![Ys Jagan Visit Rashid Family Vinukonda Updates](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/19/YSJagan.jpg.webp?itok=UVy-4RWd)
Updates
![](/sites/default/files/inline-images/8_13.jpg)
11:30 AM
- చిలకలూరిపేట చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
- రోడ్డుకు ఇరువైపులా భారీగా ఉన్న కార్యకర్తలు
- జగన్ కు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు
10:54 AM
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రిపేర్లో ఉన్న బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ఫ్రూప్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్.. మరో వాహనంలో వినుకొండ వెళ్తున్నారు.
![](/sites/default/files/inline-images/12_6.jpg)
10:38 AM
వినుకొండ వెళుతున్న వైఎస్ జగన్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్తో పాటు నేతలు వినుకొండ బయలుదేరారు. ఎక్కడికక్కడ నేతల కార్లను వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు తీరుపై వైఎస్సార్సీపీ నేతలు పడుతున్నారు.
![](/sites/default/files/inline-images/25_8.png)
10:08 AM
⇒వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వినుకొండ బయల్దేరారు.
⇒టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కాసేపట్లో పరామర్శించనున్న జగన్
9:40 AM
⇒వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ రానున్నారు. మరికాసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు.
⇒టీడీపీ గూండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకుంటారు.
⇒టీడీపీ మూకల నరమేథం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఫోన్లో మాట్లాడారు. హత్య ఘటన, వినుకొండలో పరిస్థితిని ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్ కుటుంబ సభ్యులను కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు.
⇒హింసాత్మక విధానాలు వీడాలని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ హెచ్చరించారు. ఏపీలో ఆటవిక పాలనపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఏపీలో గడిచిన 40 రోజులగా జరుగుతున్న హత్యాకాండలపై కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
⇒కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 31 మంది హత్య, 300 మందిపై హత్యాయత్నాలు, టీడీపీ వేధింపులకి 35 మంది ఆత్మహత్య.. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.
⇒టీడీపీ అరాచకాలు భరించలేక 2700 కుటుంబాలు ఊళ్లు విడిచివెళ్లాయని లేఖలో వైఎస్ జగన్ తెలిపారు. వినుకొండలో నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగా దారుణ హత్యాకాండకు పాల్పడ్డారని.. ఈదురాగతాలను నివేదించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment