ప్రధాన వార్తలు

అచ్చెన్నాయుడు గుట్టు బయటపెట్టేశాడే!
ఆడబిడ్డ నిధి పేరుతో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యఏపీలో ఐదేళ్ల ఫించన్ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు.. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడునేనేదో చేసేస్తానని ఆశ పడుతున్నారు.. ఖజానా ఖాళీగా ఉంది.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు2024 ఎన్నికల సమయంలో వీరు ఈ మాటలు మాట్లాడి ఉంటే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయి ఉండేది. కానీ అప్పుడేమి బొంకారో గుర్తు చేసుకోండి. చంద్రబాబైతే.. తనకు సంపద సృష్టించడం తెలుసన్నాడు. సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికను అమలు చేసి చూపిస్తామని బల్లగుద్ది మరీ బుకాయించారు. బాబు గారి పుత్రరత్నం లోకేశ్ ఇంకో అడుగు ముందుకేసి.. అన్ని వాగ్దానాల అమలుకు పక్కా ప్లాన్ ఉందని, లెక్కలున్నాయని, తాము చేయలేకపోతే ప్రజలు చొక్కా కాలర్ పట్టుకోవచ్చు.. అని ఛాలెంజ్ కూడా చేశారాయె! ఇక జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మాటలు ఒకసారి గమనించండి.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక అమలుకు తనదీ గ్యారెంటీ అని గొప్పగా భరోసా ఇచ్చారు. అధికారం వచ్చింది.. ఏడాది గడిచింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా తమ మనసులోని మాటలు బయటపెట్టేసుకుంటున్నారు.... ప్రజలను మోసం చేయడానికే హామీలు ఇచ్చామన్నట్టుగా మాట్లాడేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన వాగ్ధానాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చాలా విస్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే.. తామిచ్చిన నవరత్నాల హామీ అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల వరకు అవుతోందని, దానిని భరించడానికే చాలా కష్టపడవలసి వస్తోందని, కూటమి ఇస్తున్న సూపర్ సిక్స్, తదితర హామీల అమలుకు రూ.1.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఎలా తెస్తారు? అని! చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలను మోసం చేస్తున్నారని పదే, పదే చెప్పేవారు. అయినా టీడీపీ, జనసేన నేతలు బుకాయించి, దబాయించి మరీ తమ సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తామని అనేవారు. తమ వద్ద మంత్రదండం ఉందని చంద్రబాబు అనేవారు. ఇప్పుడేమో ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటూ మరికొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందులో పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి గరిష్టంగా రూ.పది లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అవన్ని అయిపు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ వీటిపై గట్టిగా నిలదీస్తుండడం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే, పదే కూటమి నేతల ఎన్నికల ప్రణాళికను గుర్తు చేస్తుండడంతో తప్పనిసరి స్థితిలో సుమారు 150 హామీలలో రెండు, మూడింటిని అరకొరగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో.. హమీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయేసరికి ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దానిని ఎలా అధిగమించాలా?అనే ఆలోచనతో రెడ్ బుక్ పాలన ద్వారా వైసీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్నారు. కేసులు పెట్టి కూటమికి మద్దతు ఇచ్చే మురికి మీడియాలో ఆ కేసుల వార్తలనే ప్రముఖంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. ఏదో గుట్టుగా మోసం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే, ఈయన రహస్యాన్ని బట్టబయలు చేశారని అనుకోవాలి.ఆడబిడ్డ నిధి పధకం కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలని అచ్చెన్న ఓపెన్గానే చెప్పేశారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఎవరైనా విశ్లేషకులు చెబితే వారిమీద మండిపడేవారు. వైఎస్సార్సీపీ వాళ్లు ‘అదెలా సాధ్యం?’ అని అడిగితే విరుచుకుపడే వారు. చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసి చూపిస్తారని ప్రచారం చేసేవారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా అత్యధికశాతం ‘మాట తప్పడమే’ అని జనానికి తెలిసినా, పవన్ కళ్యాణ్ కూడా జత కలవడం, బీజేపీ మద్దతు ఉండడంతో ఏమో ఈసారి ఏమైనా చేస్తారేమోలే అని ఆశ పడ్డవారు గణనీయంగానే ఉన్నారు. సూపర్ సిక్స్ ఎఫెక్ట్తో పాటు ఈవీఎంల మాయాజలం కలిసి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వృద్ధుల ఫించన్ను రూ. వెయ్యి పెంచారు. ఈ అదనపు పింఛన్ మొత్తాన్ని అందచేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ వేసుకువెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ 13 నెలల కాలంలో ఆ వ్యయం కోట్లు దాటిపోతుంది. ఇంకోపక్క ఫించన్దారులకు లక్షల సంఖ్యలో కోత పెడుతున్న వార్తలు వస్తున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్ బండలు ఉచితం అని చెప్పినప్పటికి అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక గ్యాస్ బండ తాలూకూ డబ్బు మాత్రమే కొందరికి అందింది. మిగిలిన హామీలను ఒక ఏడాదిపాటు ఎగవేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. తల్లికి వందనం కింద చదువుకునే విద్యార్ధులకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఒక ఏడాదంతా ఇవ్వలేదు. జగన్ విమర్శల ప్రభావంతో ఆ స్కీములో రూ.రెండు వేలు కోతపెట్టి కొంతవరకు అమలు చేసినా, అది కూడా గందరగోళంగానే జరిగినట్లు చెబుతున్నారు. ఇక.. మిగిలిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో జనం ఆగ్రహం చెందుతున్నారు. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలందరికి నెలకు1500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి సుమారు రూ.35వేల కోట్లు అవుతుందన్నది ఒక అంచనా. ఆ గణాంకాలను కొందరు నిపుణులు చెప్పకపోలేదు.కాని టీడీపీకి భజన చేసే మురికి మీడియా కూడా జనాన్ని మోసం చేయడానికి అదంతా సాధ్యమేనన్నట్లు ప్రచారం చేసింది. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఇంకోమాట మాట్లాడుతున్నారు. అంతేకాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామని వెల్లడించారు. అంటే దీని అర్థం చంద్రబాబు మోసం చేయబోతున్నారని తమకు తెలుసునని చెప్పడమే అవుతుంది కదా!. అయినా పథకాలన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అచ్చెన్న ముక్తాయించారు. అంటే గతంలో మాదిరి ఎన్నికల సంవత్సరం చివరిలో ఏదో చేసేశామని చెప్పి జనాన్ని మాయ చేసే అవకాశం ఉందని అనుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, ఫించన్లు ఇవ్వడానికే సరిపోతోందని కూడా అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. చిత్రం ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలోని ఆడబిడ్డ నిధి స్కీము తప్ప అన్నిటిని అమలు చేసేశామని మంత్రి ప్రకటించడం. ఇది చంద్రబాబు చెబుతున్న తీరుగానే ఉంది. అది నిజమే అయితే ఎన్నికల మానిఫెస్టో చదువుతూ ఏ ఏ అంశాలు ఎలా అమలు చేస్తున్నది వివరించగలగాలి. కాని ఆ పని చేయరు.అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి బీసీలకు ఏభైఏళ్లకే పింఛన్ తదితర హామీల సంగతేమిటో మంత్రి చెప్పాల్సి ఉంటుంది. 2017లో జగన్ నవరత్నాల స్కీములను ప్రకటించినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసేది. అవి సాధ్యం కాదని అనేది. కాని జగన్ సీఎం అయి అమలు చేసి చూపించారు. అప్పుడు ఏపీ శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతోపాటు మురికి మీడియా విషం చిమ్మేది. కాని అదే సమయంలో టీడీపీ, జనసేన ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్సార్సీపీ ఇచ్చే సంక్షేమం కన్నా రెండు, మూడు రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికేవారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కూడా సంక్షేమ స్కీముల గురించి పలుమార్లు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఐదేళ్ల పెన్షన్లకు అయ్యే వ్యయంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని చెబుతున్నారట. దీనిని బట్టి వారి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, మహిళలు ఎవరు కనిపించినా నీకు 15వేలు, నీకు 18 వేలు అంటూ సైకిల్ వేసుకుని వెళ్లి మరీ చెప్పిన నిమ్మల ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు అచ్చం గురువుకు తగ్గ శిష్యులే అనిపించుకుంటున్నారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

కూటమి కొత్త కథ .. రాబోయే రోజుల్లో పవన్ జీరో
సాక్షి: తాడేపల్లి:ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్లో పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒక కొత్త కథను అల్లి ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే, దానిని బట్టి సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకువెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్కు సమర్పించని రిమాండ్ రిపోర్ట్లు కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సిట్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఇలాంటి దుర్మార్గమైన కథనాలను రాసి, సిట్ను నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలను కక్షపూరితంగా అరెస్ట్లు చేయిస్తున్న చంద్రబాబు దుర్మార్గాల్లో ఎల్లో మీడియా భాగస్వామిగా మారింది. జరగని అవినీతిపై ఎలా దర్యాప్తు చేయాలో తెలియక తల పట్టుకుంటున్న సిట్ బృందానికి చక్కని కథలు, టీవీ సీరియల్స్ను రాసి, వారితో ఎవరెవరిపై ఎలా తప్పుడు కేసులు బనాయించాలో రోజుకో కథనం రాసే బాధ్యతను ఎల్లో మీడియాకు చంద్రబాబు అప్పగించారు. అందుకే ప్రతిరోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు విచిత్రమైన అంశాలను రాస్తూ, తమ ఊహలను వార్తలుగా ప్రచురిస్తూ ఏం చేయాలో సిట్ బృందానికి దిశానిర్ధేశం చేస్తున్నాయి. లిక్కర్ కేసులో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రిమాండ్ రిపోర్టుని కోర్టుకు సమర్పించకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో దానిపై అక్షరం పొల్లుపోకుండా కథనాలు ప్రత్యక్షం అవుతున్నాయి. జడ్జి ముందు పెట్టాల్సిన డాక్యుమెంట్ వారం ముందరే ఈ రెండు పేపర్లకి ఎలా లీకవుతోంది.? ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎవరి మీదనైతే వార్తలు రాస్తున్నారో సిట్ వారి మీదనే కేసులు నమోదు చేస్తుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఎల్లో మీడియా చెప్పినట్టు సిట్ నడుస్తుందా అనే అనుమానాలు కలగకుండా ఉండవు. సిట్ కి విశ్వసనీయత లేదని స్పష్టంగా తెలుస్తుంది. రెండు అపార్టుమెంట్ల నిండా వేల కోట్ల డబ్బులు దాచిపెట్టారని ఇష్టానుసారం ఎల్లో మీడియా ఛానెళ్లలో డిబేట్లు నడుపుతున్నారు. తప్పుడు కథనాలు రాసి విష ప్రచారం చేస్తున్నారే కానీ, ఎక్కడా అంత పెద్ద మొత్తంలో సిట్ డబ్బులు సీజ్ చేసింది కూడా లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు రూ.50 వేల కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ విలువను రూ. 3,500 కోట్లకు తగ్గించుకుంటూ వచ్చారు. న్యాయపరంగా ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టే ఏ అవకాశాన్ని మేం వదులుకోం. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటాం.డిస్టిలరీన్నీ చంద్రబాబు అనుమతులతో ఏర్పాటైనవే:డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకున్నారనేది సిట్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. కానీ వాస్తవంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతులిచ్చినవే. వైయస్సార్సీపీ హయాంలో ఒక్క దానికి కూడా అనుతివ్వలేదు. కొంతమంది అధికారులను లోబర్చుకుని, బెదిరించి, భయపెట్టి వారితో వాంగ్మూలాలు తీసుకుని కేసులు నమోదు చేశారు. లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పడానికి సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదు. ఏదోఒక విధంగా వైయస్సార్సీపీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే కక్షపూరితంగా లిక్కర్ కేసును సృష్టించారు.రాష్ట్రంలో న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు:నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబస్తు కల్పించాలని కోర్టు స్పష్టంగా చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోలీసులు యథేచ్చగా చట్టాన్ని, న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించి కూటమి నాయకుల అరాచకాలకు సహకరిస్తున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూల్యం చెల్లించుకోకతప్పదు. వైయస్సార్సీపీని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకు మూడింతలు బలంగా తిరగబడతాం. వైఎస్సార్సీపీ పోరాటాలు కొత్తకాదు. పార్టీ ఏర్పాటే తిరుగుబాటుతో మొదలైంది.పవన్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు:తనకు పాలన చేతకాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పేశాడు. ఏదైనా అలజడి సృష్టించి వైఎస్సార్సీపీ మీద బురద జల్లడానికే చంద్రబాబు ఆయన్ను వాడుకుంటున్నాడు. ఆయనకున్న సినిమా క్రేజ్ని తెలుగుదేశం పార్టీ వాడుకుని మొన్న ఎన్నికల్లో లబ్ధిపొందింది. పవన్ కళ్యాణ్ బలం, బలహీనత జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పూర్తిగా అర్థమైంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాన్ జీరో కావడం తథ్యం. వైఎస్సార్సీపీ హయాంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, దానివెనుక వాలంటీర్ల పాత్ర ఉందని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై మా ప్రభుత్వ హయాంలో నమోదైన కేసును కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిపై క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేసి న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు
టీమిండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ అద్భుత అర్థ శతకాలతో చెలరేగారు. క్రాలీ 113 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 84 పరుగులు సాధించాడు. మరోవైపు, బెన్ డకెట్ సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 100 బంతులు ఎదుర్కొన్న అతడు ఏకంగా 13 బౌండరీలు బాది 94 పరుగులు సాధించాడు. భారత అరంగేట్ర పేసర్ అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కి క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన హోలీ పోప్, జో రూట్ నిలకడగా ఆడటంతో గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. కేవలం 46 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. పోప్ 20, జో రూట్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇక అంతకుముందు 264/4 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట మొదలు పెట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) శుభారంభం అందించారు. వన్ డౌన్ బ్యాటర్ గా తిరిగి వచ్చిన సాయి సుదర్శన్ అర్థ శతకం (61) తో మెరిశాడు. కానీ, కెప్టెన్ శుభ్ మన్ గిల్ (12) మరోసారి విఫలం అయ్యాడు. ఇక తొలిరోజు 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హార్ట్ గా క్రీజు వదిలిన రిషబ్ పంత్ రెండో రోజు బ్యాటింగ్ కు తిరిగి వచ్చాడు. అర్థ శతకం (54) పూర్తిచేసుకుని ఆర్చర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మిగతా వారిలో శార్దూల్ ఠాకూర్ (41) ఒక్కడే పరవాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్టు ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ వోక్స్, లియాం డాసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

WWF దిగ్గజం హల్క్ హోగన్ కన్నుమూత
దిగ్గజ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్ స్టార్ హల్క్ హోగన్ (Hulk Hogan) (71) ఇవాళ (జులై 24) ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో హోగన్ తుది శ్వాస విడిచారని సమాచారం. కార్డియాక్ అరెస్ట్ కారణంగా హోగన్ మృతి చెందినట్లు తెలుస్తుంది.1953 ఆగస్ట్ 11న జన్మించిన హోగన్ అసలు పేరు టెర్రి జీనీ బోల్లియా. 80వ దశకంలో హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (WWF) ద్వారా విశేష ప్రజాదరణ పొందారు. హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజిల్ మానియాలోని తొలి తొమ్మిది ఎడిషన్లలో ఎనిమిది టైటిళ్లు సాధించాడు.హోగన్కు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్లలో కూడా చోటు దక్కింది. 1984లో హోగన్ తన తొలి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. హోగన్ తన కెరీర్ ఉన్నతిలో ఆండ్రీ ద జెయింట్, మాఛో మ్యాన్ రాండీ సావేజ్, అల్టిమేట్ వారియర్ లాంటి దిగ్గజ రెజర్లతో కుస్తీ పడ్డాడు. హోగన్కు అతని మీసాలు చాలా ప్రత్యేకతనిచ్చాయి.హోగన్ రెజ్లింగ్ కాకుండా సినిమాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా నటించాడు. హోగన్ గడిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేశాడు. హోగన్కు భారత్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. 80వ దశకంలో పిల్లలకు హోగన్ సుపరిచితుడు.

తెలంగాణ సచివాలయంలో మరోసారి ఊడిపడ్డ పెచ్చులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి సీఎం రేవంత్ కాన్వాయ్ వచ్చే మార్గంలోనూ పెచ్చులు కూలాయి. పెచ్చులు ఊడి పడడంతో సచివాయం సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కాగా, గత వారం రోజుల నుంచి సచివాలయానికి సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు. సచివాలయంలో పెచ్చులు ఊడి పడుతున్న ఘటనలపై సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సచివాలయలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి.. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది.ఘటనపై స్పందించిన సచివాలయ నిర్మాణ సంస్థసెక్రటేరియట్ పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ స్పందించింది. ‘‘ రెగ్యులర్ డిపార్ట్మెంట్ పనుల్లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేపట్టినట్లు పేర్కొంది. నిర్మాణం ప్రాబ్లం కాదని.. అది కాంక్రీట్ వర్క్ కాదని తెలిపింది. స్ట్రక్చర్కు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఊడి పడింది జీఆర్సీ ఫ్రేం. ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్ఎసీ డ్రిల్ చేస్తున్నారు.. దీంతో జీఆర్సీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతోంది. ఎలాంటి నాణ్యత లోపం లేదు. మేము ఘటనపై రివ్యూ చేస్తున్నాం అని’’ ఆ సంస్థ వెల్లడించింది. తాజాగా, మరోసారి సచివాలయంలో పెచ్చులు ఊడడం చర్చాంశనీయంగా మారింది.

రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 43 మంది దుర్మరణం
రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న అంగారా ఎయిర్లైన్స్ విమానం చైనా సరిహద్దులో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 43 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం.. సుమారు 43 మందితో(ప్రయాణికులు(ఐదుగురు చిన్నారులు సహా), సిబ్బంది) టిండా ఎయిర్పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే గమ్యస్థానానికి కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండగానే ఈస్ట్రన్ అమూర్ రీజియన్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో(ఏటీసీ) సంబంధాలు తెగిపోయింది. దీంతో విమానం అదృశ్యమైనట్లు ప్రకటించిన అధికారులు.. దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయితే.. కాసేపటికే అమూర్ రీజియన్లోని దట్టమైన అడవుల్లో విమాన శకలాలను గుర్తించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.🚨 JUST IN: Aerial footage shows the wreckage of the crashed An-24 in Russia’s Amur Region.Civil Defense confirms: no survivors found.The plane was carrying nearly 50 people.🎥👇 #Russia #PlaneCrash #An24 #Breaking pic.twitter.com/LyXWnBmRa9— Depin Bhat (@DepinBhat) July 24, 2025#BREAKING: Russian plane missing with about 50 people on board.the plane, operated by the Angara airline, was headed for the town of Tynda in the Amur region bordering China.#Russia #PlaneMIssing #AngaraAirline #An24 #China #RussianPlane #aviation #aviationnews pic.twitter.com/RQVKxlfKOM— upuknews (@upuknews1) July 24, 2025అంగారా ఎయిర్లైన్స్ (Angara Airlines) రష్యాలోని ఇర్కుట్స్క్ కేంద్రంగా పనిచేసే ప్రాంతీయ విమాన సంస్థ. ఇది 2000లో స్థాపించబడింది. అంగారా నది పేరు మీద ఎయిర్లైన్స్కు ఈ పేరు పెట్టారు. సైబీరియాతో పాటు రష్యాలోని ఇతర ప్రాంతాలకు ఈ విమానయాన సంస్థ నిత్యం రవాణా సేవలు అందిస్తోంది. అలాగే చైనాలోని మాంఝౌలి రీజియనకు కూడా సర్వీసులను నడుపుతోంది.దుర్ఘటనలు:2011: Flight 9007 – ఇన్-ఫ్లైట్ ఇంజిన్ ఫైర్ వల్ల ఒబీ నదిలో విమానం కూలి ఏడుగురు చనిపోయారు2019: Flight 200 – టేకాఫ్ తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగి ఓ బిల్డింగ్ను ఢీకొని అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు సిబ్బంది ఈ ఘటనలో చనిపోయారు.2025, జులై 24న: ఏ24 ఫ్లయిట్- గమ్యస్థానానికి కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండగా తెగిపోయిన సిగ్నల్స్.. కాసేపటికే ప్రమాదం.. విమానంలోని 43 మంది మరణించినట్లు తెలుస్తోంది.

పవన్.. చేతనైతే ‘కోహినూర్’ను వెనక్కి రప్పించు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన హరిహర వీరమల్లు చిత్రం ఇవాళ రిలీజ్ అయ్యింది. కోహినూర్ వజ్రం సీక్వెన్స్ ఈ చిత్ర కథలో భాగమని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్... దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి” అని పవన్ పేల్చిన డైలాగూ ఉంది. అయితే బ్రిటిషర్లు తీసుకెళ్లిన ఆ వజ్రాన్ని నిజంగానే వెనక్కి తేవాలంటూ పవన్కు ఓ లేఖ చేరింది ఇప్పుడు. కోహినూర్.. ఒక వజ్రం(Kohinoor Diamond) మాత్రమే కాదు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఓ చిహ్నం కూడా. భారత్తో పాటు పాక్, అఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా ఈ వజ్రం తమదేనంటూ వాదిస్తుంటాయి. చివరకు.. 1849లో లాహోర్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా చేతికి వెళ్లింది. అక్కడి నుంచి క్వీన్ విక్టోరియా కిరీటంలో పొదిగారు. రాజకుటుంబంలో మగవాళ్లు కోహినూర్ను అరిష్టంగా భావించి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లండన్ టవర్ జ్యువెల్స్ టవర్లో ప్రదర్శనగా ఉంటోంది. కోహినూర్ను భారత్కు రప్పించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ విజ్ఞప్తులను ఇంగ్లండ్ తోసిపుచ్చుతూ వస్తోంది. క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత మరోసారి ఈ డిమాండ్ ఊపందుకుంది. 2025లో బ్రిటన్ మంత్రి లీసా నాండీ(Lisa Nandy) భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ చర్చ జోరుగా సాగింది. కోహినూర్ను ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు అంటూ కామెంట్ చేశారామె. అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం సంతృప్తికర పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతోందని అంటోంది. ఈ నేపథ్యంలో.. పవన్కు చేరిన లేఖలో అంశాలు ఇలా.. ‘‘మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన "హరిహర వీరమల్లు" చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ ఆని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను.బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలు. వాస్తవాలకు కట్టు కథలను జోడించడంవల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి.కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం ఆనాడు (దాదాపు 700 సంవత్సరాల క్రితం) కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొగల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్ వారికి అది లభించింది.బ్రిటిష్వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో అంతర్భాగం అయిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది.యావన్మంది ప్రజలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళి పోయారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం.మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు.కోహినూర్ డైమండ్.. మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టు కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరుతున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహినూర్ డైమండ్ కథాంశంగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కావడం గమనార్హం.VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan ) says, "The Kohinoor should definitely be brought back to India. I personally feel it belongs to our nation, it is the property of Bharat. That is our heart and soul, that is our Ratnagarbha. I think it should be… pic.twitter.com/sPZHjsBJjM— Press Trust of India (@PTI_News) July 22, 2025

పెదాలు కొరికి.. వీడియోలు తీసి.. కటకటాల్లోకి కామపిశాచులు
ఐటీ మహా నగరం బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు కామపిశాచులను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్యంగా అమ్మాయిలను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ డెలివరీ ఏజెంట్ను(19), అలాగే ఓ మహిళ పెదాలను కొరికి పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. మణిపూర్కు చెందిన దిలావర్ హుస్సేన్.. బెంగళూరులో డెలివరీ ఏజెంట్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొత్తనూరులోని బైరాతిలో అద్దెకు గది తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే సాయంత్రం కాగానే నగరంలోని ఎంజీరోడ్డు, చర్చ్ స్ట్రీట్, కొరమంగల ప్రాంతాల్లో అమ్మాయిలను రహస్యంగా ఫోన్లో చిత్రీకరించడం ప్రారంభించాడు. అలా ఆ అశ్లీల ఫొటోలను, వీడియోలను బెంగళూర నైట్ లైఫ్ అనే ట్యాగుతో తన దిల్బర్ జానీ-67 పేజీలో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అశ్లీల పేజీలు పెరిగిపోతుండడంపై దృష్టిసారించిన అశోక్ నగర్ పోలీసులకు దిలావర్ పేజీ కంటపడింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ తరహా కంటెంట్ చిత్రీకరించి.. నెట్టింట వైరల్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. మహిళల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు తీసినందుకు బీఎన్ఎస్తో పాటు ఐటీ సెక్షన్లు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బెంగళూరులో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. మే చివరి వారంలో.. బెంగళూరు మెట్రో రైళ్లలో యువతులను అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. జులై మొదటి వారంలో.. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ బాత్రూంలో మహిళా ఉద్యోగిణిని రహస్యంగా చిత్రీకరించబోయి ఓ సీనియర్ అసోషియేట్ జైలు పాలయ్యాడు. ఇక.. రెండు వారాల కిందట గురుదీప్ సింగ్ అనే వ్యక్తి రోడ్ల మీద మహిళలను తన ఫోన్లో బంధించే ప్రయత్నంలో ఓ యువతి చేతికి చిక్కి చెప్పు దెబ్బలు తిని.. ఆపై జైలు పాలయ్యాడు. తాజాగా మరో ఘటనలో.. గోవిందపూర్లో ఓ యువతిని లైంగికంగా వేధించిన వ్యక్తి.. ఆమె పెదాలను కొరికి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని మరూఫ్గా గుర్తించి అరెస్ట్ చేశారు. జూన్ 6వ తేదీన బెంగళూరు కూక్ టౌన్ మిల్టన్ పార్క్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిని మహిళను అసభ్యంగా తాకి.. ఆపై పార్క్లో ఆమె వెంటపడి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. అంతకు ముందు.. ఏప్రిల్ 3వ తేదీన బీటీఎం లేఅవుట్లోనూ ఇదే తరహాలో ఓ ఘటన జరిగంది. ఓ వ్యక్తి ఇద్దరు యువతుల్ని వెంబడించి.. వాళ్లను అసభ్యంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. తీసుకోవాలా.. వద్దా?
ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏడాదికి రూ.75 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చింది.. తీసుకోవాలా.. వద్దా అని సందిగ్ధంలో ఉన్నానని ఇటీవల ఓ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతదేశంలో అధిక పన్ను కారణంగా ఈ ఆఫర్ను తాను స్వీకరిస్తానని ఖచ్చితంగా చెప్పలేనన్నారు.తాను ఇప్పటికే దాదాపు రూ.12 లక్షల పన్నులు చెల్లిస్తున్నానని, కొత్త జాబ్ ఆఫర్ స్వీకరిస్తే ఆ పన్ను మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ.22 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. ‘20 ఏళ్ల అనుభవంతో ప్రస్తుతం భారత్ లో ఏటా రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. ఈ మధ్యనే రూ.75 లక్షలకు ఆఫర్ వచ్చింది. ఇది గణనీయమైన పెరుగుదల అయినప్పటికీ, ప్రధానంగా పన్ను బాధ్యతలో విపరీతమైన పెరుగుదల కారణంగా దానిని అంగీకరించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం రూ.12 లక్షల వరకు పన్నులు చెల్లిస్తున్నాను. రూ .50 లక్షలకు పైగా ఆదాయంపై వర్తించే అదనపు 10% సర్ఛార్జ్ కారణంగా కొత్త ఆఫర్తో ఆ మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ .22 లక్షలకు చేరుకుంటుంది" అని యూజర్ రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు.ట్యాక్స్ ఎక్కువ కట్టేందుకు పనిచేయాలా?కొత్త వేతన నిర్మాణంలో పన్ను ఆదా చేసే అంశాలను చేర్చే వెసులుబాటు లేదని ఆయన అన్నారు. ‘కాబట్టి, నా టేక్-హోమ్ వేతనం సుమారు 50% పెరగవచ్చు, పన్ను భారం దాదాపు రెట్టింపు అవుతుంది. తక్కువ పన్ను లేదా అస్సలు చెల్లించని వారితో పోలిస్తే ఎటువంటి అదనపు స్పష్టమైన ప్రయోజనాలను పొందకుండా, ప్రభుత్వానికి ఎక్కువ పన్ను చెల్లించడానికి నేను ఎందుకు ఎక్కువగా కష్టపడాలి?" అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సదరు వ్యక్తికి వచ్చిన సందిగ్ధ పరిస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తూనే అభిప్రాయాలనూ వ్యక్తీకరించారు. నేరుగా ఉద్యోగంలో చేరకుండా కన్సల్టెంట్ గా పరిహారం అందుకుంటే పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకోవచ్చని, కానీ ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ చెల్లించడం ఇష్టం లేక వేతన పెంపు తీసుకోకపోవడం సరికాదంటూ ఓ యూజర్ సలహా ఇచ్చారు. ఇప్పుడొస్తున్న దానికంటే 50% ఎక్కువ జీతం వస్తున్నా కూడా ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి జాబ్ ఆఫర్ను వదులుకుంటాననడం మూర్ఖత్వం అని మరో వ్యక్తి పేర్కొన్నారు.దేశంలో ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ .4 లక్షల వరకు ఆదాయంపై సున్నా పన్ను ఆ తర్వాత 5% నుండి 30% వరకు పన్ను రేట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు (వేతన జీవులకు రూ.12.75 లక్షలు) అధిక రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత విధానం ఎంచుకునేవారికి 80సీ, హెచ్ఆర్ఏ వంటి సెక్షన్ల కింద మినహాయింపులు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ ఛార్జీలు వర్తిస్తాయి.👉 ఇదీ చదవండి: ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!

గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆడి చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు (67 ఇన్నింగ్స్ల్లో 2719 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్ శర్మ (69 ఇన్నింగ్స్ల్లో 2716 పరుగులు) పేరిట ఉండేది. పంత్ తాజాగా హిట్మ్యాన్ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ మ్యాచ్లో పంత్ 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. మరో 17 పరుగులు జోడించి పెవిలియన్కు చేరాడు. బొటన వేలు గాయంతో బాధపడుతూనే పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పంత్ వీరోచిత పోరాటానికి అందరూ సలాం కొడుతున్నారు. పంత్ హాఫ్ సెంచరీకి చేరువలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఈ సిక్సర్తో పంత్ భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం పంత్, సెహ్వాగ్ టెస్ట్ల్లో తలో 90 సిక్సర్లతో ఉన్నారు.హాఫ్ సెంచరీ పూర్తి కాగానే పంత్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ కొద్ది క్షణాల్లోనే ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, ఆర్చర్ 3, వోక్స్ డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు
ENG VS IND 4th Test: దుమ్మురేపిన ఓపెనర్లు.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
WWF దిగ్గజం హల్క్ హోగన్ కన్నుమూత
ఎట్టకేలకు పాకిస్తాన్కు ఓ విజయం
ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఇచ్చే క్రెడిట్ కార్డులు
భారత్లోని అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదల
గ్రీన్ డ్రెస్లో దివి బోల్డ్ లుక్.. హాలీడే ట్రిప్లో అలేఖ్య హారిక!
తెలుగు యువ దర్శకుడికి కోడిరామకృష్ణ అవార్డ్
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇదీ పవన్ కల్యాణ్ అసలు రంగు
ENG VS IND 4th Test: దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు
బుల్లితెర నటుడి ఎంగేజ్మెంట్! నటికి మాత్రం రెండో పెళ్లి!
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
లిక్కర్ కేసు సంగతి చూడమంటే తిరిగి తిరిగి మళ్లీ నా దగ్గరికే వచ్చారేంటయ్యా!!
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ముడతలు లేకుండా అందంగా.. ఆకర్షణీయంగా మెరిసిపోవాలంటే..!
ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
ఇండస్ట్రీ నే షేక్ చేస్తోన్న.. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పలుకుబడి పెరుగుతుంది
.. నొక్కకుండా ఉండటానికట!
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ?
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!
‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు
ENG VS IND 4th Test: దుమ్మురేపిన ఓపెనర్లు.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
WWF దిగ్గజం హల్క్ హోగన్ కన్నుమూత
ఎట్టకేలకు పాకిస్తాన్కు ఓ విజయం
ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఇచ్చే క్రెడిట్ కార్డులు
భారత్లోని అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదల
గ్రీన్ డ్రెస్లో దివి బోల్డ్ లుక్.. హాలీడే ట్రిప్లో అలేఖ్య హారిక!
తెలుగు యువ దర్శకుడికి కోడిరామకృష్ణ అవార్డ్
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇదీ పవన్ కల్యాణ్ అసలు రంగు
ENG VS IND 4th Test: దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు
బుల్లితెర నటుడి ఎంగేజ్మెంట్! నటికి మాత్రం రెండో పెళ్లి!
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
లిక్కర్ కేసు సంగతి చూడమంటే తిరిగి తిరిగి మళ్లీ నా దగ్గరికే వచ్చారేంటయ్యా!!
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ముడతలు లేకుండా అందంగా.. ఆకర్షణీయంగా మెరిసిపోవాలంటే..!
ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పలుకుబడి పెరుగుతుంది
.. నొక్కకుండా ఉండటానికట!
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ?
బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!
‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
జగదీప్ ధన్ఖడ్కు అందే రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇవే
సినిమా

గ్రీన్ డ్రెస్లో దివి బోల్డ్ లుక్.. హాలీడే ట్రిప్లో అలేఖ్య హారిక!
హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న అలేఖ్య హారిక..గుర్రంపై స్వారీ చేస్తున్న బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా..యూఎస్ ట్రిప్ పిక్స్ షేర్ చేసిన వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు..గ్రీన్ డ్రెస్లో బిగ్బాస్ దివి బోల్ట్ లుక్స్..ప్రకృతిని ఆస్వాదిస్తోన్న కీర్తి సురేశ్.. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

పరదాలో థియేటర్కు అభిమానులు.. అందరి కళ్లు వారిపైనే!
పవన్ కల్యాణ్ హీరోగా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఫిక్షనల్ చిత్రం హరిహర వీరమల్లు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వీపరీతమైన నెగెటివ్ టాక్ వస్తోంది. వీఎఫ్ఎక్స్తో పాటు కథలో ఎలాంటి కొత్తదనం లేదంటూ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తొలి ఆట నుంచే వీరమల్లు చిత్రానికి ఊహించని షాకిస్తున్నారు అభిమానులు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతమేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.అయితే ఇవాళ ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు వచ్చిన కొందరు మహిళలు విభిన్నమైన వేషధారణలో కనిపించారు. సినిమా చూసేందుకు వచ్చిన మహిళా అభిమానులు తమ తలకు శారీని పరదాలాగా కప్పుకుని సందడి చేశారు. రెడ్ శారీలో వచ్చిన వీరు.. మొహాలు ఎవరికీ కనిపించకుండా థియేటర్కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో వీరంతా ఎందుకిలా వచ్చారని చర్చ మొదలైంది.అయితే ఇదంతా అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన పరదా మూవీ కోసమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగానే ఇలా పరదా కప్పుకుని వచ్చారని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇదంతా పరదా సినిమా ప్రమోషన్స్ కోసమేనని.. బ్రిలియంట్ ఐడియా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదేమైనా మహిళ అభిమానులు ఒక్కసారిగా పరదాల్లో కనిపించడంతో అందరి చూపులు వారిపైనే పడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన చిత్రం పరదా. ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది.#Paradha ladies watch #HariHaraVeeraMallu at Prasad’s! #Paradha movie directed by Praveen Kandregula (Cinema Bandi & Subham fame) is releasing on 22 August! pic.twitter.com/sO7AgByzMt— idlebrain jeevi (@idlebrainjeevi) July 24, 2025

చాహల్కు ప్రియురాలి బర్త్ డే విషెస్.. అవీ ఇంకా దారుణమంటూ ఆర్జే మహ్వశ్ పోస్ట్!
ప్రముఖ ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవల లండన్ వెకేషన్లో ఉన్న చిత్రాలను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. అయితే ఈ ముద్దుగుమ్మ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో డేటింగ్లో ఉందంటూ గతంలోనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.లండన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాహల్తో డేటింగ్పై చర్చ మొదలైంది. అదే లోకేషన్లో చాహల్ కూడా ఫోటోలు పోస్ట్ చేయడం ఈ జంట డేటింగ్ నిజమేనని అందరూ ఫిక్సయిపోయారు. తరచుగా వీరిద్దరు పార్టీల్లో కనిపించడం ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది. చాహల్ విడాకుల తర్వాత మహ్వశ్ మరింత దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఐపీఎల్లోనూ పంజాబ్ మ్యాచ్ల్లో సందడి చేసింది.తాజాగా చాహల్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో విషెస్ తెలిపింది. జూలై 23న చాహల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. లండన్లోని ఓ రెస్టారెంట్లో చాహల్ కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.మహ్వశ్ తన క్యాప్షన్లో.. "పుట్టినరోజు శుభాకాంక్షలు యుజీ! వయసు పెరగడం అనేది మన జీవితంలో ఒక భాగం. అలాగే జీవితంలో మిగిలిన భాగాలు మరింత దారుణంగా ఉంటాయి. అందుకే ఆల్ ది బెస్ట్" అంటూ ఫన్నీ ఎమోజీతో పోస్ట్ చేసింది. ఇప్పటికే వీరిద్దరి డేటింగ్లో ఉన్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ.. ఈ పోస్ట్తో మరింత క్లారిటీ వచ్చేసింది. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ డేటింగ్పై ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. అయితే జీవితంలో మిగతావన్నీ కూడా దారుణంగా ఉంటాయని రాయడం చర్చనీయాంశంగా మారింది. చాహల్- ధనశ్రీ వర్మ విడాకులను ఉద్దేశించి చేసినట్లు అర్థమవుతోంది. కాగా.. చాహల్ ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్నారు.

నీళ్ల కిచిడీయే ఆహారం.. మా పేదరికాన్ని చూసి వెక్కిరించేవాళ్లు
రేసుగర్రం విలన్ రవికిషన్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించారు. సినిమాల మీద ఆసక్తితో రూ.500 నోటుతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన రానురానూ తన టాలెంట్తో గుర్తింపు సంపాదించారు. భోజ్పురి, హిందీ చిత్రపరిశ్రమలో టాప్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.కటిక పేదరికంతాజాగా రవికిషన్ (Ravi Kishan) ఓ పాడ్కాస్ట్లో తన బాల్యంలోని బాధల్ని చెప్పుకొచ్చారు. నేను కటిక పేదరికం అనుభవించాను. చాలాసార్లు నా జీవితాన్ని అసహ్యించుకునేవాడిని. మా ఇంట్లో 12 మంది ఉండేవాళ్లం. కొద్దిపాటి బియ్యంతో నీళ్లలా చేసే కిచిడీని కుటుంబమంతా తినేవాళ్లం. చిన్నగదిలోనే మేమందరం పడుకునేవాళ్లం. ఒక్కోసారి ఒకరిపై మరొకరం నిద్రించేవాళ్లం.ఆరోజే అనుకున్నాపేదరికంలో ఉన్న మమ్మల్ని చూసి చాలామంది వెక్కిరించారు. నా తండ్రిని ఎవరూ హేళన చేయకూడదని, ఆ స్థాయికి నేను చేరుకోవాలని చిన్నతనంలోనే బలంగా నిశ్చయించుకున్నాను. ఈ భూమి మీదకు వచ్చామంటే ఏదో ఒకటి చేసి పోవాల్సిందే! అంతేకానీ పక్కింటివాళ్లకు కూడా తెలియకుండా అనామకులుగా చనిపోతే ఏం లాభం? కేవలం పిల్లల్ని కనడానికో, బంగ్లాలు కట్టడానికో ఈ భూమిపైకి రాలేదు కదా! మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి. ఒక్కసారి మనకు పేరు వచ్చిందంటే డబ్బు దానంతటదే వస్తుందని బలంగా నమ్మాను అని చెప్పుకొచ్చారు.డబ్బు లేకపోతే..ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ.. ప్రతిరోజు జిమ్కు వెళ్లండి, అంత డబ్బు లేదంటే రోడ్డుపై పరిగెత్తండి. కనీసం 3-5 కి.మీ అయినా పరిగెత్తండి, 200 పుషప్స్ చేయండి. శనగలను రాత్రంతా నానబెట్టి తెల్లారి ఆ నీళ్లను తాగండి, శనగలను తినండి. మీరు పేదవాళ్లయినప్పటికీ ఇవన్నీ చేయొచ్చు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే నిత్యావసర సరుకులను ఇలా వాడుకోవచ్చు. కనీసం సూర్యోదయానికి ముందు లేవడమైనా అలవాటు చేసుకోండి అని సూచించారు.సినిమాపీతాంబర్ (1992) సినిమాతో రవికిషన్ సినీప్రయాణం ఆరంభమైంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో రేసుగుర్రం, కిక్ 2, హీరో, 90 ఎమ్ఎల్, డాకు మహారాజ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది.చదవండి: మహేశ్ ఎన్నో కష్టాలు చూశాడు, అయినా పైకి మాత్రం..!
న్యూస్ పాడ్కాస్ట్

అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు కూటమి సర్కారు వెన్నుపోటు... తల్లికి వందనం సొమ్ము ఇవ్వకుండా దగా

ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మాలట... ఏపీలో మహిళలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం

లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలు..జరగని స్కామ్లో రూ.3500 కోట్ల దోపిడీ అంటూ భేతాళ విక్రమార్క కథ..సిట్ చార్జ్షీట్ సాక్షిగా వెల్లడైన బాగోతం

మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డికి రిమాండ్... ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు... తాను ఎలాంటి తప్పు చేయలేదన్న మిథున్రెడ్డి

పరాకాష్టకు చేరిన చంద్రబాబు భేతాళ కుట్ర... మద్యం అక్రమ కేసులో బరితెగింపు... వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టు

రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో అన్నదాతల మృత్యుఘోష... ఏడాదిలో 250 మందిపైగా బలవన్మరణం

తప్పుడు కేసులకు భయపడం, మేము ఎల్లప్పుడూ ప్రజాపక్షమే... తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వచేస్తేనే బనకచర్లకు గోదావరి జలాలు... పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం అసాధ్యం అంటున్న సాగు నీటి రంగ నిపుణులు

70 ఏళ్ల కిందట కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, కేసీఆర్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చర్చిద్దామా?. బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్
క్రీడలు

పసికూనపై పరాక్రమం చూపించిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఇదివరకే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఫైనల్స్కు చేరిన ఆ జట్టు మరో విజయం సొంతం చేసుకుంది. పసికూన, ఆతిథ్య జింబాబ్వేతో ఇవాళ (జులై 24) జరిగిన నామామాత్రపు మ్యాచ్లో కివీస్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. టిమ్ సీఫర్ట్ (45 బంతుల్లో 75; 9 ఫోర్లు, సిక్స్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో టిమ్ రాబిన్సన్ 10, మార్క్ చాప్మన్ 0, బెవాన్ జాకబ్స్ 0, మిచెల్ సాంట్నర్ 7 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో మైఖేల్ బ్రేస్వెల్ (16 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 4 వికెట్లు తీయగా.. మపోసా 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఐష్ సోధి (4-0-12-4) అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో జింబాబ్వేను మట్టికరిపించాడు. అతనికి మ్యాట్ హెన్రీ (3-0-34-2), జకరీ ఫౌల్క్స్ (3.5-0-14-1), విలియమ్ ఓరూర్కీ (3-0-19-1), మైఖేల్ బ్రేస్వెల్ (2-0-16-1) సహకరించారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో మున్యోంగా (40) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. డియాన్ మేయర్స్ (22), తషింగ ముసేకివా (21) రెండంకెల స్కోర్లు చేశారు.జింబాబ్వే ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో మరో జట్టైన సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జులై 26న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

పంత్ వీరోచిత పోరాటం.. ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్
మాంచెస్టర్ టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్నైట్ స్కోర్కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.తొలి రోజు ఆటలో గాయపడిన వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇవాళ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇవాళ శార్దూల్ ఠాకూర్ ఔటయ్యాక రీఎంట్రీ ఇచ్చిన పంత్.. వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్ సాయంతో భారత ఇన్నింగ్స్ను తీర్చిదిద్దాడు. పంత్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాక భారత ఇన్నింగ్స్ క్షణాల్లో ముగిసింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్కు సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆడి చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు (67 ఇన్నింగ్స్ల్లో 2719 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్ శర్మ (69 ఇన్నింగ్స్ల్లో 2716 పరుగులు) పేరిట ఉండేది. పంత్ తాజాగా హిట్మ్యాన్ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ మ్యాచ్లో పంత్ 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. మరో 17 పరుగులు జోడించి పెవిలియన్కు చేరాడు. బొటన వేలు గాయంతో బాధపడుతూనే పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పంత్ వీరోచిత పోరాటానికి అందరూ సలాం కొడుతున్నారు. పంత్ హాఫ్ సెంచరీకి చేరువలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఈ సిక్సర్తో పంత్ భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం పంత్, సెహ్వాగ్ టెస్ట్ల్లో తలో 90 సిక్సర్లతో ఉన్నారు.హాఫ్ సెంచరీ పూర్తి కాగానే పంత్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ కొద్ది క్షణాల్లోనే ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, ఆర్చర్ 3, వోక్స్ డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

విజృంభించిన బెన్ స్టోక్స్.. ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన ఘనత
మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో చెలరేగిపోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్ల్లో అరుదైన ఐదు వికెట్ల ఘనత సాధించాడు. భారత తొలి ఇన్నింగ్స్లో అన్షుల్ కంబోజ్ వికెట్ స్టోక్స్కు ఈ మ్యాచ్లో ఐదో వికెట్. కంబోజ్ను ఔట్ చేయకముందు స్టోక్స్ అదే ఓవర్లో వాషింగ్టన్ సుందర్ను కూడా పెవిలియన్కు పంపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన భారత ఇన్నింగ్స్ స్టోక్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో ఒక్కసారిగా కుదుపుకులోనైంది. కంబోజ్ వికెట్తో స్టోక్స్ ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు (16) తీసిన బౌలర్గానూ అవతరించాడు. ఈ ఇన్నింగ్స్లో స్టోక్స్ కంబోజ్, సుందర్ వికెట్లతో పాటు కీలకమైన సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీశాడు.లంచ్ విరామం తర్వాత భారత్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులుగా ఉంది. రిషబ్ పంత్ 54, జస్ప్రీత్ బుమ్రా 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, వోక్స్, ఆర్చర్, డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
బిజినెస్

కొత్త ఆవిష్కరణలపై బ్యాంక్ ఆఫ్ బరోడా దృష్టి
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తమ 118వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పలు కొత్త ఆవిష్కరణలు, కార్యక్రమాలను ప్రకటించింది. వ్యాపార వర్గాల కోసం ఉద్దేశించిన వరల్డ్ బిజినెస్ యాప్, బాబ్ ఈ–పే ఇంటర్నేషనల్, ఇన్సైట్ బ్రెయిలీ డెబిట్ కార్డు, గ్రీన్ ఫైనాన్సింగ్ స్కీములు మొదలైనవి ఉన్నాయి.టెక్నాలజీ ఆధారిత బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధనలో బీవోబీలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. బ్యాంకింగ్ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, లావాదేవీల నిర్వహణను సరళతరంగా, సురక్షితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని బీవోబీ ఎండీ దేబదత్త చంద్ తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!బ్యాంకు అందిస్తున్న జనరేటివ్ ఏఐ పవర్డ్ టూల్స్అదితి: వీడియో, ఆడియో, చాట్ ద్వారా మల్టీ ల్యాంగ్వేజీలో 24/7 వర్చువల్ రిలేషన్ షిప్ మేనేజర్ సర్వీసులు అందిస్తుంది.ఏడీఐ: తక్షణ సమస్యల పరిష్కారం కోసం జనరేటివ్ఏఐ ఆధారిత చాట్ బాట్.గ్యాన్సహాహ్.ఏఐ(GyanSahay.AI): ఉద్యోగులు ప్రొడక్ట్, పాలసీ సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేయడానికి ఇంటర్నల్ జెఎన్ఏఐ ప్లాట్ఫామ్.

రూ.64 కోట్లతో లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు
మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ ఛైర్మన్ రంజన్ పాయ్ భార్య శ్రుతి పాయ్ బెంగళూరులోని జయమహల్ ఎక్స్టెన్షన్లో లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్మెంట్ను రూ.64 కోట్లకు కొనుగోలు చేశారు. ఈమేరకు జాప్కీకి అందిన డాక్యుమెంట్లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ రియల్టీ డీల్ ఆ ప్రాంతంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ లావాదేవీల్లో ఒకటిగా నిలిచింది. బెంగళూరు అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్లో పెరుగుతున్న మార్పును ఇది హైలైట్ చేస్తుంది.ఒకప్పుడు స్టాండలోన్ బంగ్లాలు ఆధిపత్యం చెలాయించిన రూ.50 కోట్లకు పైగా ఉన్న ఈ విభాగంలో ఇప్పుడు ప్రీమియం అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరుగుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ బెంగళూరులో అత్యంత డిమాండ్ ఉన్న రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ల్లో ఒకటైన సవ్యసాచి సరయూలో శ్రుతి పాయ్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. 12,800 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా, 9,929 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో బాల్కనీలు, లిఫ్ట్ లాబీతో ఈ అపార్ట్మెంట్ విస్తరించి ఉంది. కార్పెట్ ఏరియాలో చదరపు అడుగుకు రూ.64,457, సూపర్ బిల్టప్ ఏరియాలో రూ.50,000 చొప్పున కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!2024లో బెంగళూరుకు చెందిన క్వెస్ కార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ ఐజాక్ బెంగళూరులోని బిలియనీర్ స్ట్రీట్ కోరమంగళ ప్రాంతంలో రూ.67.5 కోట్ల విలువైన 10,000 చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేశారు. మే నెలలో యూకేకు చెందిన మార్కెట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ సీఈఓ పరేష్ రాజా ఎంఐఏ ఎస్టేట్స్కు చెందిన 27 సమ్మిట్ ప్రాజెక్టులో లగ్జరీ పెంట్ హౌజ్ను రూ.54.38 కోట్లకు కొనుగోలు చేశారు. గత డిసెంబర్లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి బెంగళూరులోని కింగ్ ఫిషర్ టవర్స్లో రెండో లగ్జరీ అపార్ట్మెంట్ను రూ.50 కోట్లకు కొనుగోలు చేశారు.

ఉపాధిని తొలగించే టెక్నాలజీ ఎందుకు?
సాంకేతిక పురోగతి ఉపాధిని తొలగించేదిగా ఉండకూడదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. టెక్నాలజీ అనేది కార్మికులను గౌరవించి, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా సమతుల్య విధానాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. బీఎంఎస్ ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద కార్మిక సంఘం.ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరివర్తన సవాలుగా మారుతోంది. ప్రతి కొత్త టెక్నాలజీ ప్రాథమికంగా ఆందోళన కలిగిస్తుంది. నాలెడ్జ్ బేస్డ్ టెక్నాలజీ సంబంధిత రంగంలోని ఉద్యోగాలపై ప్రభావం చూపకూడదు. దాని ప్రతిష్ఠను దిగజార్చకూడదు. మారుతున్న ఆర్థిక, సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా కార్మిక, పారిశ్రామిక, జాతీయ ప్రయోజనాలను సమన్వయం చేసేలా సాంకేతిక అభివృద్ధి ఉండాలి. ప్రతి ఆవిష్కరణలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మాన్యువల్ లేదా సెమీ స్కిల్డ్ లేబర్పై ఎక్కువగా ఆధారపడే రంగాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అన్నారు.

ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

ఫుఫు డిష్.. పోషకాలు ఫుల్..!
ఫుఫు డిష్.. వినడానికి కాస్త వెరైటీగా ఉన్నా.. ప్రస్తుతం నగరంలో ఈ డిష్ ప్రాచుర్యం పొందుతోంది.. ఫుఫు అనేది పశ్చిమ ఆఫ్రికా దేశస్తుల ఫేవరెట్ ఆహారం.. ఆ దేశంలో పుట్టిన ఈ సాధారణ ఆహారం.. కాసావా (కర్రపెండలం), యమ్ లేదా ఆకుపచ్చని అరటి వంటి దుంప కూరగాయలతో తయారు చేస్తారు. ప్రధానంగా కాసావాని యుకా/మానియోక్ అని కూడా పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికాతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇది ప్రధాన ఆహారంగా ఉపయోగంచే పిండి పదార్థాలు కలిగిన దుంప కూరగాయ. దీని శాస్త్రీయ నామం మనిహోట్ ఎసు్కలెంటా. ప్రస్తుతం ఈ వంటకం హైదరాబాద్ నగరంలో ఆఫ్రికా వాసులు నివాసముండే పలు ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో ఆహారప్రియులను అలరిస్తోంది. ఫుఫు అనే వంటకాన్ని యమ్/ ఆకుపచ్చని అరటి వంటి దుంపను తొక్క(వెరడు) తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్చేసి నానబెడతారు.. అనంతరం బాగా ఉడకబెట్టడం ద్వారా దీనిని తయారు చేస్తారు.. దీనిని మిక్సీలో మెత్తగా పిండిచేసి మృదువైన, సాగే ముద్దగా తయారుచేస్తారు.ఈ మిశ్రమాన్ని పెనంమీదపోసి రుచికి సరిపడా ఉప్పువేసి ఉడికిస్తారు. ఈ వేడివేడి మిశ్రమాన్ని రాగిముద్దలా చేసి చికెన్, మటన్ గ్రేవీ, ఫిష్ గ్రేవీలతో పాటు వెజిటబుల్ గ్రేవీలతోనూ.. సాధారణ సూప్లు, సాస్చ చిక్కుళ్లు లేదా ఇతర వంటకాలతో పాటు సైడ్ డిష్గానూ తింటారు. పోషక విలువలు... ఆఫ్రికన్ వాసులకు ఎంతో ఇష్టమైన ఈ ఫుఫు డిష్లో అనేక పోషక విలువలు దాగివున్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాయం, విటమిన్–సీ తో కూడిన అనేక విటమిన్లు, ఖనిజాలతో పాటు క్యాలరీలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు పెరగడం, జీర్ణక్రియ, రక్త ప్రసరణకు సహాయపడుతుందట. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకారంగా ఉంటుందట. అయితే కాసావాలో సైనోజెనిక్ గ్లూకోసైడ్లు ఉంటాయి. దీనిని సరిగ్గా ఉడికించకపోతే సైనైడ్ను విడుదల చేస్తుందట. పూర్తిగా ఉడికించడం వల్ల ఇందులోని టాక్సిన్లు పూర్తిగా నశించి ఆరోగ్యప్రయోజనాలను అందజేస్తుంది. (చదవండి:

పొంగల్లో పురుగు : మరో వివాదంలో రామేశ్వరం కెఫే
రామేశ్వరం కేఫే శుభ్రమైన, నాణ్యమైన దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఘీ ఇడ్లీ , సాంబార్, ఇడ్లీ, వడ, దోస, పొంగల్, ఫిల్టర్ కాఫీ ఇలా రకాలు చాలా ఫ్యామస్. సామాన్యుల నుంచి భోజన ప్రియులు, పర్యాటకుల దాకా రామేశ్వరం కేఫే ఫుడ్ బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రామేశ్వరం కేఫే అందించిన ఫుడ్లో పురుగు కన్నించడం వివాదాన్ని రేపింది.గురువారం ఉదయం కేఫ్లోని ఒక కస్టమర్ అల్పాహారం కోసం ఆర్డర్ చేసిన పొంగల్లో పురుగు కనిపించింది. దీనిపై వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన తర్వాత కేఫ్ సిబ్బంది మొదట్లో దీన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో రెస్టారెంట్ అంతటా పాక్షికంగా కెమెరాను ప్యాన్ చేయడంతోపాటు, కస్టమర్ ఒక చెంచా పొంగల్లో పురుగును హైలైట్ చేస్తూ చూపించాడు. ఈ వీడియోను, సిబ్బంది ప్రతిస్పందనను వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించిన తర్వాత మాత్రమే వారు క్షమాపణలు చెప్పడం ప్రారంభించారని పేర్కొన్నాడు. ఆ తరువాత సిబ్బంది తనకు రూ. 300 పూర్తి వాపసును అందించారని వెల్లడించాడు. ఇదీ చదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్ లుక్ వైరల్అయితే ఈసంఘటనపై రామేశ్వరం కేఫే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.కాగా బెంగళూరుకు చెందిన రామేశ్వరం కేఫ్కు పలు శాఖలున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్లో కూడా ఒక శాఖ ఉంది. కాగా హైదరాబాద్లోని గత సంవత్సరం మే నెలలో, గడువు ముగిసిన , తప్పుగా లేబుల్ చేసిన అనేక ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత తెలంగాణ ఆహార భద్రతా శాఖ తనిఖీ కిందకు వచ్చాయి. వీటిలో మార్చి 2024లో గడువు ముగిసిన 100 కిలోల మినప పప్పు, అలాగే 10 కిలోల గడువు ముగిసిన పెరుగు, ఎనిమిది లీటర్ల గడువు ముగిసిన పాలు ఉన్నాయి. అలాగే గత ఏడాది మార్చిలో బెంగళూరులోని రామేశ్వరంకేఫ్లో జరిగిన IED పేలుడులో అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే. చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!

అలా కుందేలు ఓడిపోయింది... ఆ తరువాత..?
రన్నింగ్ రేస్లో తాబేలుతో పోటీ పడి అతి ఆత్మవిశ్వాసంతో ఓడిపోయిన కుందేలు కథ గురించి మనకు తెలిసిందే. మరి ఆ తరువాత ఏం జరిగింది?’ కుందేలులో ఆత్మవిశ్వాసం లేకుండా పోయిందా? తాబేలులో వోవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందా?‘అసలు ఆ తరువాత ఏం జరిగింది?’ అనే పాయింట్పై వచ్చిన నాటకం....సూపర్ టార్టైస్, సూపర్ రాబిట్. హాంగ్ సెంగ్హీ దర్శకత్వం వహించిన ఈ కొరియన్ నాటకాన్ని ఇటీవల బెంగళూరులో ప్రదర్శించారు. ‘ఒకసారి వచ్చిన ఫలితంతో వ్యక్తులను నిర్ణయించలేము అని చెప్పడానికి, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ నాటకం ఉపయోగపడుతుంది’ అంటున్నాడు హాంగ్. కొరియన్ డ్రామా కంపెనీ ఈ నాటకాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది.‘భారతీయ ప్రేక్షకుల ముందు నటించాలనే నా కల నెరవేరింది’ అంటున్నాడు కిమ్ మిన్–కి అనే ఆర్టిస్ట్. హాస్యాన్ని, సందేశాన్ని మిళితం చేస్తూ సాగే ఈ నాటకంలో సంగీతం, రిథమ్స్ ప్రత్యేక ఆకర్షణ.నాటకంలో అత్యంత ఆకట్టుకునే ఘట్టం? డైరెక్టర్ హాంగ్ ఇలా అంటున్నాడు...‘చివరి ఘట్టం. నేనేమిటి? నేను నిజంగా కోరుకునేది ఏమిటి? అని నాటకంలో ప్రతి క్యారెక్టర్ తనను తాను తెలుసుకుంటుంది’. (చదవండి: ఎవరీ మీరా మురాటీ..? టెస్లా టు థింకింగ్ మెషిన్ ల్యాబ్..)

యునెస్కో వారసత్వ సంపదలో మరో 7 అద్భుత ఆలయాలు
దక్షిణ భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలకు నిలయం. వీటి అద్భుతమైన వాస్తుశిల్పం, చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక మహత్తు అద్భుతం. అందుకే ఈ దేవాలయాల్లో చాలా వరకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. రాతి శిల్పాలు, సంగీత స్తంభాలు, రథాకార నిర్మాణాలు ఈ ఆలయాలకు ఒక ప్రత్యేకతను, గుర్తింపునూ తీసుకువచ్చాయి. ప్రతి దేవాలయం ఒక అపురూప కట్టడం. అంతేకాదు, ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతుంది. ఇటీవలే యునెస్కో తాజాగా మరో ఏడు ఆలయాలకు వారసత్వ గుర్తింపును ఇచ్చింది. అవేమిటో చూద్దాం.. 1. కడలేకల్ గణేశాలయం – హంపి బాల గణేశుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో ముద్దుగా కూర్చుని, చిట్టి చేతులను ఆ జగదంబ వీపుమీద వేసినట్లుగా ఉన్న ఈ విగ్రహం చూడగానే ఆహా అనిపిస్తుంది. హంపీలోని ప్రముఖ శిల్పాలలో ఒకటైన కడలేకల్ గణేశ విగ్రహం ఏకశిల నుంచి చెక్కబడింది. విజయనగర సామ్రాజ్య శిల్పకళా చాతుర్యాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం వినాయకుడి భక్తులకు ఎంతో ప్రీతికరమైనది. ‘కడలేకల్‘ అనే పేరు గణేశుడి పొట్టను పోలి ఉండటం వల్ల వచ్చింది.2. బృహదీశ్వరాలయం – తంజావూరు రాజరాజ చోళుడు 1010లో నిర్మించిన ఈ అద్భుత ఆలయం, శివుని వాహనమైన నందితో సహా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని రాతి శిల్పాలు అబ్బురపరుస్తాయి. ప్రతి రోజు రాత్రి జరిగే పూజ ప్రత్యేక ఆకర్షణ. పూజారులు వేద మంత్రాలతో బృహదీశ్వరునికి పవిత్ర జలాలు, పాలతో అభిషేకం చేస్తారు. పల్లకీలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అందంగా మార్చుతుంది.3. ఐరావతేశ్వరాలయం – దారాసురరథాకార శిల్పాలకు పెట్టిన పేరైన ఈ ఆలయం సురపతి అయిన ఇంద్రుడి వాహనం శ్వేత మత్తేభం ఐరావతం పేరు మీదుగా ప్రసిద్ధికెక్కింది. గోడలపై పురాణాలు చెక్కబడి ఉంటాయి. ప్రత్యేక ఆకర్షణ – సంగీత మెట్లు. ఏడు మెట్లు, ఏడు సంగీత స్వరాలను సూచిస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆలయంలోని సూర్య పుష్కరణి అనే పవిత్ర పుష్కరిణిలో ముందుగా స్నానం చేసి ఆ తర్వాత స్వామిని సందర్శించటం ఆనవాయితీ.4. మహిషాసురమర్ధిని మండపంమహాబలిపురం పల్లవ రాజవంశం నిర్మించిన ఈ రాతి శిల్పాల ఆలయం, మహిషాసురుడు, దుర్గాదేవి మధ్య యుద్ధాన్ని చూపించే అద్భుత దారుశిల్పాలతో ప్రసిద్ధికెక్కింది. అంతేకాక, శ్రీ మహా విష్ణువు తన పానుపైన ఏడు తలల ఆదిశేషునిపైన విశ్రాంతి తీసుకుంటున్న శిల్పం చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.5. షోర్ టెంపుల్, మహాబలిపురంమహాబలిపురం పల్లవ రాజు 11వ నరసింహవర్మ 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఒకప్పుడు ఏడు దేవాలయాల సమూహంలో భాగం. వరద ముంపులో మిగతా ఆలయాలన్నీ నీట మునిగి΄ోయినా, ఇది మాత్రమే నిలిచి ఉంది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి, వైకుంఠ ఏకాదశి పండుగలకు ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.6. విరూపాక్షాలయం – హంపిహంపి మధ్యలో ఉన్న ఈ ఆలయం మహా శివునికి అంకితం చేయబడింది. పంప అనే బ్రహ్మ కుమార్తె ఇక్కడ తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుందనే కథనం దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం తెచ్చింది. ఇక్కడ పంచామృత అభిషేకం, పూల అలంకారం, పూజారుల వృత్తాకార ఊరేగింపులు ముఖ్య విశేషాలు.7. విఠలాలయం – హంపిఈ ఆలయం సంగీత స్తంభాలు (మొత్తం 56) కు ప్రసిద్ధి. స్తంభాలను మీటితే వినసొంపైన స్వరాలు వినిపిస్తాయి. విష్ణువు అవతారమైన విఠలేశ్వరుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఆధ్యాత్మికతకే కాదు, గొప్ప కళాత్మకతకు కూడా నిదర్శనంగా నిలుస్తుంది.ఇదీ చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!
ఫొటోలు


జలజల.. జలపాతాలు (ఫోటోలు)


ఇంగ్లండ్ టూర్లో ప్రియుడు కూడా.. స్మృతి మంధాన ఫొటోలు వైరల్ (ఫోటోలు)


కేటీఆర్ జన్మదినం.. తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ (ఫోటోలు)


అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక పరవశం.. లండన్ స్వామినారయణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు (ఫోటోలు)


వరలక్ష్మీ శరత్కుమార్ భర్త సర్ప్రైజ్.. కోట్ల విలువైన కారు గిఫ్ట్..! (ఫోటోలు)


తొలి సినిమాకే సెన్సేషన్.. ఎవరీ బ్యూటీ! (ఫోటోలు)


హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025 ఈవెంట్లో మెరిసిన తమన్నా (ఫొటోలు)


69 ఏళ్ల ఏజ్లో స్లిమ్ అండ్ ట్రిమ్గా : ఈ సిక్రెట్ వెనకాల ‘జగదేక సుందరి’ (ఫొటోలు)


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం..జనజీవనం అస్తవ్యస్తం (ఫొటోలు)


హరి హర వీరమల్లు నటి నిధి అగర్వాల్ (ఫొటోలు)
అంతర్జాతీయం

Pakistan: ఇమ్రాన్ ఖాన్కు కోలుకోలేని దెబ్బ.. ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాక్ న్యాయస్థానం నుంచి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్కు కోలుకోలేని దెబ్బ పడింది. దేశంలో గతంలో జరిగిన అల్లర్ల కేసుల్లో ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 2023, మే 9న పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దరిమిలా దేశంలోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాలపై పీటీఐ నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ నేపధ్యంలో పలువురు నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ అల్లర్ల కేసులో లాహోర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) తాజాగా పీటీఐకి చెందిన ఏడుగురు సీనియర్ నేతలకు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైలు శిక్ష పడిన నేతలలో సెనేటర్ ఎజాజ్ చౌదరి (పార్టీ సీనియర్ మహిళా నేత) సర్పరాజ్ చీమా (పంజాబ్ మాజీ గవర్నర్), డాక్టర్ యాస్మిన్ రషీద్ (పంజాబ్ మాజీ ఆరోగ్య మంత్రి) , మెహమూదూర్ రషీద్ (మాజీ మంత్రి) న్యాయవాది అజీమ్ పహత్ (పార్టీ న్యాయ సలహాదారు) ఉన్నారు. మరో ఇద్దరు నేతలు కూడా శిక్ష పడినవారిలో ఉన్నారు. అయితే పలు మీడియా నివేదికలు ఐదుగురి పేర్లను హైలైట్ చేశాయి. ఈ కేసులో పీటీఐ వైస్ చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.మరో కేసులో పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత మాలిక్ అహ్మద్ ఖాన్ భచర్, పీటీఐ పార్లమెంటేరియన్ అహ్మద్ చట్టా, మాజీ శాసనసభ్యుడు బిలాల్ ఎజాజ్లకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. నాడు జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ఖాన్ 2023, ఆగస్టు నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పీటీఐ నేతలకు విధించిన శిక్షను ఫెడరల్ ప్రభుత్వం స్వాగతించింది. దీనిని సానుకూల చర్యగా అభివర్ణించింది. కాగా పీటీఐ పంజాబ్ చాప్టర్ హెడ్ అలియా హంజా, సీనియర్ నేత బాబర్ అవాన్, శాసనసభ్యుడు అసద్ కైసర్ ఈ శిక్షలను ఖండించారు. ఈ కేసులలో చట్టపరమైన విధానాలను అనుసరించలేదని, విశ్వసనీయ సాక్షులను హాజరుపరచలేదని వారు ఆరోపించారు.

‘సమితి’లో పాక్ బండారం బయటపెట్టిన భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తీరుతెన్నులను భారత్ ఎండగట్టింది. భారతదేశం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుండగా, పాకిస్తాన్ ఒకవైపు మతతత్వం, మరోవైపు ఉగ్రవాదంలో మునిగిపోయి, భారీ రుణగ్రహీతగా మారిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.ఐక్యరాజ్యసమితిలో ‘అంతర్జాతీయ శాంతి- భద్రతను ప్రోత్సహించడం’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, భారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశమని, పురోగతి, శ్రేయస్సు, అభివృద్ధి నమూనాలలో ఎదుగుతున్నదని పేర్కొన్నారు. పొరుగుదేశం ఇందుకు భిన్నంగా ఉన్నదని ఆరోపించారు. భారత్ ఐక్యరాజ్యసమితి లక్ష్యంలో భాగస్వామ్యం వహిస్తూ, మరింత శాంతియుత, సంపన్నమైన,ప్రపంచం కోసం సమిష్టిగా కృషి చేయడంలో చురుకుగా, నిర్మాణాత్మకంగా పాల్గొంటున్నదని అన్నారు.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతుండగా, అదే సమయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల నుండి రుణాలు తీసుకోవడంలో బిజీగా ఉందని హరీష్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ, ఈ ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్ పేర్కొన్నారు. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసిందన్నారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం.. యూకే పర్యటనలో ప్రధాని మోదీ సంతకం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన లండన్ పర్యటనలో జూలై 24న సంతకం చేయనున్న భారత్- యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా ఇది నిలవనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించాయి.ప్రధాని మోదీ చేపట్టే యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల నాలుగు రోజుల పర్యటన బుధవారం(జూలై 23)ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రధానమంత్రి వెంట ఉండనున్నారు. కాగా 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందం ప్రతిపాదించింది.భారత్-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాల ప్రస్తావన ఉంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకం చేయనున్నారు. అనంతరం దీనిని అమలు చేసేందుకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు సామాజిక భద్రతా ఒప్పందంపై రెండు దేశాలు చర్చలు జరిపాయి. కాగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బిట్)పై చర్చలు కొనసాగుతున్నాయి. 2024-25లో యూకేకి భారతదేశ ఎగుమతులు 12.6 శాతం పెరిగాయి. దిగుమతులు 2.3 శాతం మేరకు పెరిగాయి. భారత్-యూకేల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో20.36 యూఎస్ బిలియన్ డాలర్ల నుండి 2023-24లో 21.34 యూఎస్ బిలియన్ డాలర్లకు పెరిగింది.

United States: నిర్బంధ కేంద్రాల్లో మహిళలకు ఘోర అవమానం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని నిర్బంధ కేంద్రాల్లో(డిటెన్షన్ సెంటర్లు)మహిళకు ఘోర అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మయామి పశ్చిమ ప్రాంతంలోని క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్లో మహిళా ఖైదీలు.. పురుష ఖైదీల ఎదుట టాయిలెట్లను ఉపయోగించవలసిన దుస్థితి ఏర్పడింది.‘యూ ఫీల్ లైక్ యువర్ లైఫ్ ఈజ్ ఓవర్’ పేరుతో వెలువడిన ఒక నివేదికలో అమెరికాలోని ఫ్లోరిడాలో గల మూడు ఇమ్మిగ్రేషన్ సెంటర్లలో తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేని వలసదారులు ఘోర అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 2025 మొదటి నుంచి ఈ విధమైన దుస్థితి మరింతగా పెరిగిందని నివేదికలో వెల్లడించారు. సంకెళ్ళు వేయడం, అరకొర ఆహారం అందించడం, పరిశుభ్రంగా లేని ప్రాంతంలో ఉంచడం, వైద్య సంరక్షణలో ఆలస్యం చేయడం మొదలైనవి వీటిలో ఉన్నాయని తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఖైదీ మరిణించారని కూడా దానిలో పేర్కొన్నారు.అక్రమ వలసదారులను సంకెళ్లతో బంధించి, వారి చేతులు వెనుకకు కట్టి, కుక్కల మాదిరిగా స్టైరోఫోమ్ ప్లేట్లలోని ఆహారాన్ని మోకరిల్లి తినాలంటూ అధికారులు బలవంతం చేశారని ఆ నివేదిక పేర్కొంది. పదుల సంఖ్యలో పురుషులను గంటల తరబడి సెల్లలో బంధించారని, సాయంత్రం 7 గంటల వరకు ఆహారం పెట్టలేదని నివేదిక తెలిపింది. తాము జంతువుల మాదిరిగా ఆహారం తినవలసి వచ్చిందని పెడ్రో అనే ఖైదీ తెలిపాడు. ఈ ఘటన మయామి ఇమ్మిగ్రేషన్ జైలులో చోటుచేసుకుంది. పశ్చిమ మయామిలోని క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్లో పురుష ఖైదీల ముందు మహిళా ఖైదీలు టాయిలెట్లను ఉపయోగించవలసిన దుర్భర పరిస్థితిని అధికారులు కల్పించారని నివేదిక పేర్కొంది. పోంపానో బీచ్లోని బ్రోవార్డ్ పరివర్తన కేంద్రంలో 44 ఏళ్ల హైతీ మహిళ మేరీ ఏంజ్ బ్లేజ్ ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోనే మృతిచెందింది. ఎవర్గ్లేడ్స్లోని అలిగేటర్ అల్కాట్రాజ్ జైలులో సౌకర్యాలు లేనప్పటికీ సరైన పత్రాలు లేని ఐదువేల మంది వలసదారులను ఉంచి, ఇబ్బందుకు గురిచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
జాతీయం

ఏఐ సాయంతో బెంగళూరు ట్రాఫిక్కు చెక్!
ఉద్యాన నగరి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు బృహత్ ప్రయత్నం మొదలైంది. కోటి రూపాయలైనా ఖర్చుపెడతా.. ఈ కార్యక్రమంలో చేయి కలపండి అని పిలుపునిచ్చిన ప్రశాంత్ పిట్టి తన కార్యచరణ మొదలుపెట్టాడు. పది రోజుల క్రితం ఒకానొక ట్రాఫిక్ జామ్లో గంటకు పైగా చిక్కుకుపోయిన ప్రశాంత్.. ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలని తీర్మానించుకోవడం... ఏఐ, ఎంఎల్ ఇంజినీర్లు ముందుకొస్తే టెక్నాలజీ సాయంతో ట్రాఫిక్ చిక్కులు తొలగిద్దామని ‘ఎక్స్’ వేదికగా(కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత.. ఈ పది రోజుల్లో ఏం జరిగిందో కూడా ప్రశాంత్ తన తాజా ట్వీట్లో వివరించారు. ‘‘ఏడాది కాలంలో బెంగళూరు ట్రాఫిక్ సమస్యను 25-30 శాతం వరకూ తీర్చగలనని నమ్మకంగా ఉన్నా’’ అన్న ప్రశాంత్ దిశగా చేసిన ప్రయత్నాలను ఇలా వివరించారు.అందరి సహకారం...బెంగళూరు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రశాంత్ బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) కమిషనర్లతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్లు, రోడ్డు ఇంజినీర్లు, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ట్రాఫిక్తో సంబంధమున్న వ్యాపారస్తులను కలిశారు. కలిసికట్టుగా సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్న ప్రశాంత్ పిలుపునకు సానుకూల స్పందన వ్యక్తమైంది. ట్రాఫిక్ పోలీస్, బీబీఎంపీ కమిషనర్లు ఇప్పటికే తాము చేస్తున్న ప్రయత్నాలను, తమకున్న సామర్థ్యాలను వివరించారు. అటు ప్రభుత్వ అధికారులు.. ఇటు విద్యావేత్తలు.. మరోవైపు సమస్యను ఎదుర్కొంటున్న వారందరూ ఒక్కతాటిపైకి చేరారన్నమాట.కంప్యూటర్ మోడళ్లతో అధ్యయనం...బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, ఐఐఎస్సీల వద్ద ఉన్న కంప్యూటర్ సిములేషన్ మోడళ్లను ట్రాఫిక్ రీమోడలింగ్కు ఉపయోగించాలని నిర్ణయించాము. ఏయే మార్గాల్లో ఎంత ట్రాఫిక్ ఉంటే బాగుంటుందో ఈ కంప్యూటర్ మోడళ్ల ద్వారా పరిశీలిస్తారు. దగ్గరి దారిపై దృష్టి పెట్టకుండా.. తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం ఈ మొడళ్ల లక్ష్యం. ‘‘గూగుల్, ఊబర్, ఓలా, ర్యాపిడోల నుంచి కూడా ట్రాఫిక్ సమాచారం కోరాను. కొంతమంది సహకరించేందుకు అంగీకరించారు. ఇతరుల కోసం వెయిట్ చేస్తున్నా. ఈ మోడల్ పనిచేస్తే ఎప్పుడు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో ముందుగానే గుర్తించవచ్చు. నివారించేందుకూ అవకాశం ఏర్పడుతుంది’’ అని ప్రశాంత్ వివరించారు.రోడ్లపై గుంతల సంగతి తేలుస్తా...‘‘రహదారిపై ఉండే గుంతలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే కొన్ని యాప్లు ఉన్నాయి. ఆ యాప్ ఓనర్షిప్ నేను తీసుకుంటా. గుంతలతోపాటు అక్రమ పార్కింగ్, సిగ్నల్స్ పనిచేయకపోవడం, రాంగ్సైడ్ డ్రైవింగ్, నీరు నిలిచిపోవడం, వాహనాల బ్రేక్డౌన్ వంటి అంశాలను ప్రజలే మా దృష్టికి తీసుకొచ్చేలా చేస్తాం. ఎవరి బాధ్యత ఏమిటన్నది స్పష్టంగా నిర్ణయించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మంచి పని చేసిన వారికి గుర్తింపు కూడా. వచ్చిన ఫిర్యాదులు.. తీసుకున్న చర్యలను బహిరంగంగా ప్రదర్శిస్తాం. ‘‘ప్రభుత్వం మౌలికసదుపాయాల వృద్ధి, నిర్వహణల కోసం అప్పుడప్పుడూ రహదారులను బంద్ చేస్తూంటుంది. అయితే వర్షం పడగానే ఈ పనులు నిలిచిపోతాయి. ఫలితంగా ట్రాఫిక్ చిక్కులు ఎక్కువవుతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం బెంగళూరు నగరంలోని ఒక్కో ప్రాంతంలో ఎప్పుడు, ఎంత వర్షం పడుతుందో తెలుసుకునేందుకు ‘హైపర్లోకల్ రెయిన్ ప్రిడిక్టర్’ ప్రాజెక్టును చేపడతాం. వర్షం పడకముందే డ్రెయినేజీ సమస్యలను సరిచేసేందుకు, కొన్ని ఇతర పనులకు ఇది ఉపయోగపడుతుంది’’ఒక మార్గంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సమన్వయంతో ఒకదాని తరువాత ఒకటి పడేలా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఫలితంగా వాహనాలు ఒక క్రమ పద్ధతిలో కదులుతాయి. ప్రతి జంక్షన్లోనూ నిలవాల్సిన అవసరం ఉండదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పైలట్ ప్రోగ్రామ్ నడుస్తోంది. ఫలితాలను విశ్లేషించి అవసరమైతే నగరం మొత్తం విస్తరిస్తాం.’’విజన్ ఫర్ ఇండియా...‘‘పది రోజుల క్రితం నేను ట్రాఫిక్ సమస్యపై పోస్ట్ పెట్టినప్పుడు అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య అని కొందరు చెప్పారు. వాస్తవం చెప్పినందుకు కంగ్రాట్స్. అయితే ఈ మౌలిక సదుపాయాలు మెరుగయ్యేంత వరకూ వెయిట్ చేస్తే మనం పాశ్చాత్యదేశాలతో పోటీ పడినట్లుగా ఉంటుంది. ఉన్న సదుపాయాలను మరింత మెరుగ్గా వాడుకునేందుకు ఇక్కడ ఎంతో అవకాశం ఉంది. నేను దీనిపై దృష్టి పెడతా. నెపం వ్యవస్థలపై నెట్టేసే సమయం కాదిది. ఆచరణ సాధ్యమైన ఆశావహ దృక్పథం. మంచి ఉద్దేశంతో అన్ని రకాల సమాచారం సేకరించుకుని, అందరి సహకారంతో ఏం చేయలేము అనుకుంటున్న సమస్య విషయంలో ఎంతో కొంత చేయవచ్చునని నా నమ్మకం’’పాఠకుల నుంచి ఆశిస్తున్నది..‘‘మీ సహకారాన్ని కొనసాగించండి. ట్వీట్లు షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఫలితంగా ఈ సమస్య మరింత ఆంప్లిఫై అవుతుంది. ట్రాఫిక్ జామ్లను పరిష్కరించేందుకు సరైన వారు పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకు చాలా సమయం పడుతుందని నాకు తెలుసు. అందుకు సిద్ధంగానే ఉన్నా.. మీరు?’’‘‘వాట్సప్ కమ్యూనిటీలో చేరండి. ఎప్పుడేం చేయబోతున్నది అందులో వివరిస్తూంటాను. అంతేకాదు.. మీలో ప్రతి ఒక్కరి నుంచి మరింత సమాచారం కోరుతున్నా. ట్రాఫిక్ సమస్య ఏ జంక్షన్, రోడ్డులో ఎక్కువగా ఉంటుందో చెప్పండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సులువుగా ఉంటుంది.’’ ప్రశాంత్ వాట్సప్ కమ్యూనిటీలో చేరేందుకు... https://whatsapp-traffic-community.forpublicgood.ai ఉపయోగించుకోండి.

40 ఏళ్ల అంకుల్తో 10వ తరగతి విద్యార్థిని ప్రేమ..!
తమిళనాడు: తన 40 ఏళ్ల ప్రియుడితో వెళ్లేందుకు యత్నించి పట్టుబడిన ఓ 10వ తరగతి విద్యార్థిని పోలీస్ స్టేషన్ మిద్దె పైనుంచి దూకి కలకలం సృష్టించింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణపాయ స్థితిలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు.. నెల్లై జిల్లాలోని పత్తమడైకి చెందిన మురుగన్ (40). ఇతను కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు. అతను పత్తమడై ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సోషల్ మీడియా ద్వారా కలుసుకుని ప్రేమ సంబంధాన్ని పెంచుకున్నారు. తరు వాత, ఇద్దరూ సెల్ఫోన్ల ద్వారా తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈనెల 14వ తేదీన పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అకస్మాత్తుగా అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రులు పత్తమడై పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న చేరన్మా దేవి ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి తిరుచెందూర్ వెళ్లిందని తేలింది. పోలీసులు, విద్యార్థిని తల్లిదండ్రులు తిరుచెందూర్ వెళ్లి ఇద్దరు వ్యక్తులను బుధవారం ఉదయం అక్కడికి తీసుకువచ్చారు. తరువాత, ఆల్–ఉమెన్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించినప్పుడు, విద్యార్థిని తన తల్లిదండ్రులతో వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆమె తన ప్రియుడిని విడిచిపెట్టనని స్పష్టంగా చెప్పింది. అయితే విద్యార్థిని మైనర్ కావడంతో పోలీసులకు అప్పగిస్తామని తేల్చారు. దీంతో నిరాశ చెందిన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ మిద్దెపై నుంచి దూకింది. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయి ప్రాణపాయ స్థితిలో ఉంది. వెంటనే పోలీసులు అతన్ని రక్షించి చికిత్స కోసం నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మురుగన్ను అరెస్టు చేశారు. మురుగన్కు వివాహం జరిగి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పడం గమనార్హం.

‘యుద్ధానికి రాకుంటే ఏం చేయగలం?’: రాహుల్పై స్మృతి సంచలన వ్యాఖ్యలు
న్యూఢ్లిల్లీ: ‘2024లో గాంధీ కుటుంబం నాతో పోరాడేందుకు నిరాకరించింది. వారు యుద్ధభూమిలోకి కూడా దిగనప్పడు నేను ఏమి చేయగలను? ఇకపై నేను వారిని వెంటాడను’ అంటూ బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండియా టుడే టీవీతో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాటల దాడి చేయడం తన బాధ్యతల్లో భాగం కాదని అన్నారు. రాహుల్ గాంధీపై ఈ మధ్య కాలంలో ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథి నుంచి పోటీచేసి, గాంధీ కుటుంబపు కోటను కొల్లగొట్టానని, 2024లో కూడా రాహుల్ గాంధీ తనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఉంటే, తాను ఆయనను ఖచ్చితంగా ఓడించగలనని ఆమె పేర్కొన్నారు. ఓటమి భయంతోనే రాహుల్ అమేథి నుండి పోటీ చేయలేదని స్మృతి విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో, కాంగ్రెస్ అమేథి నుంచి కేఎల్ శర్మను అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన ఇరానీని ఓడించారు. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్తో పాటు యూపీలోని రాయ్బరేలి నుండి కూడా పోటీచేసి గెలుపొందారు. అమేథీ అంత తేలికైన స్థానం కాదని చరిత్ర తెలియజేస్తోంది. శరద్ యాదవ్ వంటి సీనియర్ నేతలే అక్కడ ఓడిపోయారు. మేనకా గాంధీ కూడా అమేథీ నుండి ఓడిపోయాయరని స్మృతి ఇరానీ గుర్తుచేశారు. ఓటమి ఎదురవుతుందనే సీటును ఏ తెలివైన నాయకుడు ఎంచుకోడు. అయితే పార్టీ ఆదేశిస్తే దానిని విధిగా అంగీకరిస్తారు. 2019లో తాను అసాధ్యాన్ని సుసాధ్యం చేశానని అని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల నుండి దూరమవుతున్నాననే వార్తలను స్మృతి తోసిపుచ్చారు. టీవీ సిరీస్ ‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’లో తిరిగి తులసి పాత్రలో కనిపిస్తూ అలరిస్తున్నానని తెలిపారు. భవిష్యత్లో పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తుందో తెలియదని స్మృతి అన్నారు.

‘పెద్ద ప్లానే’.. నలుగురు ఉగ్రవాదుల ఆటకట్టించిన ఏటీఎస్
న్యూఢిల్లీ: నకిలీ కరెన్సీ రాకెట్ను నడుపుతూ, ప్రపంచ ఉగ్రవాద సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సాయపడుతున్న అల్ ఖైదాతో సంబంధం కలిగిన నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. పట్టుబడిన ఉగ్రవాద నిందితులు మొహమ్మద్ ఫైక్, మొహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీలు అల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను, అనుమానాస్పద యాప్లను ఉపయోగించారని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. అలాగే వీరు తమ జాడ తెలియకుండా ఉండేందుకు ఆటో డిలీట్ యాప్లను ఉపయోగించారని సమాచారం.ఈ నిందితులు చాలా కాలంగా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని గుజరాత్ ఏటీఎస్ అధికారులు గుర్తించారు. వారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అల్-ఖైదాతో సంప్రదింపులు జరిపారని వెల్లడైందన్నారు. వారి చాట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురూ సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు సంప్రదించుకున్నారని, ఢిల్లీ నివాసి ఫైక్.. పాకిస్తాన్ ఇన్స్టాగ్రామ్ యూజర్తో పరిచయం పెంచుకుని, భారతదేశంలో జిహాదీ కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి చర్చించారని తమకు తెలిసిందని తెలిసిందని గుజరాత్ ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సునీల్ జోషి పేర్కొన్నారు.ఈ నలుగురు నిందితుల ప్రధాన ఎజెండా అల్ఖైదా భావజాలం వైపు యువతను ఆకర్షించడం. హింస ద్వారా షరియాను స్థాపించడానికి, తద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించేందుకు యవతను ప్రేరేపించేందుకు వారు పనిచేస్తున్నారని సునీల్ జోషి తెలిపారు. వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో అల్ఖైదా సాహిత్యం, షరియాను స్థాపించాలని పిలుపునివ్వడం, మత విద్వేషాన్ని సృష్టించే ప్రకటనలు ఉన్నాయని ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఒకరు వెల్లడించారు.నిందితుల ప్రవర్తన ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించడానికి, భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అణగదొక్కడానికి ఉపకరించేదిగా ఉందని డీఐజీ తెలిపారు. కాగా ఒసామా బిన్ లాడెన్ గురువు షేక్ అబ్దుల్లా అజ్జాం నెలకొల్పిన మఖ్తబ్ అల్-ఖిదామత్ నుండి అల్-ఖైదా ఉద్భవించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే సంస్థగా ఉంది. అల్-ఖైదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోని పెషావర్లో విస్తరించి ఉంది. 1996 నుండి 2001 చివరి వరకు అల్ఖైదాను తాలిబాన్ రక్షణలో బిన్ లాడెన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు పర్యవేక్షించారు.
ఎన్ఆర్ఐ

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

అమెరికా స్టోర్లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చ
భారతదేశానికి చెందిన మహిళను దొంగతనం ఆరోపణల కింద అమెరికాలో అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్ నుండి 1,300 డాలర్ల (సుమారు రూ.1.11 లక్షలు) విలువైన వస్తువులను దొంగిలించినట్టు ఆరోపణలు నమోదైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైఐరల్గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది.స్టోర్ ఉద్యోగుల ప్రకారం, విలువైన వస్తువులను కొట్టేసే ఆలోచనతోనే ఆ మహిళ ఏడు గంటలకు పైగా స్టోర్లో సంచరిస్తూ, తన ఫోన్ను నిరంతరం తనిఖీ చేసుకుంటూ కనిపించింది. చివరికి డబ్బు చెల్లించ కుండానే పశ్చిమ గేటు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించిందని దీంతో వారు పోలీసులకు సమాచారం అందించించారు. దీంతో ఆమెను అమెరికా పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె చేతికి సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై నేరపూరిత దొంగతనం అభియోగం మోపారు. అయితే దీనిపై డబ్బులు చెల్లిస్తానంటూ క్షమాపణలు చెప్పిన మహిళ తాను ఇక్కడికి చెందిన దాన్ని కాదని, తన ఫ్యామిలీ ఇండియాలో ఉంది, వాళ్లకి ఫోన్ చేయాలి లేకపోతే నేను ఎక్కడ ఉన్నానో వారికి తెలియదు.. అమెరికాకు ఒంటరిగా వచ్చాను.. ఇంట్లో 20 ఏళ్ల కూతురు ఉంది అంటూ దీనంగా చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!ఈ ఏడాది మే 1న జరిగినట్టుగా చెబుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. అలా ఎలా చేసింది? అని కొంతమంది ప్రశ్నించగా, మరికొంతమంది దేశం పరువుతీసింది అంటూ విమర్శించారు. ఈ ఘనకార్యం కోసమేనా పాస్పోర్ట్తో విదేశాలకు వెళ్లింది. ఇలాంటి వారి వల్లనే అమెరికా సోషల్ మీడియా భారతీయుల పట్ల ద్వేషం, అసహ్యంతో నిండిపోయింది అని మరొకరు కమెంట్ చేశారు."ప్రపంచ వేదికపై భారతదేశానికి తలవంపులు తెచ్చి పెడుతోంది. విదేశాలలో దేశానికి అవమానం తీసుకురావద్దు. గౌరవంగా ప్రవర్తించండి అని మరొకరు హితవు పలకడం విశేషం. నోట్: అయితే ఆ మహిళ ఏ ప్రదేశానికి చెందినవారు, ఎవరు? అనే వివరాలేవీ అందుబాటులో లేవు.

నిమిషా ప్రియను క్షమించలేం
సనా: తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని దారుణంగా హత్య చేసిన కేరళ నర్స్ నిమిషా ప్రియను క్షమించలేమని అబ్దెల్ ఫతాహ్ మెహదీ తేల్చిచెప్పారు. ఆమె నుంచి క్షమాపణ గానీ, నష్టపరిహారం(బ్లడ్ మనీ) గానీ తాము కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు. యెమెన్లో నిమిష తల్లి ప్రేమకుమారియెమెన్లో మాజీ వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీని 2017లో విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు నిమిషా ప్రియకు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆమెకు బుధ వారం శిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమి షంలో వాయిదా పడింది. బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫతాహ్ మెహదీ బీబీసీ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఖిసాస్’ తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదని చెప్పారు. షరియా చట్టం ప్రకారం తమకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సోదరుడిని చంపినందుకు నిమిషా ప్రియను ఉరి తీయాల్సిందేనని, అంతకుమించి ఇంకేదీ అక్కర్లే దని వెల్లడించారు.

నిమిష మరణశిక్ష వాయిదా
యెమెన్లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం.నిమిష శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్లో ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ సభ్యుడు శ్యామూల్ జోరెమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయితే.. బాధిత కుటుంబం బ్లడ్మనీ(పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని అంటున్నారాయన.కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం. మరోవైపు.. నిమిషా ప్రియ విషయంలో భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఈఏ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హౌతీ నియంత్రణలోని యెమెన్తో భారతకు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. ఈ తరుణంలో తామ చేయగలిగినదంతా చేశామని, ఇంతకు మించి చేయలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే.. నిమిష కేసును బాధాకరంగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అనధికారిక మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చినా.. కేంద్రం యెమెన్ న్యాయవిభాగానికి విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భర్తతో నిమిషఇంకోవైపు క్షమాభిక్షపైగానీ, బ్లడ్మనీపైగానీ చర్చించేందుకు సైతం తలాల్ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే తాజా భేటీలో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి పాల్గొన్నట్లు తెలస్తోంది. ఈ పురోగతితో నిమిష శిక్ష రద్దయ్యే అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి.
క్రైమ్

ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం తీసిన నిజాయితీ.. విచారణకు సీఎం ఆదేశం
దిస్పూర్: విధి నిర్వహణలో నిజాయితీ ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రాణం తీసింది. ప్రాజెక్ట్లు పూర్తి కానప్పటికీ.. పూర్తయ్యాయని బిల్లులు ఇవ్వాలంటూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD)లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న బాధితురాల్ని ఆమె సీనియర్ ఉద్యోగులు వేధించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాల్ని వివరిస్తూ ఓ లేఖను రాసింది. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నా పని ఒత్తిడి కారణంగా నేను ఈ చర్య తీసుకుంటున్నాను. ఆఫీసులో నాకు అండగా ఎవరూ లేరు. పూర్తిగా అలసిపోయాను నా తల్లిదండ్రులు నా గురించి ఆందోళన చెందుతున్నారు’అని సూసైడ్ నోట్లో రాశారు.బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా, ఇటీవల పదోన్నతి పొందిన సూపరింటెండెంట్ ఇంజనీర్, గతంలో బొంగైగావ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన దినేష్ మేధి శర్మ, ప్రస్తుతం బొంగైగావ్లో పనిచేస్తున్న సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్డిఓ) అమీనుల్ ఇస్లాంలను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సైతం దర్యాప్తు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రేమించిన మరదలితో వివాహం చేయడం లేదని..
కృష్ణా: ప్రేమించిన మరదలితో కుటుంబ సభ్యులు వివాహం చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇక సెలవు (మిస్యూ మా, మిస్యూ ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ) అంటూ తన ఫొన్లో స్టేటస్ పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని చేగుంటలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. చేగుంటకు చెందిన సంగెంబండ బస్సప్ప – తిమ్మవ్వ దంపతులకు మల్లప్ప, భీమ్రాయ, పరశివ సంతానం. వీరి తల్లి తిమ్మవ్వ కొన్నేళ్ల క్రితం మృతిచెందగా.. మొదటి కొడుకు మల్లప్ప తన భార్యతో కలిసి జీవనోపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లారు. ఆరేళ్ల క్రితం పదో తరగతి పూర్తిచేసుకున్న చిన్నకొడుకు పరశివ (22) కూడా ఉపాధి నిమిత్తం బెంగళూరులోని తన అన్న మల్లప్ప వద్దకు వెళ్లాడు. బెంగళూరులో పరశివ పనిచేసుకుంటూ.. తన రెండో అన్న భీమ్రాయ భార్య సునీత చెల్లెలు నిఖితతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు వరుసకు బావమరదలు కావడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తన సోదరుడు భీమ్రాయ, వదిన సునీతకు చెప్పేందుకు గాను వారం రోజుల క్రితం పరశివ బెంగళూరు నుంచి చేగుంటకు వచ్చాడు. ఈ క్రమంలో పరశివ, నిఖిత వివాహానికి అన్న, వదినలు అడ్డు చెప్పారు. ప్రేమించిన యువతి ఆరోగ్యం బాగా లేదని, నీకు మరో అమ్మాయితో వివాహం చేస్తామని పరశివకు సర్దిచెప్పారు. ఇక వీరి మాటకు ఎదురు చెప్పలేక తిరిగి బెంగళూరుకు బయలుదేరాడు. ఆదివారం బెంగళూరు నుంచి మళ్లీ బయలుదేరిన పరశివ.. రాష్ట్ర సరిహద్దులోని దేవసూగూర్లో గల కృష్ణానది తీరానికి చేరుకున్నట్లు తెలిసింది. అక్కడ తన ఫోన్లో ‘మీస్యూ ఆల్ మై ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీ’ అంటూ స్టేటస్ పెట్టాడు. అలాగే తాను ప్రేమించిన నిఖితతో దిగిన ఫొటోలు, వీడియోలు స్టేటస్లో పెట్టుకొని ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొదట కృష్ణా, ఆ తర్వాత శక్తినగర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే కృష్ణానదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడేమో అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికుల సహాయంతో కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఆచూకీ లభించలేదు. యువకుడి అదృశ్యం ఘటనకు సంబంధించి శక్తినగర్ ఎస్ఐ తిమ్మణ్ణను వివరణ కోరగా.. ఈ విషయంపై బెంగళూరులో కేసు నమోదైందని త తెలిపారు. తాము స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. ఇప్పటికే బెంగళూరులో కేసు నమోదైనందున తాము కేసు చేయలేదని తెలిపారు.

ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం..!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో కలిసి భార్య.. భర్తను హత్య చేయించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మూడేళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ చెన్నైలో ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు. ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్ సరకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్లాడు. తిరిగొస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరిమట్టలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భారత్పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానం కలిగింది.భారత్ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. మూడేళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. తన ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి చంపి పారిపోయాడని తెలిపాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వెంటనే నందినితోపాటు సంజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

అన్నా చెల్లెళ్ల ‘లవ్ స్టోరీ’ అలా ముగిసింది!
తమిళనాడు: తిరుపోరూర్ పక్కన ఉన్న తండలం పంచాయతీకి చెందిన సెల్వరాజ్ కుమారుడు సురేంద్రన్ (28). అతనూ షోలింగనల్లూర్లో నివసించే బంధువు ప్రియాంక (25) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇంజినీర్ అయిన ప్రియాంక, పోరూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. సురేంద్రన్ తల్లి, ప్రియాంక తల్లి అక్కాచెల్లెళ్లు. దీంతో ఆ కుటుంబాల్లో ఎవరూ సురేంద్రన్, ప్రియాంక స్నేహాన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం వారికి తెలియగానే రెండు కుటుంబాలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి మధ్య ప్రేమ ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని హెచ్చరించాయి. అయితే అప్పటికే ప్రియాంక గర్భవతి అయింది. దీంతో తమ వివాహానికి సమ్మతి తెలపాలని ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యులను కోరారు. కానీ రెండు కుటుంబాలు దీనిని వ్యతిరేకించాయి. అంతేకాకుండా ప్రియాంక 8 నెలల గర్భవతి కావడంతో గర్భాన్ని తొలగించడం అసాధ్యంగా మారింది. దీని కారణంగా, ప్రేమికులిద్దరూ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇదే సమయంలో ఎంతకూ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో సురేంద్రన్, ప్రియాంక మనస్తాపంతో మంగళవారం రాత్రి తండలం ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. బయటకు వెళ్లిన సురేంద్రన్ తిరిగి రాకపోయేసరికి, అతని బంధువులకు అనుమానం వచ్చి అతని కోసం వెతకడానికి వెళ్లారు. స్థానికంగా ఉండే పంపు సెట్ రూంలో సురేంద్రన్, ప్రియాంక మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఈ సంఘటన గురించి తిరుపోరూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


Visakha : పోక్సో కేసులో పోలీసులు డబుల్ గేమ్


Sajjala: చంద్రబాబు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నారు


ఒక్క వర్షంతోనే మునిగిన కానూరు ప్రధాన రహదారి


నమ్ముకున్న వారిని ప్రాణం అడ్డుపెట్టి అయినా కాపాడుకునే వ్యక్తి YS జగన్


Anantapur: ఉపాధ్యాయుడినే బెదిరించిన విద్యార్థిని


పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారని మహిళల నిలదీత


Gachibowli: పీజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి


KTR Birthday: ఆశీర్వదించండి నాన్న


సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ జగన్


YS జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది