రూ.5కోట్ల వసూలే లక్ష్యం!
నరసరావుపేట: పురపాలకసంఘ పరిధిలో నివాసం ఉంటున్న గృహ, వాణిజ్య సముదాయాల యజమానుల నుంచి రూ.5కోట్ల అడ్వాన్స్డ్ ఆస్తిపన్ను వసూలును పురపాలక అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది రూ.3.5కోట్లు మాత్రమే వసూలయింది. ఈ మేరకు పన్నుల సేకరణకు పురపాలక కార్యాలయంలో మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రెండు వాహనాల ద్వారా పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెలాఖరులోపు వచ్చే ఏడాదికి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ఈ ఏడాది కూడా యజమానులు 15 శాతం అధికంగా ఆస్తిపన్ను పెంచి చెల్లించాల్సి ఉంటుందని పురపాలక రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాగా గత మార్చి 31నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.12కోట్ల పన్నులు వసూలు కావాల్సివుండగా అందులో 85శాతం రూ.10.2కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు. మరో రూ.7కోట్లు పెండింగ్ పన్నులు ఉండగా, వాటిలో రూ.1.5కోట్లవరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది ముందస్తు
ఆస్తి పన్నుపై అధికారుల దృష్టి
పురపాలక సంఘంలో
మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు


