ముస్లింలకు అండగా వైఎస్సార్‌ సీపీ | - | Sakshi

ముస్లింలకు అండగా వైఎస్సార్‌ సీపీ

Apr 1 2025 11:12 AM | Updated on Apr 1 2025 2:18 PM

ఒంగోలు ఈద్గాలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రార్థనలు

ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలోని ముస్లింలకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలుస్తుందని పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. ముస్లింల సంక్షేమం, అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. నగర పాలక సంస్థ ఫ్లోర్‌ లీడర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన మంచినీరు, మజ్జిగ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈద్గా వద్ద నమాజులో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలను కలిసి ఈద్‌ ముబారక్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ముస్లింలకు అందజేశారన్నారు. రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ నాగూర్‌, దాసరి కరుణాకర్‌, మల్లెల భాస్కర్‌ రెడ్డి, మైనారిటీ నాయకులు ఉన్నారు.

ముస్లింలకు అండగా వైఎస్సార్‌ సీపీ 1
1/2

ముస్లింలకు అండగా వైఎస్సార్‌ సీపీ

ముస్లింలకు అండగా వైఎస్సార్‌ సీపీ 2
2/2

ముస్లింలకు అండగా వైఎస్సార్‌ సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement