరూ ఉండకూడదన్న నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఇన్చార్జి ఈవో జి.గురునాథరావు వద్ద ప్రస్తావించగా సీసీ టీవీ మానిటర్ కాలిపోవడం వాస్తవమేనని, ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు. తన మొబైల్లో లింక్ ద్వారా సీసీ ఫుటేజ్ చూస్తున్నానని తెలిపారు. -
నువ్వలరేవులో విషాదం
కంచిలి/వజ్రపుకొత్తూరు రూరల్: కంచిలి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బెహరా ధర్మారావు(31), బెహరా సన్నా అలియాస్ షణ్ముఖరావు(38) మృతిచెందడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఎదురుగా వెళుతున్న ట్రాక్టర్ను తాము ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మారావు స్వగ్రామంలో టైలరింగ్ చేస్తుండేవాడు. అతని సహాయకుడిగా సన్నా పనిచేస్తుండేవాడు. వీరిద్దరూ రెడీమేడ్ దుస్తుల్ని కుట్టి బరంపురంలోని హోల్సేల్ వ్యాపారులకు ఆర్డర్పై అందిస్తుడేవారు. ఈ క్రమంలోనే బరంపురం వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లబోదిబోమంటున్నకుటుంబాలు.. ధర్మారావుకు భార్య పూజ, కుమారుడు మున్నా, కుమార్తె వర్షిణి ఉన్నారు. సన్నాకు భార్య శృతి, మూడేళ్ల కుమారుడు రోషన్ ఉన్నారు. వీరంతా విషాదంలో మునిగిపోయారు. మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు సోంపేట సామాజిక ఆసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఇద్దరు యువకుల మృతితో నువ్వలరేవులో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు మంగళవారం గ్రామానికి చేరడంతో అశృనయానాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్, ఎంపీటీసీలు, మత్య్సకార సొసైటీ సభ్యులు, గ్రామపెద్దలు మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అశ్రునయనాల మధ్య రోడ్డు ప్రమాద మృతుల అంత్యక్రియలు బాధిత కుటుంబాలకు పలువురి పరామర్శ -
వృద్ధులకు ఉచిత ప్రయాణం
మల్కన్గిరి నుంచి.. కొరాపుట్: అసోంలోని కామాఖ్యా, కోల్కతాలోని దక్షిణ కాళీ దర్శనాలకు వెళ్లే వృద్ధులకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించారు. ఈమేరకు మంగళ వారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో డాబుగాం ఎంఎల్ఏ మనోహర్ రంధారి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. జిల్లా నుంచి 130 మంది వృద్ధులు పయనమయ్యారు. కార్యక్రమంలో డీఐపీఆర్వో మనోజ్ కుమార్ బెహరా పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వి.కీర్తి వాసన్ జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. ఈ జిల్లా నుంచి 167 మంది తీర్థ యాత్రలకు వెళ్తున్నారు. ఈ బస్సులన్నీ రాయగడ చేరుకుని అక్కడ నుంచి రైలులో ముందుకు సాగనున్నారు. వీరందరికీ ఉచిత రవాణా, ఆహారం, వసతితి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. తీర్థయాత్రలకు సీనియర్ సిటిజన్ల పయనం రాయగడ: దారిద్య్ర రేఖ దిగువన గల సీనియర్ సిటిజన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏటా సొంతఖర్చులతో తీర్థయాత్రలకు పంపిస్తోంది. బీజేపీ కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తోంది. మంగళవారం 775 మంది సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రైలులో తీర్థయాత్రలకు పంపించింది. స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఫరూల్ పట్వారి ముఖ్యఅతిథిగా హాజరై పచ్చ జెండాను ఊపి రైలును ప్రారంభించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలోని కొరాపుట్, రాయగడ నవరంగపూర్, మల్కన్గిరి జిల్లాలతో పాటు కలహండి, నువాపడ జిల్లాలకు చెందిన సీనియర్ సిటిజన్లు ఈ తీర్థయాత్రలు చేయనున్నారు. వీరికి ఎస్కార్ట్గా మరో 25 మందిని ప్రభుత్వం పంపించింది. వారి ఆలనాపాలన, అవసరమైనవి అందివ్వడంతో పాటు వారికి పర్యటన రోజుల్లో దిక్సూచిగా వీరు వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 31988 మంది సీనియర్ సిటిజన్లు తీర్థ యాత్రలకు వెళ్లి వచ్చారని చెప్పారు. మంగళవారం పర్యటించిన సీనియర్ సిటిజన్లు రాయగడ నుంచి కోల్కతా–కామాక్షి వరకు పర్యటించి తిరిగి వస్తారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయగడ నుంచి బయలు దేరిన ప్రత్యేక రైలును సుందరంగా అలంకరించారు. సీనియర్ సిటిజన్లకు జిల్లా యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికింది. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా నుంచి 71 మంది వృద్ధులను తీర్థయాత్రలకు పంపనున్నారు. రెండు బస్సుల్లో బుధవారం వారిని రాయగడ పంపించి అక్కడి నుంచి ట్రైన్లో అస్సోంలోని కామాక్షి అమ్మవారి దర్శనానికి పంపించనున్నారు. మొత్తం ఏడు రోజుల పాటు ప్రయాణించనున్నారు. బస్సును జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ ప్రారంబించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి మాధవ్ పంగి, జిల్లా డీఐపీఆర్ఓ ప్రమిళా మాఝి తదితర అధికారులు పాల్గొన్నారు. -
అవినీతి నిరోధక కమిటీ జిల్లా కన్వీనర్గా రాంబాబు
జయపురం: అఖిల భారత అవినీతి నిరోధక కమిటీలో జయపురానికి చెందిన ప్రముఖ కళాకారుడు, సమాజ సేవకుడు గండ్రేటి రాంబాబుకు అవకాశం దక్కింది. కొరాపుట్ జిల్లా అవినీతి నిరోధక కమిటీ కన్వీనర్గా ఆయన నియమితులయ్యారు. అఖిల భారత అవినీతి నిరోధక సంఘటన కన్వీయర్, ఒడిశా హైకోర్టు న్యాయవాది సుభ్రత కుమార్ నందో సోమవారం విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. నెల రోజుల్లో జిల్లా అంతా పర్యటించి జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాంబాబుకు సుభ్రత కుమార్ నందో సూచించారు. కొరాపుట్ జిల్లాలో వివిధ ప్రభుత్వ పదవీ కాలంలో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలపై వివరాలు సేకరించేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు రాంబాబు మంగళవారం వెల్లడించారు. ఖోఖో క్రీడాకారిణికి అభినందనలు రాయగడ: ఇటీవల ముగిసిన ప్రపంచ ఖోఖో పోటీల్లో విజేతలుగా నిలిచిన భారత మహిళా జట్టులో సభ్యురాలుగా ఉన్న మంగాయి మఝిని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి అభినందించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారిణి మంగాయి మఝికి దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. ప్రపంచ ఖోఖో పోటీల్లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో రాయగడ జిల్లాలోని కాసీపూర్ సమితి చంద్రగిరి పంచాయతీకి చెందిన మంగాయి మాఝి పాల్గొని భారత్తో పాటు రాష్ట్ర ప్రతిష్టను పెంపొందించారని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ పాల్గొన్నారు. రాయగడ బ్లాక్లో 28న జాబ్మేళా పర్లాకిమిడి: ఈనెల 28న రాయగడ బ్లాక్ చంపాపూర్ వద్ద మినీస్టేడియంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి మంగళవారం తెలిపారు. టెన్త్ ఫెయిల్ నుంచి పట్టభద్రులు, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్తోపాటు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్టు త్రిపాఠి తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు దాదాపు 40 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు తమ విద్యార్హల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో పాటు ఫొటోలు, ఆధార్ కార్డు తీసుకొని హాజరు కావాలన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు గొప్పలు ఊదరగొట్టారని, కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని, తమ ఉద్యోగ భద్రత కల్పించాలని పశుసంచార వాహన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద తొలగించిన పశుసంచార వాహన ఉద్యోగులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 18 ఉన్నాయని వాటిని ఆదివారం నుంచి నిలిపివేసి వాహనాలను పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయని తెలిపారు. అదే విధంగా తమకు టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. వాహనాలు నిలిపివేయడం అనివార్యమైతే తమను పశుసంవర్ధక శాఖలో కొనసాగించాలని కోరారు. -
శంబర పాఠశాలను సందర్శించిన ‘కేసలి’
మక్కువ: మండలంలోని శంబర జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడుతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. అలాగే పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వల్ల అనధికార వ్యక్తులు చొరబడి మద్యం తాగడం, తాగిన మద్యం బాటిల్స్ పాఠశాల ఆవరణలో వదిలేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే పశువులు సంచరించడం వల్ల కూడా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని, పునరావృతం కాకుండా తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతినాయుడికి సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పాచిపెంట సీడీపీఓ బొత్స అనంతలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ, ఉపాధ్యాయ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
కోట్లాది రూపాయలతో వ్యక్తి పరారీ
సీతానగరం: మండలంలోని నిడగల్లుగ్రామానికి చెందిన వ్యక్తి సుమారు రూ 2.5 కోట్లతో నాలుగు రోజుల క్రితం గ్రామం నుంచి పరారైనట్లు సమాచారం. బాధితులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వ్యక్తి మెడికల్ షాపు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలు పాపమ్మవలస, నీలకంఠాపురం ప్రజలతో నమ్మకంగా ఉండేవాడు, ప్రజల్లో కలిగిన నమ్మకం అనంతరం చీటీలు, వడ్డీవ్యాపారం, ప్రోనోట్లు రాయడం ఆర్థికపరమైన పనులు నిర్వహించాడు. మందుల షాపునకు వచ్చిన వారిలో కొంతమంది చిన్నపాటి లావాదేవీలు నిర్వహించడం వల్ల చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా ప్రోంసరీ నోట్లు రాసి పంపించేవాడు. అలా డబ్బులున్న వ్యక్తులు అతనిపై ఉన్న ఉమ్మకంతో 90 మందికి పైగా వ్యక్తులు రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఒకవ్యక్తి కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు తీర్చాలని కోరాడు. అయితే అడిగిన వెంటనే అప్పుతీర్చక పోవడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదేవ్యక్తి గ్రామ పెద్దల ఎదుట పంచాయితీ పెట్టడంతో ఒకటి–ఒకటిగా అప్పులు ఇచ్చిన వారు బయటకు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలో పాల్గొన్నారు. మెడికల్షాపు నిర్వాహకుడిని పెద్దలు పిలిచి అప్పుల విషయమై అడగడంతో కొంతఅప్పు తీర్చుతాను. మిగతా మిగిలిన అప్పు స్థిరాస్తులు విక్రయించి అందరికీ న్యాయం చేయాలని చెప్పినట్లు బాధితులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారిలో ఆందోళన మొదలవడంతో నిర్వాహకుడు సడన్గా నాలుగు రోజుల క్రితం పరారయ్యాడు. ఈ విషయమై ఎస్సై ఎం.రాజేష్ వద్ద మంగళవారం ప్రస్తావించగా నిడగల్లులో ప్రజలనుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని వ్యక్తి పరారైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి తగుచర్యలు తీసుకుంటామన్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన -
క్రీడల్
కళాశాలల్లో క్రీడలకు దూరం.. నేను ఆలిండియా యూనివర్సిటీ హ్యాండ్బాల్లో గోల్డ్ మెడల్ విన్నర్ని. గేమ్స్లో ఆసక్తితో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగంలో చేశాను. స్కూల్స్ వరకే పీడీ, పీఈటీలు ఉన్నారు. కాలేజీలకు పూర్తిగా పీడీలు లేరు. గత ప్రభుత్వం హయాంలో నాకు పదోన్నతి లభించింది. హెచ్ఎంగా చేరాల్సి వచ్చింది. క్రీడ లకు దూరమైపోయాను. అదే జేఎల్స్గా పదోన్నతులు కల్పించి పీడీలుగా నియమిస్తే జూనియర్ కాలేజీలు సైతం క్రీడలతో కళకళలాడుతుండేవి. –ఎమ్మెస్ చంద్రశేఖర్, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్ పాతటెక్కలి, వజ్రపుకొత్తూరు మండలం శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను గుర్తించి, వారిని తీర్చిదిద్దేందుకు శిక్షకులు కావాలి. అందుకు ప్రభుత్వ స్కూళ్లలో పాఠశాల స్థాయిలో పీడీ/పీఈటీలు ఉన్నారు. పాఠశాల స్థాయి తర్వాత జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కానీ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 38 ఉంటే.. పనిచేస్తున్న పీడీలు సున్నా. క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిద్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు, శిక్షకులను నియమించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఉన్నా శిక్షకులు లేక నిరాశకు లోనవుతున్నారు.కొంతమంది పిల్లలు వివిధ వేదికల్లా రాణిస్తున్నా.. వారి వ్యక్తిగత ప్రతిభతోనే గుర్తింపు పొందుతున్నారు. నాలుగు గదులకే పరిమితమవుతూ.. జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యలో 10వ తరగతి వరకు పీఈటీలు, పీడీలు విద్యార్థులకు క్రీడల పట్ల మంచి శిక్షణ ఇస్తున్నారు. వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అయితే వారి కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. అందుకు ప్రధాన కారణం ఇంటర్మీడియట్లో చేరేసరికి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చే వారు లేకపోవడం. సర్కారీ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు క్రీడలు, వ్యాయామాలకు దూరమైపోతూ నిరంతనం తరగతుల గదులకే పరిమితం అవుతున్నారు. దీంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇంకొంతమంది డ్రగ్స్, గంజాయి, చెడు వ్యసనాల బారిన పడుతున్నారు. అదే కాలేజీల్లో పీడీలుంటే వ్యాయామం, క్రీడలు, ఆటపాటలపట్ల ఆకర్షితులను చేస్తే మానసిక ఉల్లాసం, ఆనందం కలిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉండొచ్చని మానసిక వైద్యనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పదోన్నతల ప్రక్రియ.. పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు, 30 మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలో ఇంటర్మీడియెట్ విద్యను అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 38 ఉన్నాయి. వీటిల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఒక్కరూ లేరు. పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలు, ఎంపీఈడీ కోర్సు పూర్తి చేస్తే పీడీలుగా ఉద్యోగోన్నతులు పొందేవారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు ఉద్యోగోన్నతులపై జూనియర్ కళాశాలలకు వెళ్లేవారు. దీనిపై కోర్టులో కేసు జరుగుతున్నందున ఉద్యోగ పదోన్నతులు రెండు దశాబ్దాలుగా ఆగిపోయాయి. పీఈటీలంతా పాఠశాలల్లోనే ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో పీడీలను పాఠశాలల్లో హెచ్ఎంలగా పదోన్నతులు కల్పించి నాటి సీఎం జగన్మోహన్రెడ్డి వారి పేరిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. కానీ న్యాయస్థానాల్లో కేసులు కారణంగా జూనియర్ కాలేజీలకు పీడీలగా మాత్రం ఉద్యోగోన్నతలు పొందలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగోన్నతుల ద్వారా ఉన్నత పాఠశాలల్లో పీడీలను జేఎల్స్ పీఈగా పదోన్నతులు కల్పించాలని పీడీ, పీఈటీల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఇంటర్ సెకెండియర్ విద్యార్ధులుజిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పీడీలు3863837883 ఉద్యోగోన్నతులు కల్పించాలి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ నియామకాలను ఉద్యోగోన్నతుల ప్రక్రియ ద్వారా చేపట్టాలి. జూనియర్ కళాశాలల్లో పీడీలు లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. క్రీడలకు దూరమైపోతున్నారు. జూనియర్ కాలేజీల్లో పీడీల నియామకాలు జరిగితే పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. – మొజ్జాడ వెంకటరమణ, పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు జూనియర్ కాలేజీల్లో కనుమరుగవుతున్న ఫిజికల్ డైరెక్టర్లు మొత్తం 38 చోట్ల ఒక్కరూ లేని వైనం నష్టపోతున్న విద్యార్థులు పట్టించుకోని ప్రభుత్వం 0 -
ప్రాణం మీదికి తెచ్చిన పది రూపాయలు
శృంగవరపుకోట: పది రూపాయలు తెచ్చిన తంటా ప్రాణాల మీదికొచ్చింది. చెల్లని పది రూపాయలు ఇచ్చావంటూ పెట్రోల్బంక్ ఉద్యోగి చేయి చేసుకోవడంతో వినియోగదారుడు కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోటకు చెందిన నౌదాసరి ఈశ్వరరావు మంగళవారం పనినిమిత్తం తన బైక్మీద ధర్మవరం వైపు వెళ్తూ మండలంలోని సీతంపేట గ్రామం వద్ద ఉన్న పెట్రోల్బంక్కు వెళ్లాడు. బంక్లో ఆయిల్ వేయించుకున్న ఈశ్వరరావు సొమ్ము చెల్లించాడు. ఈశ్వరరావు ఇచ్చిన నోట్లలో ఒక పదిరూపాయల నోటు చెల్లదని బంక్ ఉద్యోగి వాదనకు దిగాడు. దీంతో స్వల్ప ఘర్షణ జరిగి బంక్ ఉద్యోగి ఈశ్వరరావును నెట్టేయడంతో పక్కనే ఉన్న రెయిలింగ్పై పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన చేరుకుని ఈశ్వరరావును ఎస్.కోట ఆస్పత్రికి చేర్చారు. ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు నడుము వద్ద ఇబ్బంది ఉందని, తొడఎముక విరిగిందని చెప్పి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు రిఫర్ చేశారు. క్షక్షతగాత్రుని బంధువులు బంక్ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్.కోట ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. పెట్రోల్ బంక్ ఉద్యోగి నిర్వాకం వినియోగదారుడికి విరిగిన కాలు -
జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులు చేయండి
జయపురం: జగన్నాథ సాగర్ పునరుద్ధరణ పనులు ప్రారంభించకుంటే జయపురం బంద్ చేస్తామని మో జగన్నాథ సాగర్ ట్రస్టు నిర్ణయించింది. స్థానిక గీతా శవణం ప్రాంగణంలో మందిరంలో మో జగన్నాథ సాగర్ ట్రస్టు ఉద్యోగులు రజనీ కాంత నాయిక్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో పునరుద్ధరణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజనీ కాంత నాయిక్ చారిత్రాత్మక జగన్నాథ్ సాగర్ ప్రాధాన్యతను వివరించారు. ఆక్రమణలకు లోనవుతూ శిథిలావస్థకు చేరుకుంటున్న సాగర్ను అభివృద్ధి చేయాలన్నారు. మో జగన్నాథ సాగర్ ట్రస్టు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పలు ఆందోళనలు జరిపినా సంబంధిత అధికారులు స్పందించటం లేదని విమర్శించారు. జగన్నాథ్ సాగర్ పనులలో అక్రమాలు ఉన్నాయని, అందుకే సాగర్ పునరుద్ధరణ పనులను టాస్క్ ఫోస్క్ ద్వారా నిర్వహించాలని ట్రస్టు డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. జగన్నాథ్ సాగర్ పనులు పూర్తికి సాగర్ పోరాట కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో పాల్గున్న పట్టణ ప్రముఖులు, మేధావుల అభిప్రాయాలు సేకరించారు. సమావేశంలో సతీష్ నంద, నిరంజన్ పాణిగ్రహి, బరిగడ చంధ్ర శేఖర్, హర మిశ్ర, రఘు త్రిపాఠీ, పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.మనోజ్ కుమార్, హిమాంశు మహాపాత్ర, విద్యుత్ మిశ్ర, ధిరెన్ మోహణ పట్నాయిక్, సుభాష్ రౌత్, అరుణ కుమార్ భటమిశ్ర, సుధీర్ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న గుర్తు తెలియని జంతువు
● తీవ్ర గాయాలపాలై వ్యక్తి మృతి సోంపేట: మండలంలోని సుంకిడి పంచాయతీ రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నర్సింగ్ మహంతి (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ మహంతి కుమారుడు జగదీష్ ఐటీఐ చదువుతున్నాడు. జగదీష్ కొర్లాం వద్దకు బస్సులో రాగా.. కుమారుడిని తీసుకురావడానికి నర్సింగ్ సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. బుసాబద్ర పంచాయతీ వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని జంతువు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నర్సింగ్ కిందపడి గాయపడ్డాడు. 108 సిబ్బంది వచ్చేసరికే మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బుడితి సచివాలయంలో ఒకే ఒక్కడు సారవకోట: మండలంలోని బుడితి సచివాలయానికి ఎంపీడీఓ మోహన్ కుమార్ మంగళవారం ఉదయం 10.10 గంటలకు తనిఖీ చేయడానికి వచ్చారు. ఆ సమయానికి వీఆర్ఓ తప్ప ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 10 నిమిషాల వ్యవధిలో పంచాయతీ కార్యదర్శి హాజరు కాగా ఇతర సిబ్బంది ఏ ఒక్కరూ రాలేదు. ఒక్క బుడితిలోనే కాకుండా అన్ని సచివాలయాలలో ఇదే తంతు నడుస్తుందని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని తెలిపారు. ఈనెల 27న జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. -
ఉపాధ్యాయ ప్రీమియర్ క్రికెట్ టోర్నీ చాంపియన్ బొయిపరిగుడ టీమ్
జయపురం: జయపురం సమితి అంబాగుడ స్టేడియం మైదానంలో కొరాపుట్ జిల్లా ఉపాధ్యాయ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం జరిగింది. ఈ టోర్నమెంట్లో బొయిపరిగుడ టీమ్ ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ను జయపురం బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయిక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. జయపురం ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం వారు నిర్వహించిన ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో జయపురం, కుంధ్ర, బొరిగుమ్మ, లక్ష్మిపూర్, బొయిపరిగుడ, లమతాపుట్ సమితుల నుంచి జట్లు పాల్గొన్నాయి. తొలి మ్యాచ్ జయపురం–కుంధ్ర టీమ్ల మధ్య జరిగింది. 10 ఓవర్లలో 62 పరుగులు చేయగా 63 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కుంధ్ర ఉపాద్యాయుల టీమ్ 4.4 ఓవర్లలో 63 పరుగులు చేసి గెలుపొందింది. రెండో మ్యాచ్లో బొరిగుమ్మ, లక్ష్మీపూర్ టీమ్లు తలపడ్డాయి. బొరిగుమ్మ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి గెలుపొందింది. మూడో మ్యాచ్లో లమతాపుట్, బొయిపరిగుడ టీమ్లు తలపడగా బొయిపరిగుడ టీమ్ 6.5 ఓవర్లలో 83 పరుగులు చేసి లమతాపుట్ను ఓడించింది. అనంతరం కుంధ్రా, బొయిపరిగుడ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచి కుంధ్ర టీమ్ బ్యాటింగ్ ప్రారంభించింది. కుంధ్ర టీమ్ 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. 97 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బొయిపరిగుడ టీమ్ 8 వికెట్లు కోల్పోయి తన లక్ష్యం 97 పరుగులు చేసి చాంపియన్గా నిలిచింది. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు గోపీ పట్నాయిక్, సురేంధ్ర మహాపాత్రో, ప్రాథమిక ఉపాద్యాయ సంఘ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, బ్లాక్ విశ్రాంత విద్యాదికారి మానస ముఖర్జీ, కార్యదర్శి ప్రదీప్ కుమార్ మిశ్ర, ఉపాధ్యక్షుడు సదానంద సామంతరాయ్, కేషియర్ పురందర నాయిక్, తదితరులు పాల్గొన్నారు. -
వుషు పోటీలకు వర్సిటీ క్రీడాకారులు
ఎచ్చెర్ల క్యాంపస్: పంజాబ్లోని ఛండీఘడ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22 నుంచి 27 వరకు అఖిల భారత మహిళలు, పురుషుల వుషు పోటీలు జరగనున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం తరఫున ఆర్.పావని (ప్రతిభా డిగ్రీ కళాశాల), ఎం.శిరీష (విద్యాధరి డిగ్రీ కళాశాల) ప్రాతినిధ్యం వహించనున్నారు. కోచ్గా కె.మురళీ వ్యవహరిస్తున్నారు. క్రీడాకారులను వీసీ కె.ఆర్.రజిని, అధికారులు మంగళవారం అభినందించారు. ఇన్ఫోసిస్ స్కాలర్షిప్కు విద్యార్థి ఎంపిక టెక్కలి: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అందజేసే స్కాలర్షిప్కు టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల మొదటి ఏడాది సీఎస్ఈ విద్యార్థిని ఎ.హేమలత ఎంపికై నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్కు ఎంపికై న విద్యార్థినికి ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున నాలుగేళ్ల పాటు రూ. 4 లక్షలు ఉపకార వేతనం కింద అందజేస్తారని వివరించారు. పదో తరగతి, ఇంటర్లో సాధించిన మార్కులతో పాటు ఆర్థిక స్థోమత, ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్కు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, సీఎస్ఈ హెచ్ఓడీ వై.రమేష్, అసిస్టెంట్ హెచ్ఓడీ టి.చలపతిరావు, శాక్ ఇన్చార్జి జె.సురేష్కుమార్ అభినందించారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన మినీ వ్యాన్ టెక్కలి : కోటబొమ్మాళి మండలం బొడ్డపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జలుమూరు మండలం సురవరం గ్రామానికి చెందిన వండాన శ్రీను టెక్కలి నుంచి కోటబొమ్మాళి వైపు తన ట్రాక్టర్తో వస్తుండగా, బరంపురం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ఓ మినీ వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ తొట్టె బోల్తా పడింది. వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. వ్యాన్ డ్రైవర్ బాదల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స పొందుతూ యువకుడు మృతి ఆమదాలవలస: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్కుమార్(33) ఆమదాలవలస పట్టణానికి చెందిన చిట్టీ వ్యాపారి వేధింపులు తాళలేక ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. రాగోలు జెమ్స్లో చికిత్స పొందుతున్న సురేష్కుమార్ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. కుమారుడి మరణంతో తండ్రి పొన్నాడ దమరకేశ్వరరావు, తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస ఎస్ఐ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రూప్–2 పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 23న జరగనున్న గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ సహా, పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
జగన్నాథుడిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు
రాయగడ: బీజేపీ రాయగడ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ఎం.గొపి ఆనంద్ తన మద్దతు దారులతో పూరి శ్రీజగన్నాథుడ్ని సోమవారం దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి 13 మంది బరిలో ఉండగా గొపిని అధిష్టానం ఎంపిక చేయడంపై ఆయన మద్దతుదారులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జగన్నాథస్వామిని దర్శించుకున్న ఆయన జిల్లాలో పార్టీ బలొపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అందరి సహాకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజల దరికి చేరేలా కృషి చేస్తానని వివరించారు. స్వామి దర్శనానికి వెళ్లినవారిలో సీనియర్ నాయకుడు శివశంకర్ ఉలక, భాస్కర పండ, దేశాశీష్ పండ, పలువురు కార్యకర్తలు ఉన్నారు. బాలిక ఆత్మహత్యాయత్నం జయపురం: జయపురం సమితి బంకబిహారి గ్రామంలో ఒక బాలిక తన తల్లితో ఏదో విషయంపై గొడవ పడి సమీప అప్పర్ కొలాబ్ ఇరిగేషన్ ధనపూర్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ ప్రాంతంలో ఉన్న వారు చూసి వెంటనే ఆమెను రక్షించి కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించగా ఆమెకు ప్రమాదం తప్పిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. భైరాగిమఠం గ్రామం లో +2 చదువుతున్న పూజా హరిజన్ తన తల్లితో ఏదో విషయమై గొడవపడింది. ఇరువురి మధ్య మాటలు పెరగడంతో ఆమె ధనపూర్ శాఖా కెనాల్లో దూకేసింది. దీంతో స్థానికులు రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాంగ్రెస్లోకి బీజేడీ యువనేత కొరాపుట్: బీజేడీ పార్టీ సీనియర్ గిరిజన యువజన నాయకుడు అఖిల్ బోత్ర ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని పీసీసీ కార్యాలయంలో ప్రముఖుల సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. పీసీసీ నూతన అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఈ చేరిక జరిగింది. నబరంగ్పూర్ జిల్లాకి చెందిన అఖిల్ తన రాజకీయ జీవితం మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి బాటలో కొనసాగించారు. ప్రదిప్తో కలిసి కాంగ్రెస్ను వీడి బీజేడీలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక ప్రదిప్ని వదలి తిరిగి మాతృ పార్టీ కాంగ్రెస్ గూటికి చేరారు. కలిమెల సమితిలో నీటి సమస్య మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి కంగూర్కొండ గ్రామంలో వేసవి ప్రారంభానికి ముందే ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో బోరుగాని, బావిగాని లేదు. దీంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నది నుంచి నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే వేసవి ప్రారంభం కావడంతో నదిలో కూడా నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ నీటి సరఫర విళభాగం జూనియర్ ఇంజినేర్ నిత్యానాందొ సోరాన్ను గ్రామస్తులు మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.