తెలంగాణ నుంచి సోనియా పోటీ.. కాంగ్రెస్‌ పీఏసీ కీలక నిర్ణయం | Telangana Congress PAC Key Decision On Sonia Gandhi | Sakshi

తెలంగాణ నుంచి సోనియా పోటీ.. కాంగ్రెస్‌ పీఏసీ ఐదు నిర్ణయాలు ఇవే..

Dec 18 2023 3:28 PM | Updated on Dec 18 2023 4:42 PM

Telangana Congress PAC Key Decision On Sonia Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఐదు అంశాలే ఎజెండాగా సమావేశం కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. 

కాగా, పీఏసీ సమావేశం అనంతరం పీఏసీ ‍కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశాం. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తాం. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్‌ ఇస్తారు. 

ఇక, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్ట్‌ల అవకతవకలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రాజెక్ట్‌ల్లో ఏం జరిగిందో ఆయన వివరిస్తారు. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తాం. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని తీర్మానం చేశాం. గతంలో ఇందిరా గాంధీ కూడా మెదక్‌ నుంచి పోటీ చేశారు. ఇక, త్వరలోనే రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్టీ. అలాగే, ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక్కో మంత్రికి ఇంఛార్జి భాధ్యతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది’ అని స్పష్టం చేశారు. 

పార్లమెంట్‌​ స్థానాల వారీగా బాధ్యతలు అప్పగింత..
సీఎం రేవంత్ రెడ్డి: చేవెళ్ల, మహబూబ్‌నగర్
భట్టి విక్రమార్క: ఆదిలాబాద్‌
పొంగులేటి: ఖమ్మం
ఉత్తమ్ కుమార్‌ రెడ్డి: నల్లగొండ
పొన్నం ప్రభాకర్: కరీంనగర్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement