‘బెయిల్‌ను అడ్డుకునేందుకే కస్టడీ పిటిషన్లు’ | YSRCP Leader Vidadala Rajini Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘బెయిల్‌ను అడ్డుకునేందుకే కస్టడీ పిటిషన్లు’

Feb 9 2026 3:25 PM | Updated on Feb 10 2026 3:37 PM

YSRCP Leader Vidadala Rajini Slams Chandrababu Govt

నెల్లూరు:   ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి విడదల రజిని పరామర్శించారు. సోమవారం(ఫిబ్రవరి 9వ తేదీ) నెల్లూరు వెళ్లిన విడదల రజిని.. పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘బెయిల్‌ను అడ్డుకునేందుకే కస్టడీ పిటిషన్లు వేస్తున్నారు. ఏపీలో అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంబటికి సినిమా చూపిస్తానమని టీడీపీ నేతలే హెచ్చరించారు. జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేశారు. లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్‌ చేసేందుకే దాడులు చేస్తున్నారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement