దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో సాయంత్రం 4.15 గంటల సమయంలో పోలింగ్ సమయం ముగిసిన తర్వాత గొలపల శ్రీనుతోపాటు మరికొందరు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. నిబంధనలకు విరుద్దంగా వారిని ఎలా లోపలికి అనుమతిస్తారని ఎస్ఐను ప్రశ్నించానని తెలిపారు. ఇంతలో ‘నువ్వు ఎవడవిరా ఇక్కడ మాట్లాడటానికి‘ అంటూ తనపై ఒక్కసారిగా దాడికి దిగారన్నారు. గొలపల శ్రీనుతోపాటు మరికొంతమంది దాడి చేశారని తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment