మిర్చి రైతులకు అండగా ఉంటాం
లక్ష్మీపురం: మిర్చి రైతులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నేతలు స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు మిర్చి యార్డును నేతలు సందర్శించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రూ.11,781 మద్దతు ధరతో రైతుల ఆశలు అడియాసలయ్యాయని తెలిపారు. కనీసం రూ.20వేలు అయినా ప్రకటిస్తారని ఎదురు చూశారని పేర్కొన్నారు. తీరా గుంటూరు మార్కెట్ యార్డుకు వస్తే వ్యాపారస్తుల దోపిడీకి రైతులు బలి అవుతున్నారని చెప్పారు. మచ్చు, కమిషన్, గోతం పేరులతో క్వింటాకు వెయ్యి రూపాయల వరకు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఎన్నో రైతుల కన్నీటి గాథలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జగన్నాథం, కంజుల విఠల్ రెడ్డి, పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమారెడ్డి, వీరారెడ్డి, రామయ్య పాల్గొన్నారు.
విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్కు మంటలు
పర్చూరు(చినగంజాం): డ్రైవర్ చాకచక్యంతో పెనుప్రమాదం తప్పింది. వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్లు తగిలి నిప్పులు చెలరేగడంతో తీవ్రంగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన వరిగడ్డిని పొలం నుంచి ఇంటికి చేరుస్తున్నాడు. ఈక్రమంలో వరిగడ్డి ట్రాక్టర్ పంచాయతీ కార్యాలయం ముందుగా వెళ్తున్న సమయంలో ఆ మార్గంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వరిగడ్డి పూర్తిగా తగలబడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆనందరావు చాకచక్యంగా వ్యవహరించాడు. తానేమాత్రం భయాందోళనకు గురికాకుండా గడ్డిని పక్కన పడేసి అందులో ఉన్న కూలీలను, ట్రాక్టర్ను కాపాడాడు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గడ్డి పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.50 వేలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని సమాచారం.
మిర్చి రైతులకు అండగా ఉంటాం
మిర్చి రైతులకు అండగా ఉంటాం
Comments
Please login to add a commentAdd a comment