Palnadu
-
మర్రి రాజశేఖర్ను వైఎస్ కుటుంబం ఎంతో గౌరవించింది: విడదల రజిని
పల్నాడు, సాక్షి: వైఎస్సార్సీపీ మర్రి రాజశేఖర్ని ఏనాడూ మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇంఛార్జి విడదల రజిని గుర్తు చేశారు. పార్టీని వీడే క్రమంలో వైఎస్సార్సీపీపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మర్రి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీలో తనకు గౌరవం దక్కలేదని, పదవులు దక్కలేదని అన్నారు. 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన మర్రి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీలో చేరాక ఆయనకు వైఎస్ జగన్ మోహన్రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో ఓడినా సరే.. ఆయనను ఆ బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్ కుటుంబం మర్రి రాజశేఖర్కు ఎంతో గౌరవం ఇచ్చింది. వైఎస్సార్సీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రెడ్ బుక్ పేరుతో పాలన జరుగుతున్నప్పుడు మర్రి రాజశేఖర్ తన గొంతుక వినిపించి ఉంటే గౌరవం పెరిగి ఉండేది. కానీ, ఆయన అలా చేయలేదు. ఒకవేళ.. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందితే ఆ సీటు టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. విమర్శించే ముందు మర్రి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఎస్సార్సీపీ ఆయన్ని మోసం చేయలేదు. ఉన్నత పదవులతో గౌరవించింది అని విడదల రజిని అన్నారు... 2019 ఎన్నికల టైంలో నాకు పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ సమయంలో పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024లో చిలకలూరి పేట నుంచి పోటీ చేయలేకపోవడం నా దురదృష్టంగా భావించా. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబితేనే పోటీ చేశాను. తిరిగి చిలకలూరిపేటకు తిరిగి ఆయన పంపిస్తేనే వచ్చా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టే ఆ పనులన్నీ చేశా. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను పాటించడం మాత్రమే నాకు తెలుసు అని అన్నారామె. -
బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా వైఎస్ జగన్
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ జగన్ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్సీపీ‘ నిర్ణయించింది. వైఎస్ జగన్ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు. -
పల్నాడు: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రకాశం జిల్లాలకు చెందినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో తల్లి షేక్ నజీమా (50).. ఆమె కుమారులు ఇద్దరు షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) ఉన్నారు. ఇక, వీరిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా.. కూలీల దుర్మరణం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ముప్పాళ్ల: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంకి చెందిన 20 మంది మహిళా కూలీలు ట్రాక్టర్పై మిరపకాయలు కోసేందుకు వెళ్లారు. పనులు ముగించుకుని వారంతా ట్రాక్టర్పై తిరిగి ఇంటికి వస్తుండగా బొల్లవరం సమీపంలోని కాలువ కట్టపై ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడింది. ట్రాక్టర్లో ఉన్న కూలీలంతా చెల్లాచెదురుగా కింద పడిపోయారు. ట్రాక్టర్ కింద నలిగిపోయిన కూలీలు మధిర గంగమ్మ (55), తేనేపల్లి పద్మ (48), చక్కెర మాధవి (30) అక్కడికక్కడే మృతి చెందారు.మధిర సామ్రాజ్యం (65)కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సత్తెనపల్లి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. మృతి చెందిన కూలీలంతా చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన వారే. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ముప్పాళ్ల పోలీసులు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్యంత బాధాకరం: వైఎస్ జగన్సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆదివారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,పల్నాడు : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మిర్చి కోత కోసి పోలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద 30మంది మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
శ్రీచైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి
-
వైఎస్సార్సీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
తాడేపల్లి : ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డిని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఈ మేరకు నర్రెడ్డి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్తో మాట్లాడారు. బాధితునికి అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్ను కోరారు. అదే సమయంలో పార్టీ అండగా ఉంటుందని నర్రెడ్డి లక్ష్మారెడ్డికి భరోసా ఇచ్చారు వైఎస్ జగన్కాగా, నాలుగు రోజుల క్రితం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గూండాలు.. వైఎస్సార్సీపీ నేత లక్ష్మారెడ్డిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డిని అంతమొందించాలనే రాజకీయ కుట్రలో భాగంగా టీడీపీ ఊరి చివరి కాపు కాసి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను పిడుగురాళ్ళలోని పల్నాడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
డయేరియా మరణాల పాపం ప్రభుత్వానిదే, ఏపీలో మైన్స్, వైన్స్ దోపిడీ
-
టీడీపీ గూండాల దాడిలో నాగరాజుకు గాయాలు.. వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, నరసారావుపేట: టీడీపీ గుండాల చేతిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త నాగరాజును వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నాగరాజుకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. నాగరాజును జాగ్రత్తగా చూసుకోమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని వైఎస్ జగన్ ఆదేశించారు.పల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్లకు చెందిన చల్లా నాగరాజు మొదటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తగానే పనిచేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించాడు. దీంతో నాగరాజుపై కక్ష కట్టిన స్థానిక టీడీపీ నాయకులు, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన్ను బెదిరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కూటమి నేతల నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, తేలుకుట్ల వదిలి పులిపాడు వచ్చి అక్కడే ఉంటున్నాడు.కాగా, గత నెల 20న వ్యక్తిగత పనిమీద తేలుకుట్ల వెళ్లి పులిపాడు తిరిగి వస్తుండగా, గ్రామ శివారులోని గాడిదల వాగు వద్ద కాపుకాసిన 10 మంది టీడీపీ గుండాలు, నాగరాజుపై విచక్షణా రహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రెండు కాళ్లనూ నాలుగు చోట్ల విరగ్గొట్టారు. దీంతో, నాగరాజును వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తరలించారు. అనంతరం, మెరుగైన చికిత్స కొరకు నరసారావుపేట జీబీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యం చేసిన వైద్యులు.. నాగరాజు కుడి కాలు చికిత్స చేసే అవకాశం లేదని, మోకాలు కింద నుంచి కాలు తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్.. నాగరాజును ఆదివారం ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాగరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ ఆకాక్షించారు. ఈ సందర్భంగా నాగరాజుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాగరాజుకు పూర్తి వైద్య సాయం చేయించాలని, జాగ్రత్తగా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని ఆదేశించారు. -
పల్నాడు జిల్లాలో పచ్చ బ్యాచ్ దౌర్జన్యం
-
టీడీపీ బరితెగింపు.
-
మెడికల్ సీట్లు వద్దని చెప్పడం దుర్మార్గం: గోపిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, వాటిలో 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే, ఈ ఏడాది మరో 5 కాలేజీలు కూడా మొదలై ఉండేవని తెలిపారు.కానీ, సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల.. అవి ప్రారంభం కాకపోగా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 మెడికల్ సీట్లు కూడా పోయాయని ఆక్షేపించారు. ఆ సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కొత్తగా మెడికల్ సీట్లు వస్తే మీకు (ప్రభుత్వానికి) వచ్చిన నష్టమేమిటని.. ఒక డాక్టర్గా అడుగుతున్నానన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అందుకు సమాధానం చెప్పాలని నిలదీశారు.40 ఏళ్ళుగా ఏపీలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. వైద్య విద్య ఎంత కష్టమైందో.. మెడిసిన్ సీటు సంపాదించడం కూడా ఎంత ఇబ్బందో అందరికీ తెలిసిందేనన్న నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే.. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాటలు విస్మయం కలిగించాయని చెప్పారు.ఇదీ చదవండి: తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదంగత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ , వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడమే కాక.. పోస్టులన్నీ భర్తీ చేశారని స్పష్టం చేశారు. అందుకే.. మంత్రి సత్యకుమార్ సవాల్ స్వీకరిస్తున్నానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో ఎంత అభివృద్ధి జరిగింది?. ఈ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సిబ్బంది ధర్నాతో పీహెచ్సీల్లో వైద్య సేవలు ఆగిపోయాయని, స్పెషలిస్ట్ వైద్యసేవలూ నిల్చిపోయాయని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్లపై పోలీసుల ఓవర్ యాక్షన్...
-
పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం
-
పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ నేతల అరాచకాలు
-
టీడీపీ నేతల వేధింపులకు పల్నాడు ఉద్యోగి బలి
సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులతో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఉద్యోగులను ఎవరినీ వదలకుండా వేధింపులకు తెగపడుతున్నారు. తాజాగా పచ్చ నేతల వేధింపులకు పల్నాడులో ఓ ఉద్యోగి బలి అయ్యారు. పల్నాడు జిల్లాలోని అన్నారం సొసైటీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని టీడీపీ సానుభూతిపరులు దొప్పలపూడి శ్రీనివాసరావు, సురేంద్రబాబులు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు సైతం శ్రీనివాస్ రెడ్డికి రెండు నెలల నుంచి జీతం ఆపేశారు. ఉద్యోగం మానేయాలని ఆ ఉద్యోగంలో తమ వారిని ఎంపిక చేసుకుంటామని ఆయన్ను టీడీపీ నేతలు వేధించారు. వారి వేధింపులు భరించలేక శ్రీనివాస్ రెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్రెడ్డి మృతి చెందారు. శ్రీనివాస్రెడ్డి మృతికి టీడీపీ నేతల వేధింపులు కారణమని కుటుంసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. -
టీడీపీ నేతల అరాచకం.. నాగరాజుకు తీవ్ర గాయాలు
పల్నాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులు.. నాగరాజును చావబాదడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. నాగరాజును బొల్లాపల్లి స్టేషన్ తీసుకువచ్చిన పోలీసులు.. ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. కిడ్నాడ్ ఘటనకు సంబంధించ ఎనిమిది మంది కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కిడ్నాపర్లను విచారిస్తున్నారు. నిందితులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు గోప్యగా ఉంచుతున్నారు. బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. -
Nagaraju Incident in Palnadu: రంగంలోకి 6 స్పెషల్ టీంలు..
-
నాగరాజుకు ఏమైనా హానీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి: అంబటి రాంబాబు
-
AP: పచ్చమూకల దాడి.. వైఎస్ఆర్సీపీ నేతకు తీవ్ర గాయాలు
సాక్షి,పల్నాడు జిల్లా: ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు మళ్లీ బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నేత, క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై 15 మంది మాస్కులు వేసుకున్న టీడీపీ నాయకులు దారికాచి దాడి చేశారు. మంగళవారం(జులై 23)సాయంత్రం గుంటూరు నుంచి తాళ్లూరు వెళ్తుండగా ఉంగుటూరు వద్ద మాటువేసిన టీడీపీ నాయకులు సాంబిరెడ్డి కారుపై దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో కారు ధ్వంసమైంది. సాంబిరెడ్డి కాళ్లు చేతులపై ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో సాంబిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
వినుకొండకు వైఎస్ జగన్.. కార్యకర్తల ఘన స్వాగతం (ఫొటోలు)
-
రాజకీయ కక్షతోనే హత్య.. రషీద్ కుటుంబానికి అండగా ఉంటానన్న వైఎస్ జగన్
పల్నాడు,సాక్షి: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి.. రాష్ట్రంలో అన్నీ దారుణాలకు తెగబడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వినుకొండలో టీడీపీ గుండా చేతిలో రెండ్రోజుల కిందట అతికిరాతకంగా హత్యకు గురైన వైఎస్సార్సీపీ యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్ను చూడగానే రషీద్ తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగానికిలోనూ కంటతడి పెట్టారు. వారిని ఓదార్చిన ఆయన.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చంపేసేంత కక్షలు లేవు.. ఎందుకిలా జరిగింది? అని ఆరా తీశారాయన. అయితే అవి పాత కక్షలు కావని, రాజకీయ కక్షలే అని రషీద్ తల్లి జగన్కు వివరించారు. వైఎస్సార్సీపీ కోసమే రషీద్ తాపత్రయపడ్డాడు. రాజకీయ కక్షతోనే మా కొడుకును బలి తీసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుల పేర్లు చేర్చలేదు. ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నిందితుడు జిలానీ వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారు. జిలానీ కాల్ డేటా తీస్తే హత్య వెనుక ఎవరున్నది తెలిసిపోతుంది. నా కొడుకును చంపిన వాళ్లను రోడ్డుపైనే ఉరి తీయాలి అని రషీద్ తల్లిదండ్రులు కోరారు. ఆ సమయంలో టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫొటోలను జగన్కు రషీద్ కుటుంబ సభ్యులు చూపించారు. ‘‘హత్య వెనుక ఎవరున్నా వదలం. మీ కుటుంబానికి అండగా ఉంటాం’’ అని రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ దారుణాలే. కాపాడాల్సిన పోలీసులే నిందితులకు వత్తాసు పలుకుతున్నారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదు’ అని అన్నారాయన. అలాగే.. రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.ఆ టైంలోనూ ఆ కుటుంబ సభ్యుల్ని ఆయన ఓదార్చారు. అంతకు ముందు రషీద్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ పరామర్శలో జగన్ వెంట పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. అడుగడుగునా ఆంక్షలు.. ఆటంకాలుపోలీసుల ఆంక్షలు.. అడుగడుగునా వాళ్లు కల్పించిన ఆంటకాలతో వైఎస్ జగన్ వినుకొండ పర్యటన కొనసాగింది. దారి మధ్యలో ఆయన వెంట పార్టీ నేతలు రాకూడదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 15 చోట్ల ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన పర్యటన ఆలస్యంగా కొనసాగింది. అయినప్పటికీ ఆయన ఓపికగా ముందుకు సాగారు.దారివెంట అభిమాన గణంజగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించినా.. అభిమానులు మాత్రం పోటెత్తారు. దారి పొడవునా జై జగన్ అంటూ నీరాజనాలు పట్టారు. వినుకొండలో ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు వెళ్లింది. అయితే పరామర్శ కార్యక్రమానికి వెళ్తున్నప్పటికీ.. అంత పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ కేడర్ను నిరుత్సాహపర్చడం ఇష్టం లేని వైఎస్ జగన్.. బయటికి వచ్చి అభివాదం చేశారు. జగన్ భద్రతపై నిర్లక్ష్యంమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రిపేర్లో ఉన్న బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ఫ్రూప్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్.. మరో వాహనంలో వినుకొండ చేరుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ వాహనం కండిషన్లో ఉందని చెప్పడం కొసమెరుపు. -
పల్నాడులో రాజకీయ కక్షతో YSRCP కార్యకర్త దారుణ హత్య
-
ఆయన ఉంటే ఇలా జరిగేది కాదు.. వినుకొండ ఘటనపై అంబటి ట్వీట్
సాక్షి, పల్నాడు జిల్లా: సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడులో దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్లకు పాల్పడిన టీడీపీ నేతలు మరోసారి వైఎస్సార్ సీపీ కార్యకర్తలే టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కంచి శ్రీనివాసరావు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పల్నాడులో హింసాకాండ తిరిగి మొదలైంది.ఎస్పీ స్వయంగా వినుకొండలో ఉన్న సమయంలోనే తెలుగు యువత నాయకుడి తమ్ముడు నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డాడు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని కొత్తగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కంచి శ్రీనివాసరావు ఫక్తు రాజకీయ నేత మాదిరిగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.వినుకొండ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. ‘‘మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు!’’ అంటూ ట్వీట్ చేశారు.మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఉండి ఉన్నట్లయితే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదు !— Ambati Rambabu (@AmbatiRambabu) July 17, 2024 ఇదీ చదవండి: గూండారాజ్.. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య -
రాబందుల రాజ్యంలో 'రాక్షస కాండ'.. పేట్రేగిపోతున్న టీడీపీ గూండాలు
రాష్ట్రంలో రక్తం ఏరులైపారుతోంది.. మధ్యయుగాల నాటి మారణకాండను తలపిస్తూ నడిరోడ్డు పైనే, అదీ అందరూ చూస్తుండగానే మనుషులను నరికిపారేస్తున్నారు. తాలిబన్లను మించి అత్యంత పాశవికంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మారణకాండను సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు.. నెల రోజులుగా పచ్చ మూక ఉన్మాదానికి నెత్తురు కట్టలు తెంచుకుంటోంది.. తలకాయలు తెగిపడుతున్నాయి. వారి అధికార మదానికి ప్రాణాలు దూదిపింజల్లా రాలిపోతున్నాయి. సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ను బుధవారం రాత్రి టీడీపీ నేత జిలానీ కత్తితో దాడి చేసి రెండు చేతులు తెగనరికాడు.. అదే కత్తితో తలపైనా, మెడపైనా విచక్షణారహితంగా నరికాడు. ఇంతటి దారుణ హత్య ఎక్కడో చీకట్లోనో.. దొంగచాటుగానో చేయలేదు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బహిరంగంగానే ఇంతటి ఘోరానికి ఒడిగట్టాడు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని నారా లోకేశ్ హోర్డింగుల సాక్షిగా స్పష్టం చేశారు.. దీంతో పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుని టీడీపీ అరాచకాలకు రాచబాట పరిచింది.. అంతకంటే ఇంకేం కావాలని టీడీపీ రౌడీలు మారణాయుధాలు చేతబట్టి కాలకేయుళ్లా రాష్ట్రంపై దండెత్తారు. ఇదీ చంద్రబాబు రాక్షసపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖచిత్రం.. రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో నెలకొన్న అరాచక రాజ్యం. మధ్యయుగాలనాటి గజినీ, ఘోరీల దురాగతాలను మించి టీడీపీ గూండాలు హత్యలకు తెగబడుతున్నారు. తాలిబన్ మూకలను మించి పచ్చ మూకలు స్వైరవిహారం చేస్తూ కర్కశంగా విరుచుకుపడుతున్నాయి. తమ పదఘట్టనల కింద యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. నడిరోడ్లపై రాక్షసరాజ్యం కరాళ నృత్యం చేస్తోంది. 75ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు చూడని రీతిలో హింసాకాండతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే టీడీపీ మూకల దాడుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. మరో 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలా హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇళ్లు, ఆస్తులు, మహానేత విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలను కూలుస్తున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా పట్టించుకునేవారే లేరు. నెల రోజుల్లోనే 31 హత్యలు మహాభారతంలో బకాసురుడి కథ అందరికీ తెలిసిందే. అతడికి ఒక ఎడ్ల బండి నిండుగా అన్ని రకాల ఆహార పదార్థాలను పంపేవారు. ఆ ఆహార పదార్థాలను, బండికి కట్టిన ఎద్దుల్ని, బండిని తోలుకొచ్చిన మనిషిని కూడా కరకరానమిలి పారేసేవాడు. ఇలా రోజూ ఎడ్లబండి నిండుగా ఆహార పదార్థాలను నింపి మనిషితో పంపాల్సిందే. భీముడు వెళ్లి బకాసురుడిని సంహరించే వరకు ఈ అరాచకం కొనసాగింది. ఇప్పుడు బకాసురుడి రీతిలోనే చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ రౌడీలు రోజుకొకరిని అత్యంత కిరాతకంగా అంతమొందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క నెల రోజుల్లోనే రాష్ట్రంలో 31 మందిని పచ్చ నేతలు, కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. వీరి దాడులు, వేధింపులను తట్టుకోలేక 35 మంది తమ ప్రాణాలను బలితీసుకున్నారు. ఇవన్నీ ఇప్పటివరకు నమోదైన అధికారిక లెక్కలు. కానీ వాస్తవంగా అంతకుమించిన రాక్షస కాండలో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుతున్న దౌర్జన్యకాండ కావడంతో ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. వీరంతా ఫిర్యాదు చేస్తే మరిన్ని కేసులు వెలుగుచూసేవి.నెల రోజుల్లో వేయికిపైగా దాడులు.. 300 హత్యాయత్నాలుటీడీపీ రౌడీ మూకలు రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు వ్యాపారులు, సాధారణ ప్రజలపై కర్కశంగా విరుచుకుపడుతున్నారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో 1,050 దాడులకు తెగబడటం టీడీపీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనం. వాటిలో 300కుపైగా హత్యాయత్నాలే కావడం గమనార్హం. అంటే టీడీపీ గూండాలు రోజుకు సగటున 100 దాడులు.. 10 హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఒక్క ప్రాంతమని లేదు.. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్రవ్యాప్తంగా రాక్షస కాండను కొనసాగిస్తున్నారు. ఎస్సీ కాలనీలపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో చీనీ తోటలను నరికేస్తున్నారు.ఊళ్లు వదిలిపోయిన వేలాది కుటుబాలుటీడీపీ రౌడీమూకలు హత్యాకాండకు తెగబడుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో తమ గ్రామాలు వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చిత్తూరు జిల్లాలో దాదాపు 500, అనంతపురం జిల్లాలో 350, శ్రీసత్యసాయి జిల్లాలో 100, అన్నమయ్య జిల్లాలో 120, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ సొంత ఊళ్లను విడిచిపెట్టేశాయి. వ్యాపారులను కూడా టీడీపీ మూకలు వదిలిపెట్టడం లేదు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో 560 ప్రైవేటు ఆస్తులు, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికే పోలీస్ శాఖ సలాం..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీసు శాఖ నారా లోకేశ్ విరచిత రెడ్బుక్ రాజ్యాంగానికే సలాం కొడుతోంది. రెడ్బుక్ పేరిట రాష్ట్రంలో హోర్డింగులు పెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసు శాఖ చోద్యం చూస్తోంది. రెడ్బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ టీడీపీ అరాచకాల అడుగులకు మడుగులొత్తుతోంది. రాష్ట్రస్థాయిలో లోకేశ్ను అనుసరిస్తూ నియోజకవర్గ స్థాయిల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో రెడ్బుక్ను తెరపైకి తెచ్చి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తమ హింసాకాండను అడ్డుకుంటే పోలీసుల సంగతి తేలుస్తామని టీడీపీ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. -
వనవాసంలో పల్నాడు ప్రజలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఏపీలో అధికారమే అండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రక్తపుటేర్లు పారించడం తెలిసిందే. ఇప్పుడు అధికారం కూడా తోడవడంతో వారు స్వైరవిహారం చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను ఊరి నుంచి తరిమేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలను సైతం తరిమికొట్టారు. చివరకు పోలీసులు కూడా టీడీపీ నేతలకే వంతపాడుతూ.. వెళ్లిపొమ్మని ఒత్తిడి చేయడంతో గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం వదిలి అజ్ఞాతవాసం చేస్తున్నారు. చెట్టుకొకరు, పుట్టకొకరు మాదిరిగా భయంతో పారిపోయి తలదాచుకుంటున్నారు. ఇలా పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన వందల కుటుంబాలు గెంటివేతకు గురయ్యాయి. రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణకు వలస వెళ్లి అక్కడక్కడ కొందరు అద్దె ఇళ్లు తీసుకొని జీవనం సాగిస్తుండగా మరికొందరు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇలా తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కృష్ణపట్టె ప్రాంతానికి తరలి వచ్చిన కుటుంబాలను కదిలిస్తే ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.వందల ఇళ్లు ధ్వంసం.. టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగంలో పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు గ్రామంలో బతకలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ వారెవరూ గ్రామంలో ఉండడానికి వీల్లేదని గ్రామంలో దండోరా వేయించారంటే టీడీపీ నేతల దురాగతాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. టీడీపీ గూండాలు దాడులు చేస్తూ అక్కడి ప్రజలను కట్టుబట్టలతో గ్రామాల నుంచి గెంటివేశారు. ఇంకోవైపు కాపాడాల్సిన పోలీసులే ‘మీరు గ్రామంలో ఉండొద్దు.. ఉంటే గొడవలవుతాయి.. కాబట్టి వెళ్లిపోండి’ అంటూ గ్రామస్తులను వేరే చోటకు పంపించివేస్తున్నారు. గ్రామంలో దాదాపు 3,700 కుటుంబాలు ఉంటే ఇప్పటివరకు 1,035 కుటుంబాలను వెళ్లగొట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు 150 వరకు తాళాలు వేసి ఉన్న ఇళ్లు, కిటీకీలు పగులగొట్టి ఫర్నీచర్ను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఇళ్లలో ఉన్న బియ్యాన్ని కూడా వదలకుండా పారబోసినట్లు వాపోయారు. గ్రామంలో ఉన్న దాదాపు 7 వేల ఓట్లలో వైఎస్సార్సీపీ కంటే టీడీపీకే 60 ఓట్లు అత్యధికంగా వచ్చినా, అసలు వైఎస్సార్సీపీ సానుభూతిపరులెవరూ గ్రామంలో ఉండడానికి వీల్లేదన్నట్టు వెళ్లగొట్టారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వలస కూలీలుగా బతకాల్సిన దైన్యంగ్రామంలో వైఎస్సార్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో అత్యధికంగా బడుగు, బలహీన వర్గాల వారే. అయినా పేదలనే కనికరం లేకుండా వారిని టీడీపీ నేతలు వెళ్లగొట్టారు. దీంతో గ్రామంలో భూములు ఉండటంతో వ్యవసాయం చేసుకున్న రైతులు ఇప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొందరు చిన్నాచితకా పనులు చేసుకుంటున్నారు. ఎంపీటీసీగా ఉండొద్దని హుకుం జారీ చేశారు..మాది పిన్నెల్లి గ్రామం. ఎంపీటీసీ భర్తను. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. దీంతో ఎంపీటీసీగా ఉండడానికి వీల్లేదని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. మా గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ నేత చింతపల్లి అన్ని గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందినవారెవరూ ఉండడానికి వీల్లేదని మమ్మల్ని బయటకు తరిమే శారు. పోలీసులు వారికే కొమ్ముకాస్తున్నారు. – చింతపల్లి పెద్దసైదా (మాస్టర్), వైఎస్సార్సీపీ మండల అధికార ప్రతినిధి, మాచవరంకట్టుబట్టలతో గ్రామం విడిచివచ్చాంటీడీపీ నేతలు మమ్మల్ని వెళ్లగొడితే కట్టుబట్టలతో గ్రామం విడిచివచ్చాం. మాకు వ్యవసా యం తప్ప వేరే పని తెలియదు. దీంతో కుటుంబ సభ్యులతో తెలంగాణలోని కృష్ణపట్టెకు వ చ్చి వ్యవసాయ పనులు చేస్తున్నాం. ఇక్కడే రెండెకరాల పొలం కౌలుకు తీసుకున్నా. కొంత చెల్లించినా మిగతావి కట్టేందుకు డబ్బుల్లేవు. – తొండా సైదు, రైతు, పిన్నెల్లి మా ఇంటిని ధ్వంసం చేశారు.. ఎన్నికల్లో టీడీపీ గెలవగానే మా ఇంటిని క్రేన్తో ధ్వంసం చేశారు. బైకును తగలబెట్టారు. బీరువాలో ఉన్న డబ్బులు, బంగారం ఎత్తుకుపోయారు. మాకు 8 ఎకరాల పొలం ఉన్నా ప్రాణభయంతో వచ్చేశాం. మా ఇంటిలో ఉన్న పిల్లల సర్టిఫికెట్లు తీసుకురమ్మని మా బంధువులను పంపితే వారిని కూడా కొట్టి పంపారు. తిరిగి మా పైనే కేసులు పెట్టారు. – గుంటూరు జమీల, పిన్నెల్లి ఆడపిల్లలను బూతులు తిడుతూ బట్టలు తగలబెట్టారు..టీడీపీ వాళ్లు మా ఇంటి తాళాలు పగులగొట్టి సీసాలు పగులగొట్టి ఇంట్లో వేశారు. ఇల్లంతా చిందర వందర చేశారు. మా అమ్మాయిలను బూతులు తిడుతూ బట్టలు తగలబెట్టారు. – గుంటూరు బషీరున్, పిన్నెల్లి -
అన్ని అనుమతులతో పల్నాడు ఆఫీసు నిర్మించాం
-
పల్నాడులో టీడీపీ, జనసేన అరాచకం
-
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఎత్తివేత
-
పల్నాడులో 144 సెక్షన్ ముగిసింది
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్ అమలు ముగిసిందని కలెక్టర్ శ్రీకేశ్ బి. లత్కర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నరసరావుపేటలోని కలెక్టరేట్లో ఎస్పీ మలికా గార్గ్, జేసీ శ్యాంప్రసాద్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో 28 రోజులు 144 సెక్షన్ అమలు చేశామని, శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో ఆ నిబంధన ఎత్తేశామని చెప్పారు. ర్యాలీలు, సమావేశాలకు మాత్రం పోలీసుల అనుమతి తప్పనిసరి అని అన్నారు. కౌంటింగ్ తరువాత జిల్లాలో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా మళ్లీ ఆంక్షలు విధిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ సమయంలో గొడవలతో జిల్లాకు మచ్చ పడినప్పటికి, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగి జిల్లాకు తిరిగి మంచిపేరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా కౌంటింగ్ ముగిసిన జిల్లాల్లో పల్నాడు ముందుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో 13,739 మంది సిబ్బంది, కౌంటింగ్లో 2,136 మంది పాల్గొన్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో 86.5 శాతం ఓటింగ్ నమోదు చేసిన ఓటర్లను ప్రత్యేకంగా అభినందించారు.దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ మలికా గార్గ్ కౌంటింగ్ ముగిసిన తరువాత జిల్లాలో అక్కడక్కడా గొడవలు జరుగుతున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు. గత రెండు రోజుల్లో గొడవలకు దిగిన వారిపై 46 కేసులు నమోదు చేసి, 140 మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రభుత్వ భవానాలపై రంగులు, విగ్రహాలు నచ్చకపోతే స్థానిక సంస్థలలో తీర్మానాలు చేసి అధికారికంగా మార్చాలని, చట్టాలను చేతుల్లోకి తీసుకోరాదన్నారు. సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. గ్రామాలలో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి గొడవలు జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో జిల్లాలో 168 కేసులు నమోదు చేసి 1,338 మందిని అరెస్ట్ చేశామని, త్వరలో ఛార్జిïÙట్లు వేసి తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు. -
కౌంటింగ్ ముంగిట మరో కుట్ర
సాక్షి, అమరావతి: కీలకమైన ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఒత్తిడికి ఎన్నికల కమిషన్ (ఈసీ), రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి వ్యవహరిస్తున్నారన్నది మరోసారి స్పష్టమైంది. అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) ఎస్పీ ఏఆర్ దామోదర్కు హఠాత్తుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదీ పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆయన పోలింగ్ ముగిసిన తరువాత వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న దామోదర్ను హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని.. కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీచేయడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. టీడీపీకి వీర విధేయుడు.. 2007 గ్రూప్–1 బ్యాచ్కు చెందిన ఏఆర్ దామోదర్ అత్యంత వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారి మధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు అండతో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. పశి్చమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నాన్ కేడర్ ఎస్పీ అయినప్పటికీ దామోదర్ను 2019 సంవత్సరంలో ఎన్నికల కోసమని విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. వైఎస్సార్సీపీ పటిష్టంగా ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులతో బీభత్సం సృష్టించి కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని బంధించాయి.దాదాపు నాలుగు గంటలపాటు టీడీపీ రౌడీమూకలు స్వైర విహారం చేసినా పోలీసులు, ఎస్పీగా ఉన్న దామోదర్ సైతం పట్టించుకోలేదు. సరికదా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించలేదు. అప్పట్లో విశాఖపట్నం డీఐజీ స్పందించి అదనపు బలగాలను కురుపాం పంపించడంతో నాలుగు గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదీ దామోదర్ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ట్రాక్ రికార్డ్.అలాంటి అధికారికి కంట్రోల్ రూమ్ బాధ్యతలా?ఎన్నికల విధుల్లో ఉద్దేశపూర్వకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్ దామోదర్కు ప్రస్తుతం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, ఈసీకి నోడల్ అధికారిగా ఉన్న అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబాత్ర బాగ్చీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా విధ్వంసకర సంఘటనలు జరిగితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అందుకోసం జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేయడం ఆయన బాధ్యత. అంటే.. డీజీపీ తరఫున జిల్లా ఎస్పీలకు ఆయనే ఆదేశాలు జారీచేస్తారు.2019 ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో విఫలమైన ఆయన ప్రస్తుతం కంట్రోల్ రూమ్ బాధ్యతలను ఎలా నిర్వహించగలరని డీజీపీ, అదనపు డీజీ భావించారో అర్థంకావడంలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే దామోదర్కు ఈ బాధ్యతలు అప్పగించారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇటీవల పోలింగ్ రోజున పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డాయి.అదే రీతిలో కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యానికి కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయినాసరే.. టీడీపీకి అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన దామోదర్కు కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకు.. టీడీపీ గూండా మూకలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎస్పీలను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
గుంటూరు/పల్నాడు, సాక్షి: ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ ఎఫెక్ట్.. ఆపై హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు కదిలింది. కారంపూడి సీఐ నారాయణస్వామిని విధుల నుంచి తప్పించింది.తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ నారాయణ స్వామితో పాటు ఇద్దరు పోలీస్ అధికారులపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన విచారణలో భాగంగా చర్యలు చేపట్టాలని సీఈవోకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఈసీ సీఐ నారాయణ స్వామిని తప్పించింది. అంతేకాదు.. నారాయణ స్వామిపై సిట్ విచారణకు ఆదేశించారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా. ఆధారాలు సమర్పిస్తే ఇతర అధికారులపైనా విచారణ చేపడతామని ఆయన అంటున్నారు. -
పల్నాడులో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: ఎస్పీ
-
టీడీపీ నేతల అరాచకాలు..
-
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!
రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్ ట్యాంక్ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తున్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు, ఆయన అనుచరులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్ బాబు తదితరులు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు. -
పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న అక్కసుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్కు దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్కు పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్ తరువాత సైతం బడుగు, బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడులను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్సార్సీపీ నేతలు వాపోతున్నారు. పోలింగ్ రోజు, తరువాత పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగింది. ఓటేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీలపై దాడి రెంటచింతల మండలం తుమృకోటలో మే 13న ఓటు వేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలపై టీడీపీలోని అగ్రకుల నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే క్యూలైన్లలో ఉన్న మహిళల్ని కొట్టడంతోపాటు వారిని బయటకు తరిమేసిన టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. పోలింగ్ బూత్లో ఏజెంట్లను బయటకు గెంటేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తున్న మహిళల తలలు పగులగొట్టారు. దీంతో బాధిత మహిళలు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఆ ఒక్క కులమే గ్రామంలో బతకాలా.. దళితులకు ఓటు వేసే హక్కులేదా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్య నాయక్, కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావు నాయక్, నాగేశ్వరరావు నాయక్లపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. పాలువాయిగేటు బూత్లలో అరాచకం పాలువాయిగేటు గ్రామంలో టీడీపీ గూండాలు ఈ నెల 13న ఉదయం 6.30 గంటల సమయంలో ప్రవేశించి గ్రామంలోని 201, 202 పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీకి చెందిన వారిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరిరావు బరితెగించి ఓటర్లపై దౌర్జన్యానికి దిగారు. 202 బూత్లోకి వెళ్లి ఓటర్లను భయాందోళనకు గురిచేసి రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్కు, నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి, ఎస్పీ బిందుమాధవ్, జేసీ శ్యామ్ప్రసాద్ తదితర ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ సమయంలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో వచ్చి వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, శ్రీను, మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా టీడీపీ వర్గీయులు పిన్నెల్లి కాన్వాయ్లోని వాహనాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు నంబూరి శేషగిరిరావు. అతనిపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని రక్షించాడంటూ చంద్రబాబు ఫోన్లో పరామర్శించడంపై పాలువాయిగేటు గ్రామ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పోలింగ్ ముగిశాక బుడగ జంగాలపైనా దాడి కారంపూడి మండలం పేటసన్నెగండ్ల శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్ ముగిశాక వారి ఇళ్లపై దాడి చేశారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ఇళ్లలోని సామాన్లు, చివరకు ఫ్యాన్లు, బల్బులను కూడా పగులగొట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో కారును ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో పోతురాజుగుట్టలోని వారంతా ప్రాణభయంతో పారిపోయి వేరేచోట తలదాచుకున్నారు. ‘ఏరా.. టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఊరొదిలి పారిపోయిన బడుగు జీవులు గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్ల వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ రౌడీలు, గూండాలను తీసుకొచ్చి పోలింగ్ రోజు రాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులకు పాల్పడి ధ్వంసరచన సాగించారు. బైక్లు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామగ్రితోపాటు టీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని వైఎస్సార్సీపీ నేతలు పొలాల్లోకి పారిపోయి అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు, మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారని తెలిసి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. పోలీసులకు విషయం తెలిసినా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన బాధితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్కుమార్, కాసు మహేష్రెడ్డిపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయంటే వారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నాయకుల్ని గ్రామాలు దాటించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా చొరబడ్డారు. మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని పురుషులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ముస్లిం వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. కంభంపాడులో విధ్వంసకాండ పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్ రోజున వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలపైనా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య), సతీమణి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు అంజిమ్మ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడ్డారు. పలుమార్లు ఎస్సీ, బీసీ కాలనీలకు టీడీపీ రౌడీ మూక వెళ్లి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఎస్సీలపై దాష్టీకం చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా మే 13వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీకి ఎస్సీలు ఓటు వేశారన్న అక్కసుతో వారిపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి కాలనీకి చెందిన ఎస్సీలు గ్రామంలోని ప్లాంట్నుంచి మంచినీరు తీసుకువెళ్లకుండా టీడీపీ నేతలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. ఓటేయకుండా అడ్డుకున్నారు ఓటేద్దామని పోలింగ్ బూత్కు వెళితే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో ఇంటికి పారిపోయా. అధికారులకు చెప్పినా చూస్తూ నిలబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడం మేలని ఓటేయకుండా తిరిగొచ్చేశా. –కర్రా ఏసుపాదం, ఎస్సీ మహిళ, తుమృకోట ఓటు వేయలేకపోయా ఓటు వేయాలని రెండుసార్లు పోలింగ్ బూత్కు వెళ్లాను. అక్కడ యుద్ధ వాతావరణం చూసి భయపడి ఇంటికి వచ్చేశా. టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తూ బడుగులను భయపెట్టి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. – నందిగం పున్నమ్మ, ఎస్సీ మహిళ, తుమృకోట నా భర్తను కొట్టారు ఓటు వేయడానికి వెళ్లిన నా భర్త దీపావత్ స్వామినాయక్ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టారు. నన్ను కూడా ఓటు వేయకుండా బెదిరించారు. పోలింగ్ బూత్ల వద్ద దాడులు చేయడంతో మా కాలనీలో ఎవరూ ఓటు వేయలేదు. అధికారులు మాకు రక్షణ కలి్పంచలేకపోవడం వల్ల ప్రాణ భయంతో ఓటు వేయడానికి వెళ్లలేదు. – దీపావత్ రమణ, ఎస్టీ మహిళ, తుమృకోట ప్రాణభయంతో పరుగులు పెట్టా ఓటు వేయవద్దని.. వేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు బెదిరించారు. గ్రామస్తులు లెక్కచేయకపోవడంతో రిగ్గింగ్ చేయాలనే తలంపుతో దళితులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టా. – కత్తి భూలక్ష్మి, ఎస్సీ మహిళ, పాలువాయిగేటు, రెంటచింతల మండలం వైఎస్సార్ సీపీకి ఓటు వేశామని దాడి టీడీపీ నేతలు పోలింగ్ రోజు మా ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్టు కొట్టారు. మా ఆస్తులను ధ్వంసం చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. నాతో మరో నలుగురిని కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. బీభత్సం చేశారు. – గొర్ల సైదులు, జంగాల కాలనీ, పేటసన్నెగండ్ల , కారంపూడి -
టీడీపీ మరో కుట్ర మాచర్లలో హైటెన్షన్
-
మాచర్లలో మరో టెన్షన్.. సీఈవో కీలక ప్రకటన
ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల నుంచి తేరుకోవడానికి.. ప్రశాంతత నెలకొనేందుకు పల్నాట నాలుగురోజుల సమయం పట్టింది. అలాంటి చోట మళ్లీ అల్లర్లకు తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తోందా?. వద్దని పోలీసులు వారిస్తున్నా చలో మాచర్ల చేపట్టం వెనుక ఆంతర్యం ఏమిటి?. 👉మాచర్లకు టీడీపీ నేతలు.. మంచిది కాదు: సీఈవో ముకేష్ కుమార్ మీనాపిన్నెల్లి వీడియోపై సీ ఈవో సంచలన ప్రకటనఆ వీడియోను మేము విడుదల చేయలేదుఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదుఅది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాందర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లిందిపాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీ ఓ, ఏపీ ఓలను సస్పెండ్ చేశాంమాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదుఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందిటీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాంవాళ్లు వెళితే వైఎస్సార్సీపీ నేతలు కూడా వెళతామంటారుమళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందిబయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదుఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను 👉టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా? టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం 👉టీడీపీ కీలక నేతల గృహనిర్బంధంమాచర్లలో టీడీపీ ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని పోలీసుల స్పష్టీకరణఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ విజ్ఞప్తిమాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహ నిర్బంధం గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తిలో శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులుఅయినా మాచర్ల వెళ్లితీరతామంటూ టీడీపీ నేతల మొండిపట్టు.. ఉద్రిక్తత 👉మాచర్లలో భారీ పోలీసు బందోబస్తుపల్నాడు జిల్లాలో మరొక భారీ కుట్రకు ప్లాన్ చేసిన తెలుగుదేశం పార్టీ?పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చలో పల్నాడు.. మాచర్ల పేరుతో తెలుగుదేశం నేతలు మరొక డ్రామాఉమ్మడి గుంటూరు ,కృష్ణా జిల్లాల నేతలతో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీజిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులునిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులుపోలీసుల హెచ్చరికలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీచలో మాచర్ల పేరుతో పల్నాడులో మరోసారి విధ్వంసం సృష్టించడానికి తెలుగుదేశం రెడీ అవుతున్న తెలుగుదేశం నేతలు 👉 పల్నాడులో టీడీపీ చలో మాచర్ల పిలుపుతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు👉 మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమా గృహ దిగ్భంధం.. మరికొందరు నేతల్ని సైతం అడ్డుకున్న పోలీసులు👉 మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదు: పోలీసులు👉 మాచర్లలో ఎలాగైనా పర్యటన చేపడతాం: టీడీపీ నేతలు తెలుగు దేశం పార్టీ ఇవాళ చలో మాచర్లకు పిలుపు ఇచ్చింది. ఈ ఉదయం మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవీ ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ సందర్భంగా ఇక్కడ జరిగిన అల్లర్లపై ఈసీ సీరియస్ అయ్యింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలోఎలాంటి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా టీడీపీ సానుభూతిపరులకు పరామర్శ పేరిట చలో మాచర్ల నిర్వహించి తీరతామని టీడీపీ అంటోంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొందక్కడ. -
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
-
సిట్ వద్ద కీలక ఆధారాలు.. విచారణ అడ్డుకునే కుట్ర
-
టీడీపీ నేతలే నా బైక్ తగలబెట్టారు: YSRCP నేత పిచ్చయ్య
-
చివరి అంకానికి సిట్ దర్యాప్తు
-
AP: సిట్ దూకుడు.. అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు!
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం ప్రధానంగా దృష్టిసారించింది. కాగా, హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్లను సిట్ నమోదు చేయనుంది. అయితే, కొందరు పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సిట్ గుర్తించింది. ఇక, హింసాత్మక ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. -
Palnadu: పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు ఉన్నతాధికారులను బదిలీ, సస్పెన్షన్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం వారి స్థానాల్లో కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలిచి్చంది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ, పల్నాడు ఎస్పీగా మలికా గర్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్థన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పల్నాడు జిల్లాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు
-
AP: జెట్ స్పీడ్గా సిట్ దర్యాప్తు
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక బృందం(SIT) దర్యాప్తు జెట్ స్పీడ్తో ముందుకు సాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో టీంను నియమించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సిట్ బృందం దర్యాప్తు ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి నుంచి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది అధికారుల బృందం దర్యాప్తులోకి దిగింది. ఈ టీంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ వి శ్రీనివాసరావు, డీఎస్పీ రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు ఉన్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైనా ఆరాలు తీస్తోంది. ఈ మొత్తం ఘటనలపై ఆదివారం లోగా ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది.ఇంకా 144 సెక్షన్పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన హింస నాలుగు రోజుల పాటు కొనసాగింది. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతిల్లో జరిగిన ఘటనలు స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తాడిపత్రి, సత్తెనపల్లి, జమ్మలమడుగులో పోలీస్ పహారా ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల ఆఫీస్ల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలీసుల పచ్చపాత వైఖరిమరోవైపు.. ఏపీలో పోలీసులు పక్షపాత వైఖరిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేస్తుంటే చూస్తూ ఉండిపోయారు. దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి.. గొడవలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ నేతలను, అలాగే వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఖండిస్తున్నారు. -
పల్నాడుపై పగబట్టిన బాబు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, నరసరావుపేట : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు పల్నాడుపై పగపట్టారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా వరుసగా చావు దెబ్బ తింటున్న తెలుగుదేశం ఎలాగైనా పల్నాడులో ఫ్యాక్షనిజాన్ని ఎగదోసి, వర్గ వైషమ్యాలను పెంచి పోషించడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా వరుస దాడులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు పల్నాడు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మాచర్ల నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ గెలుపొందారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2009, 2012 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారు. కాగా దుర్గాంబ కుమారుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో మాచర్లలో సైకిల్ మూలన పడింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. టీడీపీ బలోపేతమంటూ...మాచర్లలో టీడీపీని బలోపేతం చేయాలంటే పిన్నెల్లిని అడ్డు తొలగించడమే మార్గం అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు.. అందుకు అనుగుణంగా దాడుల ప్రణాళిక రచించారు. అందులో భాగంగా 2020 జనవరి ఏడో తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మంగళగిరికి సమీపంలోని కాజ టోల్ప్లాజా వద్ద టీడీపీ శ్రేణులతో భారీ ఎత్తున దాడి చేయించారు. ఎమ్మెల్యే వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. గన్మెన్ గాయాలపాలయ్యారు. అయితే ఆ రోజు ఎమ్మెల్యే బయటపడ్డారు. ఆ క్రమంలో భాగంగా రౌడీలు, గూండాలనే గుర్తింపున్న బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మందీ మార్భలాన్ని తోడిచ్చి విజయవాడ నుంచి 2020 మార్చి 11న మాచర్లకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, స్థానికులు తిరగబడి బొండా, బుద్దా బృందాలను వెంటపడి తరిమేశారు. దీంతో చంద్రబాబు.. ఫ్యాక్షనిజం, హత్యల నేపథ్యమున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మళ్లీ రంగంలోకి దింపుతూ 2021 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. 2010 మార్చి పదో తేదీన ఆత్మకూరు వద్ద ఏడుగురి హత్య కేసులో జూలకంటి ప్రథమ ముద్దాయి. చివరకు తన బాబాయి కుమారుడైన సాంబిరెడ్డి పొలాల్లో దాక్కుని ఉండగా హత్య చేయించారని అందరూ చెప్పుకుంటారు. పోలేపల్లి శివారెడ్డి హత్య కేసులోనూ జూలకంటిది ప్రధాన పాత్ర అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మాచర్ల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వరుస దాడులు, దొమ్మీలు, హత్యా ప్రయత్నాల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్నికల తర్వాత అది శ్రుతి మించింది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై విచ్చలవిడిగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోనూ టీడీపీ దాడులకు తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో అశాంతికి ప్రధాన కారణం పోలీసులేనని, ప్రధానంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కారంపూడి సీఐ నారాయణస్వామి తీరు వల్లే గొడవలు పెరిగాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగా నిప్పులు చెరగడం పల్నాడులో పరిస్థితికి అద్దం పడుతోంది. పదుల సంఖ్యలో ఊళ్లలో విధ్వంసం» మాచర్ల రూరల్ మండలంలోని కొత్తూరు, కంబంపాడు, భైరవునిపాడు, వెల్దుర్తి మండలం లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సంపేట, రెంటచింతల మండలం రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి, దుర్గి మండలం ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ దాడులు కొనసాగాయి.» దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లోని కేశానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, బ్రాహ్మణపల్లి, పెద అగ్రహారం, జానపాడు, వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం, సత్తెనపల్లి నియోజకవర్గంలోని పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుంట్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్లలోనూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు.» నరసరావుపేట టౌన్, దొండపాడు, పమిడిపాడు, పెదకూరపాడు మండలం యర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు, చిలకలూరిపేటలోని అప్పాపురం గ్రామాల్లో టీడీపీ దాడులకు తెగబడింది. అభివృద్ధిలో పోటీ పడలేకే విధ్వంసంచంద్రబాబు ఏలుబడిలో అభివృద్ధి ఊసే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి పరుగెత్తుతోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ రూపు దిద్దుకుంటోంది. వరికపూడిసెలకు మోక్షం కలిగింది. గురజాల నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తాగునీటి వసతి కలిగింది.నరసరావుపేటలో జేఎన్టీయూ కాలేజీకి శాశ్వత భవనాలు ఒనగూరాయి. రొంపిచర్ల, మాచర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. పులిచింతల ప్రాజెక్టు దిగువన మాదిపాడు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. తద్వారా అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, గుంటూరు వరకు, మరోవైపు జగ్గయ్యపేటకు రవాణా వసతి మెరుగు పడనుంది.కొండమోడు–పేరేచర్ల, సాగర్– దావుపల్లి, మాచర్ల– దాచేపల్లి, నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు చేయిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ను తమ ట్రాప్లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బదిలీల తర్వాతే హింస!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కారణాలను నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వచ్చిన వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూలతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అల్లర్లకు కారణాలను విశ్లేషించారు.అధికారుల బదిలీ తర్వాతే అల్లర్లు..సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్రెడ్డి ఈసీకి తెలిపారు. హఠాత్తుగా పోలీసు అధికారులను బదిలీ చేయడం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అల్లర్లకు దారి తీసిందని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు పల్నాడు, కారంపూడి, మాచవరం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కృష్ణా జిల్లా, నర్సీపట్నం తదితర చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ వరకు హఠాత్తుగా బదిలీలు చేయడంతో ఇదే అదునుగా అల్లర్లకు పాల్పడినట్లు వివరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ పోలీసు అధికారుల ఆకస్మిక బదిలీలే హింసకు కారణమని పేర్కొన్నట్లు తెలిసింది.కౌంటింగ్ రోజు జాగ్రత్త..రాష్ట్రంలో ఇకపై ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్లకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కల్పించాలని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, దీనిపై నిశితంగా పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ సూచించినట్లు తెలిసింది. -
పల్నాడు దాడుల వెనక పోలీసుల నిర్లక్ష్యం...
-
రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడు జిల్లాలో టీడీపీ మూకల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు బుధవారం దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలివెళ్లిపోయిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. తెలిసిన వారి ఇళ్లల్లో దూరప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగిరావాలని చూస్తున్నారు. మరోవైపు మాచర్ల, గురజాల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీడీపీ మూక స్వైరవిహారం.. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా గ్రామాలకు చేరలేదు. పోలీస్ పికెటింగ్ ఉన్నా మళ్లీ టీడీపీ మూకలు దాడులు చేస్తాయనే అభద్రతాభావంతో గ్రామానికి దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో టీడీపీ మూకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దుకాణాలను మూసివేయించారు. చివరకు కొన్నిచోట్ల మెడికల్, కూరగాయలు, పాల దుకాణాలు, టీస్టాల్స్ను కూడా తెరవలేదు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి గుమిగూడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటు వేయని వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. గ్రామానికి తిరిగిరాగానే పచ్చ మూకల దాడి.. గురజాల నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. పల్లెల్లో టీడీపీ ఫ్యాక్షన్ చిచ్చురేపుతోంది. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలింగ్ రోజునే ఆదిరెడ్డితో టీడీపీ నాయకులు వాగి్వవాదానికి దిగారు. పోలింగ్ ముగిశాక గ్రామంలో పరిస్థితి బాగోలేకపోవటంతో రెండు రోజులపాటు వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటిలో ఆయన తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం మాదినపాడు చేరుకున్న వెంటనే 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, ఇనుపరాడ్లతో ఆదిరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని ఆదిరెడ్డిని పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తలలో నరాలు తెగి రక్తప్రసరణ నిలిచిపోయిందని.. రెండు మేజర్ సర్జరీలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం.. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు కోవెలమూడి సాంబశివరావుపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. పోలింగ్ రోజు పన్నెండో బూత్లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి రాత్రి 7 గంటల వరకు ఓట్లేశారు. వీరికి సాంబశివరావు అండగా ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు. మరికొంతమందిపై కూడా దాడి చేసేందుకు కారులో వెంటపడ్డారు. అలాగే పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణç³ల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెంకయ్య, విజయేంద్రబాబుల ఇళ్లపై దాడి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గురజాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్.. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారిని ఇంటికే పరిమితం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను హౌస్ అరెస్ట్లో ఉంచారు. మరోవైపు అల్లర్లకు కారణమైన టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జిల్లావ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా నేరస్వభావం ఉన్న వారిని బైండోవర్ చేశారు. దీంతో వందలాది మంది గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు మకాం మార్చారు. -
టీడీపీ నాయకుల దాష్టీకం..
-
పచ్చ ముఠా మంటల్లో ‘పల్నాడు’
పల్నాడు, సాక్షి: పోలింగ్ రోజున చెలరేగిన హింస మూడు రోజులైనా చల్లారడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతూ.. టీడీపీ శ్రేణులు అవకాశం దొరికినప్పుడల్లా దాడులకు తెగబడుతున్నాయి. దీంతో.. మూడు రోజులుగా జిల్లా అట్టుడుకి పోతోంది.హింసను కట్టడి చేయడంలో తొలి రెండు రోజులు విఫలమైన పోలీస్ యంత్రాంగం.. ఆలస్యంగా మేల్కోంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. పల్నాడు కేంద్రంలో 800 మందితో కూడిన కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. అయినా కూడా టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ‘‘ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారా?’’.. అంటూ దాడులు చేస్తూ పల్నాట మంటల్ని రాజేస్తున్నాయి.మరోవైపు టీడీపీ నేతలను, శ్రేణుల్ని కట్టడి చేయలేని పోలీసులు.. మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలను మాత్రం హౌజ్ అరెస్ట్ చేశారు. మాచర్లలో ఇప్పటికీ షాపులుతెరచుకోలేదు. అక్కడ 2 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని అడుగడుగునా మోహరించారు. అంతటా వాహనాలను పోలీసులు జల్లెడ పుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. మాచర్లలోనే మకాం వేసిన డీఐజీ త్రిపాఠి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు
-
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
-
బస్సులో అయిదుగురు సజీవదహనం...
-
టీడీపీ రాక్షస మూకల రక్తదాహం
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు దిగారు. బుధవారం కూడా బీతావాహ వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు, తాడిపత్రి లాంటి చోట్ల తెలుగు దేశం ముఖ్య నేతలను ముందుండి.. తమ శ్రేణులను, అరాచక మూకలను రెచ్చగొడుతూ దాడులు చేయించి, బీభత్సం సృష్టించారు. ఎన్నికల్లో తమకు ఓటేయలేదన్న కక్షతో.. దొరికినవారిని దొరికినట్లుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు. ఆస్తులు ధ్వంసం చేశారు.టీడీపీ మూకలు పేట్రేగిపోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు, స్థానిక ప్రజలూ భీతావహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే... వారిని అడ్డుకోవడంలోనూ పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.పల్నాడుదాచేపల్లి మండలం మాదినపాడు లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాస్టికంకర్రలు ఇనుప రాడులతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాలు హాస్పిటల్ తరలింపుకాళ్లు చేతులు నరికేశారు!పల్నాడు మాచవరంలో టీడీపీ శ్రేణులు కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సింగరయ్య, లక్ష్మీరెడ్డి కాళ్లు చేతులు నరికేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.తాడిపత్రిలోనూ ఉద్రిక్తతలుతాడిపత్రి లో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు. జేసీ వర్గీయులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల విజ్ఞప్తి తో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు పోలీసుల ఆదేశాల మేరకు.. టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తాడిపత్రి వదిలి బయటకు వెళ్లారు. తాడిపత్రి లో 144 సెక్షన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జేసీ దౌర్జన్యాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రి ఉద్రిక్తతలకు కారణమైన జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, తాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించలని పిలుపు ఇచ్చారు. అలాగే.. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారాయన.పల్నాడులో 144పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండడం.. విమర్శలు వెల్లువెత్తడంతో అధికార యంత్రాంగం కదిలింది. పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. -
పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పల్నాడు: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరి పేట-పర్చూరు జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట ఈవూరవారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రవెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్, నాలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. గాయపడి వారిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చినగంజాం నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికలలో ఓటువేసి తిరిగి హైదరాబాదు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాద ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయటంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. బైపాస్ పనులు జరుగుతుండటం.. తారురోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవటం వల్ల టిప్పర్ వేగంగా దుసుకువచ్చింది. టిప్పర్ డ్రైవర్ వేగాన్ని కంట్రోల్ చేయకపోవటమే ప్రమాదానికి కారమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.మృతుల వివరాలు..అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా -
కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ ముగిసినా పల్నాడులోటీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్ïపీకి ఓటేశారన్న అక్కసుతో జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం నుంచి అమాయకులపై టీడీపీ రౌడీ మూకలు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. ఇళ్లపై విచక్షణారహితంగా దాడులు చేస్తుండటంతో పురుషులు గ్రామాలు వదిలి ప్రాణాలు దక్కించుకోగా, మహిళలు, పిల్లలు దేవాలయంలో తలదాచుకుంటున్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపైనా దాడులకు తెగబడుతున్నారు. చివరకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి నాయకులను గ్రామాలు దాటించాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ బాధితులను రక్షించే చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.కొత్త గణేశునిపాలెంలో యథేచ్ఛగా దాడులుమాచవరం మండలం కొత్త గణేషునిపాడు గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పెద్ద ఎత్తున టీడీపీ రౌడీలను, గూండాలను తీసుకువచ్చి దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లపై దాడులు చేశారు. మోటారు బైకులు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామాన్లు, టీవీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా బూతులు తిడుతూ, భౌతికదాడులకు పాల్పడ్డారు. భయానక పరిస్థితుల్లో పురుషులంతా పొలాల్లోకి పరుగులు పెట్టి, అర్ధరాత్రి వరకూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు గంగమ్మగుడిలో తలదాచుకున్నారని తెలిసి, దేవాలయంపైకి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. చేతులెత్తేసిన పోలీసులు...గ్రామంలో టీడీపీ చేస్తున్న దాడులపై పోలీసులకు ఫోన్ద్వారా, వీడియో సందేశాల ద్వారా బాధిత మహిళలు సమాచారం అందించినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఫోర్సు తక్కువగా ఉందన్న నెపంతో తప్పించుకున్నారని మంగళవారం ఆ గ్రామానికి వెళ్లిన మీడియాకు వారు తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్రెడ్డి మంగళవారం మ«ధ్యాహ్నం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు చూసి వారు చలించిపోయారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చిన విషయం తెలుసుకున్న వందలాది మంది టీడీపీ మూకలు వారిని చుట్టిముట్టి, వాహనాలపై రాళ్లు రువ్వారు. గ్రామం నుంచి బయటకు వెళ్లనీయకుండా రహదారిని దిగ్బంధించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మరింత రెచ్చిపోయిన టీడీపీ మూక దాడులను అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారుఓట్లు వేసి ఇంటికి వచ్చాం. అంతా బాగుంది అనుకున్నాం. ఒక్కసారిగా టీడీపీ వాళ్లు గుంపులు, గుంపులుగా వచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇంటిపైనున్న రేకులు పగులగట్టారు. ఇంట్లోని టీవీ, ప్రిడ్జ్ కూలర్, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. బూతులు తిడుతూ మగవాళ్లను బతకనీయమంటూ బెదిరించారు. మేము బెదిరిపోయి గంగమ్మ గుడిలో తలదాచుకున్నాం.– అంబటి శ్రీలక్ష్మి, బాధిత మహిళవైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నామనే...గ్రామంలో టీడీపీ బలంగా ఉండేది. 2019 ఎన్నికల నుంచి జగనన్నపై నమ్మకంతో మేము వైఎస్సార్సీపీలో యాక్టివ్గా ఉంటున్నాం. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగనన్నను గెలిపించాలని బాగా పని చేశాం. దానిని తట్టుకోలేక మా ఇంటిపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు వేశారు. బూతులు తిట్టారు. భయంతో మా వాళ్లు రాత్రంతా పొలాల్లో తలదాచుకున్నారు. చాలా భయమేçస్తోంది. – చల్లగుండ్ల కోటేశ్వరమ్మ బాధిత మహిళకనీసం స్పందించని ఎస్పీగ్రామంలో ఇంత అరాచకం జరుగుతుంటే జిల్లా ఎస్పీ బింధుమాదవ్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు, వైఎస్సార్సీపీ నాయకులు వాపోతున్నారు. ఆయన గ్రామాన్ని సందర్శించలేదు. అవసరమైన బలగాలను పంపలేదు. వారి వైఖరి ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కారంపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైందని తెలియగానే వెళ్లిన ఎస్పీ కొత్త గణేషునిపాడుకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
సాక్షి, పల్నాడు: ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణాన్ని దెబ్బ తీసేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఓటమికి ముందుగానే భయపడి.. పోలింగ్కు కొన్నిరోజుల ముందు నుంచే దాడుల పర్వానికి దిగింది. ఈ క్రమంలో మాచర్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. పోలింగ్బూత్ పరిశీలనకు పిన్నెల్లి వెళ్తున్నారనే సమాచారంతో టీడీపీ శ్రేణులు మాటు వేశాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద టీడీపీ గుండాలు దాడికి దిగారు. కర్రలు.. రాడ్లు.. మారణాయుధాలతో దాడికి దిగారు. ఈ దాడి నుంచి పిన్నెల్లి సురక్షితంగా బయటపడగా, ఆయన తనయుడు గౌతమ్రెడ్డికి గాయాలు అయ్యాయి.అయితే.. పది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తలలు పగిలాయి. అదే సమయంలో పిన్నెల్లి వాహన శ్రేణి పూర్తిగా ధ్వంసం అయ్యింది.సాక్షి టీవీతో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ..ఉదయం నుంచి పాల్వాయి గేట్ ఓటర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఆ సమాచారం అందుకుని పాల్వాయి గేటు వద్దకు మేం వెళ్ళాం. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు రౌడీలాగా ప్రవర్తిస్తూ మా నాన్నపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మేం అడ్డుకోవడంతో మమ్మల్ని విచక్షణారహితంగా కొట్టారు. మారణాయుధాలతో దాడి చేశారు. నాతోపాటు కార్యకర్తల తలలు పగిలాయి. మాపై దాడి చేసిన వారిలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మ రెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు . ఇంత జరుగుతున్నా కారంపూడి సీఐ నారాయణ స్వామి స్పందించలేదు. -
పల్నాడులో బరితెగించిన టీడీపీ నేతలు..
-
చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోవొద్దు: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారని.. అధికారంలోకి వచ్చాక మాయలు, మోసాలే ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. .. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. ముఖ్యహామీలంటూ ప్రతి ఇంటికీ పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?చంద్రబాబు విఫల హామీలుమొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. రూ.25 వేల కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?..ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నారు , చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూరుకు మించి అభివృద్ధి అన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు?.. జరిగిందా? మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? అక్కా నమ్ముతారా? అన్నా నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటున్నారు? ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా?.. ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరీ.. ఏ నెలలో అమ్మ ఒడి, చేయూత అని ఫలానా నెలలో ఫలానా ఇస్తామని చెప్పి మరీ మేలు చేశాడు. పొరపాటును చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి.. ఇంటికి జరుగుతున్న మంచిని పొగొట్టుకోవద్దు.వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్లను గెలిపించాలని సీఎం జగన్ చిలకలూరిపేట ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. సెల్ఫీతో సీఎం జగన్ సందడిచిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం ముగించుకుని కైకలూరు బయల్దేరిన సమయంలో కొందరు అభిమానులు సీఎం జగన్తో సెల్ఫీ కోరారు. తన ప్రచార రథం దిగి కిందకు వచ్చిన ఆయన.. వాళ్లతో సరదాగా సెల్ఫీ దిగారు. ఆపై అశేష జనవాహిని నడుమ సీఎం జగన్ ప్రచార రథం నెమ్మదిగా ముందుకు సాగింది. -
బాలకృష్ణ, దత్తపుత్రుడికి జిరాక్స్ కాపీలిచ్చారా?: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: లంచాలు,అవినీతి లేని పాలనతో పథకాలు కొనసాగాలన్నా, ఇంటింటి అభివృద్ధి జరగాలన్నా.. జగన్కు ఓటేయాలని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపుతో పాటు మోసపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.చిలకలూరిపేట సిద్ధమా?.. దేవుడి దయతో ఇవాళ వాతావరణం చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా, తోడుగా ఉంటున్న నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.జరగనున్నాయి ఎన్నికల సమరం. బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా?. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది గతంలో జరిగాయా?గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా నిర్వచనమిస్తూ.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్ టెక్స్ట్ బుక్లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, పౌర సేవలు. పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. గతంలో ఎప్పుడైనా జరిగిందా?, మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. మొదటిసారిగా రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్పాత్ల మీద శ్రమజీవులను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా?. ఇవాళ వాళ్లకు ఓ తోడు.. బ్రహ్మణులకు, రజకులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. ఏకంగా రూ. 25 లక్షలకు విస్తరించిన ఆరోగ్యశ్రీ. రెస్ట్ పీరియడ్లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతంగా పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతలా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్ ఐదుసార్లు షేక్ చేసినా చెల్లెమ్మా ఏం జరిగింది అని అడుగుతున్న పరిస్థితి. లంచాలు, అవినీతి లేని పాలన.. నేను చెప్పినవన్నీ కూడా గతంలో లేనివి...మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల్లో జరిగినవి.. నిజమా? కాదా? అని అడుగుతున్నాను.కుట్రలు గమనించాలిజరగబోయేది రెండు కులాల మధ్య యుద్ధం కాదు. రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు ఉన్నారు. జరుగుతున్న కుట్రలు గమనించాలి. రెండు నెలల కింద దాకా అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే వచ్చేది. అలాంటిది.. ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందో అని పెన్షన్ ఆపేసి.. ఆ అవ్వాతాతల ఉసురు తగిలించుకున్నారు.ఏ ప్రభుత్వమైన 60 నెలల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. కానీ, 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును ఆ అక్కాచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఢిల్లీతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎన్నికలయ్యాక ఇస్తారట. 14వ తేదీ ఇస్తారట. ఇది కుట్ర కాదా?. అయినా ఫర్వాలేదు. కారణం ఏంటంటే.. నాకు కావాల్సింది.. నా అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం. వాళ్ల పిల్లల చదువులు, రైతన్నల ముఖంలో సంతోషం.అలాగే.. ల్యాండ్ టైటిలింగ్యాక్ట్, రిజిస్ట్రేషన్ల మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం. ఇదే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ విశాఖలో, దత్తపుత్రుడు(పవన్ కల్యాణ్ను ఉద్దేశించి..) ఏపీలో భూములు కొన్నారు. మరి వారికి ఒరిజినల్ ఇచ్చారా?.. మరి జిరాక్స్లు ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏపీలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ, చంద్రబాబు దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో గమనించాలి అని సీఎం జగన్ కోరారు. -
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
-
ఇలాంటి సంక్షేమాన్ని గతంలో చూశారా?: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబుకి లేదని, మొన్నటి మేనిఫెస్టో చూస్తే బాబు చేయబోయే మోసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులను గమనించాలని ఏపీ ప్రజలను కోరారాయన. సోమవారం మధ్యాహ్నాం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.మాచర్ల.. సిద్ధమేనా?. ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులు, ప్రేమా ఆప్యాయతలే కనిపిస్తున్నాయి. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం కనిపిస్తోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటమే.చంద్రబాబుకి ఏరోజు మాట మీద నిలబడిన చరిత్ర లేదు. సాధ్యంకాని రీతిలో ఆయన ఇప్పుడు ఇచ్చిన హామీలు.. ఆయన చేయబోయే మోసాల్ని కళ్లకు కడుతున్నాయి. కానీ, ఈ బిడ్డ జగన్ పాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో.. 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయల్ని అక్కచెల్లెమ్మల కుటుంబాల బాగుండాలని వివిధ పథకాల రూపంలో 130 సార్లు బటన్ నొక్కాడు. మీ బిడ్డ తన పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేది చూశాం. మొట్టమొదటిసారిగా ఆ చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా చూడని విధంగా.. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు నెరవేర్చాం. 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చేశాం.ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా చూసారా?. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?, రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని.. పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని అడుగుతున్నాను. మునుపెన్నడూ చూడని విప్లవాలు.. మీ బిడ్డ పాలనలోనే జరిగాయి.మరో పక్క.. 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటైనా మంచి గుర్తుకు వస్తుందా?. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చంద్రముఖి. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో.. 2014లో ఇచ్చిన పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది.ఈ పాంప్లెట్ గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురు పెద్దల ఫొటోలతో ముఖ్యమైన హామీలంటూ ఇంటింటికీ పంపించారు. వాళ్ల ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతిలో ఊదరగొట్టించారు. 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?..రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా? పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ జరిగిందా?. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో కనీసం ఒక్క రూపాయి చంద్రబాబు వేశాడా?..ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?.అర్హులందరికీ 3 సెంట్ల స్థలం అన్నారు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నా.. ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు.. జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు.. జరిగిందా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నారు.. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు.. జరిగిందా?. నేను మీ అందరినీ అడిగేది ఒక్కటే సాక్షాత్తు చంద్రబాబు సంతకం.. 2014లో స్వయంగా మీ ఇంటికి పంపారు. ముఖ్యమంత్రిగా పాలించారు. మరి ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?.ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా? అదీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ.. మళ్లీ ఇదే చంద్రబాబు. ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట. సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఇలాంటి అబద్ధాలతో, మోసాలతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్లపైపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచాలని, ఓటేసి గెలిపించుకోవాలని సవినయంగా కోరుతున్నాను అని చెబుతూ సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. -
కట్టమూరులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. దీనిలో భాగంగా నాట్స్ తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి చొరవతో కాటూరు మెడికల్ కాలేజీ వారి సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందికి పైగా రోగులకు శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గుండె, శ్వాస కోస, ఊపిరితిత్తులు, కళ్ళు, ముక్కు, చెవి, గొంతు, ఎముకలు, కీళ్లు ఇలా 12 విభాగాలకు చెందిన వైద్యులు.. రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే లక్ష్యంతోనే తాము ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి ఈ సందర్భంగా తెలిపారు.. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షుడు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, స్థానిక ప్రముఖులు మాగలూరి భాను ప్రకాష్, బొల్లు సురేశ్, హరి కొల్లూరు, కిరణ్ కుంచనపల్లి, గ్రామ పెద్దలు శివప్రసాద్, మల్లికార్జున రావు, నరేష్, శ్రీనివాస రావు, బాబు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మందులు అందించడం అభినందనీయమని శ్రీ హరి మందాడిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రశంసించారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందిన వారు తమ కోసం శ్రీ హరి మందాడి చూపిన చొరవ, సేవాభావాన్ని కొనియాడారు.(చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!) -
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
-
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
లావుకు చుక్కలు చూపిస్తున్నారు!
చంద్రబాబు జిత్తుల గురించి తెలుసుకోకుండా టీడీపీలో చేరినందుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇపుడు చుక్కలు కనపడుతున్నాయి. అంతే కాదు కృష్ణదేవరాయాలను నమ్ముకుని టీడీపీలో చేరిన నేతలు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఉస్సూరు మంటున్నారు. టీడీపీలో చేరే ముందు కొన్ని నియోజక వర్గాల అభ్యర్ధులను మార్చేయాలని కూడా కృష్ణ దేవరాయాలు షరతు విధించారట. ఇపుడా అభ్యర్ధులంతా కృష్ణ దేవరాయలు ఎలా గెలుస్తారో తామూ చూస్తాం అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వాపును చూసి బలుపనుకున్న కృష్ణ దేవరాయలు కూడా ఇపుడు ఆత్మపరిశీలనలో పడ్డట్లు చెబుతున్నారు.2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో నరసరావుపేట ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత అయిదేళ్ల పాటు ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా నరసరావుపేట ఎంపీ స్థానం నుండి బీసీ అభ్యర్ధిని బరిలో దించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ క్రమంలో లావు కృష్ణ దేవరాయలకు గుంటూరు లోక్ సభ స్థానం ఇస్తామని చెప్పారు. అంతే వెంటనే చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లి కృష్ణ దేవరాయలు నరసరావు పేట లోక్ సభ టికెట్కు బేరం పెట్టారు.తనకు నరసరావుపేట సీటు ఇవ్వడంతో పాటు తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని.. తాను చెప్పిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను మార్చాలని షరతు పెట్టారట. తాను టీడీపీలోకి వెళ్తూ తనతో పాటు వైఎస్సార్సీపీలోని తన అనుచరులు మక్కెన మల్లికార్జున రావు,జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలో చేర్పించారు. గురజాల అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించి ఆ సీటును జంగాకృష్ణమూర్తికి ఇవ్వాలని లావు డిమాండ్ చేశారు. వినుకొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును తప్పించి ఆ సీటును తన అనుచరుడు మక్కెన మల్లికార్జునరావుకు ఇవ్వాలని షరతు పెట్టారు. అంతే కాదు జీ.వి.ఆంజనేయులును నరసరావు పేటకు బదలీ చేయాలని సలహా కూడా ఇచ్చారు.నరసరావు పేటలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టారు లావు. అంతే కాదు చిలకలూరి పేట సీటును మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావుకు ఇవ్వద్దని అన్నారట. పెదకూర పాడు సీటును కొమ్మాల పాటి శ్రీధర్ కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించారు. తాను సూచించిన విధంగా అభ్యర్ధులను,నియోజక వర్గాలను మార్చి తన అనుచరులక తాను అడిగిన సీట్లు ఇస్తేనే తాను పార్టీలో చేరతానన్నారట లావు. అన్నీ విన్న చంద్రబాబు నీకెలా కావాలంటే అలాగే చేద్దాం ముందు చేరు అన్నారు. తీరా చేరాక తాను అనుకున్న విధంగా టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. లావు అనుచరులు మక్కెన మల్లికార్జున రావు, జంగా కృష్ణమూర్తిలకు టికెట్లు దక్కలేదు.లావు మార్చమన్న పత్తిపాటి, చదలవాడ అరవింద్,జి.వి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్లకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇపుడు లావు కృష్ణదేవరాయలు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థానాలకే ఎసరు పెట్టాలనుకున్న లావును ఓడించి తీరాలని పత్తిపాటి, చదలవాడ, యరపతినేని, జి.వి.ఆంజనేయులు, కొమ్మాల పాటి శ్రీధర్ శపథాలు చేస్తున్నారు. యరపతినేని అయితే బాహాటంగానే లావు ఎలా గెలుస్తాడో నేనూ చూస్తాను అని సవాల్ చేశారట.ఈ నియోజక వర్గాల్లో లావు ఎన్నికల ప్రచారం చేసినా ఈ నేతలెవరూ ఆయనకు సహకరించడానికి సిద్దంగా లేరు. ఈ ఎన్నికల్లో తమ తమ నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయించి అయినా లావును ఓడిస్తామని వీరు అంటున్నారట. చదలవాడకు టికెట్ ఇవ్వద్దని అనడంతో బీసీ సంఘాల నేతలంతా లావుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. మొత్తం మీద వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి అనవసరంగా టీడీపీలోకి వచ్చానని లావు ఇపుడు తన సన్నిహిత వర్గాలతో అంటున్నారట. తాను చెడ్డమే కాకుండా తన అనుచరులు మక్కెన, జంగా కృష్ణమూర్తిల భవిష్యత్తు కూడా నాశనం చేశారని లావుపై జంగా వర్గీయులు మండి పడుతున్నారని సమాచారం. బహుశా ఈ పరిణామాలన్ని చూసేనేమో.. ఆయన ఏపీలో టీడీపీ గెలుపు కష్టమేనంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. -
మంగళగిరిలో సీఎం జగన్ బస్సుయాత్రకు జననీరాజనం (ఫొటోలు)
-
మేమంతా జగన్ వెంటే.. YSRCPలోకి భారీ చేరికలు (ఫొటోలు)
-
మేమంతా సిద్ధం: ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర
Memantha Siddham Bus Yatra Live Updates.. సీఎం జగన్పై రాయితో దాడి వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లికి బయల్దేరారు. సీఎం జగన్తో పాటుగా వైఎస్ భారతీ ఉన్నారు. గాయం కారణంగా సీఎం వైయస్ జగన్ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి సీఎం జగన్ పై క్యాట్ బాల్తో దాడి చేసినట్లు అనుమానం రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం వెంటనే సీఎం జగన్కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్ విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా.. అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో సీఎం జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే.. టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు పైపుల రోడ్ చేరుకునన్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర పైపుల రోడ్ సెంటర్లో సీఎం జగన్ ఘన స్వాగతం విజయవాడలో జన ప్రభంజనం కాసేపట్లో పైపుల రోడ్ చేరుకోనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర సీఎం జగన్కు అడుగడుగునా జన నీరాజనం దారిపొడవునా సీఎం జగన్కు అపూర్వ స్వాగతం గజ మాలలు, హారతలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం బీఆర్టీఎస్ రోడ్ చేరుకున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర విజయవాడ: బీఆర్టీఎస్ ఫుడ్ కోర్ట్ జంక్షన్ దాటిన సీఎం జగన్ బస్సుయాత్ర అడుగడుగునా జననీరాజనం పట్టిన ప్రజలు భారీ గజమానులతో సీఎం జగన్కు స్వాగతం విజయవాడ: ఘంటసాల కళాశాల ఫుడ్ జంక్షన్ వద్ద భారీ స్వాగత ఏర్పాట్లు సీఎం జగన్కు నీరాజనాలు పలుకుతున్న బెజవాడ ప్రజలు క్రేన్లతో గజమాలలతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న అభిమానులు విజయవాడ: శిఖామణి సెంటర్లో భారీ గజమాలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసిన తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్ధి దేవినేని అవినాష్ సీఎంకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు రోడ్డుకి ఇరువైపులా కిక్కిరిసిన అభిమానులు సీఎం జగన్ బస్సుయాత్రకు నేను సిద్ధం అంటున్న సతీమణి వైఎస్ భారతి తాడేపల్లి జంక్షన్లో సీఎం జగన్ బస్సుయాత్రకు శ్రీమతి వైఎస్ భారతి సంఘీభావం ప్రజలతో కలిసి స్వాగతం పలికిన శ్రీమతి వైఎస్ భారతి బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి అభివాదం చేసిన శ్రీమతి వైఎస్ భారతి బస్సులో నుంచి ప్రతి అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనుకదుర్గ వారధిపై బస్సుయాత్ర వెంట లక్షలాదిగా తరలివెళ్లిన జనం వన్స్మోర్ సిఎం జగన్ అని నినదిస్తున్న ప్రజలు కనకదుర్గమ్మ వారధిగా మీదుగా విజయవాడ సిటీలోకి ఎంట్రీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సుయాత్ర కనకదుర్గ వారధి చేరుకున్న బస్సుయాత్ర కాసేపట్లో శిఖామణి సెంటర్కు చేరుకోనున్న బస్సుయాత్ర సీఎం జగన్కు అడుగడుగునా జన నీరాజనం ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సుయాత్ర కపకదుర్గ వారధిపై అరుదైన ఘట్టం ఆవిష్కృతం సీఎం జగన్ ఘనంగా స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు మంగళగిరిలో చేనేతలు ఎక్కువ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చాం మరోవైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు కుప్పంలోనూ బీసీలు ఎక్కువగా ఉన్నా అక్కడ కూడా ఇదే పరిస్థితి తేడా గమనించమని కోరుతున్నాను మంగళగిరిలో చేనేతలు ఎక్కువ. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చాం. మరోవైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలోనూ బీసీలు… pic.twitter.com/kB1XDL6mOQ — YS Jagan Mohan Reddy (@ysjagan) April 13, 2024 కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాలోకి మేమంతా సిద్ధం యాత్ర మంగళగిరిలో చేనేత కార్మికులతో ముగిసిన సీఎం జగన్ ముఖాముఖి కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ బస్సు యాత్ర లబ్ధిదారులతో సీఎం జగన్ రూ.10 లక్షల ఆసక్తి పేద మహిళల చేతుల్లో పెట్టాలి అనుకున్నా 54 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాం చంద్రబాబు, ఆయన కొడుకు అడ్డుపడ్డారు చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉంది ఓట్ల కోసం వాళ్లు వస్తే గట్టిగా నిలదీయండి చేనేత కార్మికులతో సీఎం జగన్ ఏమన్నారంటే.. 58 నెలల మన పాలనను మీరు చూశారు గత చంద్రబాబు పాలనను మీరు చూశారు నాయకుడి ఎన్నికలో పొరపాటు చేస్తే .. మనం చేసేదీ ఏమీ ఉండదు మనం తీసుకునే నిర్ణయం సరైంది అయితే, మన అడుగులు ముందుకు పడతాయి చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు మన ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు ఇవ్వరు 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం ఎనిమిది మంది మున్సిపల్ చైర్మన్లు చేనేతలకు ఇచ్చాం 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు నామినేటెడ్ పదవుల్లోనూ చేనేత వర్గానికి ప్రాధాన్యతనిచ్చాం చేనేత వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వారికి అండగా నిలిచాం మంగళగిరి నియోజకవర్గంలో 90.1 శాతం లబ్ధి జరిగింది అక్కా చెల్లెమ్మలకు రూ.1530 కోట్ల లబ్ధి నాన్ డీబీటీ ద్వారా రూ.735 కోట్ల లబ్ధి టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా చేనేత కార్మికులతో సీఎం జగన్ ఏమన్నారంటే.. నేతన్నల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు చంద్రబాబు చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారు అప్కోకు కూడా చంద్రబాబు బకాయిలు పడ్డారు రెండు ఎమ్మెల్సీలు చేనేత వర్గానికే ఇచ్చాం మన ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చాం మంగళగిరిలో చేనేతలు ఎక్కువగా ఉన్నారని ఆర్కేతో మాట్లాడి ఒప్పించి ఇక్కడ సీటు చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళకు(లావణ్య) ఇచ్చాం బీసీలు ఎక్కువగా ఉన్న చంద్రబాబు సీటు ఇవ్వరు మంగళగిరిలో తన కొడుకు నారా లోకేష్కు ఇచ్చారు గతంలో ఎన్నడూ లేనంతగా.. మన ప్రభుత్వంలో నేతన్నల కోసం 3 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశాం మన సంక్షేమ పాలనలో 1.06 లక్షల మందికి లబ్ధి చేకూరింది 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు ఇంటికి కేజీ బంగారం, బెంజీ కారు ఇస్తామని మోసం చేస్తారు ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు మరోసారి రంగు రంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?.. పక్కా ఇంటిని కట్టించి ఇచ్చారా? గతంలో 98 శాతం హామీలను చంద్రబాబు ఎగ్గొట్టారు ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమ చేస్తున్నాం వివక్ష లేకుండా, పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నాం అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ మేలు చేస్తున్నాం గతంలో పథకాలు అందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి మన ప్రభుత్వంలో పెన్షన్ రూ.3 వేలు అందిస్తున్నాం నేను 14 ఏళ్లుగా సీఎం చేశానని చంద్రబాబు చెప్పుకుంటారు నేను ఆయనన్ని సార్లు సీఎంగా పని చేయకున్నా.. ఆయనంత నెగిటివిటీ అనుభవం మాత్రం లేదు మన బతుకుల్ని మార్చే నాయకుడినే ఎన్నుకోవాలి.. అలాంటి నాయకుడే సీఎం స్థానంలో ఉండాలి గత పాలకులకు, ఇప్పటి పాలనకు తేడా చూస్తున్నారు.. ఆ తేడాలు గమనించండి ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మోసపోతాం చేనేతల కోసం నాడు వైఎస్సార్, నేడు వైఎస్ జగన్: మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ చేనేత పరిశ్రమ, కార్మికుల పరిస్థితులు, ఇబ్బందులు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. మనం సీఎం వైఎస్ జగన్ రాష్ట్రం అంతా ప్రయాణిస్తూ వివిధ వర్గాలను కలుస్తూ వాళ్ల సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నారు. ఇవాళ చేనేతల కోసం నేడు ఇక్కడ మనకు అవకాశం కల్పించడం ముఖ్యమంత్రిగారు తీసుకున్న గొప్ప నిర్ణయం. చేనేతలుగా మంగళగిరిలో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మంగళగిరిలో తయారైన బట్ట మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశం నలుమూలల నుంచి మన మంగళగిరి వస్త్రాల కోసం వస్తున్నారు. దీనికి కారణం అప్పటి పెద్దలు స్టాండర్డ్ గా తయారు చేసిన రంగులు, నూలు, డిజైన్లు అని చెప్పుకోవాలి. మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వైఎస్సార్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా రోశయ్య గారిని, నన్ను పిలిచి చేనేత పరిశ్రమ పరిస్థితులు ఏంటి అని అడిగారు. 65 ఏళ్లకు పెన్షన్లు ఇస్తున్నారు, చేనేతలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వాలని కోరాను. అదెలా సాధ్యం అని ఆయన అడిగారు. రంగులు, రసాయనాల వల్ల మామూలు వ్యక్తుల కంటే చేనేత కార్మికులకు 50 ఏళ్లకే త్వరగా వృద్ధాప్యం వస్తుందని చెప్పాము. అది విని వెంటనే ఆయన అందుకు అంగీకరించారు. అలాగే చేనేతల కోసం మేము ఇచ్చిన 17 డిమాండ్లు కూడా నెరవేర్చారు. చేనేతల క్రిఫ్ట్ ఫండ్ ను రెట్టింపు చేసిన వ్యక్తి కూడా వైఎస్సారే. అప్పట్లో 8% చేనేతలు దాచుకుంటే మరో 8% ప్రభుత్వం ఇచ్చేది. దాన్ని 16%కి పెంచారు వైఎస్సార్. అంతకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రిబేట్ను తీసేసింది. దాన్ని వైఎస్సార్ పునరుద్ధరించారు. డైస్ అండ్ కెమికల్స్ మీద సబ్సిడీని కూడా ఇచ్చారు. 100 కోట్లు ఆప్కోకి రిలీజ్ చేస్తున్నామని చెప్పి సాంక్షన్ కూడా చేసారు. దానివల్లే నేటికీ చేనేత పరిశ్రమ నిలబడింది. మంగళగిరిలో ఇళ్లులేని చేనేత కార్మికుల కోసం APIIC నుండి 25 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇప్పుడు అక్కడ 3వేల కుటుంబాలు నివసిస్తున్నారు. నేడు వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో 150 మంది మగ్గాలకు షెడ్లు కూడా వేసాం. నవరత్నాల్లో అన్ని పథకాలకంటే ఎక్కువగా, చేనేతలకు ఇచ్చే పథకంలో మాత్రమే 24వేలు అందిస్తున్నారు. చేనేత కార్మికుల జీవితాలను బాగుచేసింది నాడు రాజశేఖర్ రెడ్డిగారు, నేడు జగన్ మోహన్ రెడ్డిగారు. వీరిద్దరే మనల్ని ఆదరిస్తున్నారని మనం మర్చిపోకూడదు. ఇవాళ ఆప్కోకి రూ.100 కోట్లు రిలీజ్ చేసారు. మంగళగిరిలో మార్కెటింగ్ సౌకర్యం కోసం రూ.3కోట్లతో 40 షాపుల నిర్మాణం చేయించారు. ఆ నాడు తండ్రి నేడు కుమారుడు చేనేత కార్మికులకు మేలు చేసారు. ఎన్నో ఏళ్లలో మనలను గుర్తించిన నాయకులు లేరు. ఇవాళ అసెంబ్లీలో చేనేతల నుంచి ప్రాతినిధ్యం లేదు అని ఇక్కడ ఉన్న రామకృష్ణారెడ్డిగారిని ఆపి మరీ మన చేనేత మహిళలకు టికెట్టు ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలందరి ప్రతినిధిగా లావణ్యకు ఆయన అవకాశం కల్పించారు. ఆమెను గొప్ప మెజారిటీతో గెలిపించుకుని మనబాధ్యత నెరవేర్చాలి. జగన్ గారి పరిపాలన మనకి కావాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రాజ్యాధికారం కల్పించిన చరిత్ర మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ లేదు. ధైర్యసాహసాలతో అనేక ప్రాంతాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చి, మనలను గెలిపించే పరిస్థితికి తీసుకువచ్చింది సీఎం వైఎస్ జగన్ మాత్రమే. నేటి పాలన ఎంతో ప్రత్యేకమైనది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనారటీలకు ఓసీలతో సమానంగా, ఓసీలకంటే అధికంగా మున్సిపాలిటీలు, పంచాయితీలు, కార్పొరేషన్లలలో ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేవు. ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం. మన ముఖ్యమంత్రిగారిని మళ్లీ గెలిపిస్తే మన జీవితాల్లో పేదరికాన్ని నిర్మూలించి, రాజకీయంగా మనకు మరింత ప్రాధాన్యత కల్పిస్తారు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సీఎం జగన్తో ముఖాముఖి.. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి ప్రసంగం ఒక చేనేత బిడ్డను, ఒక సాధారణమైన కుటుంబం, మధ్యతరగతి కంటే దిగువన ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక సోదరిని తన ప్రభుత్వంలో పద్మశాలి కార్పొరేషన్ కు ఛైర్మన్ గా చేయడమే కాకుండా ఈరోజు చేనేత విభాగానికి సంబంధించిన ఈ మీటింగ్ ను నిర్వహించమని చెప్పినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు. పార్టీ స్థాపించినరోజు నుండి జగనన్నతోనే నా ప్రయాణం సాగుతోంది. అయినా ఎప్పుడూ కూడా నా పర్సనల్ విషయాలు అన్నకు చెప్పుకోలేదు. అయినా కూడా నాకు కాళ్లు బాగాలేవన్న విషయం ఆయన తెలుసుకుని నేను ఎప్పుడు కనిపించినా నీకు కాళ్లు బాగాలేవు జాగ్రత్తగా ఉండు తల్లీ అంటారు జగనన్న. తనను నమ్ముకున్న వారికోసం ఏవిధంగా ఆలోచిస్తారో గుర్తించుకోవాలి సోదరుల్లారా, సోదరీమణుల్లారా. చేనేత వృత్తిని ఏ ప్రభుత్వమూ, ఏ నాయకుడూ గుర్తించింది లేదు. ఎందుకంటే ఏ నాయకుడికి మన మీద అవగాహన లేదు, మనస్సు లేదు. కానీ దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు 50 ఏళ్లకే పెన్షన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆప్కోస్ ద్వారా ఎన్నో సబ్సిడీలు తీసుకొచ్చారు. మన సీఎం జగనన్న ఎక్కడా లేనివిధంగా చేనేతలకు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలను పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. నవరత్నాల సంక్షేమాల్లో అగ్రభాగం అందుకుంటున్నది మన చేనేతలే. సుదీర్ఘ పాదయాత్రలో చేనేతల కష్టాలను కళ్లారా చూశారు, సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో చేనేతలను నట్టేట్లో ముంచితే ఆప్కోను బయటికి తీసుకొచ్చి రూ.180 కోట్లను అందించారు. కరోనా కష్టకాలంలో రెండుసార్లు రూ.24 వేలు ఇవ్వడం జరిగింది. కాబట్టి జగనన్న లాంటి నాయకుడు మనకు ఉండటం ఎంత అవసరమో ఆలోచన చేయాలి. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా జగనన్న నిలబెట్టిన పద్మశాలి సోదరి లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ► చంద్రబాబు నేతలన్నను పట్టించుకోలేదు: చేనేత కార్మికులు చంద్రబాబు హయాంలో చేనేత రంగాన్ని పట్టించుకోలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీఎం జగన్ చేనేత రంగాన్ని ఆదుకున్నారు. ఆప్కోను ఆదుకున్న మనసున్న నేత సీఎం జగన్. ►సీఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాల లబ్ధిని పంచుకుంటున్న చేనేత కార్మికులు. ►చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్. ► చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం జగన్ తాము అందుకున్న లబ్ధిని పంచుకుంటున్న చేనేత కార్మికులు ►మంగళగిరిలో సీకే కన్వెషన్ సెంటర్కి చేరుకున్న సీఎం జగన్ ►మరికాసేపట్లో చేనేత కార్మికులతో ముఖాముఖి. ►మంగళగిరి బైపాస్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర ►మంగళగిరి బైపాప్ దగ్గర బైక్ ర్యాలీతో సీఎం జగన్కు ఘన స్వాగతం. ►జైత్రయాత్రలా కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర ► కాజా టోల్గేట్ వద్ద సీఎం జగన్కు గజమాలతో స్వాగతం పలికిన స్థానికులు. ► 14వ రోజు ప్రారంభమైన యాత్ర నంబూరు బైపాస్ బస కేంద్రం నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర 14వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగనున్న మేమంతా సిద్ధం యాత్ర కాసేపట్లో సీకే కన్వెన్షన్ హాల్లో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి ► కాసేపట్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. Memantha Siddham Yatra, Day -14. ఉదయం 9 గంటలకు నంబూరు బైపాస్ దగ్గర నుంచి ప్రారంభం ఉదయం 11 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత సోదరులతో ముఖాముఖి విజయవాడ సిటీలో రోడ్ షో కేసరపల్లి దగ్గర రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/qDIlqygeoY — YSR Congress Party (@YSRCParty) April 13, 2024 ►వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ నేడు ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగనుంది. Day-14 ఎన్టీఆర్ జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 13, 2024 ►ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ శుక్రవారం రాత్రి బస చేసిన నంబూరు బైపాస్ నుంచి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతారు. ►కాగా, మంగళగిరి బైపాస్ మీదుగా 11 గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత విజయవాడలో వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్సింగ్ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
12వ రోజు కొనసాగుతోన్న "మేమంతా సిద్ధం" బస్సుయాత్ర
-
YSRCP పల్నాడు జిల్లా బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే!
పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
వైఎస్ఆర్ సీపీ కార్యాలయం తగలబెట్టిన దుండగులు
-
టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత
-
జింకల కొమ్ములు, చర్మం తరలిస్తున్న ముఠా అరెస్ట్
-
పల్నాడు వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది: ఎమ్మెల్యే కాసు
-
నర్సరావుపేట ఎంపీగా అనిల్ యాదవ్ ను గెలిపించుకుందాం: అంబటి రాంబాబు
-
‘జగనన్న సామాజిక న్యాయం మొదలైంది ఇక్కడి నుంచే’
సాక్షి, పల్నాడు: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత నియోజకవర్గంలో భావోద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని ప్రసంగించారామె. సోమవారం చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఆపై నిర్వహించిన సభలో మంత్రి విడుదల పాల్గొని మాట్లాడారు. ఒక బీసీ మహిళలైన తనకు చిలకలూరిపేట సీటు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి తమ ప్రభుత్వంలో చిలకలూరిపేటలో జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిపించాలి మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆమె సభకు హాజరైన ప్రజలకు పిలుపు ఇచ్చారామె. కానుక అందిద్దాం.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలు మరే ఇతర ముఖ్యమంత్రి అమలు చేయలేదని చిలకలూరిపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీని గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి కానుక అందిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. దేశంలోనే 30 లక్షల మందికిపైగా నిరుపేదలకు ఇల్లపట్టాలు పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. చదవండి: వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
సమానత్వానికి ప్రతీక చాపకూడు
భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ‘సమతా సమానతా వాదం’ పల్నాటి వీరుల మస్తిష్కంలో మనకు గోచరిస్తుంది. అప్పటి వరకు ఉన్న కుల నిచ్చెన మెట్లను ధ్వంసం చేసి సమతాస్మృతి నిర్మాణం జరిగేట్లు పల్నాటి వీరులు కృషిచేశారు. కాబట్టే వెయ్యేండ్ల క్రితం ఆ వీరులు నేలకొరిగిన ‘కార్యమపూడి’ (కారెంపూడి) రణక్షేత్రంలో నేటికీ వారిని స్మరించుకుంటూ, వారి ఆయుధాలను పూజించుకుంటూ, సమతావాదం కోసం పల్నాటి ఆచారవంతులు కృషి చేస్తున్నారు. భారత దేశ చరిత్రలో అంటరానితనం నిర్మూలనకు వెయ్యేండ్ల క్రితమే పల్నాడులో బ్రహ్మనాయుడు కృషి చేశాడు. దళితులకు ఆలయ ప్రవేశం గావించాడు. ‘చాపకూడు సిద్ధాంతా’న్ని అమలు చేశాడు. రాజ్యాధికారంలో అన్ని కులాల వారికీ... అంటే శూద్రులకూ, రేచర్ల మాలలకూ సమ ప్రాధాన్యం ఇచ్చాడు. మొదటగా రేచర్ల మాలలకు రాజ్య సర్వసైన్యాధ్యక్ష పదవిని ఇచ్చింది పల్నాటి రాజ్యమే! పల్నాడు ప్రాంతంలో 1182వ సంవత్సరంలో జరిగిన యుద్ధం ‘పల్నాటి యుద్ధం’గా చరిత్రలో నిలిచింది. మహాభారతానికీ, పల్నాటి వీర చరిత్రకూ దగ్గరి పోలికలు ఉండటం చేత పల్నాటి చరిత్రను ‘ఆంధ్ర భారతం’ అని కూడా అంటారు. పల్నాటి చరిత్రలో నలగామరాజు, నరసింగ రాజు, మలిదేవరాజులు మువ్వురూ వేర్వేరు తల్లుల బిడ్డలు. వీరి తండ్రి అనుగురాజు. వీరి మధ్య కోడిపందాల మూలంగానూ, రాజకీయ కుట్ర మూలంగానూ ద్వేషాలు రగిలి యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం కూడా రాజ్యభాగం కోసమే జరిగింది. బాలచంద్రుని మరణానికీ మహాభారతంలో అభిమన్యుని మరణానికీ మధ్య సారూప్యం ఉంది. పల్నాటి యుద్ధంలో వాడిన ఆయుధాలను ప్రతి సంవత్సరం కార్తీకమాసం చివరి అమావాస్య రోజున నాగులేటిలో స్నానమాచరింప చేసి వీరారాధన ఉత్స వాలను ప్రారంభించటం ఆనవాయితీ. మార్గశిర మాసంలోని మొదటి రోజు నుంచి పంచమిరోజు వరకు 5 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మనాయుని ఆజ్ఞను పాటిస్తూ... పల్నాటి ‘వీరాచార పీఠం’ ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తోంది. మొదటి రోజు ‘రాచగావు’, రెండవ రోజు ‘రాయబారం’ మూడవ రోజు ‘మందపోటు’ (చాపకూడు), నాల్గవ రోజు ‘కోడి పోరు’, ఐదవ రోజు ‘కల్లిపాడు’ కార్యక్రమాలతో వీరా రాధన ఉత్సవాలుగా జరుపుతూ ఉన్నారు. ఈ ఉత్స వాల్లో ‘వీరవిద్యావంతులు’ ఆలపించే కథలు భావి తరాలకు ముందస్తు హెచ్చరికలు! తగిన జాగ్రత్తలు! మనో వికాస విజ్ఞానిక విపంచులు! ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పల్నాటి ఆచారవంతులంతా కారెంపూడిలో జరిగే ఈ వేడుకలకు కుటుంబ సమేతంగా వేలాదిగా హాజరవుతూ ఉంటారు. సమతా ధర్మం పాటించే వారికి ఇష్టమైన ప్రీతికరమైన దేవుడు చెన్న కేశవుడు. బ్రహ్మ నాయుడు వాడిన ‘నృసింహకుంతం’ రూపంలో చెన్న కేశవుని భక్తులు పూజిస్తారు. చాలా ఊళ్లలో ఈ రూపంలో పూజలందు కుంటున్న ఈ దైవాలు (నృసింహ కుంతాలు) ప్రతి కార్తీక చివరి అమావాస్య రోజున కార్యమ పూడిలోని నాగులేటి ఒడ్డున స్నాన మాచరించి భక్తులకు దర్శనమిస్తాయి. ఈ 5 రోజుల పల్నాటి వీరారాధన ఉత్సవాలలో ముచ్చటగా మూడవరోజు జరిపే ‘చాపకూడు’ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో అధికారికంగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. సమతా భావం మరింతగా వెల్లివిరియడానికి ఇది అవసరం. – ధర్నాశి చిరంజీవి ‘ 70950 91228 (రేపటి నుంచి 16వ తేదీ వరకు కారెంపూడిలో ‘పల్నాటి వీరారాధన’ ఉత్సవాలు) -
నాగార్జున సాగర్ దగ్గర టెన్షన్.. టెన్షన్.. మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలు
సాక్షి, పల్నాడు జిల్లా: నాగార్జునసాగర్ డ్యాంపైన యథాస్థితి కొనసాగుతోంది. 14వ గేట్ నుంచి 26 గేట్ వరకు ప్రాజెక్టుపై ఆంధ్ర భూభాగంపై ఏపీ పోలీసుల పహారా కాస్తున్నారు.1వ గేటు నుంచి 13వ గేటు వరకు ప్రాజెక్టు తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉంది. ఇరువైపులా భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించారు. కేంద్ర బలగాలు నాగార్జున సాగర్కు చేరుకున్నాయి. ఇంకా ఇరు రాష్ట్రాల పోలీసుల బలగాల ఆధీనంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉంది. మరి కొద్ది సేపట్లో నాగార్జునసాగర్ డ్యాం పైకి సీఆర్పిఎఫ్ బలగాలు వచ్చే అవకాశం ఉంది. -
సొంత మామకే వెన్నుపోటు..చంద్రబాబును నమ్మగలమా ?
-
ప్రజలతోనే మా పొత్తు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వచ్చే ఎన్నికల్లో తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని, పేద ప్రజల కోసమే తమ పార్టీ ఉందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నెరవేర్చిన హామీలు, ప్రజలే తన ధైర్యం, నమ్మకం అని స్పష్టం చేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని పునరుద్ఘాటించారు. వైఎస్సార్కు, వైఎస్ జగన్కు తెలిసిందల్లా ప్రజల్లో నడవడం, ప్రజల గుండెల్లో ఉండటమేనన్నారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం కింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన అటవీ, పర్యావరణ అనుమతులు సాధించి బుధవారం ఆయన మాచర్లలో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ.. సాగు, తాగునీటి ఎద్దడి దశాబ్దాలుగా మన కళ్లెదుటనే కనిపిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందలేదన్న మాదిరిగా.. సముద్రంలో ప్రయాణిస్తున్న వారికి గుక్కెడు మంచి నీరు దొరకలేదన్న చందంగా ఇన్ని దశాబ్దాల పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి నది నీరు దక్కలేదని చెప్పారు. ఈ పరిస్థితిలో పల్నాటి ప్రాంత రూపురేఖలు మార్చేలా ఈ రోజు రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ నీరు అందిస్తామని గర్వంగా చెబుతున్నానన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సభా ప్రాంగణం నిండిపోవడంతో బయటే భారీగా నిలిచిపోయిన జనం గతంలో టెంకాయ కొట్టి మోసం ► 2019 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా, ఏ మాత్రం భూమి సేకరించకుండానే అందరిని మోసం చేసేందుకు ఇదే పథకానికి ఎన్నికలకు కేవలం నెల ముందు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని నమ్మించే ప్రయత్నం చేసి నిస్సిగ్గుగా మోసం చేశారు. ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6వ తేదీన అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. అభయారణ్యం కావడం వల్ల నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి కూడా ఈ ఏదాది మే నెలలో అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే సేకరించాం. అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తున్నాం. ► ఈ లిఫ్ట్ను నాలుగు పంపులతో నాగార్జునసాగర్కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తున్నాం. వరిక పూడిశెల వాగు నుంచి రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున మొదటి దశ కింద 1.57 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లిఫ్ట్ ద్వారా 20 వేల మంది జనాభాకు తాగు నీరందించవచ్చు. దాదాపు రూ.340 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతానికి నీటిని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. సభా ప్రాంగణం నిండిపోవడంతో బయటే భారీగా నిలిచిపోయిన జనం పౌరుషాల గడ్డ నుంచి అభివృద్ధి గడ్డగా.. ► పల్నాడు ప్రాంతాన్ని, ఈ పౌరుషాల గడ్డను, అభివృద్ధి గడ్డగా మార్చడానికి గత 53 నెలలుగా అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని కూడా తీసుకొచ్చాం. పల్నాడు గుండె చప్పుడు విన్న మనిషిగా ఈ ప్రాజెక్టు ఎంత అవసరమో నాకు తెలుసు. ఈ ప్రాజెక్టును దశల వారీగా మాచర్ల నియోజకవర్గం, తర్వాత వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, ఆ తర్వాత ఎరగ్రొండపాలెం వరకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. తద్వారా 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరు, దాదాపు లక్ష మందికి తాగు నీరు అందించవచ్చు. ► ఏ కార్యక్రమం చేసినా అందులో చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాలి. ప్రజలను, రైతులను, అక్కచెల్లెమ్మలను, చదవుకుంటున్న పిల్లలను మోసం చేయాలనే ఆలోచనతో అడుగులు వేస్తే ఏం జరుగుతుందనేది 2019లోనే ప్రజలు గట్టిగా చెప్పారు. 175 నియోజకవర్గాలకు గానూ చంద్రబాబు నాయుడిని కేవలం 23 స్థానాలకే పరిమితం చేస్తూ తీర్పునిచ్చారు. ► రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ప్రధానంగా పేద వర్గాలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, నా నిరుపేద వర్గాలందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా సాధికారతను ఇవ్వడానికి 53 నెలలుగా మనందరి ప్రభుత్వం ప్రతి నిమిషం, ప్రతి రూపాయి ఖర్చు చేసింది. మీ బిడ్డ బటన్ నొక్కడం ద్వారా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా రూ.2.40 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యింది. నాన్డీబీటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు, సంపూర్ణ పోషణ లాంటి కార్యక్రమాల ద్వారా మరో రూ.1.70 లక్షల కోట్లు.. వెరసి మొత్తం రూ.4.10 లక్షల కోట్ల పైచిలుకు మేర ప్రజలకు లబ్ధి కలిగించింది. కోవిడ్ అతలాకుతలం చేసినప్పటికీ.. ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గినా సంక్షేమాభివృద్ధి మాత్రం ఆగలేదు. ► మీ బిడ్డ 53 నెలల పాలనలో పల్నాడు జిల్లా అయింది. పల్నాడుకు రెవెన్యూ డివిజన్ వచ్చింది. జిల్లాకో మెడికల్ కాలేజీ, గ్రామ గ్రామాన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటా జల్లెడ పట్టి వైద్యం అందించే ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతోంది. ఇంగ్లిష్ మీడియం బడులొచ్చాయి. సభలో థ్యాంక్యూ జగనన్న అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మహిళలు మోసాల మాటలు నమ్మగలమా? ► గత చంద్రబాబు పాలనలో మనం మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాల చరిత్ర చూశాం. ఈ పెద్దమనిషి 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ కనీసం ఒక మంచి పని చేశానని చెప్పి ఓటు అడగలేడు. అందుకే మళ్లీ మోసం చేసేందుకు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడడు. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారిస్తాను.. ఓటు వేయండి అని చంద్రబాబు అడుగుతాడు. 34 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా కుప్పం నియోజకవర్గానికి నీరిచ్చిన చరిత్ర లేదు. ఇలాంటి వ్యక్తి మన మాచర్లకు, పల్నాడుకు మరో ప్రాంతానికి నీరు ఇస్తానని చెబితే నమ్మగలమా? కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానని ఒకడు అన్నాడట. ఈ పెద్దమనిషిని చూస్తుంటే ఆ మాటలు గుర్తుకొస్తాయి. చివరికి కుప్పానికి నీళ్లు కావాలన్నా.. కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలన్నా చేసేది మీ బిడ్డే. ► పొదుపు సంఘాల రుణాల్ని మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. దీంతో ఏ గ్రేడ్, బీ గ్రేడ్లో ఉన్న సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. చివరకు నా అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశాడు. ఒక జగనన్న అమ్మ ఒడి గానీ, వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ గానీ, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కానీ ఏనాడైనా చేయగలిగాడా? ఇప్పుడు చేస్తానంటే నమ్మగలమా? పల్నాడు జిల్లా మాచర్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు ► ఒకాయన ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటాడట. లేస్తే మనిషిని కాదంటాడట. కానీ మంచంలోంచి లేవడు. చంద్రబాబు పరిస్థితీ ఇంతే. తాను చేసిన మంచి ఏమిటనేది ఎప్పుడూ చెప్ప డు. ఆయన 2000లో ఉంటే 2047 గురించి చెబుతాడు. ఇప్పుడేం చేస్తావంటే చెప్పడు. 50 ఏళ్ల విజన్ అంటాడు. 50 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోందని చెబుతాడట. 50 ఏళ్ల తర్వాత ఎవడుంటాడో..ఎవడు పోతాడో? ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టడం ఈజీ కదా అని ఆలో చిస్తాడు. ఇలాంటి బాబు మాటలు నమ్మగలమా? వెన్ను పోటు వీరుడు ► సొంత కూతురును ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, రాష్ట్రంలోని కోటీ 50 లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానని అహంకారంతో మాట్లాడాడు. ముస్లింలకు, ఎస్టీలకు కనీసం మంత్రి పదవి ఇవ్వని ఈ పెద్దమనిషి.. సమాజంలో ఏ వర్గానికైనా ఏనాడైనా న్యాయం చేశాడా? ఇలాంటి ఆయన నేను మారాను అంటే మనం నమ్మగలమా? ► తన కొడుకు, మనవడు.. వీళ్లు వెళ్లే బడులు మాత్రం ఇంగ్లిష్ మీడియం. ఆ కొడుక్కు తెలుగు మా ట్లాడటమూ సరిగా రాదు. పోనీ ఇంగ్లిష్ వస్తుందా అంటే అదీ రాదు. అది వేరే విషయం. మన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మన నిరుపేద వర్గాల పిల్లలు వెళ్లే మన ప్రభుత్వ బడులు మాత్రం ఇంగ్లిష్ మీడియంకు మారకూడదట. అవి తెలుగు మీడియంలోనే ఉండాలట. ► గతంలో ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. జాబు రావాలంటే బాబు రావాలి అని ఊదరగొట్టి మోసం చేశాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా మన ప్రభుత్వం వచ్చేదాక గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మరో 2 లక్షల 7 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వానిది. ► మన అదృష్టం కొద్దీ చంద్రబాబు దిగాడు గానీ, దిగకపోయి ఉంటే ఆర్టీసీ ఉండేది కాదు. కరెంటు కంపెనీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ఉండేవి కాదు. ప్రభుత్వ రంగంలో ఏ కంపెనీలు ఉండేవి కావు. అన్నింటినీ నీట్గా అమ్మేసి మూసేసేవాడు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రభుత్వంలో కలిసింది. ఆస్పత్రులు, స్కూళ్లు మారాయి. ► రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న ఈ పెద్దమనిషిది ఉచిత విద్యు త్ కోసం రైతులు ధర్నాలు చేస్తే కాల్చి చంపిన చరిత్ర. రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం చేస్తానన్న పెద్దమనిషి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని టీవీల్లో అడ్వర్టయిజ్మెంట్లు ఊదరగొట్టిన ఈ పెద్దమనిషి.. అధికారంలోకి వచ్చాక నిండా ముంచాడు. ఈరోజు మైకు పట్టుకొని అది చేస్తా ఇది చేస్తాఅంటే నమ్మగలమా? పల్నాడు రూపురేఖలు మార్చాలన్నది నా తపన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి, అమరావతి: పుట్టిన బిడ్డకు అందని తల్లిపాల మాదిరిగా.. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నా పల్నాడు ప్రాంతానికి నీరు దక్కని పరిస్థితి ఉందని, కొన్ని దశాబ్దాలుగా అక్కడ దుర్భర పరిస్థితులు దర్శనమిస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అందుకే ‘పల్నాడు రూపురేఖలు పూర్తిగా మార్చాలనే తపన, తాపత్రయంతో ఇవాళ రూ.340.26 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు అందించే బృహత్తర కార్యక్రమానికి శంకుస్థాపన చేశానని చెప్పడానికి సంతోషిస్తున్నా’ అని బుధవారం ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. నూజివీడులో రేపు సీఎం పర్యటన సాక్షి, అమరావతి: ఈ నెల 17న (శుక్రవారం) ఏలూరు జిల్లా నూజివీడులో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. 2003కు మందు అసైన్డ్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్డ్ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నూజివీడు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. బాబు – దత్త పుత్రుడి మోసం ► తన బినామీ భూముల ధర బాగా పెరగాలన్న దుర్భుద్ధితో ఈ పెద్దమనిషి అమరావతిని ఒక రాజధానిగా భ్రమ కల్పించాడు. మూడు ప్రాంతాలకు ఏనాడైనా సమన్యాయం చేశాడా? తన హయాంలో పేదలకు కనీసం సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మనం 31 లక్షల ఇంటి స్థలాలను నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపేందుకు కేసులు వేశారు. కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని, ఏకంగా ఎదురు దాడి చేసిన వ్యక్తి చంద్రబాబు. ► 2014లో ఇదే దత్తపుత్రుడు చంద్రబాబుతో కలిసే పోటీ చేశాడు. కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టోకు నాదీ పూచీ అన్నాడు. వీళ్లద్దరూ అయితే సరిపోరని వీరికి తోడు మోడీ గారి పేరు కూడా తెచ్చుకున్నారు. దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది గత చరిత్ర. మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో 5 హామీలు చెబితే... నేను దత్తపుత్రుడు కలిశాము కాబట్టి మరో 6 హామీలు ఇస్తున్నామని చెబుతారు. ఇవాళ వీళ్లు మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది. ► ఇలాంటి రాజకీయాలు, పొత్తులు మీ బిడ్డకు చేత కాదు. ఒక వైఎస్సార్కు గానీ, ఒక జగన్కు గానీ తెలిసిందల్లా ఒక్కటే. ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినడం. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఒక్కటే ఒక్కటి చెబుతాను. నేను విన్నాను, నేను ఉన్నానని మాత్రమే మీ బిడ్డ జగన్ చెబుతాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి, అక్కచెల్లెమ్మల బతుకుల్లో మార్పు తీసుకురావడానికి తపిస్తూ అడుగులు వేశాను. ► మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి కొన్ని అభివృద్ధి పనులు అడిగాడు. ఇవాళ జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులే కాకుండా ఇక్కడ ఉన్న సీహెచ్సీని 100 పడకలకు అప్గ్రేడ్ చేయమని కోరారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. ► ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, విడదల రజని, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జెడ్పీ చైర్మన్ హెన్రీ క్రిష్టినా, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెట్టండి వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టాలి. 15వ శతాబ్దంలో పల్నాడులో పర్యటించిన కవిసార్వభౌముడు శ్రీనాథు డు ఇక్కడి కరువు పరిస్థితిని వివరించారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించిన కాటన్న్దొరను గుర్తించుకున్నట్లు ఈ ప్రాంత ప్రజలు సీఎం వైఎస్ జగన్ని గుర్తుంచుకుంటారు. ఇది ఆరు దశాబ్దాల కల. 1996లో శంకుస్థాపన చేసి, మా ప్రాంత రైతాంగాన్ని జిత్తులమారి చంద్రబాబు మోసం చేశాడు. జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ శంకుస్థాపన చేశారు. జగనన్న ఆదేశాల మేరకు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అనుమతుల కోసం ఢిల్లీలో కృషి చేశారు. ఇది మాచర్ల, వినుకొండ, ఎరగ్రొండపాలెం 3 నియోజకవర్గాల ప్రజలకు ఉపయోగకరం. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను నా ఊపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే ఉంటాను. – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే -
పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. పులుల అభయారణ్యం (టైగర్ ఫారెస్ట్)లో వరికపుడిశెల ఎత్తిపోతల, పైపులైన్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను రూ.340.26 కోట్లతో చేపట్టేందుకు మాచర్లలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి.. అధునాతన పైప్డ్ ఇరిగేషన్(పూర్తిగా పైపులైన్ల ద్వారా) పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ప్రాంతం ఒకటి. తలాపున వరికపుడిశెల వాగు, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా పల్నాడులో సాగునీటికే కాదు.. గుక్కెడు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులే. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కి.మీ.ల ఎగువన కృష్ణా నదిలో వరికపుడిశెలవాగు కలవక ముందే.. ఆ వాగు నుంచి జలాలను ఎత్తిపోసి పల్నాడును సుభిక్షం చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పనులు చేపట్టడానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితమైంది. పల్నాడును సస్యశ్యామలం చేసే దిశగా వరికపుడిశెలవాగు, కృష్ణా, గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానం ద్వారా నదీ జలాలను తరలించి దుర్భిక్ష పల్నాడును సుభిక్షం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానం తొలి దశ పనులతోపాటు వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను అధికారులు చేపట్టారు. వరికపుడిశెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.340.26 కోట్లతో చేపట్టారు. టైగర్ రిజర్వు ఫారెస్ట్లో వరికపుడిశెల వాగుపై ఎత్తిపోతల నిర్మాణం, ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించడానికి 4 కి.మీ.ల పొడవున పైపు లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధులు, జల వనరుల శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరపడంతో కేంద్రం కదిలింది. వరికపుడిశెల ఎత్తిపోతలకు ఏప్రిల్ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. పనులకు తొలగిన అడ్డంకి శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో వరికపుడిశెల ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దాంతో వరికపుడిశెలవాగు కుడి గట్టుపై పంప్హౌస్ నిర్మాణానికి.. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 4 కి.మీ.ల పొడవున పైపులైన్ నిర్మించడానికి మార్గం సుగమమైంది. దాంతో ఆ ఎత్తిపోతల పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తున్నారు. ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైపు లైన్లు వేయనున్నారు. పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని.. ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందింవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు వరికపుడిశెల ఎత్తిపోతల రెండో దశలో పల్నాడు ప్రాంతంలో భారీ ఎత్తున ఆయకట్టుకు నీళ్లందించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
CM Jagan: 15న మాచర్లకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం(నవంబర్ 15న) పల్నాడు జిల్లా మాచర్లకు వెళ్లనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు Varikapudisela Project ఆయన శంకుస్ధాపన చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. బుధవారం ఉదయం 9.45 గంటలకు సీఎం జగన్ తన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. నేరుగా మాచర్లకు చేరుకుంటారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశం సభాస్ధలి వద్దనే వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. 13వ రోజు షెడ్యూల్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. నేడు(శుక్రవారం) 13వ రోజు సామాజిక సాధికారిత బస్సుయాత్ర పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఉదయం గం. 10.30ని.లకు సీతానగరం మండలం లచ్చయ్యపేటలో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం ఉంటుంది. ఉదయం 11గంటలకు కాశయ్యపేట సచివాలయాన్ని వైఎస్సార్సీపీ నేతలు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ జరుగనుంది. ఈ సభలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొననున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధరణికోటలో వ్యాపార, ఉద్యోగ ప్రతినిధులతో పార్టీ నేతలు సమావేశం కానున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు విలేకర్ల సమావేశం, గం. 3.45ని.లకు ధరణికోట బేబీ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం గం. 4L45ని.లకు గ్రామ సచివాలయాన్ని వైఎస్సార్సీపీ నేతలు సందర్శించనున్నారు. సాయంత్రం గం. 5:30 ని.లకు అమరావతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లోలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం గం. 12:15ని.లకు పెద్దతిప్పసముద్రం నుండి బైక్ ర్యాలీ, ఒంటి గంటకు కేజీఎన్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం గం. 2:30 ని.లకు బైక్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. మాదవయ్యగారి పల్లె, పులికల్లు మీదుగా బైక్ ర్యాలీ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
బతుకమ్మ ఊరేగింపులో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
-
ఆస్తులు అమ్ముకుని పనిచేస్తుంటే.. చంద్రబాబు మాత్రం వారిని బుజ్జగిస్తూ..
జనం ఛీకొట్టినా తెలుగుదేశం నాయకత్వంలో మార్పు రావడంలేదు. ఆ పార్టీలో ఒక్కో కులానికి ఒక్కో న్యాయం అమలవుతోంది. అధికారంలో ఉన్నా అంటే.. అధికారం పోయినా అంతే. చంద్రబాబు సామాజికవర్గ నేతలకు ఇబ్బంది కలిగితే వెంటనే యాక్షన్ ఉంటుంది. ఇతర కులాల నేతలకు ఎంత ఇబ్బంది కలిగించినా పట్టించుకునేవారుండరు. ఇప్పుడిదే గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అసలు గుంటూరు పచ్చపార్టీలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజికవర్గానికి మాత్రమే చెందిన పార్టీ అని తొలి నుంచి ప్రచారం ఉంది. పదవులు ఎవరికి ఇచ్చినా పెత్తనం మాత్రం ఒకే సామాజికవర్గం చేతుల్లో ఉంటుంది. అది చంద్రబాబు సామాజిక వర్గం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బడుగు, బలహీనవర్గాల పార్టీ అని చంద్రబాబు పదే పదే డప్పు కొడుతుంటారు. కాని ఆయన చెప్పేదొకటి.. చేసేదొకటి. బీసీలైతే ఏమాత్రం తేడా వచ్చినా తొక్కేస్తారు. అదే మనోడైతే నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పచ్చపార్టీలో ఇదే జరుగుతోంది. నర్సరావుపేటలో గత ఎన్నికల్లో బీసీ నేత చదలవాడ అరవిందబాబు టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నాలుగేళ్లనుంచి ఇన్చార్జిగా పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే అరవిందబాబు ఆర్దికంగా ఇబ్బందులు పడ్డారు. అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. గత నాలుగేళ్లుగా సొంత ఆస్తులను సైతం అమ్ముకుని నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీని నడుపుతున్నాడు. చదవండి: అక్కడ ఆటలు సాగవని అర్థమైంది.. అందుకే గ్లాస్లో మునకేశాడా? మరో ఏడాదిలోగా ఎన్నికలు రానున్న తరుణంలో ఇప్పుడు సడన్ గా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వర్లు తెరపైకి వచ్చారు. తాము కూడా టికెట్ రేసులో ఉన్నామంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు కమ్మ సామాజికవర్గం నేతలతో సమావేశమై ఈసారి టికెట్ మన సామాజికవర్గానికే దక్కేలా చూడాలని కులపెద్దలను కోరినట్లు సమాచారం. అరవిందబాబును కట్టడి చెయ్యడానికి ఒకవైపు నల్లపాటి రాము, మరోవైపు కడియాల వెంకటేశ్వర్లు ఇద్దరూ తెగ పోటీ పడుతున్నారు. ఇన్ చార్జిగా ఉన్న అరవిందబాబును ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా ప్రతిరోజూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వర్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేష్ కు ఎన్ని ఫిర్యాదులు చేసినా వారిద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నర్సరావుపేటలో టీడీపీ అభిమానులందరూ పార్టీని బతికించడానికి అరవిందబాబు ఆస్తులు అమ్ముకుంటే.. చంద్రబాబు మాత్రం పార్టీని నాశనం చేస్తున్న కమ్మ సామాజికవర్గానికి కొమ్ము కాస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ నేతలతోపాటు పార్టీకి సపోర్టు చేస్తున్న ఎల్లో మీడియా కూడా బీసీ నేత అరవిందబాబుకు వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తున్నాయి. నర్సరావుపేట పక్కనే ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజికవర్గం నేతలు ఇన్ ఛార్జిని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. రెండు నెలల క్రితం సత్తెనపల్లి టీడీపీ ఇన్ ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. కన్నాను ఇన్ ఛార్జిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కోడెల శివరాం సొంత కుంపటి ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించినా ఎటువంటి చర్యలు లేవు. పైగా చంద్రబాబును విమర్శిస్తే పార్టీ నేతలు శివరాంను బుజ్జగించారే కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కన్నా కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం, ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కోడెల శివరాం కమ్మ సామాజికవర్గంకు చెందిన నేత కావడంతోనే పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతుంది. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్ మధ్య వార్ నడుస్తోంది. ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నాయకులే. పుల్లారావుకు వ్యతిరేకంగా బాష్యం ప్రవీణ్ నారా ట్రస్ట్ పేరుతో పాగా వెయ్యడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో ఇద్దరు నేతలు కొట్టుకోవడం మొదలయ్యింది. ఇక్కడ ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నేతలు కావడంతో.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా రక్షించుకోవడానికి అధినాయకత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. పుల్లారావును జో కొడుతూ భాష్యం ప్రవీణ్కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. షోకాజ్ నోటీసు పేరుతో అగ్ర నాయకత్వం భాష్యం ప్రవీణ్ను పిలిపించి బుజ్జగించి పంపించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నా భాష్యం ప్రవీణ్పై చర్యలు తీసుకోకపోవడానికి కమ్మ సామాజికవర్గం నేత కావడమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇలా టీడీపీ అధినేత తన సామాజికవర్గానికి ఒక న్యాయం.. మిగతా సామాజికవర్గాలకు మరొక న్యాయం అంటూ రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని గుంటూరు జిల్లాలో టాక్ నడుస్తోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
పల్నాడు జిల్లా ఎస్పీ వినూత్న ఆలోచన వ్యవసాయంలో ఎంతో మందికి ఆదర్శం
-
బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవతను చాటుకున్నారు. ఎక్కడ ఎటువంటి బాధితులు కనిపించినా వెంటనే వారికి తగిన సహాయాన్ని అందించే సీఎం జగన్ సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులోనూ పలువురికి అండగా నిలిచారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన బహిరంగ సభ అనంతరం హెలీపాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివిధ సమస్యలతో బాధపడుతున్న 20 మంది వారి సమస్యలు వివరించారు. తమను వైద్యపరంగా, ఆర్థికంగా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ను వేడుకున్నారు. సీఎం జగన్ వెంటనే స్పందించి బాధితులందరికీ అవసరమైన వైద్యం, ఆర్థిక సహాయం వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటిని ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రానికి బాధితులకు అధికారులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అవసరమైన వారికి వైద్య సాయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వివరాలివీ.. నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన బి. గోపి రైలు ప్రమాదంలో గాయపడ్డాడు. తన దీనస్థితిని సీఎం జగన్కు ఆయన వివరించారు. ఆదుకోవాలని కోరారు. సీఎం వెంటనే స్పందించి గోపికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు వెంటనే అధికారులు రూ.5 లక్షలు అందించారు. నూజెండ్ల మండలం తిమ్మాపురానికి చెందిన కుక్కమూడి సుబ్బారావు వెన్నెముక సమస్యతో బాధపడుతున్నానని చెప్పడంతో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. నంద్యాలకు చెందిన కె. మార్తమ్మ మూర్ఛవ్యాధితో బాధపడుతున్నానని, తనకు ఏదైనా ఉపాధి చూపించాలని కోరారు. ఆమెకు తక్షణ సాయం కింద లక్ష రూపాయలు అందించి ఉద్యోగ కల్పన విషయమై నంద్యాల కలెక్టర్కు లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఆమెకు ఆర్థిక సాయం అందించారు. బెల్లంకొండ మండలం మాచయపాలేనికి చెందిన పున్నారెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పడంతో ఆయనకు తక్షణ సాయంగా రూ.లక్షన్నర అందించాలని, ఉచిత డయాలసిస్, మందులు అందించాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు అధికారులు వెంటనే చెక్కు అందించారు. అచ్చంపేట మండలం ముత్యాలకు చెందిన పువ్వాడ సాయికి చెయ్యి విరిగింది. ఆమె పరిస్థితిని విన్న సీఎం జగన్ లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం ఇవ్వడంతోపాటు ఎప్పటికప్పుడు ఫిజియోథెరపీ అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఆయనకు ఆర్థిక సాయం అందించారు. ► పిడుగురాళ్ల మండలం పత్తిగుంటలకు చెందిన మాస్టర్ మొహమ్మద్ షబ్బీర్, షేక్ అబ్దుల్ రెహ్మాన్ ఇద్దరూ మూర్చవ్యాధితో బాధపడుతున్నారు. వారికి చెరొక లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి, ఉచితంగా వైద్యం అందజేయాలని సీఎం ఆదేశించారు. వారికి అధికారులు చెక్కులు అందించారు. ► క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన దుర్గారావు పశుమిత్రగా నియమించాలని కోరారు. అతనికి స్వయం ఉపాధి కోసం రెండు లక్షల తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు వెంటనే ఆయనకు చెక్కు అందించారు. ► నరసరావుపేట మండలానికి చెందిన ఇందిర తనకు ఉద్యోగం కావాలని కోరడంతో లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించడంతోపాటు ఆమె కుమారుడికి స్వయం ఉపాధి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఆమెకు రూ.లక్ష చెక్కు అందించారు. ► నూజెండ్ల మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కుప్పల మరియమ్మ భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పగా సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ► అంగ వైకల్యంతో బాధ పడుతున్న క్రోసూరుకు చెందిన షేక్ సుభానికి తక్షణ ఆర్థిక సాయం కింద లక్ష రూపాయలు అందజేయాలని సీఎం ఆదేశించారు. ఆమేరకు అధికారులు ఆర్థిక సాయం అందించారు. ► దుర్గి మండలం నెహ్రూనగర్ తాండాకు చెందిన బాలునాయక్ కడుపులో ట్యూమర్లతో బాధపడుతున్నారు. అతని పరిస్థితిని విన్న సీఎం జగన్ అతనికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, పింఛన్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆతనికి అధికారులు రూ.లక్ష చెక్కు అందించారు. ► నంద్యాల జిల్లాకు చెందిన ప్రవీణ్కుమార్కు స్వయం ఉపాధి కోసం రెండు లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించగా, అధికారులు ఆమేరకు చెక్కు అందించారు. ► క్రోసూరుకు చెందిన షేక్ అమాన్ వెన్నెముక సమస్యతో బాధపడుతుండటంతో తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించడంతోపాటు నాణ్యమైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు చెక్కు అందించారు. ► క్రోసూరు మండలం ఇస్సపాలేనికి చెందిన కుమ్మరిగుంట మంజుల కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఆమెకు ఉచిత వైద్యంతో పాటు లక్ష రూపాయలు సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రానికే ఆమెకు రూ.లక్ష చెక్కును అధికారులు అందించారు. ► అంగవైకల్యంతో బాధపడుతున్న పెదకూరపాడుకు చెందిన ఆదాం షఫీకి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంత్రానికి అధికారులు ఆయనకు రూ. లక్ష చెక్కు ఇచ్చారు. ► గుండె జబ్బుతో బాధపడుతున్న కోసూరు మండలం గుడిపాడుకు చెందిన షేక్ కాజా షరీఫ్కు లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం, ఉచితంగా వైద్యం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఆయనకు రూ.లక్ష చెక్కు ఇచ్చారు. ► తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పెదకూరపాడు మండలం లగడపాటికి చెందిన హాకీ హసన్ సాహెబ్కు సీఎం ఆదేశాల మేరకు అధికారులు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ► క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన ఇమామ్ బాషాకి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అతనికి లక్ష రూపాయల చెక్కు పంపిణీతోపాటు ఏదైనా ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ► సంతమాగులూరు మండలం పరిటాల వారి పాలేనికి చెందిన గంజనబోయిన చరణ్ తలసేమియా బాధితుడు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇతనికి జిల్లా కలెక్టర్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇతనికి గతంలోనే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు మరోసారి ఆర్థిక సహాయం అందించారు. బాధితుడికి అత్యున్నత ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. ► తాడేపల్లి మండలం పెనుమాకకి చెందిన కె అరవింద్కి మెదడు ఆపరేషన్ కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు లక్ష రూపాయిలు తక్షణ సాయం అందించారు. -
Jagananna Vidya Kanuka: విద్యార్థులతో సీఎం జగన్.. ఫోటోలు
-
14 ఏళ్లు గాడిదలు కాసావా చంద్రబాబు?.. సీఎం జగన్
సాక్షి, పల్నాడు: పేదపిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ధి చంద్రబాబుదని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అన్నింట్లోనూ.. పేదల పట్ల వ్యతిరేకత బుద్ధి ప్రదర్శించాడని, అందుకు కారణం ఆయనలోని పెత్తందారీ మనస్తత్వమని చెప్పారు సీఎం జగన్. సోమవారం పల్నాడు క్రోసూర్లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తీరును సీఎం జగన్ ఏకిపారేశారు. ‘‘చంద్రబాబుకు మంచి చేయాలన్నది ఏనాడూ లేదు. గతంలో ఇది చూశాం. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా.. ఏ ఒక్క మంచి, పథకం కూడా గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు ఏ ఒక్క వర్గాన్ని కూడా వదకులండా ‘‘ఎన్నికలకు ముందు వాగ్ధానం చేశారు.. ఎన్నికల తర్వాత మోసం చేశాడ’’ని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యమన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గుర్తించండి. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధి దారులకు సంక్షేమం అందించిన ప్రభుత్వం మనది. అక్కచెల్లెమ్మల దగ్గరి నుంచి అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుస్తున్నాం. మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తున్నాం. కానీ, చంద్రబాబు బతుకే మోసం, అబద్ధం, కుట్ర, వాగ్ధానాలు, వెన్నుపోటులు. ఒక ఈనాడు, ఒక టీవీ5, ఒక ఆంధ్రజ్యోతి, ఒక దత్తపుత్రులు.. ఈ గజదొంగల ముఠా ఆయనకు అండగా వస్తోంది. మూసేయడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్కరాష్ట్రం నుంచి మేనిఫెస్టో తీసుకొచ్చి.. బిసిబిల్లాబాత్గా వండుతున్నారు. మనం చేసిన మంచిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను కిచిడీ, పులిహోరగా వండే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాయలసీమ, బీసీ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్లు అంటూ ఇవాళ మొదలుపెట్టారు. ఆ 14 సంవత్సరాలు ఏం గాడిదలు కాసావా చంద్రబాబు? అంటూ నిలదీశారు సీఎం జగన్. కేవలం ఎన్నికలప్పుడే వాగ్ధానాలు.. వెన్నుపోట్లతో చంద్రబాబు చట్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు సీఎం జగన్. చంద్రబాబునాయుడుగారి పెత్తందారీ వ్యవస్థకు X పేదల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం. డీపీటీ(దోచుకో, పంచుకో, తినుకో) భావజాలానికి X లంచాలకు తావులేకుండా వివక్షకు చోటులేకుండా నేరుగా లబ్ధి అందిస్తున్న టీబీటీ సర్కార్కు జరుగుతున్న యుద్ధం. సామాజిక అన్యాయానికి X సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. యెల్లో మీడియా విష ప్రచారానికి X ఇంటింటికీ జరిగిన మంచికీ మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధం.. ఇది జగన్పై జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలపై జరుగుతున్న యుద్ధం. మీ జగనన్నకు ఈనాడు తోడు లేదు, టీవీ 5 అండ లేదు, ఏబీఎన్ ఢంకా బజాయించడంలేదు, దత్తపుత్రుడు అసలే లేడు. మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. వీటినేం మీ జగనన్న నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకుంది దేవుడి దయను. మీ చల్లని దీవెనలు. నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన మంచి అని చెప్పడానికి గర్వపడుతున్నా. మిమ్మల్ని కోరేది ఒక్కటే.. వాళ్ల దుష్ప్రచారాలను నమ్మకండి. ఈ ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లో జరిగిన మంచే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి గెలుస్తుందని మనసారా నమ్ముతూ.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. పిల్లలు మంచిగా చదువుకుని విద్యావేత్తలుగా ఎదగాలని, మంచి నాయకులు కావాలని.. మీ అందరికీ మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. గతానికీ ఇప్పటికీ తేడా.... గత ప్రభుత్వంలో ఇవన్నీ చేయాలని చంద్రబాబుకు మనసే లేదు. గతంలో చంద్రబాబుకు ఆలోచన వేరు. ఆయన మనస్తత్వం పూర్తిగా వేరు. పేదలు చదువుకుంటే, అందులోనూ ఆ పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే.. వారికి గవర్నమెంట్ బడుల్లో డిజిటల్ బోధన వస్తే.. ఆ పేద పిల్లల చేతుల్లో కూడా ట్యాబ్స్ కనిపిస్తే తట్టుకోలేని మనస్తతత్వం చంద్రబాబుది. చంద్రబాబు పేదల వ్యతిరేకి.. అన్ని విషయాల్లో చంద్రబాబు గారిది ఇదే వ్యవహారం, ఇదే బుద్ది. పేదలకు వ్యతిరేక బుద్ధి. పేదలు బాగు పడకూడదన్న దుర్బుద్ధి. కారణం వారిది పెత్తందారీ మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకం అని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. వాలంటీర్లు– లంచాలకు తావులేని వ్యవస్ధ... మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావుండకూడదని చెప్పి.. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. గ్రామాల్లో అవ్వాతాతలకు పెన్షన్ దగ్గర నుంచి, అక్కచెల్లెమ్మలకు రేషన్ సరుకులు మొదలు పేదలు, రైతులందరూ ఎటువంటి ఇబ్బంది, లంచాలు ఉండకూడదని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే వాలంటీర్ల వ్యవస్ధ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. వెంటనే ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు–నేడు స్కూల్స్లో మార్పులు తీసుకొచ్చాం. ఇలా అనేక వ్యవస్ధలను గ్రామస్ధాయిలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. మరి ఇవే ఆలోచనలు గతంలో చంద్రబాబు బుర్రకు ఎందుకు తట్టలేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. కారణం వారిది పెత్తందారీ మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకం. ఈ నాలుగు సంవత్సరాల్లోనే మనం ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం, అక్కచెల్లెమ్మలకు ఇచ్చే అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, దిశ యాప్.. ఇటువంటివన్నీ తీసుకొచ్చాం. భారత దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిలబడనంత అండగా నా అక్క చెల్లెమ్మలకు మీ జగనన్న ప్రభుత్వం తోడుగా నిలబడింది. చంద్రబాబు బ్రతుకే మోసం, అబద్దం ... ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేశాడు. రైతన్నలకు ఎన్నికలకు ముందు వాగ్దానం, ఎన్నికల తర్వాత మోసం చేశాడు. యువతకూ ఎన్నికలకుముందు వాగ్దానం చేసి, ఎన్నికల తర్వాత మోసం చేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు.. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీలో నిరుపేదలకు ఏం చేశాడని చూస్తే.. ఎన్నికలకుముందు వాగ్దానం, ఎన్నికల తర్వాత మోసం చేశాడని మనకు కళ్లెదుటనే కనిపిస్తున్న సత్యం. కారణం ఈ పెద్దమనిషి చంద్రబాబు బతుకే మోసం, పెద్ద అబద్ధం. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం, ఈ బాబు పేదలకు వ్యతిరేకమన్నది మర్చిపోవద్దని తెలియజేస్తున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఏ ఒక్కసంక్షేమ పథకం మనకు గుర్తు రాదు. ఏ ఒక్క మంచీ గుర్తుకు రాదు. బాబు పేరు చెబితే వెన్నుపోటు గుర్తు వస్తుంది.. చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసం, కుట్ర, దగా. ఇంత దారుణంగా ప్రజలందరినీ మోసం చేస్తున్నా కూడా అన్ని విషయాల్లో బాబును వెనకేసుకురావడానికి బాబు వల్ల బాగా వెనుకేసుకున్న ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ ఒక దత్తపుత్రుడు ఉన్నారు. ఈ గజదొంగల ముఠా, ఈదుష్ట చతుష్టయం మాత్రమే చంద్రబాబుకు తోడుగా ఉంది. కానీ బాబు పాలన వల్ల, ఆయన చేసిన పనులు వల్ల తమకు మేలు జరిగిందని చెప్పే ఒక సామాజికవర్గంగానీ, ప్రాంతంగానీ, పేదలుగానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు తోడుగా లేరని ఈ సందర్భంగా చెబుతున్నాను. టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉన్న దుకాణం.. కాబట్టి మూసేయడాని సిద్ధంగా ఉన్న ఈ టీడీపీ దుకాణంలో ఈరోజు ఏం జరుగుతోందంటే.. పక్క రాష్ట్రాల్లోని మేనిఫెస్టో తెచ్చి బిస్ బేలా బాత్గా వండుతున్నారు. ఈ రోజు మనం అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా కిచిడీ చేసి పులిహోరగా వండే కార్యక్రమం చేస్తున్నారు. నిస్సిగ్గుగా చంద్రబాబు... నిజంగా బాబు ఎంత సిగ్గులేకుండా ఉన్నాడంటే.. ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన తర్వాత ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలు పెడతాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేశారు ? గాడిదలు కాశారా అని అడుగుతున్నా ? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈరోజు బీసీ డిక్లరేషన్ అంటూ మొదలు పెట్టాడు. ఎస్సీ, ఎస్టీ, డిక్లరేషన్ అంటూ మొదలు పెట్టాడు, మైనార్టీ డిక్లరేషన్ అని మొదలు పెట్టాడు. అక్కచెల్లెమ్మలు, రైతన్నలు చివరికి గ్యాస్ సిలిండర్ల డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలు పెట్టాడు. వాగ్దానాలు, వెన్నుపోట్ల చక్రమే– బాబు సైకిల్ చక్రం.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఏమి గాడిదలు కాశావయ్యా చంద్రబాబూ ? అని అడుగుతున్నా. ఇవాళ ప్రజల్ని మళ్లీ మోసం చేస్తూ మరోసారి అవకాశం ఇస్తే మయసభ నిర్మిస్తానంటున్నాడు. మరోసారి అవకాశం ఇస్తే... ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తానంటున్నాడు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా ? అని అడుగుతున్నా. కనీసం ఇప్పటికైనా ఈ పెద్దమనిషి చంద్రబాబు మరోసారి మోసానికి తెరతీయడం ఆపేస్తాడేమో అని ఆశిద్దాం. చంద్రబాబు గారి బ్రతుకంతా కూడా వాగ్దానాలు, ఆ తర్వాత వెన్నుపోట్లు, మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు మళ్లీ వాగ్దానాలు, మళ్లీ వెన్నుపోట్లు, ఈ చక్రమే బాబు సైకిల్ చక్రం. మనపేదలకూ– బాబు పెత్తందార్లకూ యుద్ధం.. ఈ రోజు బాబు పెత్తందారీ భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. గమనించమని, ఆలోచన చేయమని మిమ్నల్ని కోరుతున్నాను. చంద్రబాబు గారి దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ భావజాలానికి, మన రూ. 2.16 లక్షల కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించే డీబీటీ పద్ధతికి మధ్య యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు గారి మాదిరి దోచుకో, పంచుకో, తినుకో డీపీటీ కావాలా, మీ జగనన్న ప్రభుత్వం మాదిరిగా నేరుగా బటన్ నొక్కే మన డీబీటీ కావాలా ఆలోచన చేయండి. మనది సామాజిక న్యాయం– వారిది అన్యాయానికి యుద్దం. ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇదే రాష్ట్రంలో ఇదే బడ్జెట్లో వారు చేసిన స్కామ్లకు, అదే బడ్జెట్లో మనం అందజేస్తున్న మంచి స్కీములకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది వారి ఎల్లో మీడియా.. వారి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చేస్తున్న విష ప్రచారాలకు.. ఇంటింటికీ మనం చేసిన.. కనిపిస్తున్న మంచికి జరుగుతున్న యుద్ధం ఇది. పేదలపై జరుగుతున్న యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధంలో వీరిది పేదలపై యుద్దం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ యుద్ధంలో వారి మాదిరిగా మీ జగన్కు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు. టీవీ5 డంకా బజాయించకపోవచ్చు. ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగనన్నకు బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. మీ ఆశీస్సులు– దేవుడి దయనే నమ్ముకున్నా... మీ జగనన్న వీళ్లను నమ్ముకోలేదు. మీ జగనన్న దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికీ మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను. మీకు మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానం.... మీ అందరినీ ఒకటే కోరుతున్నా. వాళ్లు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడాలని కోరుతున్నాను. ఈ యుద్ధంలో చివరకు ఎప్పుడైనా మంచే గెలుస్తుందని మనసారా నమ్ముతున్నాను. మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు ఉండాలని, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. నా అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, తమ్ముడిగా మీ పిల్లలంతా ఇంకా బాగా చదువుకోవాలని, ప్రతి కుటుంబంలోంచి ఒక మంచి ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్, సాఫ్ట్వేర్ సీఈవో, ఎకానమిస్ట్, ఎంటర్ప్రెన్యుర్ రావాలని, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మంచి లీడర్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవుడు ఇంకా మీ అందరికీ మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. చివరిగా... కాసేపటి క్రితం మాదిపాడు వద్ద రూ.60 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్ధాపన చేశాం. దీనివల్ల విజయవాడ, గుంటూరుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా హైదరాబాద్కు వెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ నియోజకవర్గానికి మంచి చేస్తూ... హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజే శంకుస్ధాపన చేశాం. అదే మాదిరిగా అమరావతి – రాజుపాలెం... కీలకమైన రోడ్డును మరో రూ.150 కోట్లతో శంకుస్ధాపన చేసాం. -
ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన పిల్లలు ఉండాలి
సాక్షి, పల్నాడు: వీళ్లు చిన్నారులు వీళ్లకు ఓటు హక్కు లేదు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది గతం. కానీ, ఇవాళ వాళ్ల జగన్ మామ ప్రభుత్వంలో విద్యాకానుక ఓ పండుగలా జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ప్రజాప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొంటుడడం.. ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారాయన. ‘‘పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్థికి మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు అందిస్తున్నాం. నోట్ బుక్స్, వర్క్ బుక్స, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచాం. యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశాం అని తెలిపారాయన. ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతున్నాం అని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది 43.10 లక్షల మంది విద్యార్థులకు 1,042.53 కోట్ల వ్యయంతో విద్యాకానుక అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి రూ. 2,600 విలువైన కిట్ పంపిణీ అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి. అందుకే టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నాం. ఇందుకోసం అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇంగ్లీష్ మాట్లాడడంలో మన విద్యార్థుల ప్రతిభ పెరుగుతుందన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. బయట తీవ్రమైన ఎండలు ఉన్న కూడా ఏమాత్రం ఖాతరు చేయని చిరునవ్వులతో, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ, నా చిట్టిపిల్లలకూ హృదయపూర్వక కృతజ్ఞతలు. బడి గంట కంటే ముందే కానుకల గంట... వేసవి సెలవులు అయిన తర్వాత నేటి నుంచి బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. బడిగంట మోగకముందే, బడికి వెళ్లే పిల్లలకు ఇవ్వాల్సిన కానుకల గంటను మన ప్రభుత్వం ఈరోజే మోగిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది విద్యా కానుక.... ఈ రోజు స్కూళ్లు తెరవగానే పుస్తకాల కోసం, యూనిఫాం వంటి వాటి కోసం ఏ ఒక్కపాప, బాబు వారి తల్లిదండ్రులూ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంలో వరుసగా నాలుగో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లోనూ ఒకటి నుంచి పదో తరగతివరకూ చదువుతున్న ప్రతి విద్యార్ధికి ప్రభుత్వం ఉచితంగా ఈ విద్యాకానుక కిట్ను ఇవ్వనుంది. బట్టల కుట్టుకూలీతో సహా... విద్యాకానుక కిట్. ప్రతి విద్యార్ధికి కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫాం, ఒక స్కూల్బ్యాగు, బైలింగివల్ టెక్ట్స్బుక్(ఒక పేజీ ఇంగ్లిషు ఒక పేజీ తెలుగు), నోట్బుక్స్, వర్క్బుక్స్, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు ఇవి కాకుండా పిల్లలందరికీ ఇంగ్లిషు నుంచి తెలుగుకు అనువదించడానికి ఒక మంచి డిక్షనరీ కూడా విద్యాకానుక కిట్ ద్వారా ఇస్తున్నాం. వారికి వసతులు కల్పిస్తూ... బడి తెరిచే సమయానికి వారికి ఇవ్వవలిసినవి ఇస్తూ.. వీటి మీద ధ్యాస పెడుతూ, క్వాలిటీని మరింత మెరుగుపరిచేలా మార్పులు తీసుకువచ్చాం. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరింత మెరుగ్గా... పిల్లలకు యూనిఫాం కింద ఇచ్చే క్లాత్ గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఇస్తున్నాం. పిల్లలందరూ చక్కగా కనపించాలని యూనిఫాం డిజైన్లో కూడా మెరుగైన మార్పులు తీసుకొచ్చాం. నిరుడు సంవత్సరం వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పుస్తకాల బ్యాగు సైజ్ను కూడా పెంచి మెరుగైన బ్యాగు ఇస్తున్నాం. మెరుగైన క్వాలిటీ షూ కూడా ఇస్తున్నాం. బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల నాణ్యతను కూడా పెంచి పిల్లలకిస్తున్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాకానుక కిట్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుంది. చిన్నపిల్లలు ఓటర్లు కాదు వీరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న పరిస్థితి గతం. ఒక్కో విద్యార్ధికి రూ.2400 ఖర్చుతో కిట్... కానీ ఈ రోజు ఆ పిల్లలు జగన్ మామయ్య ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే.. విద్యాకానుక పండగ కార్యక్రమంలో ప్రతి స్కూళ్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజా ప్రతినిధులంతా పాలుపంచుకునే గొప్ప వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఆ పిల్లలకు మంచి మేనమామగా సంతోషపడుతున్నాను. ఈ రోజు నుంచి అందిస్తున్న ఈ విద్యాకానుక కిట్స్ కోసం అయ్యే ఖర్చు రూ.1042 కోట్లు. 43.10 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ... ఒక్కో విద్యార్ధికి ఇచ్చే స్కూల్ బ్యాగుతో సహా ఇచ్చే యూనిఫాం, బైలింగువల్ టెక్ట్స్బుక్స్ కలుపుకుని వీటి ఖరీదు రూ.2400 ఖర్చుచేస్తున్నాం. ఆ పిల్లల తల్లులకు అన్నగా సంతోషంగా ఈ ఖర్చు చేస్తున్నాం. ఒక్క విద్యాకానుక కింద ఈ నాలుగేళ్లలో రూ.3366 కోట్లు ఖర్చు చేసింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు.... విద్యావ్యవస్ధలో మన ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలి.పాఠశాల స్ధాయి నుంచే పేదపిల్లల ఇంగ్లిషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరింత మెరుగుపడాలని ఆలోచన చేశాం. మన పిల్లలు ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రపంచాన్ని ఏలే పరిస్థితుల్లో మన పిల్లలు ఉండాలి కానీ.. తక్కువగా చూసే పరిస్థితుల్లో ఉండకూడదని ఈ అడుగులు వేశాం. మన పిల్లలకు ఎక్కడైనా ఎదిగేందుకు వీలుగా టోఫెల్ పరీక్షలకు వారిని సిద్ధం చేసే కార్యక్రమం ఈ యేడాది నుంచే మొదలవుతుంది. టోఫెల్ కోసం అమెరికా ఈటీఎస్తో ఒప్పందం... ఇందుకోసం ప్రపంచంలోనే ఎంతో పేరున్న అమెరికన్ సంస్ధ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్( ఈటీఎస్ ) ప్రిన్స్టన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రిన్స్టన్లో టోఫెల్ అనే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మన పిల్లలకు ఇస్తారు. ఈ టోఫెల్ అనే పరీక్షకు పిల్లలకు తర్ఫీదు ఇస్తూ తయారు చేస్తున్నాం. మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు టోఫెల్ ప్రైమరీ, ఆరో తరగతి నుంచి తొమ్మదో తరగతి వరకు టోఫెల్ జూనియర్ పేరుతో పరీక్షలు నిర్వహించి వారికి టోఫెల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు. తద్వారా ఇంగ్లిషు వినడమే కాకుండా మాట్లాడడం కూడా వస్తుంది. అది కూడా అమెరికన్ యాక్సెంట్, డైలెక్ట్లో వస్తుంది. వీరికి ఇవన్నీ తీసుకువచ్చే కార్యక్రమంలో ఈ సంవత్సరం టోఫెల్ను కూడా ప్రవేశపెడుతున్నాం. ప్రతిభా ఉపాధ్యాయులకు అమెరికాలో ఓరియెంటేషన్... అంతే కాకుండా రాష్ట్ర స్ధాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన ప్రభుత్వ స్కూళ్లలో... ప్రతి జిల్లాలోనూ ఒక ప్రభుత్వ హైస్కూల్, ఒక ప్రైమరీ స్కూల్ వెరసి 26 జిల్లాల్లోని 52 స్కూళ్లకు సంబంధించిన ఇంగ్లిషు టీచర్లను అందరికీ స్ఫూర్తినిస్తూ.. వారికి మెరుగైన ఓరియెంటేషన్ కోసం ప్రోత్సహిస్తూ అమెరికాలోని ప్రిన్స్టన్కు కూడా పంపిస్తున్నాం. మన పిల్లలు ఇంకా బాగా ఎదగాలని, అంతర్జాతీయంగా కూడా విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ అధ్యయనం చేసి, మారిపోతున్న ప్రపంచంలో చదువులకు సంబంధించిన మార్పుల్లో మన పిల్లలు అందరికన్నా ముందడుగులో ఉండాలని, రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లాంగ్వేజ్ లెర్నింగ్ మాడ్యూల్స్, డేటా అనలెటిక్స్ మొదలు చాట్ జీపీటీ వరకూ మన సిలబస్లోకి ఎలా అనుసంధానం చేయాలి, వాటిని ఎలా అనుసంధానం చేసి, మన పిల్లలను ముందు వరుసలో నిలబెట్టగలుగుతాము అనేది అధ్యయనం చేసే దిశగా వేగంగా ఆలోచనలు చేస్తున్నాం. విద్యారంగంలో విపరీతమైన మార్పులు కనిపించేటట్లుగా నాలుగేళ్లలో చేశాం. ఇప్పటికే మనబడి నాడు–నేడులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రూపులు మారి కళ్లముందు కనిపిస్తున్నాయి. బడుల్లో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. గవర్నమెంట్ స్కూళ్లు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లిష్ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. గతంలో క్లాస్ టీచర్లే లేని పరిస్థితి నుంచి.. మూడో తరగతి నుంచి ఏకంగా సబ్జెక్టు టీచర్లే ఉండేట్లుగా మన ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి. బైజూస్ కంటెంట్తో... నాలుగో తరగతి నుంచి మన కరిక్యులమ్ కు అనుసంధానం చేస్తూ పేద పిల్లలందరికీ కూడా బైజూస్ కంటెంట్ తీసుకొచ్చి ఉచితంగా ఇస్తున్నాం. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా స్కూళ్లలో గోరుముద్ద, అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 75 శాతం హాజరుకు ముడిపెడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో జరిగిస్తూ, జగనన్న అమ్మ ఒడి ద్వారా పిల్లల్ని బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ ప్రతిఏటా రూ.15 వేలు ఏటా ఇస్తున్నాం. ఒక్క అమ్మ ఒడి అనే కార్యక్రమానికి మాత్రమే రూ.19,674 కోట్లు ఖర్చు చేశాం. 8వ తరగతి పిల్లలకు ఆఫ్లైన్లో కూడా పని చేసేట్టుగా ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్తో పిల్లలకు, టీచర్లకు ట్యాబ్లు అందించాం. అక్షరాలా 5,18,740 ట్యాబ్లు రూ. 685 కోట్లు ఖర్చు చేసి నిరుడు ఇచ్చాం. మళ్లీ ఈ సంవత్సరం మీ జగన్ మామయ్య పుట్టిన రోజున డిసెంబర్ 21న మళ్లీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇస్తాం. డిజిటల్ దిశగా మారుతున్న క్లాస్రూములు.. ప్రతి క్లాస్ రూమ్ రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ బడులలో నాడు–నేడు అయిపోయిన స్కూళ్లలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ తీసుకొస్తున్నాం. డిజిటల్ బోధన పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి చదువును సులభంగా అర్థమయ్యేట్లు చేస్తున్నాం. తొలిదశలో నాడు నేడు పూర్తయిన దాదాపు 15,750 స్కూళ్లలో 6వ తరగతి, ఆ పైన ఉన్న 30,232 క్లాస్ రూముల్లో డిజిటల్ బోధనను జూలై 12న ప్రారంభిస్తున్నాం. డిజిటల్ బోర్డులు ప్రతి క్లాస్ రూమ్లోనూ ఉంటాయి. కాసేపటి క్రితం క్రోసూరు హైస్కూల్లో డిజిటిల్ బోర్డులను కూడా చూశాను.ఈడిజిటల్ బోర్డులు 6వ తరగతి పైన ప్రతి క్లాస్రూమ్లోనూ ఉంటాయి. 2వ దశలో మరో 22 వేల స్కూళ్లు, మరో 16 వేల యూనిక్ స్కూళ్లలో డిసెంబర్ 21న మరో 31,700 ఐఎఫ్బీ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో డిసెంబర్ 21కల్లా నాడు–నేడులో ఫేజ్1, ఫేజ్2 పూర్తి చేసుకున్న దాదాపు 33 వేల స్కూల్స్లో 6వ తరగతి, ఆపైన క్లాస్ రూములన్నీ కూడా మొత్తం డిజిటల్ బోధన వైపు అడుగులు పడుతాయి. ఆడపిల్లలకు మరింత అండగా.. ఆడ పిల్లలకు మరింత అండగా నిలుస్తూ, బడుల్లో నాడు నేడుతో పాటు టాయిలెట్ల నిర్మాణం, మెయింటెనెన్స్పై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా టాయిలెట్ మెయింటినెన్స్, స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ తీసుకొచ్చాం. బడికి వెళ్లే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో వారి కోసం స్వేచ్ఛ అమలు చేస్తున్నాం. ఇవన్నీ పిల్లల చదువుల కోసం వారు వేసే ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలించి సక్సెస్ కావాలని అడుగులు వేయిస్తుంది మీ మేనమామ ప్రభుత్వం. ఉన్నత విద్యలోనూ మార్పులు.. హయ్యర్ ఎడ్యుకేషన్లో మార్పులు తెచ్చాం. జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజీ ఫీజు ఎంతైనా సరే.. ఎంత మంది పిల్లలుంటే అంతమందినీ చదివించినా సరే.. సంవత్సరంలో ప్రతి మూడు నెలలకోసారి నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన ద్వారా నగదు జమ చేస్తున్నాం. ఒక్క జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పధకంతో ఇప్పటి వరకు మన ప్రభుత్వం రూ.10,636 కోట్లు. ఖర్చు చేసింది. పిల్లలందరూ పెద్ద చదువులు చదివేటప్పుడు భోజనం, వసతి కోసం ఇబ్బంది పడకూడదని, వాళ్ల తల్లిదండ్రులూ అంత కన్నా ఇబ్బంది పడే పరిస్ధితి రావద్దని, ఒక్కో పిల్లాడికిఏడాదికి రూ. 10 నుంచి రూ. 20 వేల వరకు ఖర్చు చేసి జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం. ఇప్పటివరకు ఈ పథకానికి రూ.4,275 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న విదేశీ విద్యాదీవెన... మన పిల్లలు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి పిల్లలుగా నిలబడాలని తపన, తాయపత్రయంతో టాప్ గ్లోబల్ కాలేజీల్లో ఏ పిల్లాడికి సీటు వచ్చినా రూ.1. 25 కోట్ల వరకూ ఖర్చయినా పర్వాలేదు. మీ జగన్ మామయ్య చదివిస్తాడు. టాప్ 50 యూనివర్సిటీల్లో 213 మంది మన పిల్లలు చదువుతున్నారు. ఇంతవరకు జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం రూ.20 కోట్లు ఖర్చు చేశాం. అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. కల్యాణమస్తు, షాదీ తోఫా అనే మరో పథకాన్ని తీసుకొచ్చాం. పెళ్లిళ్లు చేసేటప్పుడు వధూవరులకు టెన్త్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రేరణ అవుతుందని.. ఈ పథకంలో చదువులను ప్రోత్సహించేందుకు అడుగులు ముందుకు వేశాం. ఇలా ఈ నాలుగేళ్లలో కేవలం ఈపథకాలకోసమే విద్యా రంగంలో నాలుగేళ్లలో మనం చేసిన ఖర్చు రూ.60,329 కోట్లు. చదువుల గురించి, ఆ అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా, పిల్లల భవిష్యత్ కోసం ఎంతగా మీ బిడ్డ ఆలోచన చేస్తున్నాడో గమనించాలని ప్రతి చెల్లెమ్మకూ తెలియజేస్తున్నా. తేడాఒక్కసారి గమనించమని కోరుతున్నా. మన హయాంలోనే పులిచింతల... పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం. ఆయన పూర్తి చేస్తే మిగిలిన పోయిన ఆర్ అండ్ ఆర్ కూడా ఇవ్వకుండా 45 టీఎంసీల నీళ్లు నిల్వచేసే కార్యక్రమం చేయకుండా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వ హయాంలో రూ.140 కోట్లు కేటాయించి, 45 టీఎంసీల నీళ్లు నింపి, ఆర్ ఆండ్ ఆర్ కార్యక్రమం కూడా పూర్తి చేశాం. ఈ కార్యక్రమం చేస్తూ.. పొరపాటున ఇమాజిగూడెంలో 128 ఇళ్లకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ మిగిలిపోయిందని ఎమ్మెల్యే నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా పూర్తి చేయిస్తాను. ఇది కాకుండా రూ.45 కోట్లతో అచ్చంపేట మండలం తాళ్లచెరువులో లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అడిగారు. దాన్ని కూడా మంజూరు చేస్తాం. అది కాకుండా మాదిపాడులో ఆర్ ఆండ్ బీ రోడ్డులో పులిచింతల డ్యామ్కు కనెక్ట్ చేస్తూ... రూ.3.50 కోట్లు ఖర్చయ్యే రోడ్డును అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాను. ఇంకా సబ్స్టేషన్లు వంటివి అడిగారు. అవసరమైన చోట వాటిని కూడా ఏర్పాటు చేస్తాం. వీటన్నింటి వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ.. సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు. ఇదీ చదవండి: ఉద్దానం చెంతకు ఆధునిక వైద్యం -
మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధాప్య పెన్షన్..ఆరా తీస్తే..
పల్నాడు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధ్యాప్య ఫించన్ ఇస్తున్నారంటూ విమర్శుల వెల్లువెత్తాయి. చాలా ఏళ్ల క్రితం తండ్రి చనిపోతే..అతడి పెన్షన్కి ఆశపడి ప్రభుత్వాని మోసం చేస్తున్న కొడుకు ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చనిపోయని వ్యక్తి బతికున్నట్లు నమ్మించి 12 ఏళ్లుగా ఫించన్ తీసుకుంటున్నాడు మృతుడు పారా కిరీటి కుమారుడు సారయ్య. 2001లో చనిపోయిన తన తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ అందుకుంటున్నట్లు మృతుడి బంధువులు జాయింట కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అతను 2011లో తన మామ చనిపోతే..అతడిని తండ్రిగా చూపించి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఫించన్కు దరఖాస్తు చేస్తే అధికారులు ఫించన్ మంజూరు చేసేశారు. దీంతో అతడు ధర్జాగా గత 144 నెలలుగా మోసం చేస్తూ సుమారుగా 4 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును పారా సౌరయ్య కాజేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ఇన్నేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నా అధికారులకు మాత్రం దొరకలేదు. (చదవండి: సత్తా చాటిన గుంటూరు జిల్లా ఎడ్లు) -
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్.. ఎమ్మెల్యే ధీటైన జవాబు
సాక్షి పల్నాడు: వినుకొండ మండలం శావల్యాపురంలో తెలుగుదేశం నాయకులు ఓవరాక్షన్కు దిగారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా శావల్యపురంలో జీవీ ఆంజనేయులు పాదయాత్ర చేశారు. అయితే.. ఈ క్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ యాత్రకు తారసపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి వాహనానికి టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వాహనాన్ని చుట్టుముట్టి పార్టీ నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. దీంతో సహనం నశించిన ఎమ్మెల్యే.. ఆగ్రహంతో బయటకు వచ్చారు. ‘రండిరా.. చూసుకుందాం..’ అంటూ యెల్లో బ్యాచ్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈలోపు రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పోలీసులు కలుగజేసుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించేశారు. -
పల్నాడు ప్రాంతంలో పులి భయం
-
పల్నాడులో దారితప్పి తిరుగుతున్న రెండు పెద్ద పులులు
-
వరికపుడిశెల వాగు ఎత్తిపోతలకు తొలగిన అడ్డంకి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషితో పల్నాడు ప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలకు అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు లభించక దశాబ్దాలుగా పనులు ప్రారంభం కాని ఈ ప్రాజెక్టును సీఎం జగన్ సాధించారు. శ్రీశైలం – నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో వరికపుడిశెల ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దాంతో వరికపుడిశెల వాగు కుడి గట్టుపై పంప్హౌస్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 4 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ఒకటి. పక్కనే వరికపుడిశెల వాగు, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా పల్నాడులో సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులే. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిలో వరికపుడిశెలవాగు కలిసే ప్రాంతానికి ముందే ఆ వాగు నీటిని ఎత్తిపోసి పల్నాడును సుభిక్షం చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. ఇందుకోసం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ఎత్తిపోతల కాగితాలకే పరిమితమైంది. పల్నాడును సుభిక్షం చేసే దిశగా.. పల్నాడు ప్రాంతానికి సాగు, తాగు నీటిని అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి సంకల్పం తలపెట్టారు. వరికపుడిశెలవాగు, కృష్ణా, గోదావరి జలాలను తరలించి పల్నాడుకు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో వరికపుడిశెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి, తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించాలని ప్రణాళిక రూపొందించారు. రూ. 340.26 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించవచ్చు. టైగర్ రిజర్వు ఫారెస్ట్లో వరికపుడిశెల వాగుపై ఎత్తిపోతల నిర్మాణం, దాని ద్వారా నీటిని తరలించడానికి 4 కిలోమీటర్ల పైపు లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి, పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పలు మార్లు చర్చలు జరపడంతో కేంద్రం కదిలింది. వరికపుడిశెల ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టైగర్ రిజర్వు ఫారెస్ట్లో పంప్హౌస్, పైపు లైన్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి పైపు లైన్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పుడు అటవీ ప్రాంతంలో పైపులైన్ నిర్మిస్తారు. పైపు లైన్ల ద్వారా నీటిని తరలిస్తే సరఫరా నష్టాలు ఉండవని, ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందింవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పైపు లైన్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించే తొలి ఎత్తిపోతల పథకం ఇదే. వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశకు అడ్డంకులు తొలగడంతో పల్నాడులో భారీ ఎత్తున ఆయకట్టుకు నీళ్లందించేలా రెండో దశకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్
-
పల్నాడులో ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభోత్సవం.. వెల్లువెత్తిన అభిమానం ( ఫొటోలు)
-
ప్రతి పేద వ్యక్తికి అండగా నిలవాలని ఫ్యామిలీ డాక్టర్: సీఎం జగన్
-
ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు: రజిని
-
‘ఫ్యామిలీ డాక్టర్’ ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఫ్యామిలీ డాక్టర్ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది: సీఎం జగన్
సాక్షి, పల్నాడు: దేశంలో గొప్ప మార్పునకు లింగంగుంట్ల నుంచి శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభోత్సవం కోసం గురువారం పల్నాడులో పర్యటించిన ఆయన.. లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీడాక్టర్ విధానం నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ కాన్సెప్ట్ దేశ చరిత్రలోనే రోల్ మోడల్గా నిలుస్తుందని సీఎం జగన్ ఆకాంక్షించారు. డాక్టర్ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు. విలేజ్ క్లినీక్లో సీహెచ్వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఉంటారు. ప్రతీ 2వేల జనాభాకు ఓ క్లినిక్ ఉంటుంది. మండలానికి రెండు పీహెచ్సీలు. ప్రతీ పీహెచ్సీలు ఇద్దరు వైద్యులు ఉంటారు. ఒకరు పీహెచ్సీలో ఉంటే.. మరొకరు ఆంబులెన్స్లో తిరుగుతుంటారు. వైఎస్ఆర్ విలేజ్క్లినిక్లను పీహెచ్సీలతో అనుసంధానిస్తాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని అన్నారాయన. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు ఉంటాయని పేర్కొన్నారు. అన్ని వైద్య సేవలు గ్రామంలో ఇంటి ముంగిటే అందించే గొప్ప పథకం ఇది. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తాం. మందులు ఉచితంగా అందించే గొప్ప కాన్సెప్ట్ ఈ ఫ్యామిలీ డాక్టర్ అని సీఎం జగన్ తెలిపారు. -
నా రాజకీయ భవిష్యత్ జగన్ పెట్టిన భిక్షే: విడదల రజిని
సాక్షి, పల్నాడు: చిలుకలూరిపేటలో అంతా జగనన్న అని పిలిస్తే.. ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడాలని కార్యక్రమానికి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. గురువారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పూర్తిస్థాయి ప్రారంభం కార్యక్రమంలో భాగంగా.. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట లింగంగుంట్ల వద్ద జరిగిన బహిరంగ సభలో విడదల రజని ప్రసంగించారు. సాధారణ బీసీ మహిళ అయిన తనకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు మంత్రిని చేశారంటూ సీఎం జగన్కు విడదల రజిని కృతజ్ఞతలు తెలియజేశారామె. తన రాజకీయ జీవితం, తన పదవులు, రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షేనంటూ సీఎం జగన్ను ఉద్దేశిస్తూ.. భావోద్వేగంతో రజిని కంటతడి పెట్టారు. సీఎం జగన్ ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారామె. భారత దేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఏనాడో చెప్పారు. పల్లె సీమలే దేశానికి పట్టుకోమలని మన సీఎం జగన్ బలంగా నమ్మారు. అందుకే వలంటీర్ వ్యవస్థ తెచ్చారని, ఆ వ్యవస్థ ఆత్మబంధువుల్లాగా పని చేస్తోంది. మహానగరాల్లో ధనవంతులు వినే ఫ్యామిలీ డాక్టర్ అనే మాటను.. గ్రామాల్లో ఉండే పేదల కోసం ఇక నుంచి ఫ్యామిలీ డాక్టర్ ఉండబోతున్నాడని ఆమె పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణం. ఇది జగన్ మానసపుత్రిక అని మంత్రి రజిని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో వైద్య సేవలు ఉచితమని, గ్రామాల్లో పేదల ఇంటి వద్దకే వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, అలాగే గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ సేవలు కొనసాగనున్నాయని ఆమె తెలిపారు. నాలుగేళ్లలో ఒక ముఖ్యమంత్రి ఎంత చేయొచ్చో.. సీఎం జగన్ ఆరోగ్య రంగంలో చేసి చూపించారని మంత్రి రజిని పేర్కొన్నారు. అయితే.. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏనాడూ ప్రజారోగ్యం గురించి ఆలోచించలేదని, పైగా ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టారని మంత్రి రజిని మండిపడ్డారు. పైగా దోమలపై దండయాత్ర, ఈగలపై కత్తి యుద్ధమంటూ కాలక్షేపం చేశారో రాష్ట్ర ప్రజలు చూశారని ఆమె గుర్తు చేశారు. పేదవాడి ఆరోగ్యం కోసం ఏనాడూ మంచి ఆలోచించలేదని, కేవలం మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబుపై ఆమె మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనొచ్చేమో, నాలుగు టీవీలు.. పత్రికలు ఉండొచ్చేమో, నాలుగు పార్టీలతో పొత్తు ఉండొచ్చేమో. కానీ, గుర్తు పెట్టుకోండి చంద్రబాబుగారు నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో మీరు ఎప్పటికీ ఉండరు. ఆ స్థానం జగనన్నదని మంత్రి రజిని ఉద్ఘాటించారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొచ్చేమోగానీ, జగన్ కోసం ప్రాణమిచ్చే ప్రజాభిమానం కొనసాగించలేరని పేర్కొన్నారామె. దుష్టచతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా.. భూమి చీలినా.. నింగి కుంగినా.. అన్యాయానికి ఓటమి తప్పదని, చంద్రబాబు టీడీపీ ఓటమి తప్పదని, జగనన్న గెలుపు తథ్యమని మంత్రి రజిని పేర్కొన్నారు. వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి.. ఊపిరి కావాలంటే వాయుదేవుడు కావాలి.. పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి.. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి.. మళ్లీ మళ్లీ జగనన్నే రావాలి అని పేర్కొన్నారు. ఏపీ ప్రస్తుతం మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు అంటోందని.. జై జగన్ నినాదాల నడుమ ప్రసంగం ముగించారామె. -
‘అగ్రిమెంట్స్’కు హక్కులు
2021 నవంబర్ వరకు జరిగిన సాదా బైనామాలను హక్కు పత్రాలుగా పరిగణిస్తూ దశాబ్దాల రైతుల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది. అన్ రిజిస్టర్ అగ్రిమెంట్ల ద్వారా భూములు కొనుగోలు చేసుకున్న రైతులు, తర్వాత వారి వారసుల అనుభవంలో ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో హక్కుదారులు కాలేకపోయారు. వీరికి పట్టాదారు పాసుపుస్తకాలు రాని పరిస్థితి. ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో పాత అగ్రిమెంట్లను అధికారిక హక్కు పత్రాలుగా గుర్తిస్తూ రైతులకు హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సత్తెనపల్లి: దశాబ్దాల తరబడి రెవెన్యూ శాఖలో అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భూముల రీ–సర్వే వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ముందుకు సాగుతోంది. మరోపక్క నిషేధిత భూములు (22ఏ) సమస్యల పరిష్కారానికి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో మరో రెవెన్యూ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. దశాబ్దాల తరబడి రైతులు ఎదురుచూస్తున్న ‘సాదా బైనామా’ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాదా బైనామా సమస్యలు పరిష్కారమై సంబంధిత వ్యవసాయ భూములపై శాశ్వత హక్కులు దక్కనున్నాయి. గతంలో తెల్ల కాగితాలు, స్టాంప్ పేపర్ల మీద వ్యవసాయ భూ లావాదేవీల అగ్రిమెంట్లు జరిగాయి. ఇటువంటి సాదా బైనామా లావాదేవీల భూములపై అధికారికంగా ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండవు. రెవెన్యూ శాఖలో ఆన్లైన్ కావు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా కుదరదు. ఇలా దశాబ్దాల క్రితం నుంచి జరిగిన లావాదేవీలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించి హక్కులు కల్పించాలని రైతులు సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే గత ప్రభుత్వాలు వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమస్యలుగా మిగిలిపోయాయి. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు తగిన మార్గదర్శకాలను జారీ చేసింది. దశాబ్దాలుగా పెండింగ్.. ఈ సాదా బైనామాల సమస్య ఇప్పటిది కాదు. దశాబ్దాల తరబడి పరిష్కారం కాని సమస్యగా రెవెన్యూ శాఖలో నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. 2021 నవంబర్ వరకు జరిగిన సాదా బైనామాలకు అనుమతి ఇచ్చింది. ఈ మార్గదర్శకాలు ఆధారంగా రెవెన్యూ అధికారులు సమస్యలు పరిష్కారానికి కసరత్తు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో సాదా బైనామా సమస్యలు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో సాదా బైనామా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మండలాల వారీగా సాదా బైనామాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. Ýë§é O»ñæ¯é-Ð]l*ÌS §éÓÆ> ¿¶æ*Ð]l¬ÌS Mö¯]l$-VøË$ B ¿¶æ*Ð]l¬-ÌSOò³ Ô>ÔèæÓ™èl çßæMýS$PË$ MýSÍ-µçÜ*¢ {糿¶æ$™èlÓ… ^èlÆý‡ÅË$ {糿¶æ$™èlÓ °Æý‡~-Ķæ$…™ø §ýlÔ>-»êªÌS ¯ésìæ çÜÐ]l$-çÜÅ-ÌSMýS$ ç³Ç-ÚëPÆý‡…2021 నవంబర్ వరకు జరిగిన అగ్రిమెంట్లకే 2021 నవంబర్ వరకు జరిగిన సాదా బైనామా లావాదేవీలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు ఎకరాల లోపు భూమి ఉండే సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆపై భూమి ఉండే రైతులు మార్కెట్ ధర ప్రకారం రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. – కె.నగేష్, తహసీల్దార్, సత్తెనపల్లి -
అనుబంధాల ఆర్తనాదం
సమాజంలో బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువ ఉంది. కొన్ని సందర్భాల్లో అత్యాశ, అనుమానం, వ్యామోహం ఈ విలువలను దిగజార్చేలా చేస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు, కొన్నిచోట్ల పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు సైతం వివాహేతర సంబంధాల వల్ల విచ్ఛిన్నమవుతున్నాయి. హద్దులు దాటాక ఊహించని పరిణామాలు జరిగి వ్యక్తుల జీవితాలు, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రస్తుతం కాలంలో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇందుకు వివాహేతర సంబంధాలే కారణం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్రమ సంబంధాలు, ఆస్తికోసం అడ్డు వస్తున్నారని భార్య లేదా భర్త ఒకరినొకరు చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రపంచంలోనే ఆదర్శ కుటుంబ వ్యవస్థ కలిగిన దేశం మనది. నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశించి చేసుకున్న పెళ్లినాటి ప్రమాణాలు పటాపంచలవుతున్నాయి. ఫలితంగా ప్రాణంగా ప్రేమించిన వారు.. జీవితాంతం తోడుండాల్సిన వారే తోడేళ్లవుతున్నారు. బంధం బలపడాలంటే.. దాంపత్యంలో దాపరికాలు ఉండకుండా చూసుకోవాలి. పొరపాట్లు జరిగినా.. అనుమానాలు.. అవమానాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలి. భార్యాభర్తలు ప్రతిరోజు కొంత సమయం ఒకరికొకరు కేటాయించుకోవాలి. బాధ్యతల్లో పడి ప్రేమించే వారిని ఒంటరిగా వదిలేయకూడదు. మనస్పర్థలు వచ్చినా కూర్చుని మాట్లాడుకోవాలి. ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా అపోహలు తొలిగే ప్రయత్నం రెండువైపులా జరగాలి. ఎవరి తప్పు ఉందో తెలుసుకుని సున్నితంగా పరిష్కరించుకోవాలి. మరోమారు అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. పిల్లల ముందు అస్సలు గొడవ పడరాదు. ఎవరైనా మనసును ప్రభావితం చేస్తుంటే సున్నితంగా తిరస్కరించాలి. తనకు జీవిత భాగస్వామి, పిల్లలు ఉన్నారని, కుటుంబ బాధ్యత ఉందని గుర్తెరగాలి. వివాహేతర సంబంధాలు ఆర్థిక, సామాజిక, శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని గమనించాలి. ఆదర్శమైన ఆ ఐదుగురు దంపతులు... గుండె గుడిలో లక్ష్మీదేవి నిండిపోయి ఉంటుందని చాటుతూ వక్షస్థలంపై చోటిచ్చిన లక్ష్మీనారాయణుల్లా.. దేహంలో సగభాగం పార్వతీ అంటూ అర్ధనారీశ్వురుడైన గౌరీశంకరుల్లా.. దంపతుల ఇద్దరి మాట ఒకటేనంటూ సతీ సరస్వతిని నాలుకపై నిలిపిన బ్రహ్మదీసరస్వతుల్లా.. జీవకోటిని మేల్కొపుతూ పరుగులు పెట్టే భర్తను అనుసరించే భార్య ఛాయాదేవి, సూర్యుడిలా.. సర్దుకుపోయేతత్వం ఉన్న రోహిణిచంద్రుడిని ఆదర్శంగా తీసుకుని అందంగా, ఆనందంగా తీర్చుదిద్దుకోవాలి. మొత్తం మీద భార్య నుంచి భర్తకు కావాల్సింది ఉపశమనం, సాంత్వన, పోషణ, కాని భార్యకు భర్త నుంచి కావాల్సింది అనుక్షణం సం‘రక్షణ’ ఒక్కటే. పెళ్లినాటి ప్రమాణాలు, నియమాలు, ఒప్పందాలను మర్చిపోకుండా మంచి సమాజం కోసం కుటుంబాన్ని ఆదర్శవంతంగా కొనసాగించినపుడే ఆ దాంపత్యంలో ఆనందం చిరస్థాయిగా ఉంటుంది. నమ్మకంతో మెలగాలి దంపతులు ఒకరిపై మరొకరు నమ్మకంతో మెలగాలి. దంపతుల మధ్య దాపరికాలు ఉండకూడదు. సోషల్ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. వృత్తికి, కుటుంబానికి సమపాళ్లలో సమయం కేటాయించాలి. భార్యాభర్తలు ఇంట్లో ఉన్నప్పుడు వ్యాయామం, భోజనం, అల్పాహారం కలిసి చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. పండుగలు, వారంతపు సెలవుల్లో ఒక రోజు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు కేటాయించడం ద్వారా అంతరాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది. డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసిక వ్యాధి వైద్య నిపుణుడు, జీజీహెచ్, గుంటూరు -
28న సీఎం జగన్ తెనాలి పర్యటన
తెనాలి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెనాలి పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించినట్టుగా ఈ నెల 27వ తేదీ కాకుండా 28వ తేదీ సీఎం పర్యటన ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి తెనాలికి చేరుకుంటారని, వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగే సభలో రైతులకు నాలుగో సంవత్సరం మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సాయం, ఇటీవల పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో శనివారం మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్ వద్ద జరిగే పనులను వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ సి.హరికిరణ్, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ ఆరిప్ హఫీజ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి పరిశీలించారు. వీరితో జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, తెనాలి డీఎస్పీ డాక్టర్ కె.స్రవంతిరాయ్ ఉన్నారు. అనంతరం తెనాలి సబ్కలెక్టర్ కార్యాలయంలో సీఎం పర్యటనపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.నేటి నుంచి నృసింహుడి బ్రహ్మోత్సవాలు 7న దివ్య రథోత్సవం మంగళగిరి: పానకాల లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమై మార్చి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నేతృత్వంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి పెండ్లి కుమారుడి ఉత్సవంతో ప్రారంభం కానున్నాయి. 27వ తేదీ రాత్రి 8 గంటలకు ధ్వజారోహణం, 6వ తేదీ రాత్రి 12 గంటలకు స్వామివార్ల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 7న ఉదయం 6 గంటలకు బంగారు గరుడోత్సవం, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 8 నుంచి టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు ఎఫ్ఏ–4కు బదులుగా ప్రీ–ఫైనల్ పరీక్ష గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు ప్రీ–ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ప్రీ–ఫైనల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా పబ్లిక్ పరీక్షల మాదిరిగా ఆరు పేపర్ల విధానంలో రూపొందించిన ప్రశ్నపత్రాలతో ప్రీ–ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. మార్చి నెలాఖరులో నిర్వహించాల్సిన ఎఫ్ఏ–4 పరీక్షలను రద్దు చేసి, వాటి స్ధానంలో ప్రీ–ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు హెచ్ఎంలు, ఉప విద్యాశాఖాధికారులు, డీఈవోలు తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ వీఎస్ సుబ్బారావు మార్గదర్శకాలు విడుదల చేశారు. -
దాచేపల్లిలో వ్యక్తి దారుణ హత్య
దాచేపల్లి: దాచేపల్లిలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని కర్రతో కొట్టి చంపి శరీర భాగాలను ముక్కలుగా చేసి తగులబెట్టిన దారుణ సంఘటన చోటుచేసుకుంది. సీఐ షేక్ బిలాలుద్దీన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి నగర పంచాయతీలో గరికపాటి కోటేశ్వరరావు (43) పంప్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య దుర్గమల్లేశ్వరి, కుమారుడు శివశంకర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచికల్లులో ఉంటున్నాడు. రాత్రి అచ్చాలగడ్డలోని వాటర్ ట్యాంక్ వద్ద వాల్ కట్టేసి వస్తానని ఇంట్లో చెప్పి కోటేశ్వరరావు వెళ్లాడు. అప్పటికే అక్కడ వేచిఉన్న మరో పంప్ ఆపరేటర్, నిందితుడు బంబోతుల సైదయ్య తన భార్య పట్ల అసభ్యకరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని ప్రశ్నించాడు. కోటేశ్వరరావు తలపై సైదయ్య కర్రతో బలంగా కొట్టాడు. మరణించాడని నిర్ధారించుకుని సైదయ్య ఇంటికెళ్లి కుమారుడు నాగరాజుకు విషయం చెప్పి డీజిల్, గోనెసంచితో వచ్చాడు. కోటేశ్వరరావు మృతదేహాన్ని నాగరాజు, సైదయ్య గోనెసంచిలో పెట్టుకొని ద్విచక్ర వాహనంపై ఆదర్శ పాఠశాల సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లారు. గొడ్డలితో శరీరాన్ని 14 ముక్కలు చేశాడు. శరీర భాగాలపై పత్తికట్టెను వేసి డీజిల్ పోసి నిప్పు పెట్టాడు. కోటేశ్వరరావు శరీర భాగాలన్నీ మంటల్లో కాలిబూడిద కాగా, కాలిపాదం మాత్రం కాలిపోలేదు. రాత్రి 11 గంటలైనా కోటేశ్వరరావు ఇంటికి రాకపోవటంతో తమ్ముడు సైదారావు, కుమారుడు శివశంకర్ వెతుకులాట ప్రారంభించారు. ఆదర్శ పాఠశాల సమీపంలో సైదయ్యను గమనించి కోటేశ్వరరావు ఎక్కడని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపో యాడు. సైదయ్య పొలంలో మంటల పక్కనే కాలిపాదాన్ని గుర్తించారు. దీంతో కోటేశ్వరరావు మృతదేహంగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సైదయ్య, అతని కుమారుడు నాగరాజు, సైదయ్య భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కర్ర, గొడ్డలి, కాలిపాదాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోటేశ్వరరావును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబం, రజక సంఘం నాయకులు కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ వేపై శనివారం ఆందోళనకు దిగారు. చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడు కోటేశ్వరరావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిలాలుద్దీన్ తెలిపారు. MýS{Æý‡™ø Mösìæt ^èl…í³ Ô¶æÈ-Æ>°² VöyýlzÍ™ø 14 Ð]l¬MýSPË$ ^ólíܯ]l OÐðl¯]l… yîlhÌŒæ ´ùíÜ Ð]l$–™èl$yìl ÔèæÈÆý‡ ¿êV>-ÌS¯]l$ ™èlVýS$-ÌS-»ñæ-sìæt¯]l °…¨-™èl$yýl$ çßæ™èlÅMýS$ Eç³-Äñæ*-W…_¯]l MýS{Æý‡, VöyýlzÍ ÝëÓ«-©¯]l… -
వివాహేతర సంబంధంతో అలజడి
భార్యను దూరం పెట్టిన ఓ భర్త సహ ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రహస్యంగా ఆ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం సహజీవనం చేస్తున్న యువతి ప్రియుడికి తెలిసింది. తాను ప్రేమించిన యువతి డబ్బు మోజులో తనను మోసం చేసిందని స్నేహితులకు చెప్పుకుని ఏడ్చాడు. మిత్రుడి బాధను చూసి అంతా కలిసి స్కెచ్ వేశారు. ఉద్యోగిని మందు పార్టీకని పిలిచి అందులో విషం ఇచ్చి చంపేశారు. పోస్టుమార్టంలో అసలు నిజం వెలుగుచూసి వారందరూ అరెస్ట్ అయ్యారు. ఇక్కడ మృతుడి భార్య ఒంటరిదై పోయింది. ప్రేమించిన యువతి మోసంతో యువకుడు కటకటాలపాలయ్యాడు. ఇవి మానవ సంబంధాల్ని దెబ్బతీస్తున్న కొన్ని ఘటనలు. మన మధ్యే జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలకు వెనుక ఉన్న యథార్థ గాథలు..! – గుంటూరు డెస్క్ -
అనుమానమే పెనుభూతమై..
ఉపాధి కోసం ముగ్గురు పిల్లలతో పట్టణానికి వచ్చారు ఆ దంపతులు. ఇద్దరూ రోజువారీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అధిక సంతానానికి తోడు భర్త మద్యానికి బానిస కావడంతో ఖర్చులు పెరిగాయి. వీరుంటున్న ఇంటి పక్కనే భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరి ఇబ్బందుల్ని గుర్తించి ఆమె పలుమార్లు డబ్బుసాయం అందించింది. దీంతో ఎక్కువసార్లు భార్య ఆ ఇంటికి వెళ్లేది. ఇది గమనించిన భర్త తన భార్య కూడా తప్పు చేస్తోందనే అనుమానం పెంచుకున్నాడు. నిజం చెప్పాలంటూ భార్యను పలుమార్లు బెదిరించాడు. చివరకు మద్యంలో విషం కలుపుకుని తాగి చనిపోయాడు. ఫలితంగా భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు. -
లక్ష్యాలతో ముందుకు సాగాలి
‘ఏ డే విత్ కలెక్టర్’లో విద్యార్థులతో కలెక్టర్ నరసరావుపేట: విద్యార్థి దశలో ఉన్నప్పుడే లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ పేర్కొన్నారు. ఏ డే విత్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో విద్యార్థులతో సమావేశమయ్యారు. వారిని పరిచయం చేసుకొని విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలకు చేరుకోవాలంటే అందుకు తగిన విధంగా అన్ని విషయాలపై పట్టుసాధించాలని పేర్కొన్నారు. ఉన్నత చదువులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా వివరించారు. మెదడుకు పదును పెట్టేలా విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగి చక్కని జవాబులు చెప్పిన వారికి బహుమతులు అందజేశారు. -
వైభవంగా నేతివెంకన్నస్వామి తిరునాళ్ల
రాజుపాలెం: నేతి వెంకన్న స్వామిగా ప్రసిద్ధికెక్కిన మండలంలోని దేవరంపాడుకొండపై మత్స్యరూపంలో వెలసిన వేంకటేశ్వరుని తిరునాళ్ల సందర్భంగా తొలి శనివారం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర జలనవరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్.శివశంకర్ తదితరులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. వీరికి వేదపండితులు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సమీప ప్రాంతాల నుంచే కాక సూదూర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. భక్తులు స్వామివారికి పొంగళ్లు పొంగించి నెయ్యి, బెల్లం, పప్పు వగైరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో దేవదాయశాఖ నుంచి ఆలయంలో మండపం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశామని అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వారి వెంట డీఎఫ్ఓ రామచంద్రరావు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, సహాయ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, మండల కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు, ఎంపీపీ తేలుకుట్ల రాజేశ్వరి చంద్రమౌళి, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ మర్రి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సునీత, మాజీ ఎంపీపీ బాసు లింగారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ అంబటి బ్రహ్మయ్య, సర్పంచ్ పత్తిపాటి దీనమ్మ కోటేశ్వరరావు, ఈఓ గుర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే తిరునాళ్ల విజయవంతం
● జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జిల్లా ఎస్పీ రవిశంకర్, ఎమ్మెల్యే డాక్టర్గోపిరెడ్డి ● తిరునాళ్ల విధులు నిర్వర్తించిన అధికారులకు సత్కారం నరసరావుపేటరూరల్: సమష్టి కృషితోనే కోటప్పకొండ తిరునాళ్ల విజయవంతం అయిందని పలువురు పేర్కొన్నారు. వినుకొండ రోడ్డులోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి అభినందన సభ నిర్వహించారు. కలెక్టర్ శివశంకర్ మాట్లాడు తూ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో తిరునాళ్లకు విస్త్రృత ఏర్పాట్లు చేశారన్నారు. లక్షలాది మంది యాత్రికులు వచ్చినా ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారు లు, సిబ్బంది పనిచేశారన్నారు. జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్దీకరణతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా విధులు నిర్వర్తించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయ లు మాట్లాడుతూ తిరునాళ్ల ఏర్పాట్లు తనకు సంతృప్తినిచ్చాయన్నారు. గతంలో వీఐపీలు దర్శనం కోసం సామాన్య భక్తు లు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. ఈ ఏడాది చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ తిరునాళ్లకు సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చారన్నారు. పల్నాడు జిల్లాగా ప్రకటించిన తరువాత జరిగిన మొదటి తిరునాళ్లను జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారన్నారు. కొండపైన, దిగువున మున్సిపల్, పంచాయతీ సిబ్బంది చక్కగా నిర్వహించారని ప్రశంసించారు. తిరునాళ్ల విధులు నిర్వర్తించిన అధికారులు, సంక్రాంతి సంబరాలు, జాతీయ స్థాయి వృషభరాజముల ఎడ్ల పందాల నిర్వాహకులను సత్కరించారు. పౌడా చైర్మన్ మిట్టపల్లి రమేష్బాబు, ఆర్అండ్బీ ఈఈ రాజానాయక్, డీఆర్ఓ వినాయకం, ఆర్డీఓ శేషారెడ్డి, డీఎఫ్ఓ రామచంద్రారావు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి...
మార్టూరు: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపుతప్పడంతో ఓ యువకుడు మృతి చెందగా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కోనంకి ఇసుక దరిశి గ్రామాల మధ్యన శుక్రవారం రాత్రి జరిగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని కుమ్మరిపాలెం కాలనీకి చెందిన షేక్ లతీఫ్ (24), ఎల్లగాల నరేంద్ర, కన్నెబోయిన అవినాష్, సురేష్, గోపి స్నేహితులు. వీరిలో లతీఫ్కు గల్ఫ్లో ఉద్యోగం రావడంతో రెండు నెలల్లో వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అవినాష్ తన కాబోయే భార్యతోపాటు తన ముగ్గురు స్నేహితులతో కలిసి తిరుమల దైవ దర్శనానికి వెళ్లా రు. దైవ దర్శనం అనంతరం శుక్రవారం స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. నరేంద్ర కారు నడుపుతుండగా జాతీయ రహదారిపై కోనంకి సమీపంలోకి రాగానే కారు ముందు టైరు ఒక్క సారిగా పేలడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని తాకుతూ వెళ్లి పల్టీ కొట్టింది. డ్రైవర్ పక్కన కూర్చొన్న లతీఫ్ తలకు గాయాలు కాగా మిగిలిన నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. క్షత గాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభు త్వాసుపత్రికి తరలించారు. లతీఫ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
అనుమతులు లేకుండా రాష్ట్ర రహదారిపై ధర్నా
రొంపిచర్ల: రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ అనుమతులు లేకుండా ధర్నా చేయటంతోపాటు విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్బాబు తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై అతని సమీప బంధువు, అదే పార్టీకి చెందిన పమ్మి వెంకటేశ్వరరెడ్డి దాడికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతిని నిరసిస్తూ రొంపిచర్ల విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటలు రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని ఆందోళన విరమించాలని టీడీపీ నాయకులకు సర్థి చెప్పారు. అయినప్పటికీ వినకుండా రెండు గంటల సేపు రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించి వారి విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు వీఆర్వో సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదలవాడపై కేసు నమోదు నరసరావుపేటరూరల్: నరసరావుపేట–చిలకలూరిపేట రోడ్డులోని ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద బాలకోటిరెడ్డి మృతదేహంతో ధర్నా నిర్వహించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో సహా 30 మందిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా దాదాపు గంటన్నరపాటు ధర్నా నిర్వహించినట్లు వీఆర్వో రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శుక్రవారం రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపారు. -
క్రీడల్లో ప్రావీణ్యంతో సవాళ్లను అధిగమించొచ్చు
ఏఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ జాన్సన్ గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థతతో అధిగమించగలరని ఏఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ పి.జాన్సన్ పేర్కొన్నారు. శుక్రవారం అమరావతిరోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో స్పర్ధ పేరుతో ఏర్పాటు చేసిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీడాంశాల్లో శిక్షణ పొందిన విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా గెలుపు, ఓటములను తేలిగ్గా తీసుకునే ఆత్మ విశ్వాసం కలుగుతాయని అన్నారు. కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు, ఏఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల అభివృద్ధికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. ముందుగా క్రీడాజ్యోతిని వెలిగించిన ప్రొఫెసర్ జాన్సన్, పావురాలను, బెలూన్లను ఎగురవేశారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి కబడ్డీ రిఫరీ వెలగా అమ్మయ్య, కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్.మధుసూదనరావు, గౌరవ చైర్మన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ నాగభూషణం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవికుమార్, ఫార్మా.డి డైరెక్టర్ పి. సీతారామయ్య, ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్ అజిత్బాబు, ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మాతృమరణాలు మరెక్కడా జరగకుండా చూడండి
నరసరావుపేట: మాతృమరణాలు ఎక్కడా చోటుచేసుకోకుండా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు కృషిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి.శోభారాణి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో మాతృ మరణాలపై ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి మాసంలో చోటుచేసుకున్న మాతృ మరణాలను కమిటీ సభ్యులు ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులు, బాధితులను విచారించి మరణం సంభవించడానికి గల కారణాలను విశ్లేషించారు. తదుపరి ఇలాంటి మరణాలు ఎక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తదుపరి లింగ నిర్ధారణ చట్టం, 1994పై పోస్టరు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణాధికారి, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బీవీ.రంగారావు, జిల్లా డెప్యూటీ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ గీతాంజలి, ఐసీడీఎస్ పీడీ డాక్టర్ నాగపద్మజ, డాక్టర్లు మంత్రూ నాయక్, వసంత రాయ, హనుమకుమార్, ఆశాలు, ఏఎన్ఎంలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శోభారాణి -
రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనకు ఎంపిక
అద్దంకి: రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శనకు మండంలోని తిమ్మాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. 9వ తరగతి విద్యార్థి షేక్ మహ్మద్ అబ్దుల్ ఖుర్షిద్ అఫ్జల్ ప్రదర్శించిన ప్రాజెక్టు ఎంపికై నట్లు హెచ్ఎం కేవీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి, 24న బాపట్లలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రదర్శనలో ద్వితీయ స్థానం పొందిన విద్యార్థి ప్రాజెక్టు ‘ఎకో ఫ్రెండ్లీ పియాజో ఎలక్ట్రిసిటీ’ ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థికి గైడ్గా ఫిజిక్స్ ఉపాధ్యాయుడు ఎస్ జే శ్రీనివాసరావు వ్యవహరించారు. మరో విద్యార్థి ఎస్వీ పార్థసాయి తయారుచేసిన ‘మదర్స్ స్మార్ట్ అండ్ హెల్దీ కిచెన్’ ప్రాజెక్టు జిల్లాలో ద్వితీయ స్థానం పొంది రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికై ందని తెలిపారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును అభినందించారు. -
చెరువుకు స్వేచ్ఛ
సాక్షి, నరసరావుపేట: కొన్ని చెరువులు ఆక్రమణదారుల చెరలో చిక్కుకోవడం రూపురేఖలు కోల్పోవడం జరుగుతోంది. చెరువులకు నీరు సరఫరా చేసే వరద కాలువలను సైతం అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించుకొని తమ పొలాల్లో కలుపుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ వర్షాలకు సైతం చెరువులు పూర్తి స్థాయిలో నిండటం లేదు. ఇలా చెరువులు ఆక్రమణలకు గురికావడంతో చెరువుల విస్తీర్ణం కుంచించుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో ఆయకట్టు రైతులు, చెరువులపై ఆధారపడిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన సామాజికవేత్త, న్యాయవాది అయిన పచ్చల కోటేశ్వరరావు లోకాయుక్తకు 2016 సంవత్సరంలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుత పల్నాడు జిల్లా పరిధిలోని ఆరు చెరువులను గట్టుపక్కనే ఉండే రైతులు ఆక్రమించి, వాటి పరిధిని తగ్గిస్తున్నారని అందులో పేర్కొన్నారు. సాగునీటి వనరు కోసం కేటాయించిన భారీ చెరువులు క్రమేణ తగ్గిపోతున్నాయని, భవిష్యత్ నీటి అవసరాల కోసం వాటిని సంరక్షించాలంటూ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త పలుమార్లు విచారణ జరిపి ఆక్రమణకు గురైన చెరువులను సంరక్షించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా మైనర్ ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. సర్వే నిర్వహించి ఆక్రమణలు ఎంతమేరకు జరిగాయో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. ఆక్రమణల గుర్తింపు.. లోకాయుక్త ఆదేశాల మేరకు మైనర్ ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు చెరువు భూముల ఆక్రమణలను సర్వే ద్వారా గుర్తించారు. చెరువులు ఆక్రమణలకు గురైన వాటిలో యడ్లపాడు మండలంలోని మైదవోలు, కారుచోల, యడ్లపాడు, నాదెండ్ల మండలంలోని గొరిజవోలు, నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు, నకరికల్లు మండలంలోని కంకలగుంట్ల చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 110.8 ఎకరాల భూములు కబ్జాకు గురైనట్టు అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు చెరువు భూముల ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు. కబ్జాకు గురైన పలు చెరువుల భూములకు విముక్తి కలిగిస్తున్నామని పంచాయతీరాజ్, మైనర్ ఇరిగేషన్ శాఖలు లోకాయుక్తకు నివేదిక సమర్పించాయి. 2023 ఫిబ్రవరి 21న లోకాయుక్త సదరు భూముల్ని స్వాధీనం చేసుకుని ఆయా భూములకు పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జలశక్తి అభియాన్ ద్వారా పనులు.. ఆక్రమణలకు గురైన చెరువులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పునరుద్ధరించి సమీపంలోని రైతుల పొలాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కొన్నింటిలో జలశక్తి అభియాన్న పథకం ద్వారా నీటి నిల్వలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టామని చైర్మన్న జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డికి అధికారులు నివేదిక సమర్పించారు. రానున్న రెండు నెలల్లో చెరువుల హద్దులను గుర్తించి, చుట్టూ కందకాలను ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్న అధికారులు తెలిపారు. జలజీవన్న మిషన్లో భాగంగా ఆయా చెరువుల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అన్యాక్రాంతమైన చెరువు భూములను తిరిగి వెనక్కి తెస్తుండటంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో సాగునీటికి ఢోకా లేదంటున్నారు. చెరువుల చుట్టూ కందకాలు తవ్వుతాం చెరువుల సంరక్షణకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేసి సరిహద్దులు గుర్తిస్తే ఉపాధి హామీ పథకం ద్వారా కందకాలు తవ్వుతాం. సరిహద్దుల చుట్టూ ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపడతాం. చెరువుల్లో వర్షపు నీరు చేరేలా జల సంరక్షణ పనులు కూడా చేపడతాం. జలశక్తి అభియాన్ ద్వారా పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – జోసఫ్కుమార్, డ్వామా పీడీ, పల్నాడు జిల్లా ఆక్రమణలు తొలగించడం శుభపరిణామం చెరువు భూములను ఆక్రమించడంతో నానాటికీ పరిధి తగ్గిపోతోంది. ఈ సమయంలో చెరువులను సర్వే చేసి చెరువు వాస్తవ పరిధిని గుర్తించి ఆక్రమణలు తొలగించి, రక్షణ చర్యలు తీసుకోవడం శుభపరిణామం. దీనివల్ల పూర్థిస్తాయిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుంది. – కె.వీరారెడ్డి, గొరిజవోలు, నాదెండ్ల మండలం -
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 551.70 అడుగుల వద్ద ఉంది. ఇది 213.5390 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 10,350, ఎడమ కాలువకు 8,986, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 17,203, ఎస్ఎల్బీసీకి 2,200, వరద కాలువకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 39,059 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 4,553 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 825.60 అడుగుల వద్ద ఉంది. ఇది 45.3174 టీఎంసీలకు సమానం. ఎన్నికల పరిశీలకులుగా కోన శశిధర్ బాపట్ల: ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా కోన శశిధర్ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను కోన పరిశీలిస్తారు. ఎన్నికల నిర్వహణలో సమస్యలు ఉంటే 93919 23114 సెల్ నంబరుకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. యార్డులో 1,12,995 బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,06,231 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,12,995 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ.21,800 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ.25,500 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.12,500 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 80,610 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. త్రికోటేశ్వరుడికి బంగారు రుద్రాక్ష మాల నరసరావుపేట రూరల్: కోటప్పకొండపై కొలువైన త్రికోటేశ్వరస్వామికి చిలకలూరిపేటకు చెందిన విడదల వేణుగోపినాథ్, స్పూర్తి దంపతులు రూ.4.40 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు రుద్రాక్షమాలను బహూకరించారు. ఆలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో స్వామి సన్నిధిలో బంగారు రుద్రాక్ష మాలను దాతలు ఆలయ ఈవో వేమూరి గోపికి అందజేశారు. బంగారు రుద్రాక్ష మాలతో స్వామి వారికి అభిషేకం నిర్వహించి దాతలకు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు. కార్యక్రమంలో అర్చక స్వాములు, సిబ్బంది పాల్గొన్నారు. ఏప్రిల్ 4న ‘కలెక్టర్ ట్రోఫీ’ పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా ఏర్పాటై ఏప్రిల్ 4వ తేదీకి సంవత్సరం కావస్తున్నందున అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, యువతను కలుపుకొని కలెక్టర్ ట్రోఫీ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. శుక్రవారం పిడుగురాళ్ల పట్టణంలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో రెవెన్యూ, సివిల్, వెల్ఫేర్, లా అండర్ ఆర్డర్ ప్రభుత్వ ఉద్యోగులను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేసి ఈ ట్రోఫీని నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనిలో యువతను కూడా భాగస్వాములను చేసి వారిని కూడా మండలానికి ఒక జట్టును ఎంపిక చేసి పోటీలు నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కలెక్టర్ ట్రోఫీ క్రీడలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. మార్చి, ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి కాబట్టి మే నెలలో యువతకు పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని తెలియజేశారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
మాచవరం: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశించారు. మాచవరం మండలంలో శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తహసీల్దారు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దారు కార్యాలయంలో కుప్పలుగా పడిఉన్న పాత రికార్డులను చూసి, రికార్డులను వెంటనే గదిలో భద్రపర్చాలని సూచించారు. రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై మండల పరిషత్ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ద్వారా మంజూరైన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కాన్పుల గదులు, రోగులకు వసతి కల్పన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై సిబ్బందితో చర్చించారు. ఉద్యోగుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించాలని సూచించారు. అనంతరం పిల్లుట్లలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్దులతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మెనూ, వసతి తదితర అంశాలపై సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామన్నారు. విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. రుక్మిణీపురంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీడీఓ వై.రాజగోపాల్, డీటీ సుబ్బారావు, ఏపీఎం శివశంకర్, ఏపీఓ వెంకటేశ్వర్లు, ఏఈలు సురేష్ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ప్రాక్టికల్స్కు ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సైన్స్ కోర్సుల విద్యార్థులకు ఆదివారం నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్న ప్రయోగ పరీక్షలు (ప్రాక్టికల్స్)కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియెట్ విద్య ఆర్ఐవో గన్నెపూడి సునీత తెలిపారు. సాంబశివపేటలోని ఆర్ఐవో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్స్కు హాజరు కానున్న 35,881 మంది విద్యార్థులకు 192 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నాన్ జంబ్లింగ్ విధానంలో జరిగే ప్రాక్టికల్స్కు హాజరుకానున్న విద్యార్థుల్లో ఎంపీసీ 28,772 మంది, బైపీసీ 7,117 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12, తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే ప్రాక్టికల్స్కు హాల్ టికెట్ కలిగిన విద్యార్థులను అర్ధగంట ముందుగా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. మూడు స్పెల్స్లో జరగనున్న ప్రాక్టికల్స్లో 400 మందికి మించిన విద్యార్థులు ఉన్న కళాశాలల్లో అదనంగా మరో ప్రాక్టికల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏ, బీ సెంటర్లుగా విభజించినట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ప్రాక్టికల్స్ సెంటర్లలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, ఇంటర్బోర్డు నుంచి ఉన్నతాధికారులు లైవ్ స్ట్రీమింగ్ విధానంలో ప్రత్యక్షంగా పరిశీలిస్తారని చెప్పారు. కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఒక్కరే సెల్ఫోన్ కలిగిఉండాలని, మిగిలిన సిబ్బంది ఎవ్వరి దగ్గర ఫోన్లు ఉండేందుకు అనుమతి లేదన్నారు. ప్రాక్టికల్స్ పూర్తవ్వగానే అక్కడికక్కడే పేపర్ల వాల్యూయేషన్ పూర్తి చేసి, సీల్డ్ కవర్లో సీఎస్కు అందజేయాలని పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీలకు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థికీ హాల్ టికెట్ ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకున్నా, కళాశాలల్లోని ప్రయోగ కేంద్రాల్లో ఏమైనా సమస్యలున్నట్లయితే గుంటూరు ఆర్ఐవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ (0863–2228528)కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో డీఈసీ సభ్యుడు టి.శేఖర్బాబు పాల్గొన్నారు. -
రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు
తెనాలి: వైఎస్సార్ రైతు భరోసా లబ్ధిదారులకు మూడో విడత ఆర్థిక సాయం, పంటలు నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కోసం ఈ నెల 27వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణానికి విచ్చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ శుక్రవారం సమీక్షించారు. అవసరమైన సూచనలను చేశారు. ముందుగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగే బహిరంగ సభా ప్రాంతం, కవిరాజ నగర్లోని హెలిప్యాడ్ ప్రాంతాన్ని అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మార్కెట్ యార్డు, చుట్టుపక్కల ప్రాంతాల్లో దారి వెంట బారికేడ్లను నిర్మించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద గ్రీన్రూమ్, టెంట్లను ఏర్పాటు చేయాలని, రైతులు సభకు వచ్చి వెళ్లేందుకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో తెనాలి సబ్కలెక్టర్ గీతాంజలి శర్మ, లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ అనిల్కుమార్, క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కె.కోటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ డాక్టర్ కె.స్రవంతిరాయ్, పొన్నూరు పోలీసు అధికారులు, స్పెషల్ బ్రాంచి సీఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం
యడ్లపాడు: నల్లబర్లీ పొగాకు రకానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రకారంగా గిట్టుబాటు అందించనున్నట్లు జీపీఐ కంపెనీ మేనేజర్ కోట ఉమామహేష్ చెప్పారు. మండలంలోని తిమ్మాపురం గ్రామంలో జీపీఐ, యూఎల్టీ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలో అత్యధికంగా నల్లబర్లీ సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ఏటా 10 నుంచి 15వేల హెక్టార్ల విస్తీర్ణంలో నల్లబర్లీ రకాన్ని రైతులు సాగు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది 12వేల హెక్టార్లలో వీటిని సాగు చేశారన్నారు. తమ కంపెనీ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఈ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడో ఏటా ప్రారంభించిన ఈ కేంద్రం వచ్చే జూలై వరకు ఉంటుదన్నారు. పొగాకు రైతులు తమ వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు తేమ లేకుండా గ్రేడ్ చేసుకుని కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఒక్కో రైతు ఎంత ఉత్పత్తినైనా తీసుకురావచ్చని ఉదయం 8 గంటల నుంచి కేంద్రం ప్రారంభం రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. సంబంధిత రైతులు తమ ఆధార్, బ్యాంక్ ఖాతా నంబర్లతో సరుకు తీసుకురావాలని కోరారు. నాలుగు జిల్లాలకు చెందిన పొగాకు రైతులు తమ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని మంచి గిట్టుబాటు ధరను పొందాలని ఆకాంక్షించారు. -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
దాచేపల్లి: పల్నాటికి గుండెకాయలాంటి అద్దంకి–నార్కెట్పల్లి హైవేకి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేగా నామకరణం చేయటం శుభపరిణామం అని గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్రెడ్డి అన్నారు. దాచేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కాసు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దివంగత సీఎం కాసు బ్రహ్మనందరెడ్డి ఎక్స్ప్రెస్వేగా నామకరణం చేయటాన్ని యావత్తు పల్నాడు ప్రజానీకం హర్షిస్తుందని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ తాము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బ్రహ్మనందరెడ్డి రాజకీయంగా ఎదిగారని గుర్తు చేశారు. నాగార్జునసాగర్, పోచంపాడు ప్రాజెక్ట్లకు అత్యధికంగా నిధులు తెచ్చి సకాలంలో పూర్తిచేసేలా కృషి చేశారని, హైదరాబాద్లాంటి మహానగరంలో భారీ పరిశ్రమలు రావటానికి బ్రహ్మనందరెడ్డి కృషి చేశారని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని తీసుకువచ్చిన ఘనత బ్రహ్మనందరెడ్డికే దక్కుతుందని, పేదవారికి ఇళ్లు కట్టించేందుకు ఎల్ఐసీ ద్వారా రుణాలు తీసుకువచ్చి పేదల సొంతింటి కలను సాకారం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, ఎంపీపీ కటకం జయశ్రీ, వైస్ ఎంపీపీలు కందుల జాను, తండా అబ్దుల్సత్తార్, వైస్ చైర్మన్ షేక్ ఖాదర్బాషా, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, మాజీ సర్పంచ్ బుర్రి విజయ్కుమార్రెడ్డి, యార్డు మాజీ చైర్మన్ మునగా నిమ్మయ్య, కౌన్సిలర్లు చాట్ల క్రాంతికుమార్, మందపాటి వీరారెడ్డి, నాగుబండి గురువులు, ఈదా వెంకటరెడ్డి, నాయకులు కుందురు తిరుపతిరెడ్డి, ముశ్యం వెంకటేశ్వర్లు, సూర్రెడ్డి తదితరులున్నారు. -
మైనార్టీలకు మేలు చేసింది వైఎస్సార్ కుటుంబమే
మాచర్ల: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి తొలుత కృషి చేసింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డేనని, ఆయన బాటలోనే నడుస్తూ మైనార్టీలకు మేలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. శుక్రవారం 23వ వార్డులోని ఈద్గా ప్రహరీ నిర్మాణానికి రూ.32 లక్షలతో నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.కోటి నిధులు మైనార్టీలకు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మాచర్ల, రెంటచింతల, కారంపూడిలో ముస్లింలకు కమ్యూనిటీ హాళ్లతోపాటు ఈద్గా అభివృద్ధికి రూ.30 లక్షల సొంత నిధులు ఖర్చు చేసినట్టు వివరించారు. వైఎస్సార్ కుటుంబం ముస్లింలకు చేసిన మేలు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. రాబోయే రోజులలో ప్రతి ముస్లిం పేద కుటుంబానికీ ఇంటి స్థల పట్టా అందించి రుణాలు మంజూరు చేయించి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పీఆర్కే చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి, మైనార్టీ నేతలు రాష్ట్ర బ్యూటీషియన్ డైరెక్టర్ ఉప్పలపాటి జానీ, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ జలీల్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కామనబోయిన కోటయ్య, శ్రీనివాసశర్మ, కౌన్సిలర్లు మురళి, షేక్ సుభాని, దస్తగిరి, షేక్ కరిముల్లా, మస్తాన్, మైనార్టీ నాయకులు షేక్ సులేమాన్ బాషా, సీలింగ్ బాషా, కణితి మస్తాన్, ట్రాక్టర్ కరిముల్లా, రెహమాన్, మున్సిపల్ కమిషనర్ రమణబాబు, ఈఈ నాగభూషణం పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆదాయం పెంపునకు ప్రత్యేక చర్యలు
వేటపాలెం: ఏపీఎస్ఆర్టీసీకి ఆదాయం పెంపుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే ఆదంసాహెబ్ పేర్కొన్నారు. వేటపాలెం మండలం వేటపాలెం–చీరాల ప్రధాన రోడ్డు పక్కన పాత ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ని ఈడీ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు రీజనల్ పరిధిలో మొట్టమొదటిసారిగా వేటపాలెంలో ఫిల్లింగ్ స్టేషన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ స్టేషన్ ద్వారా వాహనదారులకు నాణ్యమైన డీజిల్, పెట్రోల్ అందుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. సంస్థ ఆదాయం పెంపుకోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్గో సేవల ద్వారా ప్రతి ఏడాది సంస్థకు రూ.250 కోట్లు ఆదాయం సమకూర్చుతున్నట్లు తెలిపారు. రాబోవు కాలంలో ఆదాయాన్ని రూ.500 కోట్లకి పెంచేవిదంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీనితో పాటు కమర్షియల్ ద్వారా కూడా మరో రూ.500 కోట్లు ఆదాయ సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వివిధ మార్గాల ద్వారా సంస్థకు వచ్చిన ఆదాయంతో ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడానికి కృషిచేస్తామని వివరించారు. కార్యక్రమంలో కమర్షియల్ చీఫ్ మేనేజర్ పీ చంద్రశేఖర్, వివిధ ఆర్టీసీ డిపో మేనేజర్లు శ్రీనివాసరెడ్డి, అజతకుమారి, కే శ్యామల సిబ్బంది పాల్గొన్నారు. -
తెనాలి నుంచి రైతు భరోసా
తెనాలి: నాలుగో సంవత్సరం మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని ఈ నెల 27వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెనాలి నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అదే వేదికపై నుంచి ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నగదును కూడా రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభావేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్కలెక్టర్ గీతాంజలిశర్మ పరిశీలించారు. బహిరంగ సభా వేదికగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును ఎంపిక చేశారు. తెనాలి–నారాకోడూరు రోడ్డులో కవిరాజనగర్ లేఅవుట్లోని ప్రదేశాన్ని సందర్శించి హెలిప్యాడ్ ఏర్పాటుకు నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఏరియాలో వైఎస్సార్ రైతు భరోసా/ పీఎం కిసాన్ లబ్ధిదారులు అధికంగా ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తెనాలి నుంచి చేపడుతున్నారని కలెక్టర్ వెల్లడించారు. సీఎం సభకు వచ్చే రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తెనాలిలో అడుగుపెడుతున్న సందర్భంగా అపూర్వంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మెప్మా పీడీ వెంకటనారాయణ, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, ఆర్అండ్బీ ఎస్ఈ బి.నిర్మల, ట్రాన్స్కో ఎస్ఈ ఆవుల మురళీకృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. 27న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఖాతాల్లోకి నగదు జమ ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా బదిలీ హెలిప్యాడ్, బహిరంగ సభా వేదిక పరిశీలించిన నేతలు -
కన్నతల్లిని చెత్తకుప్పలో వదిలేసిన కొడుకు
తాడేపల్లిరూరల్: పేగుబంధాన్ని మరచి ఓ కొడుకు కన్నతల్లిని అర్ధరాత్రి వేళ డంపింగ్ యార్డ్ మధ్యలో వదిలేసి వెళ్లిన సంఘటన గురువారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ బంధాలు, అనుబంధాలు మృగ్యమవుతున్నాయని చెప్పేందుకు ఈ సంఘటన వాస్తవ దర్పణం. గురువారం తెల్లవారుజాము నుంచి ఓ వృద్ధురాలు చెత్తాచెదారం మధ్య ఉండటాన్ని పారిశుద్ధ్య కార్మికులు, చెత్త ఏరుకునే వారు గమనించి బ్రహ్మానందపురం సచివాలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు వీఆర్వో విన్నయ్య సంఘటన స్థలానికి వెళ్లి వృద్ధురాలిని ఇక్కడున్నావేంటని ప్రశ్నించగా ఆమె కళ్ల వెంబడి కన్నీరు ధారలయ్యాయి తప్ప ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆ వృద్ధురాలని వీఆర్వో విన్నయ్య సచివాలయానికి తీసుకువచ్చి అల్పాహారం అందించారు. అనంతరం ఆమెను ఆప్యాయంగా పలుకరించగా ఇది నా ఖర్మ అంటూ తలబాదుకుంది. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిన్ను చక్కగా చూసుకుంటాం నీ పేరు ఏమిటని ప్రశ్నించగా తన పేరు ఎం.రామలక్ష్మి అని తెలిపింది. వారు అరగంట సేపు ఆమెతో మాట్లాడగా విజయవాడలోని గవర్నరుపేటలో తన నివాసమని, నా భర్త పేరు కృష్ణ అని, నా కొడుకు పేరు శ్రీనివాసరావు అని వివరించింది. బుధవారం రాత్రి 10 గంటలకు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లారని, చనిపోదామనుకున్నా ధైర్యం చాలలేదని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి తీసుకెళతామని చెప్పగా, చనిపోవడానికై నా సిద్ధంకాని అక్కడకు వెళ్లనని కన్నీటిపర్యంతమవ్వడం చూపరులను కలచివేసింది. తాడేపల్లి తహసీల్దార్ నాగిరెడ్డి ఆదేశాల మేరకు డోలాస్నగర్లోని మేరీ హోమ్స్లో వృద్ధురాలిని చేర్పించారు. ఈ సంఘటనపై పోలీసుల సహాయంతో విచారణ చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సమాచారంతో రంగంలోకి రెవెన్యూ సిబ్బంది వృద్ధురాలిని మేరీ హోమ్స్కు తరలింపు -
కూర్చోబెట్టి జీతాలు!
టెండర్ల ఫైల్స్ అనుమతి కోసం పంపాం జీజీహెచ్లో టెండర్ల ఫైల్స్ అనుమతి కోసం ఉన్నతాధికారుల వద్దకు పంపించాం. అనుమతి రాగానే టెండర్ల నోటిఫికేషన్ ఇస్తాం. కార్యాలయ ఉద్యోగుల పనితీరుపై దృష్టి సారించి ఫైల్స్ పెండింగ్లో లేకుండా చూస్తాం. – డాక్టర్ నీలం ప్రభావతి, సూపరింటెండెంట్, జీజీహెచ్, గుంటూరుగుంటూరు మెడికల్: ఆస్పత్రికి ఆదాయం వచ్చే సైకిల్ స్టాండ్ టెండర్ ప్రక్రియను మూడేళ్లుగా నిర్వహించకుండా కార్యాలయ ఉద్యోగులు చోద్యం చూస్తున్నారు. డైట్ టెండర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పలువురు గుంటూరు జీజీహెచ్ కార్యాలయ ఉద్యోగులు ఆసుపత్రికి వచ్చి హాజరు వేసి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటున్నా, ఒక్క నోట్ ఫైల్ కూడా సిద్ధం చేసి అధికారులకు పంపించకపోయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరికొంత మంది ఉద్యోగులకు ఎలాంటి విధి నిర్వహణ బాధ్యతలు (సీట్లు) కేటాయించకపోవడంతో వారు ఏ విధులు నిర్వహించకుండానే ఆసుపత్రిలో కాసేపు గడిపి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మళ్లీ సాయంత్రం తాపీగా వచ్చి హాజరు వేస్తున్నారు. పనివేళల్లో కార్యాలయ ఉద్యోగులు సీట్లలో లేకున్నా, వారు ఎలాంటి ఫైల్స్ సిద్ధం చేయకుండా ఖాళీగా కూర్చున్నా వారిని అజమాయిషీ చేసే వారు లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆసుపత్రి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మచ్చుకు కొన్ని.. ఆసుపత్రిలో కోవిడ్ సమయంలో కాంట్రాక్టు స్టాఫ్నర్సుగా పనిచేసిన ఎస్.కరుణకు వేతనం చెల్లించకుండా కార్యాలయంలోని ఓ ఉద్యోగి ఆమె జీతాన్ని వేరే వారి ఖాతాలో జమ చేశారు. ఈ విషయంపై పలుమార్లు బాధితురాలు ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో జనవరి 9న ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేసింది. తప్పిదానికి పాల్పడి ఉద్యోగికి జీతం చెల్లించకుండా ఆసుపత్రికి సంబంధం లేని, వేరే జిల్లాకు చెందిన వ్యక్తికి వేతనం వేసిన ఉద్యోగిపై నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో పలువురు అనర్హులకు ఉద్యోగాలు కేటాయించడంతో పలువురు కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడంతో నియామకపు ఉత్తర్వులు ఇచ్చిన అభ్యర్థులను వెనక్కు పిలిపించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఈ తప్పిదాలకు పాల్పడిన ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు మెడికల్ లీవ్లు మంజూరు చేయకపోవడం, అరియర్స్ చెల్లించకపోవడం, సర్వీస్ సంబంధిత విషయాలపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు లిఖిత పూర్వకంగా ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒకేచోట ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు జీజీహెచ్ కుటుంబ నియంత్రణ విభాగంలో ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు. ఇరువురు రెగ్యులర్ సీనియర్ అసిస్టెంట్లు కాగా, ఒకరు అనధికార డెప్యూటేషన్పై పనిచేస్తున్నారు. వాస్తవానికి కార్యాలయంలో ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తే సరిపోతుంది. మిగతా వారంతా కేవలం కాలక్షేపానికే సంబంధిత విభాగంలో కూర్చుండిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఆర్డీలో కూర్చుండిపోయారు జనన మరణాల నమోదుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే మెడికల్ రికార్డ్ డిపార్టుమెంట్లో కార్యాలయ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఖాళీగా కూర్చుండిపోతున్నారు. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్సు చదివిన అభ్యర్థులను ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్టు పద్ధతిలో నియమించింది. వీరు కాకుండా గతంలో శిక్షణ పొందిన జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఓ మెడికల్ ఆఫీసర్, శిక్షణ పొందిన ఇద్దరు విభాగంలో విధులు నిర్వహిస్తే సరిపోతుంది. కానీ అధిక సంఖ్యలో సిబ్బందిని ఎమ్మార్డీ విభాగంలో పోస్టింగ్స్ ఇవ్వడం వల్ల పలువురు ఉద్యోగులు ఏపని చేయకుండా ఖాళీగా కూర్చుండిపోతున్నారు. గుంటూరు జీజీహెచ్ కార్యాలయంలో విచిత్ర పరిస్థితి కొందరు ఉద్యోగులు ఫైల్స్ పెట్టరు.. సీట్లో ఉండరు కొంత మంది ఏ పని చేయకుండానే జీతాలు డ్రా చేస్తున్న వైనం ఏళ్ల తరబడి పేరుకుపోతున్న కార్యాలయ ఫైల్స్ చోద్యం చూస్తున్న ఆస్పత్రి అధికారులు పలువురు కార్యాలయ ఉద్యోగుల తీరుపై తీవ్ర విమర్శలుఅన్ని విభాగాల్లో ఇదే తీరు ఎస్టాబ్లీష్మెంట్ విభాగం, మేనేజర్ విభాగం, అకౌంట్స్ విభాగం, క్యాషియర్ విభాగం, మెడికల్ రీయింబర్స్మెంట్ విభాగం, డైట్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల్లో కేవలం ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్గా ఫైల్స్ సిద్ధం చేస్తున్నారు. మిగతా సిబ్బందంతా తమకు కీలకమైన ఫైల్స్, సీట్లు ఏమీ అప్పగించలేదంటూ ఖాళీగా మిన్నకుండిపోతున్నారు. మరో పక్క కలెక్టర్ గ్రీవెన్స్లో జీజీహెచ్ కార్యాలయంలో ఫైల్స్ పెండింగ్లో ఉంటున్నాయని, ముఖ్యంగా ఆసుపత్రికి ఆదాయం తీసుకొచ్చే టెండర్ల ఫైల్స్ కూడా చేయకుండా మిన్నకుండిపోతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆసుపత్రిలో 12 మంది సీనియర్ అసిస్టెంట్లు, 35 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, క్లర్క్ కమ్ టైపిస్టులు ఉండి కూడా కార్యాలయ ఫైల్స్ పేరుకుపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఆసుపత్రి అధికారులు స్పదించి కార్యాలయ ఉద్యోగుల పనితీరుపై పర్యవేక్షణ చేసి కార్యాలయంలో ఫైల్స్ పెండింగ్ లేకుడా చూడాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. -
టీడీపీ శవ రాజకీయాలు!
సాక్షి, నరసరావుపేట: టీడీపీకి శవరాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడ హత్య జరిగినా వైఎస్సార్ సీపీపై నెపం నెట్టి ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది. టీడీపీలో ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో హత్య జరిగితే దాన్ని వైఎస్సార్ సీపీపై నెట్టి టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఈ నెల 2న తుపాకీ కాల్పుల్లో రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డి తీవ్రంగా గాయపడి 20 రోజుల చికిత్స అనంతరం మంగళవారం మరణించిన నేపథ్యంలో శవరాజకీయాలకు మరోసారి తెరలేపింది. హత్యచేసింది అల్లుడే.. బాలకోటిరెడ్డికి అల్లుడు వరుసయ్యే పమ్మి వెంకటేశ్వరరెడ్డి టీడీపీలో క్రీయాశీలకంగా ఉంటూ రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. భవిష్యత్తులో పార్టీలో మంచి గుర్తింపు, పదవులు అప్పగిస్తానని చెప్పి గత పంచాయతీ ఎన్నికలు, గ్రామంలో జరిగే ప్రసన్నంజనేయస్వామి తిరునాళ్లకు నిందితుడు వెంకటేశ్వరరెడ్డితో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయించారు హత్యకు గురైన బాలకోటిరెడ్డి. తదనంతరం నిందితుడిని పట్టించుకోకుండా పార్టీలో కూడా సరైన స్థానం ఇవ్వకుండా చేస్తుండటంతో బాలకోటిరెడ్డిపై వెంకటేశ్వరరెడ్డి కక్ష పెంచుకున్నాడు. బాలకోటిరెడ్డి బతికి ఉండగా తనకు పార్టీలో స్థానం ఉండదని, గుర్తింపు లభించదని భావించాడు. ఎలాగైనా బాలకోటిరెడ్డిని చంపాలనే ఉద్ధేశంతో గత ఏడాది జూలై 19వ తేదీ నిందితుడు వెంకటేశ్వరరెడ్డి దాడిచేసి చంపే ప్రయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో బాలకోటిరెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ విషయమై రొంపిచెర్ల పోలీసులు వెంకటేశ్వరరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదుచేసి జైలుకి పంపారు. జైలులో రౌడీషీటర్ అంజిరెడ్డితో వెంకటేశ్వరరెడ్డి పరిచయం పెంచుకున్నాడు. అతనికి జరిగిన విషయాలు చెప్పి తనకు సహాయం చేయమని కోరినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం పమ్మి వెంకటేశ్వరరెడ్డి అంజిరెడ్డి, వెంకటేశ్వర్లు, రాములు అనే వ్యక్తులతో బాలకోటిరెడ్డి ఇంటికి వెళ్లి అతడిని బయటకు పిలిచి తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపారు. బుల్లెట్ నడుం కింది భాగంలోకి దూసుకెళ్లటంతో బాలకోటిరెడ్డి తీవ్ర గాయంతో పడిపోయాడు. బాలకోటిరెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇస్తూ తనపై హత్యాయత్నం చేసింది టీడీపీ నేత పమ్మి వెంకటేశ్వరరెడ్డి, మరో ముగ్గురు కిరాయి ముఠా అని తెలిపారు. హతుడి భార్య సైతం తన భర్తను చంపింది టీడీపీ నేత వెంకటేశ్వరరెడ్డి అంటూ పలు టీవీ చానళ్లలో సైతం మాట్లాడింది. పట్టించుకోని అరవింద్ బాబు.. ఏడాదికిపైగా బాలకోటిరెడ్డి, పమ్మి వెంకటేశ్వరరెడ్డి మధ్య అధిపత్య గొడవలు జరుగుతున్నా ఆ పార్టీ నరసరావుపేట ఇన్చార్జి చదలవాడ అరవింద్బాబు పట్టించుకోలేదు. వెంకటేశ్వరరెడ్డి అరవింద్బాబుకు ప్రధాన అనుచరుడిగా ఉంటున్నాడు. గత ఏడాది జూలై 19న హత్యాయత్నం చేసిన తర్వాతైనా ఆ పార్టీ పెద్దలు ఇద్దర్ని కూర్చోబెట్టి సర్దుబాటుచేయాల్సింది. వారి నిర్లక్ష్యంతో హత్య జరిగిన తర్వాత ఎప్పటిలాగే నెపం వైఎస్సార్ సీపీపై నెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్క చిన్న ఆధారం కూడా చూపకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మాపార్టీకి సంబంధం ఉన్నట్టు ఏదైనా ఆధారం చూపాలని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన సవాలుకు బదులిచ్చే సాహసం టీడీపీ నేతలు చేయడం లేదు. బాబు దూతలమంటూ వచ్చిన వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్కు అసలు విషయం తెలిసినా, స్క్రిప్ట్ ప్రకారం నాటకం రక్తి కట్టించి వెళ్లారు. బాలకోటిరెడ్డి శవాన్ని స్వగ్రామం అలవాలకు కాకుండా నరసరావుపేటలో ర్యాలీ చేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుచెప్పడంతో ఎస్ఆర్కే జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. టీడీపీ శవరాజకీయాలు చూసి ప్రజలు అసహ్యించుకోవడం గమనార్హం. టీడీపీలో ఆధిపత్యం కోసం జరిగిన హత్యపై రాద్ధాంతం రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిని చంపింది అల్లుడు వరసయ్యే పమ్మి వెంకటేశ్వరరెడ్డి వాంగ్మూలంలో బాలకోటిరెడ్డి, ఆయన భార్య అదే చెప్పారు వెంకటేశ్వరరెడ్డి టీడీపీలో క్రియాశీలక నేత ఏ ఆధారం లేకపోయినా వైఎస్సార్ సీపీపై నెపం మోపుతున్న ప్రతిపక్ష పార్టీ విజయవాడ నుంచి చంద్రబాబు దూతల పేరిట వచ్చి శవరాజకీయం చేసిన వర్ల, బుద్దా, గద్దె -
బాబు కోసం ఈనాడు విషపు రాతలు
● ఈనాడు ప్రతులను దహనం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు ● ఇలాంటి పత్రికలు రాష్ట్రంలో ఉండరాదన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేట: చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో 90 ఏళ్ల రామోజీరావు తన ఈనాడు దినపత్రికలో నీతి, నిజాయితీతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషపురాతలు రాయిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ పిలుపు మేరకు గురువారం సాయంత్రం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదుట ఈనాడు దినపత్రిక ప్రతులను నాయకులు, కార్యకర్తలతో కలిసి దహనం చేశారు. పాత ఫొటోలు జోడించి తప్పుడు కథనం వండివార్చిన ఇలాంటి పత్రికలు రాష్ట్రంలో ఉండరాదన్నారు. చంద్రబాబు, రామోజీరావు, డాక్టర్ అరవిందబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉండగా ప్రజావ్యతిరేక పనులు చేయడంతోనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని తిరస్కరించారన్న విషయాన్ని రామోజీరావు గుర్తించాలని చెప్పారు. పట్టాభికి దెబ్బలు తగిలాయంటూ పాత ఫొటోలతో వార్త రాసి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి రామోజీ ఒడిగట్టి పత్రికలకు ఉన్న ప్రాధాన్యతను చంపేశాడన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన పత్రికను చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలనే తపనతో సీఎం జగన్మోహన్రెడ్డిపై రోజుకొక కట్టుకథను అల్లి ప్రచారం చేస్తున్నాడన్నారు. వివేకానందరెడ్డి హత్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన సంఘటనని, అప్పుడేమి వార్తలు రాయకుండా ఇప్పుడు సీబీఐ చెప్పినట్లుగా సీఎం జగన్పై రోజుకొక కట్టుకథను ప్రజల్లోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 15వ తేదీ జీతాలు ఇస్తుండగా ఒక్క వార్త రాసేందుకు ధైర్యం చేయని రామోజీరావు, ఏపీలో మాత్రం జీతాలు ఆలస్యమంటూ రాస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును మోస్తూ లోకేష్ను జాకీలతో లేపేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నా లేవట్లేదన్నారు. ఇక్కడ ఒక టీడీపీ నాయకుడి హత్య జరిగి, అది చేసింది టీడీపీ నాయకులేనని, మరణవాంగ్మూలంలో చెప్పినా, ఈ విషయంలో తాము చాలెంజ్ విసిరినా వైఎస్సార్సీపీ నాయకులే చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పౌడా చైర్మన్ మిట్టపల్లి రమేష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.సుజాతాపాల్, మాజీ కౌన్సిలర్లు నెలటూరి మురళి, మాడిశెట్టి మోహనరావు, షేక్ మస్తాన్వలి, ఎస్సీ సెల్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు మల్లెల అశోక్,, అచ్చిశివకోటి, నాయకులు తలారి నాని, మారూరి శివారెడ్డి, సయ్యద్ ఖాదర్బాషా, బత్తుల విష్ణు పాల్గొన్నారు. -
పల్నాడు: రొంపిచర్లలో అర్ధరాత్రి కాల్పుల కలకలం
సాక్షి, పల్నాడు: జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపి.. పరారయ్యారు. ఈ ఘటనలో బాలకోటిరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాలకోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని చికిత్స కోసం నర్సరావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. టీడీపీ అంతర్గత కుమ్ములాట నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే.. గతంలో.. ఆరు నెలల కిందట బాలకోటిరెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఆ సమయంలో ఈ దాడిని రాజకీయం చేసేందుకు టీడీపీ తీవ్రంగా యత్నించింది. నారా లోకేష్ను సైతం రంగంలోకి దించాలనుకుంది. అయితే.. ఈలోపే దాడికి తానే బాధ్యుడినంటూ స్థానిక టీడీపీ నేత పమ్మి వెంకట్రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. పార్టీలో విభేధాలు ఉన్నాయని, నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు.. డబ్బులు తాను ఖర్చు పెడుతుంటే బాలకోటిరెడ్డిని ప్రొత్సహిస్తున్నాడని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయి.. బాలకోటిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు అప్పుడు పోలీసులకు వెల్లడించాడు. దీంతో.. తాజా దాడి కూడా ఈ కోణంలోనే జరిగిందా? లేదా మరేదైనా కోణం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టెప్పులతో ఇరగదీసిన పల్నాడు జిల్లా కలెక్టర్
-
మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం
మాచర్ల: కండీషన్ బెయిల్ పేరుతో టీడీపీ నేతలు మాచర్లలో అలజడి సృష్టించేందుకు మరోమారు విఫలయత్నం చేశారు. గత నెల 16వ తేదీన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం పేరుతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి 12వ వార్డులో ర్యాలీగా వెళ్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి ముగ్గురిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డి మరో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న నిందితులందరూ కండీషన్ బెయిల్కు సంబంధించి పట్టణ పోలీసు స్టేషన్లో సంతకాలు చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆదివారం సంతకాలు చేసేందుకు బ్రహ్మారెడ్డి, టీడీపీ నాయకులు వస్తున్న నేపథ్యంలో అలజడి సృష్టించాలని వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా మాచర్లకు తరలి రావాలంటూ వారి అనుచర వర్గానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీసు 30 యాక్టు, 144 సెక్షన్ అమలు చేస్తూ నెహ్రూనగర్ నుంచి పట్టణ పోలీసు స్టేషన్ వరకు గురజాల డీఎస్పీ మెహర్ జయరాం ప్రసాద్, సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దీంతో ఇతరులు అక్కడికి వచ్చి అలజడి సృష్టించే అవకాశం లేకపోయింది. కేవలం బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులు మాత్రమే 12.30 గంటలకు బస్సులోంచి చేతులూపుతూ వచ్చి సంతకాలు చేసి వెళ్లారు. ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. -
బోగీలను వదిలి వెళ్లిపోయిన గూడ్స్ రైలు ఇంజన్
పిడుగురాళ్ల: గూడ్స్ రైలు ఇంజన్ బోగీలను వదిలి వెళ్లిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ సమీపంలోని 65వ గేటు వద్ద బోగీలను వదిలి ఇంజన్ వెళ్లిపోయింది. ఇది గమనించిన గూడ్స్ రైలు గార్డ్ రైల్వే అధికారులకు, గూడ్స్ రైలు డ్రైవర్కు సమాచారమిచ్చారు. జానపాడు రైల్వే గేటు దాటి వెళ్లిన ఇంజన్ను రైల్వే గూడ్స్ డ్రైవర్ బోగీలు ఆగిన ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. రైల్వే అధికారులు, సిబ్బంది గూడ్స్ బండి ఇంజన్, బోగీలను కలిపించారు. ఇదంతా 15 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ వైపు వచ్చే రైళ్లు ఏమీ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం -
పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ నేతల ఫ్లెక్సీ వార్
-
చాక్లెట్ల ఆశ చూపి.. లైంగిక దాడికి యత్నం.. కేకలు వేయడంతో..
దాచేపల్లి: తొమ్మిదేళ్ల బాలికపై టీడీపీ సోషల్ మీడియా గ్రామ కో–ఆర్డినేటర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి బాలికను ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తమ పాఠశాలలో తెలియజేసిన ‘బ్యాడ్ టచ్’ను గుర్తించిన బాలిక కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేసానుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రెండో తరగతి బాలిక రాత్రి ఎనిమిది గంటల సమయంలో తన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఆ బాలిక వద్దకు టీడీపీ సోషల్ మీడియా గ్రామ కో–ఆర్డినేటర్ వినుకొండ అశోక్బాబు(23) వచ్చి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి సమీపంలోని ఓ ఇంట్లోకి తీసుకువెళ్లాడు. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికదాడికి ప్రయత్నించడంతో ఆ చిన్నారి కేకలు వేసింది. దీంతో అశోక్బాబు పారిపోయాడు. వెంటనే ఈ ఘటన గురించి బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. మంగళవారం ఉదయం బాధిత బాలికను తీసుకుని ఆమె తల్లిదండ్రులు, బంధువులు వెళ్లి అశోక్బాబు, అతని తల్లిదండ్రులను ప్రశ్నించగా, వారు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు సీఐ బిలాలుద్దీన్ను కలిసి ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు... పోక్సో చట్టం కింద అశోక్బాబుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అశోక్బాబు టీడీపీ సోషల్ మీడియా గ్రామ కో–ఆర్డినేటర్గా పనిచేస్తూ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడినని చెప్పుకుంటూ ఆ పార్టీకి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. బాలికను కాపాడిన గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ మహిళలు, బాలికల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘దిశ’తోపాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహిళలు, బాలికలపై లైంగిక దాడుల నివారణ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈ క్రమంలో కేసానుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న సదరు బాలికకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కలిగింది. నిందితుడు అశోక్బాబు తనను బ్యాడ్ టచ్ చేస్తున్నట్లు బాలిక గమనించి కేకలు వేసింది. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు ఆ చిన్నారిని అభినందించారు. -
ప్రశాంతంగా మాచర్ల..పోలీసుల ఆధీనంలో పట్టణం
సాక్షి, నరసరావుపేట, మాచర్ల, మాచర్ల రూరల్: టీడీపీ రౌడీ మూకల స్వైర విహారంతో శుక్రవారం రాత్రి అట్టుడికిన మాచర్ల పట్టణంలో శనివారం ప్రశాంత వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు తెరవలేదు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా చూశారు. ఇరు వర్గాల నేతల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి వీడియో ఫుటేజీల ఆధారంగా కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ శనివారం మాచర్ల పట్టణంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎవర్నీ ఉపేక్షించవద్దని ఎస్పీ రవిశంకర్రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మారెడ్డి వెళ్లిపోయుంటే గొడవకు తావులేదు మాచర్లలో ఉద్రిక్తత సద్దుమణిగిందని, శాంతిభద్రతలు తమ ఆధీనంలోనే ఉన్నాయని పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాచర్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వెల్దుర్తి, గుండ్లపాడు గ్రామాలకు చెందిన కొంత మంది వ్యక్తులు ర్యాలీలో పాల్గొనడం వల్లే పెద్ద ఎత్తున ఘర్షణకు కారణమైందని తెలిపారు. ఇందులో పోలీసుల వైఫల్యం ఎంతమాత్రం లేదని తెలిపారు. సంఘటన స్థలం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎంతగా చెప్పినా, జూలకంటి బ్రహ్మారెడ్డి వినిపించుకోకుండా ఉద్రిక్త పరిస్థితికి దారితీసేలా ప్రవర్తించారన్నారు. బ్రహ్మారెడ్డి కార్యాలయం, వీరి మనుషుల గృహాలు దగ్ధం కాలేదని, కేవలం ఫర్నీచర్కు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు. విజువల్స్ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని, బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పారు. దాడుల్లో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని, వారిలో మోహన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉక్కుపాదంతో అణిచి వేస్తామని స్పష్టం చేశారు. బంగారం, డబ్బులు పోయినట్లు తమకు ఇంత వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బందోబస్తులో పోలీసు సిబ్బంది అంతా చంద్రబాబు సూచన మేరకే.. రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడులోనూ గొడవలు సృష్టించి హత్యలు చేయడానికి పథకం ప్రకారం కుట్రలకు తెరలేపారు. మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ 20 ఏళ్లలో అంతా ప్రశాంతంగా ఉంది. మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా 7హత్యలు చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించడం ద్వారా పల్నాడును రావణకాష్టంగా మారుస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నాటి ఘటన. బీసీ నాయకులపై టీడీపీ రౌడీలు ముందస్తు వ్యూహం ప్రకారం కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. దౌర్భాగ్య పరిస్థితి నుంచి దౌర్జన్యంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ కు తెరలేపారు. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన అల్లర్లను వైఎస్సార్సీపీపై రుద్దడం సమంజసం కాదు. దోషులు ఎవరన్నది తేల్చి శిక్షలు పడేలా చూడాలని జిల్లా ఎస్పీని కోరాం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండటమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం. – మీడియాతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే బీసీ నేతలపై దాడులు అమానుషం బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలు రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో టీడీపీ రౌడీమూకలు మాచర్లలో శుక్రవారం దాడి చేయడంపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బీసీల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించాయి. బీసీల పార్టీ అంటూ దశాబ్దాలుగా టీడీపీ మోసం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి బీసీలు వైఎస్సారీసీపీ వైపు మళ్లడంతో ఇలా దాడులకు పాల్పడుతున్నారన్నారు. మాచర్లలో బీసీలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ పిడుగురాళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవళ్ల రేవతి పాల్గొన్నారు. -
మాచర్లలో పథకం ప్రకారం రెచ్చిపోయిన టీడీపీ ముఠా
-
Komera Ankarao: అతడు అడవిని రక్షించాడు!
ఉషోదయం వేళ ఊరు దాటి భుజాన బాధ్యతతో సాగే గమనంలో.. చెట్టూ చేమను పలకరిస్తూ.. పలచటి దారుల్లో.. దట్టమైన దూరాల్లో.. కొండల్లో.. కోనల్లో.. నల్లమలను నలుదిక్కులా చుట్టేస్తూ.. అడవి నుంచి ప్లాస్టిక్ను ఊడ్చేస్తూ.. మూగ జీవాల ప్రాణాలను రక్షిస్తూ.. పాతికేళ్లుగా విశ్రమించని దినచర్యతో.. అతడు అడవిని రక్షించాడు.. రక్షిస్తూనే ఉన్నాడు! ఆంధ్రప్రదేశ్.. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన కొమెర అంకారావు ఉరఫ్ జాజి నల్లమలలో అపరిశుభ్రతపై వేట సాగిస్తున్నారు. పార్టీల పేరుతో అటవీ ప్రాంతంలో యువత ఎంజాయ్ చేసి పడేసిన మందు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, పాలిథిన్ కవర్లను శుభ్రం చేయడమే దిన చర్యగా మార్చుకున్నారు. రోజూ తెల్లవారగానే మోపెడ్పై ఊరికి ఐదు కిలో మీటర్ల దూరంలోని రిజర్వ్ ఫారెస్టుకు వెళ్లి ఆయన చేసే పని ఇదే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పాతికేళ్లుగా భుజాన గోనె సంచితో అడవి బాటపట్టి.. వేల కిలోల చెత్తను తొలగించారు. వారంలో ఆరు రోజులు అటవీ రక్షణకే కేటాయిస్తూ.. ఒక్కరోజు మాత్రమే తన కోసం పని చేసుకుంటూ పర్యావరణ శ్రామికుడిగా.. పరిరక్షకుడిగా గుర్తింపు పొందారు. తాను సేకరించిన వ్యర్థాలను.. బయట చెత్త ఏరుకుంటూ జీవనం గడిపేవారికి అందిస్తూ సహాయం చేస్తున్నారు. జాజికి ఇప్పుడు 40 ఏళ్లు. ఆయన పదో తరగతి చదువుతున్నప్పుడే (14 ఏళ్లకే) పర్యావరణంపై అమితమైన మక్కువ పెంచుకున్నారు. ఊరికి సమీపంలోనే అడవి ఉండటంతో చిన్న వయసులో సరదాగా రకరకాల మొక్కల విత్తనాలు తీసుకెళ్లి చల్లేవారు. ఇదే ఆయన జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఒక్కోసారి దట్టమైన అడవిలో 10 కిలో మీటర్లకుపైగా జాజి ప్రయాణం సాగుతుంది. ఆ క్రమంలో ఎన్నో కొత్తకొత్త ప్రాంతాలు, మొక్కలను కొనుగొనడం ఆయనకు పరిపాటిగా మారింది. వీటన్నింటితో ‘ప్రకృతి పాఠశాల’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని కూడా రచించారు. అడవిని పెంచుతూ.. తొలకరి వస్తే చాలు జాజి అడవిలో ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లి రకరకాల విత్తనాలు చల్లుతారు. అవి వర్షాలకు మొలకెత్తుతాయి. అలా ఆయన అటవీ వృక్ష సంపద పెరుగుదలకు కృషి చేస్తున్నారు. ఆగస్టు–డిసెంబర్లో సొంత డబ్బులతో అనేక రకాల పండ్ల మొక్కలు తీసుకొచ్చి అడవిలో నాటుతున్నారు. అంతటితో వదిలేయకుండా కుంటల నుంచి నీటిని తెచ్చి మొక్కలకు పోసి వాటిని బతికిస్తున్నారు. ఇందు కోసం ఆయన స్కూటీ డిక్కీలో తెల్లగోతం, వాటర్ క్యాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ‘అటవీ జంతువులు, పక్షులకు ఆహార కొరత ఏర్పడింది. ఎన్నోరకాల పండ్ల మొక్కలు అడవి నుంచి అదృశ్యమయ్యాయి. ఫలితంగా వాటి ద్వారా జీవం పోసుకునే ఇతర మొక్కల ఆవిర్భావం తగ్గిపోయింది. అడవి పందులు, ఎలుగుబంట్లు పండ్లను ఆహారంగా తీసుకున్న తర్వాత వాటి మల విసర్జన ద్వారా అందులోని విత్తనాలు మొలకెత్తి సహజసిద్ధంగా అడవి పెరిగేది. నేడు ఆ పరిస్థితి లేదు. ప్లాస్టిక్ను తినడంతో వన్యప్రాణులు మృత్యు వాత పడుతున్నాయి. ఒక్క అడవి పంది పదివేలకు పైగా మొక్కలు పెరగడానికి కారణం అవుతుంది. అటువంటి జంతుజాతులను మనం రక్షించు కోవాలి. పక్షులైతే అడవిలో పగిలిపోయిన మందు సీసాల్లోని లిక్కర్ కలసిన నీటిని తాగి చనిపోతు వడటం నన్ను తీవ్రంగా కలిచివేసింద’ని బాధ పడుతున్నారు జాజి. పక్షుల కోసం పంట సాగు.. పక్షుల మీద ప్రేమతో వాటి ఆహారం కోసం చిరుధాన్యాలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు జాజి. తనకున్న 80 సెంట్ల పొలంలో పక్షుల మేతకోసం సజ్జ, జొన్న పంటలు వేసి స్వయంగా సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. తన పొలాన్ని పక్షుల స్థావరంగా మార్చేశారు. ఔషధమూలికలపై పట్టు జాజికి అడవిలోని ప్రతి మొక్క, ప్రతి ఆకు.. వాటి ఔషధ గుణాలు గురించి బాగా తెలుసు. ఆయుర్వేద పరిశోధకులు సైతం తమకు కావాల్సిన మొక్కలను జాజికి చెప్పి తెప్పించుకుంటున్నారు. మానవాళికి ఉపయోగపడే అరుదైన మూలికలు.. ఉదాహరణకు మగలింగ చెక్క చెట్టు, కొండరేగు, పాలబెర్రంగి వంటివి కనుమరుగవుతున్నాయి. ఇవి అంతరించిపోతే ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధాలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అలాంటి అరుదైన మొక్కలను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ఎందరికో స్ఫూర్తి జాజిది మధ్య తరగతి కుటుంబం. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. డిగ్రీ చదువుకున్న తర్వాత డిస్టెన్స్ ద్వారా రెండు పీజీలు చేశారు. అడవిలో ఆయన చేస్తున్న పనిని చూసి మొదట్లో చాలా మంది ప్లాస్టిక్ ఏరుకునే వ్యక్తిగా భ్రమించి.. తాగి పడేసిన సీసాలు పలానా చోట ఉన్నాయని చెప్పి ఏరుకోమని సలహాలిచ్చేవారు. చివరికి జాజి ప్రయత్నం తెలుసుకుని ఆ ప్రాంతంలోని ఎందరో తమ పద్ధతిని మార్చుకున్నారు. జాజి స్థానిక పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు బోధిస్తూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి సేవలకుగాను మద్రాసు ప్రైవేటు వర్సిటీ జాజికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సుచిరిండియా సంకల్పతార అవార్డు వరించింది. అలాగే ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన టాల్ రేడియో సంస్థ తాళ్ హీరో అవార్డుకు జాజిని ఎంపిక చేయడం విశేషం. అడవి తల్లి చల్లగా ఉంటే సమస్త జీవజాలానికి మనుగడ ఉంటుందని బలంగా విశ్వసిస్తున్న జాజి.. తన యూట్యూబ్ చానల్ ద్వారా వచ్చే కొద్ది పాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తుండటం గమనార్హం. అయితే ఇటీవల అటవీ శాఖ అధికారులు ఫారెస్టు గైడ్గా అవకాశం ఇస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరు జిల్లాల్లో విస్తరించిన నల్లమల అభయారణ్యాన్ని పరిరక్షించడమే తన లక్ష్యమని జాజి చెబుతున్నారు. -∙వరదా కృష్ణకిరణ్, ఫొటోలు: దేవిశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి చదవండి: Sai Bharadwaja Reddy: మార్కాపురం కుర్రాడు.. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి మిస్టర్ ఇండియా విజేత.. ఇప్పుడేమో ఏకంగా Woolen Art: ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు -
పల్నాడు: మహిళా కిడ్నాప్ వ్యవహారంలో ట్విస్ట్
-
రణక్షేత్రంలో ఉప్పొంగిన ఉత్సాహం.. వైభవంగా వీరారాధనోత్సవాలు
పల్నాటి రణక్షేత్రం కారంపూడి కత్తిగట్టి కదంతొక్కిందా.. వీరావేశంతో నాగులేరు ఉవ్వెత్తున ఉప్పొంగిందా.. బ్రహ్మనాయుడి ఉగ్రనృసింహకుంతం సమరనాదం మోగిస్తూ ముందుకురికిందా.. పల్నాటి పౌరుషాగ్నిని రగిలించిందా.. అన్నట్టు పోరాటాల పురిటిగడ్డ పల్నాడు గర్జించింది. వీరారాధనోత్సావాలతో ప్రతిమదీ పులకించింది. వీరుల కొణతములతో వీరంగమాడింది. కారంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల రెండో రోజు రాయబారం ఘట్టం వైభవంగా జరిగింది. వీరాచారవంతులు వీరుల కొణతములతో కదంతొక్కారు. ఎదురు రొమ్ములపై బాదుకుంటూ కత్తిసాము చేశారు. వీరుల గుడిలో కొలువుదీరిన ఆయుధాలకు పూజలు చేశారు. రెండుగంటల పాటు కత్తుల సేవ చేశారు. అనంతరం గ్రామోత్సవానికి బయలు దేరారు. వీరులు కొందరు వీరావేశంతో ఊగిపోతుంటే బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం వారిపై వాలి ఓదార్చే ఘట్టం అబ్బురపరిచింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం బయట, బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయంలో వీరాచారవంతులు కత్తి సేవ చేశారు. చిన్న పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఉగ్ర రూపులై ఉత్సవంలో పాలుపంచుకున్నారు. చెన్నకేశవుని దీవెనలు పొంది చెన్నకేశవస్వామి, అంకాలమ్మ చెంతకు ఒక్కో ఆచారవంతుడు ఆయుధంతో వెళ్లి వారి దీవెనలు పొందారు. గంటలు గణగణ మోగిస్తూ జై చెన్నకేశవ అంటూ నినదించారు. గోవింద నామస్మరణలు చేశారు. అనంతరం పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటి వద్దకు చేరుకుని అక్కడ కొద్ది సేపు కత్తి సేవ చేశారు. రణక్షేత్ర వీధులు సంప్రదాయ డోలు, వీరు జోళ్ల వాయిద్యాలు, సన్నాయి మేళాలతో మార్మోగాయి. ఆయుధాలతో వీరులు చేసిన గ్రామోత్సవం ఆద్యంతం నాటి పోరాటాన్ని కళ్లకుకట్టింది. వీరుల గుడి నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా చెన్నకేశవస్వామి, అంకాలమ్మ ఆలయాలకు చేరుకుని కోట బురుజు మీదుగా పీఠాధిపతి ఇంటి వరకు, అక్కడి నుంచి మళ్లీ వీరుల గుడి వరకు గ్రామోత్సవం కొనసాగింది. వీరుల ఆయుధాలకు కారంపూడి ప్రజలు నీరాజనాలు పలికారు. వారుపోసి కొబ్బరి కాయలు కొట్టి ఆశీస్సులు పొందారు. ఆయుధాలకు పంచామృతాభిషేకాలు పల్నాటి వీరాచారవంతులు పల్నాటి రణక్షేత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే వారు తొలుత తలనీలాలు సమర్పించి నాగులేరులో స్నానం చేశారు. నాగులేరు గంగధారి మడుగులో ఆయుధాలను శుభ్రం చేసుకున్నారు. కొందరు పంచామృతాలతో వీరుల ఆయుధాలను నాగులేరులో అభిషేకించడం విశేషం. నూతన వస్త్రాలతో పూజ కట్టుకున్నారు. వీరంతా ఒకేసారి ఆయుధాలను వీరుల గుడిలో ఉంచి పొంగళ్లు చేసుకుని వీర్ల అంకాలమ్మ, చెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. గురువారం తెల్లవారు జాము వరకు కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరాచారవంతులు వస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా మరికొందరు రానున్నారు. రాయబారం కథాగానం రెండో రోజు రాయబారం చారిత్రక ఘట్టం నేపథ్యంలో వీరుల గుడిలో రాత్రి అలరాజు రాయబారం కథాగానాన్ని వీరవిద్యావంతులు గానం చేశారు. వేదనాభరితమైన ఈ ఘట్టం గుండెలను పిండేసింది. మందపోరు ఘట్టం.. చాపకూడు పల్నాటి వీరారాధనోత్సవాలలో 3వ రోజు శుక్రవారం మందపోరు ఘట్టం జరగనుంది. ఈ రోజు బ్రహ్మనాయుడు చాపకూడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు పది వేల మంది సహపంక్తి భోజనాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ చేయూతతో ఈ కార్యక్రమం జరుగుతోంది. -
మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత
సాక్షి, నరసరావుపేట: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలకు సింగిల్ విండోలోనే అనుమతులు ఇస్తున్నందున ప్రముఖ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంపై అత్యంత ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగా గత మూడేళ్లుగా మన రాష్ట్రం వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద ఐటీసీ సంస్థ సుమారు రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ (సుగంధ ద్రవ్యాలు) ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. వేలాది మంది రైతులకు మేలు చేసేలా ఈ పరిశ్రమను ఏర్పాటు చేసిన ఐటీసీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పరిశ్రమలు పెట్టే వాళ్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సంబంధించి మార్కులు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం గొప్ప మార్పునకు నిదర్శనం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రెండేళ్లలోనే పూర్తి ► దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్లాంట్ ప్రారంభమవ్వడం ఒక అద్భుత ఘట్టం. ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల దాకా ప్రాసెస్ చేసి, ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. మిర్చితోపాటు అల్లం, పసుపు, ధనియాలు, యాలకులు వంటి 15 రకాల సేంద్రియ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేస్తారు. ► ఈ ప్లాంట్ తొలి దశ పూర్తయింది. రెండో దశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అది కూడా పూర్తయితే.. దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుందని ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి చెప్పారు. ► ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న 14 వేల మంది రైతులకు ఇది ఒక గొప్ప వరం. వీరి ఉత్పత్తులకు గిరాకీ లభిస్తుంది. 2020 నవంబర్లో ఈ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారు. 2022 నవంబర్.. అంటే కేవలం 24 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏ మేరకు ఉందో అందరికీ తెలుస్తోంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ► ఐటీసీ సంస్థ ఈ రాష్ట్రంలో ఇంకా మెరుగైన స్థితికి ఎదగాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాల మద్దతు ఇచ్చే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు ఉండదని యాజమాన్యానికి చెబుతున్నా. ► ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటుందనే విషయాన్ని సంజీవ్ పూరి మనసులో పెట్టుకోవాలి. మీ కష్టాన్ని మా కష్టంగా భావించి.. సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తాం. ఇది మా మాట. ఇంత మంచి ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు. రూ.3,450 కోట్లతో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ► రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం. 26 జిల్లాల్లో రైతులు స్థానికంగా పండించే పంటలన్నింటికీ ఇంకా మెరుగైన ధర రావాలి. వ్యాల్యూ ఎడిషన్ ద్వారా అది సాధ్యమవుతుందని 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రూ.3,450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ► తద్వారా ప్రతి జిల్లాలోని రైతులందరికీ మేలు చేయడమే కాకుండా, దాదాపు 33 వేల ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ఇందులో ఫేజ్–1కు సంబంధించి రూ.1,250 కోట్ల పెట్టుబడితో 10 యూనిట్ల కోసం డిసెంబర్, జనవరిలో శంకుస్థాపన చేయనున్నాం. మరో రెండు మూడేళ్లలో మొత్తం 26 యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఇవి ఒక పెద్ద వరంగా మారనున్నాయి. ► ఈ కార్యక్రమంలో ఐటీసీ చైర్మన్ సంజీవ్పూరి, స్పైసెస్ బోర్డు సెక్రటరీ సతియాన్, రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, విడదల రజని, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసుమహేష్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు, కిలారి రోశయ్య, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల ఉత్పత్తులకు వ్యాల్యూ ఎడిషన్ ► ఐటీసీ స్పైసెస్ ప్లాంట్కు సంబంధించిన వీళ్ల ప్రొసీజర్ పక్కాగా ఉంటుంది. సరుకు వచ్చిన వెంటనే క్లీనింగ్, గ్రేడింగ్, డీ స్టీమింగ్, గ్రైండింగ్, బ్లెండింగ్, స్టీమ్ స్టెరిలైజేషన్ చేశాక, ప్యాకింగ్ చేస్తారు. ఇలా ప్రాసెసింగ్ పూర్తి చేసుకోవడం వల్ల రైతులు పండించిన పంటకు వ్యాల్యూ ఎడిషన్ తోడవుతుంది. ► ఎక్స్పోర్ట్ మార్కెట్లో వీటి అమ్మకం కూడా సులభమవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తున్నాం. ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు మన రాష్ట్రంలో రావడం వల్ల మన రైతులకు కచ్చితంగా మేలు జరుగుతుంది. మన రైతుల ఉత్పత్తులకు మెరుగైన రేటు ఇచ్చి, మన రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో ఐటీసీ ముందడుగు వేస్తోంది. ► ఇటువంటి గొప్ప మార్పులు వ్యవసాయ రంగంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల స్థాపనతో ఇందుకు తొలి అడుగు పడింది. రాష్ట్రంలో దాదాపు 10,668 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్ గ్యాడ్యుయేషన్ చదివిన ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ను నియమించాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయి పట్టుకుని నడిపించేలా గొప్ప విప్లవం సృష్టించాం. ప్రతి దశలో అండగా నిలిచిన ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే నంబర్ వన్. ఈ ప్లాంట్ తొలి దశ పూర్తయింది. రెండో దశ మరో 15 నెలల్లో పూర్తవుతుంది. అది కూడా పూర్తయితే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుంది. ఈ ప్లాంట్ ద్వారా 14 వేల మంది రైతులకు మేలు జరుగుతుంది. కేవలం రెండేళ్లలోనే ఈ ప్లాంట్ను ప్రారంభిస్తున్నాం. ఇంత వేగంగా అడుగులు పడటానికి కారణం ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలవడమే. – సంజీవ్పూరి, ఐటీసీ చైర్మన్ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి గొప్పగా చెప్పారు. ఆయన నోటి వెంటæ ఈ మాటలు రావడం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అధికారికి గొప్ప క్రెడిట్. ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి అనువైన వాతావరణం ఉందని అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలా వచ్చే వారందరికీ అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మూడేళ్లుగా వరుసగా మొదటి స్థానంలో నిలిచామంటేనే మన చిత్తశుద్ధి ఏమిటో చేతల్లోనే తెలుస్తోంది. – సీఎం వైఎస్ జగన్ ఏపీలో ఆదర్శవంతమైన పాలన మా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ యూనిట్ను ప్రారంభించడం శుభ పరిణామం. ఇందులో స్థానికులకు.. ప్రత్యేకించి 70 శాతం మహిళలకు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ ప్రాంతానికి స్పైసెస్ పార్క్ రావడానికి కేంద్రాన్ని ఒప్పించి, సాధించిన ఘనత దివంగత నేత వైఎస్సార్దే. ఆయన అడుగుజాడల్లోనే జగనన్న రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకు వస్తుండడం శుభ పరిణామం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సింది 40 ఏళ్ల అనుభవం కాదు. మంచి మనసు, పట్టుదల. ఇవి మా ముఖ్యమంత్రికి పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారు. – విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చదవండి: సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు -
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇదొక నిదర్శనం
సాక్షి, పల్నాడు: దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్కి ఏపీ నెలవు కాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జిల్లాలోని యడ్లపాడు మండలం వంకాయల పాడు గ్రామంలో శుక్రవారం గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ స్పైసెస్ ఫెసిలిటీ.. పద్నాలుగు వేల మంది రైతులకు గొప్ప వరంగా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు. సుమారు 200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. దాదాపు 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. ఇది మొదటి దశ మాత్రమే. రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ఘనత మనకు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 2020లో మొదలుపెట్టి.. ఇప్పుడు కమిషన్ చేయడం దాకా కేవలం 24 నెలల్లోనే అడుగులు పడడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని సీఎం జగన్ ప్రస్తావించారు. రెండో దశ పనుల కోసం ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు సీఎం జగన్. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్కు ఇదొక నిదర్శనం. ఈ ఏడాది పారిశ్రామికవేత్తలను అడిగి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడు సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం తీసుకోవడం గొప్ప మార్పుగా సీఎం జగన్ అభివర్ణించారు. రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశంతో.. రాష్ట్రవ్యాప్తంగా 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 3,450 కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం ప్లాన్ చేసిందని, దీనివల్ల ప్రతీ జిల్లాలో ఉన్న రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని తెలిపారు. ఇవి రైతుల పాలిట వరంగా మారనున్నాయన్నారు. ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుందని తెలిపారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పల్నాడు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
-
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి విడదల రజిని