‘మీరెన్ని కేసులు పెట్టినా మేం భయపడం’ | Political Leaders Reacts To KTR Formula-E Car Race Case Live Updates | Sakshi
Sakshi News home page

‘మీరెన్ని కేసులు పెట్టినా మేం భయపడం’

Jan 6 2025 12:56 PM | Updated on Jan 6 2025 1:15 PM

Political Leaders Reacts To KTR Formula-E Car Race Case Live Updates

సాక్షి,హైదరాబాద్‌ : ప్రజల పక్షాన గళం విప్పే వారిపై రేవంత్‌రెడ్డి (revanth reddy) ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఆరోపించారు. 

ఫార్ములా ఈ-రేస్‌ కేసులో బీఆర్‌ఎస్‌ (brs) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం ఉదయం కేటీఆర్‌ తన లీగల్‌ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ హైడ్రామా నడింది. ఈ తరుణంలో ఏసీబీ విచారణకు కేటీఆర్‌ హాజరవ్వడంపై కవిత స్పందించారు.     

‘మా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మాపై పెట్టిన కేసులకు మేం భయపడం. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ. 15,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు ఆమొత్తాన్ని రూ.12,000 రూపాయలకు తగ్గించింది. ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా చెల్లించాలనే మా డిమాండ్‌’ అని కవిత అన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement