గ్రూప్‌–1 ర్యాంకర్‌కు కలెక్టర్‌ అభినందన | - | Sakshi

గ్రూప్‌–1 ర్యాంకర్‌కు కలెక్టర్‌ అభినందన

Apr 3 2025 1:01 AM | Updated on Apr 3 2025 1:01 AM

గ్రూప

గ్రూప్‌–1 ర్యాంకర్‌కు కలెక్టర్‌ అభినందన

పెద్దపల్లిరూరల్‌/మంథని: మంథని మండలం ఖాన్‌సాయిపేటకు చెందిన గ్రూప్‌ – 1 ర్యాంకర్‌ జక్కుల అరుణ్‌కుమార్‌ను కలెక్టర్‌ కోయ శ్రీహ ర్ష బుధవారం అభినందించారు. అరుణ కుమా ర్‌ రాష్ట్రస్థాయిలో 114వ ర్యాంక్‌, మల్టీజోనల్‌– 1 స్థాయిలో 64వ ర్యాంక్‌ సాధించడంపై కలె క్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌, తల్లిదండ్రులు మల్లేశ్వరి – లక్ష్మీనారాయణతో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): వేసవిలో వినియోగదారులకు కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ మాధవరావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్‌ వినియోగిస్తున్న లబ్ధిదారులు కరెంట్‌ను వృథా చేయొద్దన్నారు. అనంతరం ఎస్‌ఈని సన్మానించారు. అధికారులు రవికుమార్‌, ప్రభాకర్‌, ఏడీఈ శ్రీనివాస్‌, సుగుణయ్య, ఏఈలు కిశోర్‌, బొంకూరి రవీందర్‌, సంపత్‌, శంకరయ్య, సైఫొద్దీన్‌, మాధవరావు, శంకరయ్య, సుధాకర్‌, కొమురయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, వీరయ్య, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పాపన్నగౌడ్‌కు నివాళి

పెద్దపల్లిరూరల్‌: జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సర్వాయి పాపన్న ఆశయ సాధనకు పాటుపడాలని ఆయన కోరారు. సహాయ బీసీ అభివృద్ధి అధికారి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షు డు ఎం.అంజయ్యగౌడ్‌, ప్రతినిధులు బాలసాని వెంకటేశంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

232 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,241 ధర పలికింది. కనిష్టంగా రూ.5,111, సగటు రూ.7,044గా ధర నమోదైందని మార్కెట్‌ కార్యదర్శి మనోహర్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన పలువురు రైతుల నుంచి 232 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లోని కేంద్రీయ విద్యాలంయలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శోభన్‌బాబు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రెండో తరగతిలో 13, నాలుగో తరగతిలో–07, ఐదో తరగతిలో–19, ఆరో తరగతిలో–15, ఏడో తరగతిలో–18, ఎనిమిదో తరగతిలో –22, తొ మ్మిదో తరగతిలో –09 సీట్లు ఖాళీగా ఉన్నా యని ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు విద్యాలయంలో రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు దరఖాస్తు చేయాలని, ఈనెల 11వ తేదీ వరకు గడువు ఉందన్నారు. అర్హుల జాబితాను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

గడువు పొడిగింపు

పెద్దపల్లిరూరల్‌: ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ సామాజిక వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తుల దాఖలుకు ఈనెల 14వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి తెలిపారు. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా https:// tgobmms. cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు 08728–222266, 79933 57097 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

గ్రూప్‌–1 ర్యాంకర్‌కు   కలెక్టర్‌ అభినందన 
1
1/2

గ్రూప్‌–1 ర్యాంకర్‌కు కలెక్టర్‌ అభినందన

గ్రూప్‌–1 ర్యాంకర్‌కు   కలెక్టర్‌ అభినందన 
2
2/2

గ్రూప్‌–1 ర్యాంకర్‌కు కలెక్టర్‌ అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement