Prakasam District Latest News
-
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ
● జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసులు ఒంగోలు సబర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో యువతీ, యువకులను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయటానికి ర్యాంపు పథకం ద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి ఒక బ్యాచ్కు, ఈ నెల 28వ తేదీ నుంచి రెండో బ్యాచ్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు ట్రెండ్జ్ ఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందిస్తారన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించుకోవటానికి అవసరమైన అవగాహన, ప్రాజెక్టు ప్రిపరేషన్, పథకాల వివరాలు, మార్కెట్పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఉచిత శిక్షణకు హాజరు కావాల్సిన అభ్యర్థుల వయస్సు 18 నుంచి 58 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఆధార్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటోలు, కులధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్ కార్డు తీసుకొని ఈ నెల 24వ తేదీన సంబంధిత కార్యాలయాల్లో హాజరు కావాలన్నారు. ఔత్సాహికులైన నిరుద్యోగ యువతీ, యువకులు ట్రెండ్జ్ కార్యాలయాలు ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్డులోని డొమినోస్ పిజ్జా ఎదురుగా కోటయ్య ప్లాజాలోని రెండో అంతస్తులో కార్యాలయంలో, మార్కాపురంలోని గణేష్ నగర్ పోస్టల్ ఏరియా కొండపల్లి రోడ్డులో ఉన్న ట్రెండ్జ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాల కోసం 91606 07606, 70937 73775 సెల్ నంబర్లను సంప్రదించి సమాచారం తెలుసుకోవాలన్నారు. రోస్టర్ సరిచేశాకే గ్రూప్–2 పరీక్షలు నిర్వహించాలి ● అఖిల భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరారెడ్డి ఒంగోలు సిటీ: రోస్టర్ విధానం సరిచేసిన తర్వాతనే గ్రూప్–2 పరీక్షలు నిర్వహించాలని అఖిల భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరారెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకి ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. డీఎస్సీని వెంటనే విడుదల చేసి యువతకి ఉపాధి కల్పించాలన్నారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిన్నటి వరకు కోర్టులో ఉందని చెప్పి సమయం లేకుండా ఈ నెల 23 తేదీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం సరైన పద్ధతి కాదని, రోస్టర్ సరిచేసి పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బాషా, సలోమాన్, విజయరాజ్, సంపత్, మహేష్ పాల్గొన్నారు. జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు దొనకొండ విద్యార్థులు దొనకొండ: రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్బాల్ పోటీలు ఈ నెల 16న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించారు. జిల్లా నుంచి దొనకొండ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పత్తి వెంకట లక్ష్మీనారాయణ, ఎనబరి ప్రైజీ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 23 నుంచి హర్యానాలో నిర్వహించే జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున వీరు పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు కాలే నరసింహారావు తెలిపారు. వీరిని ప్రధానోపాధ్యాయుడు వీవీ రామాంజనేయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు దొనకొండ విద్యార్థులు ఈ నెల 23 నుంచి 24వ తేదీ వరకు కర్నూలులో రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీలకు జిల్లా జట్టుకు దొనకొండ జెడ్పీ పాఠశాలకు చెందిన చంద్రశేఖర్, ఏడుకొండలు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహారావు తెలిపారు. -
అత్యవసరమైతేనే సిజేరియన్ కాన్పులు చేయాలి
ఒంగోలు టౌన్: అత్యవసరమైతేనే తప్ప సిజేరియన్ కాన్పులు చేయరాదని, సాధారణ కాన్పులకు ప్రోత్సహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉప సంచాలకుడు శ్రీనివాసులు రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. డీఎంహెచ్ఓ డా.వెంకటేశ్వరరావుతో కలిసి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న జనన, మరణ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకున్న వారికి డిశ్చార్జ్ సమయంలోనే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పారు. ప్రసవాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు పూర్తి సమాచారంతో పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. జిల్లాలోని అన్నీ ప్రాథమిక వైద్యాశాలల్లో ప్రతి నెలా కనీసం 10 కాన్పులు చేయాలని చెప్పారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అకౌంటెంట్ ప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి డి.శ్రీనివాసులు, డేటా మేనేజర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉప సంచాలకుడు శ్రీనివాసులు రెడ్డి -
పీడీ యాక్ట్ పెడతాం
గుప్త నిధుల పేరుతో వారసత్వ సంపదను ధ్వంసం చేస్తే పీడీ యాక్ట్ పెడతాం. పురాతన సంపదలైన ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, శతాబ్దాల నాటి శాసనాలను రక్షించుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటాం. సులభంగా డబ్బులు సంపాదించాలని రైస్ పుల్లింగ్ పేరుతో బయలు దేరిన ముఠాల వివరాలు సేకరించమని అధికారులను ఆదేశించా. నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తాం. వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ప్రజలు కూడా ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మొద్దు. గుప్త నిధులు లేవు, రైస్ పుల్లింగ్ లేదు. ఇలాంటివి నమ్మి చేజేతులా డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా పోలీసు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడతారు. – ఎస్పీ ఏఆర్ దామోదర్ -
బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డులోని ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ ముందు శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. మార్చి 24, 25 తేదీల్లో జరగనున్న దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా సన్నాహక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలు నగరంలోని బ్యాంకులతో పాటు పరిసర ప్రాంతాల్లోని దాదాపు 9 యూనియన్లకు చెందిన బ్యాంకుల ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సీనియర్ నాయకులు, ఎస్బీఐ ఎస్యూఏసీ గుంటూరు మాడ్యూల్ వైస్ ప్రెసిడెంట్ వీఎస్ఆర్ సుధాకర రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్లను అడ్డంపెట్టుకొని బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేయటానికి బ్యాంకు ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా రోడ్డుమీదకు వచ్చారన్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో వారంలో 5 రోజుల పనిదినాలు, బ్యాంకుల్లో అన్ని తరగతుల ఉద్యోగాల భర్తీచేయాలని డిమాండ్ చేశారు. టెంపరరీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకట రెడ్డి, వి.శ్రీనివాస రావు, సీహెచ్.శ్రీనివాస రావు, సుబ్బారావు, షేక్ హసన్, ఉమా శంకర్తో పాటు 9 బ్యాంకు యూనియన్లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. మార్చి నెల 24, 25 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మె సన్నాహక నిరసనలో యూఎఫ్బీయూ నాయకులు -
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. గ్రూప్–2, ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం ప్రకాశం భవనంలోని మినీ మీటింగ్ హాల్లో ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్అన్సారియా మాట్లాడుతూ 7 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 4,544 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాలైన క్విస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 944 మంది, శ్రీనాగార్జున డిగ్రీ కళాశాలలో 600 మంది, శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలలో 600 మంది, రైస్ కాలేజీలో రెండు కేంద్రాల్లో 1200 మంది, పేస్ కళాశాలలో రెండు కేంద్రాల్లో 1200 మంది అభ్యర్థులను కేటాయించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు కోఆర్డినేటింగ్ అధికారిగా జేసీ గోపాలకృష్ణ ఉంటారన్నారు. ఏడుగురు జిల్లా స్థాయి లైజన్ అధికారులను నియమించామన్నారు. పేపరు–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపరు–2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఏదైనా సమాచారం లేదా ఫిర్యాదు కోసం కంట్రోల్ రూమ్ నెంబరు 88011 88046 కు కాల్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయనున్న 42,439 మంది: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తారని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి సంవత్సరం 21,624 మంది, రెండో సంవత్సరం 20,815 మంది చొప్పున మొత్తం 42,439 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. వీటికి గాను చీఫ్ సూపరింటెండెంట్లు 67 మంది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 67 మంది, 27 మంది కస్టోడియన్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లయింగ్స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి ప్రత్యేక అధికారిగా ఐ.శ్రీనివాసరావు నియమించారు. హాల్టికెట్ డౌన్లోడ్ విషయంలో ఏమైనా సమస్యలున్నా ఒంగోలులోని ఆర్ఐఓ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు 08592–281275 ను సంప్రదించవచ్చన్నారు. మొబైల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురావద్దని చెప్పారు. 183 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 183 కేంద్రాల్లో నిర్వహిస్తారని, 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీరికి ఉదయం గం.9.30 నుంచి గం.12.45 వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఓపెన్ ఇంటర్మీడియెట్ పరీక్షలకు 4,175 మంది విద్యార్థులు 21 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. వీరికి మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఓపెన్ పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నారనీ, ఇందులో 1564 మంది విద్యార్థులు 23 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. వీరికి పరీక్ష ఉదయం గం.9.30 నుంచి గం.12.30 వరకు ఉంటుందని తెలిపారు. పటిష్ట భద్రత: ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లో పోలీస్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తామని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో మెయిన్స్ పరీక్ష గురించి తప్పుదారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టినా, షేర్ చేసే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ పరీక్షా కేంద్రం వద్ద ఎవైనా ఘటన జరిగినా వెంటనే డయల్ 100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమావేశంలో డీఆర్వో బి.చిన ఓబులేసు, ఆర్ఐఓ సైమన్ విక్టర్, డీఈఓ అత్తోట కిరణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈనెల 23న 7 కేంద్రాల్లో గ్రూప్–2 మెయిన్స్ మార్చి 1 నుంచి 67 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 17 నుంచి 183 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు కలెక్టర్ తమీమ్ అన్సారియా -
విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు
ఒంగోలు వన్టౌన్: పదో తరగతి విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరక్టర్ ఎ.లక్ష్మా నాయక్ అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్లో జిల్లాలోని ఒంగోలు, కొండపి సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పరిధిలోని 15 వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు శుక్రవారం ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డెప్యూటీ డైరక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 7 సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పరిధిలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న 934 మందికి ఈ ప్రేరణ తరగతులను ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సబ్జెకులో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు 6 సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉన్న ఉత్తమ ఉపాధ్యాయుల ద్వారా ఈ ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన ఈ ప్రేరణ తరగతుల్లో మొత్తం 183 మంది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇప్పటికే ఆల్ ఇన్ వన్ గైడ్లు, స్టడీ మెటీరియల్, స్టేషనరీ మెటీరియల్ను అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ నీలిమ, డీసీఈబీ శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి బీ కిరణ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు కిషోర్, సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి టీ లింగయ్య, వసతి గృహ అధికారులు డీ అంకబాబు, సిబ్బంది పాల్గొన్నారు. పది విద్యార్థుల ప్రేరణ తరగతుల్లో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
● పొలాల్లోకి పల్టీలు కొట్టిన కారు బేస్తవారిపేట: మండలంలోని కలగొట్ల సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోరుమామిళ్లకు చెందిన పశువైద్యాధికారి ఆదిత్య, భార్య సాయిసౌజన్య, పిల్లలు హర్షణ్, రాజీ తమ కారులో దర్శిలో జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ఉన్న వీరి కారు కలగొట్ల వద్ద రోడ్డుపై లోతైన గుంతలను తప్పించే క్రమంలో అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ పొలంలో పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు మధుసూదన్రెడ్డి కారు ప్రమాదాన్ని గమనించారు. క్షతగాత్రులను బేస్తవారిపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. హర్షణ్ ముక్కు వద్ద లోతైన గాయమైంది, మిగిలిన ముగ్గురుకి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
ఆదివాసీలపై మారణకాండ ఆపాలి
ఒంగోలు టౌన్: అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టే లక్ష్యంతో మధ్య భారత దేశంలోని ఆదివాసీలపై కొనసాగిస్తున్న మారణ హోమాన్ని ఆపాలని, తక్షణమే కాగర్ ఆపరేషన్ను నిలిపి వేయాలని వామపక్షాలు, విప్లవ, దళిత హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం సీపీఐ నాయకుడు కె.వీరారెడ్డి అధ్యక్షత కలెక్టరెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దండకారణ్యంలో విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టడాన్ని, ఆదివాసీలను నిర్వాసితులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నించే గొంతులపై అర్బన్ నక్సలైట్ ముద్రలు వేసి కేసులు పెట్టి అణచి వేసే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆదివాశీల మీద దాడులు ఎక్కువయ్యాయన్నారు. దేశ సంపదను అదాని, అంబానీలకు కట్టబెట్టే కుట్రలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి పిలుపునిచ్చారు. సభలో బి.పద్మ, చుండూరి రంగారావు, నాంచార్లు, మోహన్, సుధాకర్, క్రాంతి, నరసింహరావు, కోటి, ప్రకాశరావు, రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కేటుగాళ్లు..
చారిత్రక సంపదపైపశ్చిమ ప్రకాశం వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యమున్న ప్రాంతం. వేల హెక్టార్లలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ వందల సంవత్సరాల నాటి పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంపై గుప్త నిధుల వేటగాళ్ల కన్నుపడింది. భక్తులు వెళ్లలేని జీర్ణావస్థలో ఉన్న ఆలయాల్లో తవ్వకాలు చేస్తూ అత్యంత విలువైన సంపదన దోచేస్తున్నారు. మరో వైపు రైస్ పుల్లింగ్ ముఠా సైతం పురాతన దేవాలయాలే లక్ష్యంగా పాల్పడుతున్న ఆగడాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బేస్తవారిపేటలో రైస్ పుల్లింగ్ పేరుతో జరిగిన మోసం, దర్శి సమీపంలో ఓ కొండపై గుప్త నిధుల కోసం 15 అడుగుల గుంత తీసిన ఘటనల నేపథ్యంలో జిల్లాలో రైస్ పుల్లింగ్, గుప్త నిధుల వేటపై చర్చ మొదలైంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పశ్చిమ ప్రకాశం కొత్తిపి చాళుక్యులు.. విజయనగర రాజులు.. కాకతీయ రాజులు, అలాగే శాయపునాయుడి వంశస్తులు పాలించారని తెలియజేసే ఎన్నో ఆధారాలు పదిలంగా ఉన్నాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు తదితర ప్రాంతాలకు పురాతన, చారిత్రక నేపథ్యముంది. అలాగే పలు మండలాల్లో నల్లమల అటవీ ప్రాంతం కూడా విస్తరించి ఉంది. అటవీ ప్రాంతంలో అత్యంత పురాతన దేవాలయాలు అనేకం ఉన్నాయి. జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలు, భక్తులు వెళ్లేందుకు అనువుగా లేని దేవాలయాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం గుప్త నిధుల వేటగాళ్లు, రైస్ పుల్లింగ్ ముఠాలు వీటిపై కన్నేసినట్లు సమాచారం. ఈ అటవీ ప్రాంతంలో ఎక్కడ వీరభద్ర స్వామి విగ్రహం ఉంటుందో అక్కడ గుప్త నిధులు ఉన్నట్లు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దాంతో గుప్త నిధుల కోసం వీరభద్ర స్వామి ఉన్న దేవాలయాలను టార్గెట్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పాలంక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పాలంక వీరభద్రుడి దేవాలయంలో గుప్త నిధుల కోసం అనేకసార్లు తవ్వకాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కృష్ణా నది ఒడ్డున ఆ మధ్య బంగారు నాణేలు బయట పడ్డాయి. ఆనోటా ఈ నోటా పడి ప్రచారం కావడంతో ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులోంచి కొన్ని నాణేలను ఒక ఫారెస్టు అధికారి నొక్కేసినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రాంతంలో కృష్ణ దేవరాయలు హయాంలో నిర్మించిన ఆలాటం కోట ఉంది. ఈ కోటలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆరోజుల్లోనే నిధుల కోసం ఈ కోటపై దాడి జరిగినట్లు చరిత్రలో ఉంది. యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద 12 అడుగుల వినాయక విగ్రహం, శ్రీశైలం ప్రాంతంలో ఇష్టకామేశ్వరి దేవాలయం పరిసరాల్లో కూడా గుప్త నిధుల కోసం ఓ ముఠా ప్రయత్నం చేసి విఫలమైనట్లు సమాచారం. దద్దణాల ఆంజనేయ స్వామి గుడిలో కూడా తవ్వకాలు జరిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు గుప్త నిధుల వేట జోరుగా కొనసాగింది. దానికితోడు రైస్ పుల్లింగ్ వ్యవహారం కూడా నడిచింది. ఇటీవల కొంత కాలం స్తబ్దుగా ఉన్నట్టు కనిపించినా బేస్తవారిపేటలో రైస్ పుల్లింగ్ యంత్రం ఉన్నట్టు నమ్మించి విక్రయించే ప్రయత్నాలు చేయడంతో ఈ వ్యవహారం చాపకింద నీరులా కొనసాగుతున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధుల వేటగాళ్లే రైస్ పుల్లింగ్ పేరుతో లావాదేవీలు నడపడం గతంలో జరిగింది. ఇప్పుడు బేస్తవారిపేట వ్యవహారంలో కూడా అదే గుప్త నిధుల బ్యాచ్ తెరవెనక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెరవెనుక సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు దృష్టిసారించారు. జిల్లాలోని బేస్తవారిపేటను డెన్ గా ఏర్పాటు చేసుకొని ఈ ముఠాలు మోసాలకు తెగబడుతున్నట్లు సమాచారం. ఈ ముఠాలో కనిగిరి, మార్కాపురం, రాచర్ల, కంభం, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, దోర్నాల, మార్కాపురం, తర్లుపాడుకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిని పట్టుకుని విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజనగర్ శివనాగసాయి దత్తాశ్రమం పక్కన ఉన్న కొండ పైన గుప్త నిధుల కోసం 15 అడుగుల లోతు తవ్విన సంఘటన ఈనెల 4న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. యర్రగొండపాలెం, త్రిపురాంతకం దేవాలయాల్లో తవ్వకాలు... ఇక యర్రగొండపాలెంలోని మిల్లంపల్లి వేణుగోపాల స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం ఎన్నిసార్లు తవ్వకాలు జరిగాయో లెక్కేలేదు. గ్రామ శివారులో ఉండడంతో దీనికి పెద్దగా రక్షణ లేదు. దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్ విగ్రహం శిరస్సును సైతం ఎత్తుకెళ్లిపోయారు. గుడి లోపలి గోడలపై ఉన్న చిత్రాలను విధ్వంసం చేసి పూజలు నిర్వహించారు. కొన్నేళ్ల క్రితం యర్రగొండపాలెంలో మరకత వినాయకుడి విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఒక పంచాయతీ అధికారి, ముగ్గురు ప్రజా ప్రతినిధుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరిగింది. త్రిపురాంతకంలోని ప్రసిద్ధ త్రిపుర సుందరి దేవాలయంలో కూడా తరచుగా తవ్వకాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. త్రిపుర సుందరి దేవాలయం ఎదుట నంది విగ్రహంలో వజ్రాలు పొదిగి ఉన్నాయని దాన్ని విధ్వంసం కూడా చేశారు. ప్రభుత్వానికి పట్టని విధ్వంసం... గుప్త నిధుల కోసం పురాతన దేవాలయాలు, విగ్రహాలు, శాసనాలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవదాయ శాఖ, పోలీసు శాఖలు సమన్వయంగా గుప్త నిధుల వేటగాళ్లపై నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. పశ్చిమాన పురాతన దేవాలయాలే టార్గెట్ రెచ్చిపోతున్న రైస్పుల్లింగ్, గుప్తనిధుల తవ్వకాల ముఠాలు ఇతర రాష్ట్రాల నుంచి రాక నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు రైస్ పుల్లింగ్ పేరుతో పురాతన దేవాలయాలు, ధ్వజ స్తంభాల మీద ఉన్న కలశాల చోరీ రక్షణ కరువైన పురాతన దేవాలయాలు బేస్తవారిపేట, దర్శి ఘటనలతో చర్చఇతర రాష్ట్రాల నుంచి రాక...నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారంతో హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల నుంచి కూడా కొన్ని ముఠాలు వచ్చి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమధ్య పెద్దారవీడు మండలంలోని కొండ ప్రాంతంలో గుప్త నిధుల కోసం యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్న బెంగళూరుకు చెందిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బుధవారం బేస్తవారిపేటలో జరిగిన రైస్ పుల్లింగ్ కోసం హైదరాబాద్ నుంచి ఇద్దరు వ్యక్తులు రావడం గమనార్హం. పల్నాడు జిల్లా, నుంచి కూడా ఇక్కడకు కొన్ని ముఠాలు వస్తున్నాయని తెలుస్తోంది. 50కి పైగా శాసనాలు ధ్వంసం... పురాతన దేవాలయాల్లో ఉన్న శాసనాల కింద నిధులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు పురాతన దేవాలయాల్లో శాసనాలు కనిపిస్తే చాలు అక్కడ ధ్వంసం చేసేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం, దాని సరిహద్దులు, పొలాల్లో సుమారు 50 కి పైగా శాసనాలు ఉన్నట్లు జిల్లాకు చెందిన ఒక పరిశోధకుడు తెలిపారు. గుప్త నిధుల వేటగాళ్లు ఆ శాసనాలను, అక్కడ ఉన్న విగ్రహాలను పగులుగొట్టినట్లు సమాచారం. యర్రగొండపాలెంలోని అయ్యంబొట్లపల్లి దగ్గర ఉన్న 8వ శతాబ్దానికి చెందిన రామలింగేశ్వర స్వామి విగ్రహం, గర్భాలయాన్ని సైతం ధ్వంసం చేశారు. దొనకొండ మండలంలోని కొచ్చర్ల కోట రామలింగేశ్వర స్వామి ఆలయం, పుల్లల చెరువు మండలంలోని శతకోడులో పదో శతాబ్దానికి చెందిన సప్తకోటి శివాలయంలో కూడా గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారు. -
నత్తనడకన బాల ఆధార్
బేస్తవారిపేట: జిల్లాలో బాల ఆధార్ నమోదు నత్తనడకన సాగుతోంది. 0–6 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ ఆధార్ నమోదు చేయించాలని ప్రభుత్వం ప్రకటనలిస్తున్నా ప్రత్యేక క్యాంపుల నిర్వహణ లోపభూయిష్టంగా సాగుతోంది. దీంతో క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో ఫలితం కనపడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆధార్ నమోదు చేయించేందుకు సంబంధిత అంగన్వాడీ కార్యకర్తలు శ్రద్ధ చూపించి చిన్నారులకు తమ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాలు, ఆధార్ కేంద్రాలకు తీసుకువెళ్లి వివరాలు నమోదు చేయించాల్సి ఉంది. అయితే గ్రామ స్థాయిలో సిబ్బంది, అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చిన్నారులకు ఆధార్ నమోదు చేస్తున్నారనే విషయం చాలా మందికి తెలియకపోవడం శోచనీయం. అలాగే గ్రామ/వార్డు సచివాలయాలకు కూడా అరకొరగానే ఆధార్ కిట్లను సరఫరా చేశారు. కొన్ని సచివాలయాల్లో ఆధార్ నమోదు కిట్లు పనిచేయకపోవడం, లాగిన్ సమస్యలతో ఆధార్ నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలోని 13 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 40 మండలాల్లో 2,903 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 0–6 సంవత్సరాలలోపు పిల్లలు 1,25,274 నమోదై ఉన్నారు. 96,650 మందికి ఆధార్ ఉంది. ఆధార్ లేని పిల్లలు 26,593 మంది కాగా బర్త్ సర్టిఫికెట్ ఉన్న పిల్లలు 10,093 మంది ఆధార్ పొందలేదు. మరో 15,631 మందికి ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదు. జిల్లాలో 0–6 ఏళ్లలోపు చిన్నారుల్లో 53.1 శాతం మందికి ఆధార్ ఉండగా.. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసిన తర్వాత ఈ రెండు నెలల వ్యవధిలో 11 శాతం మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేశారు. జిల్లాలో 0–6 ఏళ్లలోపు చిన్నారులు 1,25,274 మంది ప్రత్యేక క్యాంపుల్లో 11 శాతం పిల్లలకే ఆధార్ నమోదు జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోక, సరైన అవగాహన లేక మందకొడిగా సాగుతున్న ప్రక్రియ -
మూడు కేజీల గంజాయి పట్టివేత
గిద్దలూరు(బేస్తవారిపేట): గిద్దలూరు అర్బన్ కాలనీలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గిద్దలూరు ఎస్టీ కాలనీలో గత కొన్ని రోజులుగా గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా ఉంచారు. కావడి అశోక్ ఆధ్వర్యంలో 10 గ్రాముల గంజాయి రూ.500 ప్రకారం అమ్ముతున్నట్లు గుర్తించారు. అతనితోపాటతు తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కె.రోహిత్, ఎస్.మురళీకృష్ణ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. తెలంగాణ వ్యక్తులు గత కొంతకాలంగా విశాఖపట్నం నుంచి గిద్దలూరుకు గంజాయి తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తామన్నారు. సమావేశంలో గిద్దలూరు సీఐ సురేష్, రూరల్ ఎస్సై రామకోటయ్య పాల్గొన్నారు. సిసోడియాకు కలెక్టర్ స్వాగతం ఒంగోలు సిటీ: రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియాకు ఒంగోలు నగరంలోని ఓ హోటల్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్ఓ చినఓబులేసు, ఒంగోలు ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న పుష్పగుచ్చాలతో శుక్రవారం స్వాగతం పలికారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారం, రీసర్వే జరుగుతున్న తీరుపై శనివారం సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో సిసోడియా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. -
చిరుద్యోగులపై దాడులు
కూటమి పాలనలో ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చిరుద్యోగులపై దాడులు పెరిగిపోయాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ యూనియన్ నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే వందలాది మంది చిరుద్యోగుల పొట్టకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయలను బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్న పాలకులు.. రోడ్లు చిమ్ముకునే పారిశుధ్య కార్మికులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. మేసీ్త్రల మీద వైఎస్సార్ సీపీ ముద్ర వేసి 106 మందిని విధుల నుంచి తొలగించారని, వారిని విధుల్లో తీసుకోవాలని కోరుతూ 50 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మేసీ్త్రల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కాస్ను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి.మహేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చెత్త సేకరణకు నియమించిన 60 మంది క్లాప్ డ్రైవర్లను, ఆటోలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయంతో క్లాప్ డ్రైవర్ల కుటుంబాలు పస్తులుండాల్సి వస్తుందన్నారు. ఆప్కాస్ను రద్దు చేసి కార్మికులను తొలగిస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజయమ్మ, కొర్నెపాటి శ్రీనివాసరావు, సామ్రాజ్యం, దివ్య, సంతోషమ్మ, తిరుపతమ్మ, రవి, వెంకయ్య, బాబు, సాయి, మధు తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్లో ఎంఈఓ విచారణ
పెద్దదోర్నాల: మండల పరిధిలోని మోట్ల మల్లికార్జునపురంలో ఏపీ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంఈఓ మస్తాన్నాయక్ శుక్రవారం విచారణ చేపట్టారు. పాఠశాలలో మెనూ అమలు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న వైనంపై ‘ఇదేంది సారూ.. రోజూ పప్పుచారు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎంఈఓ స్పందించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ అమలు తీరుపై ఆరా తీశారు. విద్యార్థులు చెప్పిన విషయాలతోపాటు ప్రిన్సిపాల్ వివరణను డీఈఓకు పంపినట్లు ఎంఈఓ పేర్కొన్నారు. పోక్సో కేసు నమోదు కొండపి: కొండపి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసినట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొండపి మండలంలోని బాధితురాలైన ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను బట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్సై ప్రేమ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. సినిమా థియేటర్ సీజ్ మద్దిపాడు: మండల పరిధిలోని ఓ సినిమా థియేటర్ను శుక్రవారం ఉదయం తహసీల్దార్ సుజన్ కుమార్ తన సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. అందిన వివరాల ప్రకారం.. వెల్లంపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జీఎంఆర్ సినిమా హాల్ నిర్వహిస్తున్నారు. గతంలో రైస్ మిల్లుగా నిర్వహిస్తున్న కట్టడాన్ని ఎటువంటి బదలాయింపు లేకుండా సినిమా హాలుగా మార్పు చేశారని జేసీ గోపాలకృష్ణకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో జేసీ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు థియేటర్ను సీజ్ చేశారు. తనిఖీలో డిప్యూటీ తహసీల్దార్ అజయ్కుమార్ రెడ్డి, ఆర్ఐ రమణయ్య, వీఆర్వో పూజిత, మహిళా పోలీస్ అనూష తదితరులు పాల్గొన్నారు. వీఓఏ రూ.22 లక్షలు నొక్కేసింది ● ఏపీఎంకు బింగినపల్లి డ్వాక్రా మహిళల ఫిర్యాదు సింగరాయకొండ: మండలంలోని బింగినపల్లి గ్రామానికి చెందిన వీఓఏ ఈశ్వరి సుమారు రూ.17 లక్షల డ్వాక్రా సంఘం నిధులు, రూ.5 లక్షల సీ్త్ర నిధి నగదు స్వాహా చేసిందని గంగమ్మ డ్వాక్రా గ్రూప్ మహిళలు ఏపీఎం భాగ్యలక్ష్మికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆమైపె విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేస్తానని ఏపీఎం భరోసా ఇచ్చారు. -
వణికిస్తున్న విషజ్వరాలు
ముండ్లమూరు(కురిచేడు): మండలంలోని అగ్రహారం, నూజిళ్లపల్లి గ్రామాల ప్రజలు విషజ్వరాలతో మంచంపట్టారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు, వైరస్లు విజృంభిస్తున్నాయి. వాటి వలన విషజ్వరాలు, మలేరియా, చికున్గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో జ్వరపీడితులు సూదిమందు వేసే దిక్కులేక ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. జ్వరం, ఒళ్లునొప్పులతో నడవలేని స్థితిలో ప్రజలున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నా పంచాయతీ సిబ్బంది డ్రైనేజిలను శుభ్రం చేయకుండా, దోమల మందు కొట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు అద్దంకి, దర్శి లాంటి పట్టణాలకు వెళ్లి ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్సలు పొందుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసుకుని ఇల్లు వదిలిపోయి ఆస్పత్రుల పాలవుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు ఇంటింటికీ వలంటీర్లు, వైద్యసిబ్బంది వచ్చి జ్వరపీడితులను గుర్తించేందుకు సర్వే చేసేవారు. వారికి అవసరమైన వైద్యచికిత్సలు ఇళ్ల వద్దే అందించేవారు. కానీ ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ వైద్యాధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి జ్వర పీడితులను గుర్తించి వైద్యచికిత్సలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ముద్ద మింగుడు పడలేదా? ● సింగరాయకొండ జెడ్పీ స్కూల్లో హోటల్ భోజనం తిన్న డీవైఈఓ చంద్రమౌళీశ్వరరావు ● మధ్యాహ్న భోజనం రుచి చూసి హోటల్ ఫుడ్ తినడంపై విస్మయం సింగరాయకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలు డొల్లేనని జిల్లాలో వరుసగా బయటపడుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. పెద్దదోర్నాలలోని ఏపీ మోడల్ స్కూల్లో అసలు మెనూ అమలు చేయని వైనం తెలిసిందే. తాజాగా శుక్రవారం సింగరాయకొండలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న జెడ్పీ హైస్కూల్లో భోజనం బాగోలేదన్న విషయం ఒంగోలు డీవైఈఓ చంద్రమౌళీశ్వరరావు చర్యతో బయటపడింది. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి, ఎలా ఉందని విద్యార్థులను ప్రశ్నించిన డీవైఈఓ.. కాసేపటి తర్వాత హోటల్ నుంచి తెప్పించిన భోజనాన్ని పాఠశాలలోనే తాపీగా భుజించారు. ఇదంతా చూసిన విద్యార్థులు.. శ్రీఔరా మనకేమో ఈ చప్పిడి కూడు, సారుకేమో హోటల్ ఫుడ్డుశ్రీ అని చర్చించుకున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హోటల్ ఫుడ్డు తిన్న డీవైఈఓ.. పాఠశాలలో భోజనం బాగుందని కితాబివ్వడం గమనార్హం. జీజీహెచ్లో ఆధార్ నమోదు కేంద్రం ఒంగోలు టౌన్: జనన మరణాల ధ్రువీకరణ పత్రాలను వందేళ్ల వరకు భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉప సంచాలకులు ఎం.శ్రీనివాసులు రెడ్డి ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిశు ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ సీఎస్సీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పుట్టిన వెంటనే శిశు ఆధార్ నమోదు చేయాలని సూచించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేరోజునే తల్లిదండ్రులకు బిడ్డ జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. శిశు ఆధార్ తో పాటుగా అభా ఐడీ ఇవ్వాలని చెప్పారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాల్లో తప్పులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ మాధవీ లత, జిల్లా స్టాటిస్టికల్ అధికారి ప్రసాదరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ అనంత లక్ష్మి, మెడికల్ రికార్డు టెక్నీషియన్ శ్రీనివాస రావు, సీఎస్సీ జిల్లా మేనేజర్ ప్రమోద్ పాల్గొన్నారు. మంచంపట్టిన 2 గ్రామాలు సూదిమందుకూ దిక్కు లేదు -
కూటమి సిద్ధం
మిత్ర ద్రోహానికి వైద్యమిత్రల ఉద్యోగ భద్రతపై నీలినీడలు కంభం: కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్) పథకాన్ని భీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆప్కాస్ రద్దు దిశగా ఇప్పటికే అడుగులేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి కొత్త విధానంలో ఎన్టీఆర్ వైద్యసేవ నిర్వహణ కొనసాగుతుందని వార్తలు వస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న సుమారు 2,500 మందికి పైగా వైద్యమిత్రలు, దాని పరిధిలో పనిచేసే ఇతర ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు తమ మిత్రులని, అన్ని విధాలా అండగా ఉంటామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కూటమి నేతలు.. గద్దెనెక్కిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2008లో దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకంలో నాడు స్థానికతను బట్టి ఉద్యోగులను ఎంపిక చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసే ఉద్యోగులను అప్కాస్ (ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్సింగ్ సర్వీస్) కిందకు చేర్చారు. వారికి సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా ప్రతి నెల విధిగా వేతనం ఇవ్వడంతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించారు. సీఎఫ్ఎంఎస్లో వేతనం తీసుకోవడం వల్ల వారిని ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణించారు. ప్రభుత్వ పథకాలు లేనప్పటికీ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఆశతో వారు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవను భీమా పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండటంతో వారంతా ఆందోళకు గురవుతున్నారు. తమను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుతారో లేక ఊడబీకుతారోనన్న అయోమయంలో ఉద్యోగులు ఉన్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో 123 వైద్యశాలల్లో 147 మంది వైద్యమిత్రలు పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సుమారు 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నారు. ఎక్కువ మంది డిగ్రీతోపాటు పీజీలు చేసిన వారున్నారు. వైద్యమిత్రలతో పాటు జిల్లాలో టీమ్ లీడర్లు 8 మంది, డీఎం ఒకరు, ఆఫీస్ అసోసియేట్లు ఇద్దరు పనిచేస్తున్నారు. తమను బీమా సంస్థల పరిధిలోకి తీసుకొస్తే తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతుందని వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది వాపోతున్నారు. 17 ఏళ్లుగా సేవలందిస్తూ.. రోగులు వైద్యశాలలో చేరినప్పటి నుంచి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు వైద్యమిత్రలు పర్యవేక్షిస్తుంటారు. వైద్యశాలలకు వచ్చిన పేద ప్రజలకు వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ వారికి సేవలందిస్తుంటారు. వీరితోపాటు ఉద్యోగుల హెల్త్కార్డులు, జర్నలిస్ట్ హెల్త్కార్డు, ఆరోగ్య రక్ష స్కీమ్కు సంబంధించి సేవలందిస్తుంటారు. ఇలా అన్ని విభాగాల్లో దాదాపు 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వయసు కూడా చాలా మందికి 50 సంవత్సారాలు దాటింది. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఎవరిని ఉంచుతారో, ఎవరిని తొలగిస్తారోనని ఆందోళనగా ఉందని, ఈ వయసులో వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యమిత్రలను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రతను కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో వెయిటేజీ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వైద్యమిత్రలు కోరుతున్నారు. ఆరోగ్యశ్రీని భీమా కంపెనీలకు అప్పగించేందుకు యోచనలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా వేతనం పొందుతున్న వైద్యమిత్రలు ప్రైవేట్వారికి అప్పగిస్తే తమ ఉద్యోగాలకు భద్రత ఉండదని ఆందోళన కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తమను గుర్తించాలని డిమాండ్ జిల్లాలో 123 వైద్యశాలల్లో 147 మంది వైద్యమిత్రలు జిల్లాలో ఆరోగ్యశ్రీ ముఖ చిత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి డిగ్రీలు, పీజీలు చదువుకొని పదిహేడేళ్లుగా వైద్యమిత్రలుగా పనిచేస్తున్నాం. ఆప్కాస్ రద్దు చేసే పక్షంలో తమను ట్రస్టు పరిధిలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలి. ఎక్కడ విధులు నిర్వహించే వారిని అక్కడే బదిలీ చేయకుండా కొనసాగించాలి. – బి.శేఖర్, ఏపీ ఎన్టీఆర్ వైద్యసేవ స్టేట్ సెక్రటరీ -
ఉపాధ్యాయులంతా బాలల హక్కులు పరిరక్షించాలి
ఒంగోలు సిటీ: నేటి బాలలే రేపటి పౌరులని, ప్రపంచానికి ముఖ్యమైన మానవ వనరులుగా వారిని తీర్చిదిద్దేందుకు బాలల హక్కులను పరిరక్షించే బాధ్యతల్లో ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ, అవి అమలు జరుగుతున్న తీరుపై గురువారం డీఈవో కిరణ్కుమార్ అధ్యక్షతన స్థానిక ఎన్టీఆర్ కళాకేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన ఈ సమావేశంలో పద్మావతి పాల్గొని మాట్లాడారు. పిల్లలపై మొబైళ్ల ప్రభావం తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చదువుతో పాటు క్రీడలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మార్కులు, ఇతర విషయాల్లో పిల్లలను ఇతరులతో సరిపోల్చకుండా కేవలం వారి వ్యక్తిగత సామర్థ్యాల మేరకే రాణించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. చిన్న వయసులోనే చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలను చూస్తున్నామన్నారు. చదువంటే కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు కావడం మాత్రమే కాదన్నారు. అనేక రంగాల్లో మంచి అవకాశాలున్నాయని, చిన్న వయసులోనే పిల్లలకు వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో కంప్లైంట్ బాక్సులను కేవలం అలంకారప్రాయంగా కాకుండా పిల్లలందరికీ తెలిసే విధంగా బహిరంగంగా ఉంచాలన్నారు. కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయడంపై ఉపాధ్యాయులు తప్పుగా భావించరాదని, పిల్లల సమస్యలు వెలుగులోకి వచ్చే విధంగా వాటిని ఉపయోగించాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆచరణాత్మకంగా అమలుచేయాలని చెప్పారు. బాలబాలికలిద్దరికీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలని, ఫ్రెండ్లీ టీచర్ కాన్పెప్ట్ను అభివృద్ధి చేయాలని సూచించారు. విధిగా ప్రతి నెలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, ఆరోగ్య పరీక్షలు కూడా తప్పనిసరిగా జరిపించాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలని, పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100, 112లను ప్రతీ క్లాస్ రూమ్ంలో ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం ఉండేలా, స్వచ్ఛమైన తాగునీరు అందేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్లను నిర్ణీత సమయంలో అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో బాలల సంక్షేమ మండలి సభ్యురాలు నీలిమ వంశీలత, ఐసీడీఎస్ పీడీ హేమసుజన్, బాలల సంరక్షణ విభాగ అధికారి దినేష్కుమార్, మండల విద్యాధికారులు, రెసిడెన్షియల్, కస్తూరిబా గాంధీ, బీసీ గురుకుల విద్యాలయాల హెచ్ఎంలు, ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల బాక్స్ తప్పనిసరి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి బాలల సంరక్షణకు సమన్వయంతో పనిచేయాలి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి -
రైతుల పక్షాన పోరాడితే జగనన్నపై కేసులా.?
సింగరాయకొండ: మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే వారి సమస్యను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, రైతు పక్షపాతి అయిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు సోదరులను ఓదార్చేందుకు గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి వారి బాధలు తెలుసుకుని పరామర్శిస్తే కేసులు పెడతారా అని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. జగనన్నపై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఘాటుగా స్పందించారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్స్టేషన్లో జగనన్నతో పాటు మరో 8 మంది పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుకు ఇచ్చిన హామీలైన అన్నదాత సుఖీభవ, గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి వైఫల్యం చెందిందన్నారు. పంటల బీమా పథకాన్ని తుంగలో తొక్కి కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వక రైతులు అల్లాడుతుంటే వారికి సమాధానం చెప్పకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన జగన్ పోరాటం చేస్తుంటే కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లా నాయకుల నియామకం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీగా మేడికొండ జయంతి, రైతు విభాగం సెక్రటరీగా సూరసాని మోహన్రెడ్డి, రైతు విభాగం జాయింట్ సెక్రటరీలుగా ఏలం మురళీకృష్ణ, తాటికొండ రామచంద్రరావును నియమించారు. అలాగే, రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీలుగా సారే వెంకటనాయుడు, ఎన్నాబత్తిన వెంకటేశ్వరరావును నియమించారు. రాష్ట్ర బూత్ కమిటీ జనరల్ సెక్రటరీగా బొర్రా కృష్ణారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీలుగా సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, వెగినాటి ఓసురారెడ్డిని నియమించారు. ఆర్యవైశ్యులు భిక్షగాళ్లు కాదు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆర్యవైశ్యుల్లో నిరుపేదలు ఉంటారుగానీ భిక్షగాళ్లు ఉండరని అమరజీవి పొట్టి శ్రీరాములు అభిమాన సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పేరకం నాగాంజనేయులు అన్నారు. ఆర్యవైశ్యులు కష్టపడి సంపాదించుకుని తమకు వచ్చిన దాంట్లోనే ఇతరులకు సాయం చేస్తుంటారని, ఆత్మగౌరవంతో బతుకుతారని అన్నారు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన మెసేజ్ను అందరితో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏ అనిల్కు పెట్టినందుకు తనను భిక్షం అడుక్కునే కొ..క అంటూ ఫోన్ చేసి ధూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఒక వీడియో విడుదల చేసిన ఆయన.. జరిగిన విషయాలను వివరించారు. 2014లో టీడీపీ విజయం కోసం తాను కృషి చేశానని, ఆ క్రమంలో తాను రూ.8 లక్షలు నష్టపోయానని చెప్పారు. అయినప్పటికీ బాధ పడలేదని, పొట్టి శ్రీరాములు గుడి నిర్మాణానికి విరాళం అడిగితే ఇంటి చుట్టూ తిప్పుకున్న అప్పటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన వద్ద డబ్బులు లేవని చెప్పారని.. అవహేళనగా మాట్లాడి తనను అవమానించారని వివరించారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు వీడియో పంపితే ఎమ్మెల్యే పీఏ అనిల్ తనను ముష్టివాడని ధూషిస్తూ ఫోన్ చేశారన్నారు. ఇంటికొచ్చి కొడతానంటూ బెదిరించాడని తెలిపారు. ఎమ్మెల్యే దామచర్లకు ఆర్యవైశ్యులపై ఏమాత్రం గౌరవం ఉన్నా తన పీఏను మందలించాలని కోరారు. లేకపోతే అతడు ఆర్యవైశ్యుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూనే ఉంటాడని చెప్పారు. పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం రూపాయిచ్చే గతి లేకపోయినా కనీసం ఆ మహనీయుడిని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఆర్యవైశ్యుల ఓట్లు లేకుండా టీడీపీ గెలుపు సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులు తలచుకుంటే పరిస్థితులు మారిపోతాయని హెచ్చరించారు. సోషల్ మీడియాపై నిరంతర నిఘా ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉందని, తప్పుడు సందేశాలు, విద్వేషాలు రెచ్చగొట్టే మెసేజ్లు పెట్టే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టా గ్రాం, టెలిగ్రాం, యూ ట్యూబ్ తదితర సామజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా, అసభ్యకరమైన, అనైతిక పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా, కులాల మధ్య, మతాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రగల్చడం, సున్నితమైన మతవిశ్వాసాలపై వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేయడం నేరమన్నారు. ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ఫేక్ న్యూస్లు పెట్టిన, ఫార్వార్డ్ చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
విద్యారంగ సమస్యల పరిష్కారంలో విఫలం
● కూటమి ప్రభుత్వంపై పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ధ్వజం ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ ధ్వజమెత్తారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులు, యువకులకు అనేక హామీలిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం వాటిని అమలుచేయడంలో విఫలమైందని విమర్శించారు. చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు జమచేస్తామన్నారని, నేటికీ ఆ హామీ అమలుకాలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,500 కోట్ల ఫీజు బకాయిలుంటే.. నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 11,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమన్నారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, వాటిని అలకించే వారే లేరని విమర్శించారు. ెఇప్పటికై నా ప్రభుత్వం ఆలోచించి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్యామ్, నాయకులు వెంకటేష్, ఎలీషా, మానస, తదితరులు పాల్గొన్నారు. -
ధర రైతు ఉసూరు
జిల్లాలో మూడేళ్లుగా లాభాలు చవిచూసిన మిర్చి రైతు నేడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. పంట చేతికొచ్చిన సమయంలో కనీస మద్దతు ధర రాక విలవిల్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం నుంచి కనీస మద్దతు సైతం లభించకపోవడం, తెగుళ్లు ఆశించడం, కూలి రేటు భారీగా పెరగడంతో పాటు గుంటూరు మార్కెట్ యార్డులో ధరలు నేలచూపులు చూస్తుండడంతో మిర్చి రైతు కంట రక్త కన్నీరొస్తోంది. లక్షలు వెచ్చించి సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. ఇదే అదునుగా సిండికేట్లు నాణ్యతలేవంటూ ధరలు తగ్గించేసి దోచేస్తున్నారు. జిల్లాలో దయనీయంగా మారిన మిర్చి రైతు పరిస్థితిపై సాక్షి ఫోకస్... సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రైతులు అత్యధికంగా మిర్చి సాగుచేశారు. గతేడాది జిల్లాలో 66,387 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాల్సి ఉండగా, మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో 96 వేల ఎకరాల్లో సాగు చేశారు. లాభాలు చవిచూశారు. గతేడాది గుంటూరు మార్కెట్ యార్డులో తేజ రకం అత్యధికంగా రూ.22 వేల నుంచి రూ.24 వేల మధ్య విక్రయాలు సాగాయి. ఫలితంగా రైతులు లాభాలు ఆర్జించారు. వచ్చే ఏడాది కూడా మంచి ధరలు వస్తాయని రైతులు ఎదురు చూశారు. పరిస్థితి తలకిందులైంది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా రైతులకు లాభాల సంగతి దేవుడెరుగు.. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు సాగు విస్తీర్ణాన్ని భారీగా తగ్గించేసుకున్నారు. సుమారు 59,005 ఎరాల్లో సాగు చేశారు. ఇప్పటికే 3 కోతలు పూర్తయ్యాయి. నవంబర్లో క్వింటా ధర రూ.17 వేల నుంచి రూ.18 వేలు ఉండగా, డిసెంబరు నాటికి రూ.14 వేలకు పడిపోయింది. జనవరిలో రూ.14 వేల నుంచి రూ.12 వేలకు చేరి తాజాగా రూ.10 వేలు కనిష్టానికి పడిపోయింది. ఇక మిర్చి కోతలకు కూలీలకు భారీగా చెల్లించాల్సి వస్తోంది. క్వింటా మిర్చి కోసేందుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకూ ఖర్చు చెల్లిస్తున్నామని రైతులు తెలిపారు. ఇలా అయితే మిర్చి సాగు చేపట్టడం కష్టమని రైతులు వాపోతున్నారు.కొనుగోలు కేంద్రాలు నిల్...పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో మిర్చిని అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. అయితే ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు పండించిన మిర్చిని బస్తాల్లో పెట్టుకుని గుంటూరు వెళ్తున్నారు. దీంతో రానూ.. పోనూ లారీ బాడుగ కింద సుమారు రూ.20 వేల ఖర్చు వస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకూ ఖర్చుపెట్టారు. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావచ్చని రైతులు భావిస్తున్నారు. గుంటూరు మార్కెట్ యార్డులో తేజ, బాడిగ రకాల మిర్చిని ఎక్కువగా రైతులు తీసుకెళ్తున్నారు. ఈ రెండు రకాల ధరలు తగ్గిపోయాయి. తేజ టాప్ క్వాలిటీకి సుమారు రూ.12 వేల నుంచి 13 వేల వరకు ధర ఉన్నట్లు తెలుస్తోంది.నాడు...2020 నుంచి 2024 వరకూ రైతులకు ఎర్రబంగారంగా మిర్చి పంట నిలిచింది. వైఎస్సార్ సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధిని పెట్టింది. ఏ పంటకు గిట్టుబాట ధర లేకుంటే ఆ పంటకు ధర పెంచి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించి తెగుళ్లు వస్తే శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించి నివారణ చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు ధరల వివరాలను రైతులకు తెలిపారు. దీంతో సాగుచేసిన రైతుల పాలిట ఎర్రబంగారంగా మిర్చి పంట మారింది. గతేడాది వరకూ క్వింటా ధర రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకూ పలికింది. తేజ, బాడిగ రకాలకు అదనంగా మరో రూ.2 వేలు వచ్చింది.నేడు...జిల్లాలో మిర్చి సాగుచేసిన రైతులు కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మిర్చిరైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది. మిర్చి సాగు చేసిన రైతు కంట్లో కారం పడుతోంది. గిట్టుబాటు ధర లేక విలవిల్లాడిపోతున్నారు. గుంటూరు యార్డులోనే క్వింటా ధర రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు సాగుచేసిన మిర్చికి మంచి ధర వచ్చేంత వరకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుకుంటున్నారు. ఎకరా మిర్చి సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు రైతులు ఖర్చు పెట్టారు. అయితే అక్టోబర్, నవంబర్లో మిర్చికి వైరస్ తెగులు సోకడంతో ఊహించని విధంగా పంట దిగుబడి తగ్గిపోయింది. ఇదే సమయంలో నవంబర్లో క్వింటా రూ.18 వేలు ఉండగా డిసెంబరు నాటికి రూ.14 వేలకు తగ్గింది. నేడు రూ.10 వేలకు కూడా కొనడం కష్టమైంది. మిర్చి ఎందుకు సాగుచేశామా అని రైతులు దిగులుపడుతున్నారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయలేదు. పశ్చిమ ప్రకాశంలో గుంటూరు యార్డుకు పోలేని రైతులు దళారులు చెప్పిన ధరకే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. లేకుంటే ముగ్గురు నలుగురు రైతులు కలిసి సుమారు రూ.20 వేలకు బాడుగ పెట్టుకుని లారీల్లో వేసుకుని గుంటూరు వెళ్లి రెండుమూడు రోజులు యార్డులోనే తిండీతిప్పలు మానేసి వచ్చిన ధరకే విక్రయించి ఉసూరుమంటూ తిరిగి వస్తున్నారు.దిగుబడి లేదు.. ధర లేదుఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. గత పదేళ్ల నుంచి ఎండు మిర్చి పండిస్తున్నా. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. ఎర్ర నల్లి ఉధృతంగా రావడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. గత ఏడాది ఎకరాకు 20–25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నేడు 10–15 కింటాళ్లు కూడా రావడం లేదు. నల్లి నివారించేందుకు విపరీతంగా పురుగుమందులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎకరాకు ఖర్చు రూ.2 లక్షలు వచ్చింది. రెండు రోజుల క్రితం యార్డులో అమ్మితే క్వింటా రూ.12 వేలు ధర పడింది. గతేడాది రూ.20 వేల నుంచి రూ.22 వేల ధరకు అమ్మాను. తాలు కాయలు గతంలో రూ.12 వేల నుంచి రూ.15 వేలు ఉంటే నేడు రూ.5 వేలు కూడా పడటంలేదు. తెగుళ్లతో ఇంకో కోత వచ్చే పరిస్థితి లేదు. ఐదు ఎకరాలకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు పెట్టాను. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల నష్టం వస్తుంది. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు. – కామిరెడ్డి వెంకట రంగారెడ్డి, వంగపాడు, బేస్తవారిపేట ఎకరాకు రూ.లక్ష నష్టంగత ఏడాది ఎకరా మిరప సాగు చేశా. 30 క్వింటాల దిగుబడి వచ్చింది. అన్ని ఖర్చులుపోగా రూ.3 లక్షల ఆదాయం మిగిలింది. ఈ ఏడాది రెండు ఎకరాల్లో పంట సాగు చేశా. మొదటి కోతగా 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 4 క్వింటాలు తాలు, 2 క్వింటాలు మంచి కాయలు వచ్చాయి. తాలు రూ.6500, మంచి కాయలకు రూ.12 వేల ధర పలికింది. రెండో కోతకు 6 క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. క్వింటా ఎండు మిర్చి కోతకు రూ.5 వేలు కోత కూలీలు, రూ.1000 గ్రేడింగ్, రూ.1000 గోతాలు, యార్డ్కు ట్రాన్స్ఫోర్ట్ ఖర్చు వస్తుంది. వర్షాలు అధికం కావడంతో కాయపై మచ్చలు ఏర్పడి లోపల బూజు రావడంతో బరువు తగ్గడంతో పాటు తాలు కాయలుగా మారాయి. తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంది. ఖర్చులు అధికమయ్యాయి. రెండు ఎకరాలకు రూ.2.50 లక్షల నష్టం వస్తుంది. – లాకా కొండయ్య, వంగపాడు, బేస్తవారిపేట మండలంఇలా అయితే నష్టమేనేను ఈ ఏడాది 10 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. పెట్టుబడి సుమారు రూ.18 లక్షల వరకు అయ్యింది. మిర్చి నారు, ఎరువులు, తెగుళ్లకు మందులు, అంతరసేద్యంలో కూలీలకే ఎక్కువ ఖర్చయింది. వైరస్ తెగులు సోకడంతో దిగుబడులు తగ్గాయి. గుంటూరు యార్డులో మిర్చి ధర తగ్గడంతో పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. గత రెండేళ్లుగా మిర్చికి మంచి ధర ఉండటంతో ఈ ఏడాది సాగుచేశా. అయితే ధరలు.. దిగుబడులు.. చూస్తే నష్టాలే వస్తున్నాయి. ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోకపోవడం బాధగా ఉంది. – గుంటక సుబ్బారెడ్డి, మిర్చిరైతు, పాతపాడు, కొనకనమిట్ల మండలంధరలు చూస్తే నీరసం వస్తుందిరెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. కోత కొద్దామన్నా కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అసలు పంటలు కొనుగోలు చేసేందుకు దళారులు రావడం లేదు. గుంటూరు యార్డులో క్వింటా రూ.12,500 పలుకుతోంది. గత ఏడాది తాలు కాయలకే ఆ ధర పలికింది. మంచి మిర్చికి రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలికింది. ఒక్కో కూలీకి రూ.500 లేదా కిలోకు కాయలు కోసినందుకు రూ.30 ఇవ్వాల్సి వస్తోంది. ఎకరా కోత ఖర్చులకే రూ.60 వేలు ఖర్చవుతోంది. ఎకరా సాగుకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెడితే రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదు. పంటను చూస్తే నీరసం వస్తుంది. ఐదు నెలల పాటు నేను, నా భార్య ఎంతో కష్టపడి పండించిన పంటను వదులుకోలేక నష్టం వచ్చినా సరే కోత కోపించాల్సిందేనని కూలీల కోసం ఎదురుచూస్తున్నాం. – ఆముదం వెంకటరమణారెడ్డి, వై.కొత్తపల్లి, యర్రగొండపాలెం -
పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు
7 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. తొలి కాపుకింద 50 క్వింటాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రెండో కాపు ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది క్వింటా రూ.10 వేలకు మించి పలకడం లేదు. గతేడాది ఈ రకం రూ.18 వేల పైచిలుకు పలికింది. పంట దిగుబడులు తగ్గినా మిర్చి రేటు గతంలోలా నిలకడగా ఉంటే నష్టం ఉండదు. ఏడాదంతా కష్టపడ్డా పెట్టుబడులూ వచ్చే పరిస్థితులు లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – మూలా సుబ్బారెడ్డి, ఐనముక్కల, పెద్దదోర్నాల మండలం -
రైస్ పుల్లింగ్ పేరుతో మోసం
బేస్తవారిపేట: రైస్ పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడిన వ్యవహారం గురువారం వెలుగులోకి రాగా అందులో ముగ్గురు అటవీశాఖ సిబ్బంది పాత్ర ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం మేరకు.. మార్కాపురం మండలం వేములకోటకు చెందిన డి.సాయికుమార్కు స్నేహితుడు కిషోర్, అంబులెన్స్ డ్రైవర్ రాజేష్ బేస్తవారిపేటలోని ఓ వ్యక్తి వద్ద రైస్ పుల్లింగ్ యంత్రం(బియ్యాన్ని ఆకర్షించే శఠగోపం లాంటి వస్తువు) ఉందని చెప్పారు. ఈ విషయమై బేస్తవారిపేటకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తిని కుంట వద్దకు పిలిపించి సెల్ఫోన్లో రైస్ పుల్లింగ్ను చూపించాడు. రూ.3 లక్షల నగదు తీసుకొస్తే కొనుగోలు చేయవచ్చని కిషోర్, అతని స్నేహితులు చెప్పారు. దీంతో సాయికుమార్ తన స్నేహితుడైన తర్లుపాడుకు చెందిన కారు డ్రైవర్ మల్లికార్జున్ను నగదు అడిగాడు. వేరే వాళ్ల వద్ద బంగారం ఉంది, నీకు రూ.3 లక్షలకు అదనంగా రెండు లక్షల వరకు ఇస్తానని చెప్పాడు. రైస్ పుల్లింగ్ విషయాన్ని సాయికుమార్ తన బంధువైన కనిగిరికి చెందిన రామకృష్ణకు చెప్పాడు. కోట్ల ధరకు అమ్మవచ్చని హైదరాబాద్ నుంచి ఇద్దరు వ్యక్తులను పిలిపించాడు. రూ.2.80 లక్షల నగదు కారులో పెట్టుకుని సాయికుమార్, మల్లికార్జున్, కిషోర్, కనిగిరికి చెందిన రామకృష్ణ, హైదరాబాద్ వ్యక్తులు బేస్తవారిపేటలోని పందిళ్లపల్లె టోల్ప్లాజా వద్దకు వచ్చారు. జగనన్న లేఔట్ రోడ్డు చివరికి వెళ్లిన తర్వాత రైస్ పుల్లింగ్ ఉందని చెప్పిన బేస్తవారిపేటకు చెందిన రామకృష్ణ అక్కడికి రాలేదు. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇద్దరు గరికపాటి శ్రీనివాసులు, జక్కం శ్రీనివాసులు, గరికపాటి శ్రీనివాసులు కుమారుడు రవి, డ్రైవర్ లేఔట్ వద్దకు వచ్చారు. కారులో వెతుకులాడి రూ.2.80 లక్షల నగదు తీసుకున్నారు. కనిగిరి, హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తులను బెదిరించి మల్లికార్జున్ సెల్ఫోన్కు రూ.48 వేలు ఫోన్ పే చేయించారు. మరళా రూ.48 వేలను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చెప్పిన నంబర్కు ఫోన్ పే చేయించుకున్నారు. అక్కడికి వచ్చిన వారిని బెదిరించి వీడియోలు తీసుకుని, ఎవరికై నా చెబితే కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తామని హెచ్చరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు కంభం సీఐ కే మల్లికార్జున్, బేస్తవారిపేట ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ముగ్గురు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ల పాత్ర! రూ.2.80 లక్షల నగదు, రూ.48 వేలు ఫోన్ పే నగదు దోచుకున్నట్లు ఆరోపణ బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లె టోల్ ప్లాజా వద్ద సంఘటన పోలీసులను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకున్న బాధితులు -
గురుకులంలో దారుణం
టంగుటూరు: స్థానిక వెంకటాయపాలెం సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో గురువారం దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులచే వంటశాలలో వెట్టి చాకిరీ చేయిస్తుండటంతో వేడివేడి పాలు ఐదో తరగతి విద్యార్థి మాచేపల్లి మధుమోహన్పై పడి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనతో విద్యార్థులచే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ వెట్టిచాకిరీ చేయిస్తున్న బాగోతం బయటపడింది. మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మాచేపల్లి మధుమోహన్ (11) గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్లు వంటశాలలో విద్యార్థులతోనే కొన్నాళ్లుగా పనులు చేయిస్తున్నారు. గురువారం ఐదో తరగతి విద్యార్థి మాచేపల్లి మధుమోహన్ వంటశాలలో పనులు చేసి విద్యార్థులకు పాలిచ్చే సమయంలో వేడివేడి పాలు అతనిపై పడ్డాయి. వంటశాల నుంచి పాలను బయటకు తీసుకొచ్చే క్రమంలో బరువు మోయలేక పాత్ర కిందపడి వేడి పాలు మధుమోహన్పై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. శరీరం అంతా కాలిపోయింది. పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్లు గుట్టుచప్పుడు కాకుండా టంగుటూరులోని ఆరాధ్య ప్రైవేటు ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తగిలించారు. దీంతో ఈ ఘటన బహిర్గతమైంది. జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలకు వస్తారనే భయంతో ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్లు పాలు పడిన ప్రాంతాన్ని క్లీన్ చేశారు. విద్యార్థికి గాయాలైన విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకుని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్పై మండిపడ్డారు. విద్యార్థులతో పనులు చేయిస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు రక్షణ లేకపోతే ఎలాగంటూ నిలదీశారు. ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, గాయాలపాలైన విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కిమ్స్కు తరలించారు. విద్యార్థిని మంత్రి డీబీవీ స్వామి గురువారం పరామర్శించారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటన జరిగిందని బక్క తిరుమలరావు మాదిగ అన్నారు. వేడి పాలు మీద పడి గాయాలైన బాలుడికి నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులతో పనులు చేయించిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. వంటశాలలో విద్యార్థులతో పనులు విద్యార్థి మధుమోహన్పై వేడివేడి పాలు పడి తీవ్రగాయాలు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కిమ్స్కు తరలింపు ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్పై విద్యార్థి తల్లిదండ్రుల ఆగ్రహం -
బైకును ఢీకొట్టిన కారు
● ప్రమాదంలో ఒకరు మృతి ● అదుపుతప్పి బోల్తా పడిన కారు పామూరు: జాతీయ రహదారిపై బైక్ మీద వెళ్తూ ఓ చోట మలుపు తిరుగుతున్న వ్యక్తిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ క్రమంలో బైక్ను కారు బలంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన పామూరు మండలంలోని నుచ్చుపొద సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన బేల్దారీ కూలీ వేముల నివాస్(44) పామూరులో సొంత పని ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. నుచ్చుపొద సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్బంక్వైపు బైక్ను తిప్పాడు. అదే సమయంలో కందుకూరు నుంచి పామూరు వస్తున్న కారు నివాస్ బైక్ను తప్పించబోయి బలంగా ఢీకొట్టింది. నివాస్ తలకు గాయాలై రోడ్డుపై పడగా స్థానికులు ఓ ఆటోలో పామూరులోని కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. అప్పటికే నివాస్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా, కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. అందులోని వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలాన్ని సీఐ ఎం.భీమానాయక్ పరిశీలించారు. మృతునికి భార్య సుజాత, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ పి.దాసు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. భర్త మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా మృతుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడి ఉండేవాడని స్థానికులు చర్చించుకున్నారు. -
23న జిల్లా స్థాయి హాకీ జట్టు ఎంపిక
సంతనూతలపాడు: జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో ఈ నెల 23న సీనియర్ పురుషుల హాకీ జట్టును ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏవీ రమణారెడ్డి, ఎ.సుందరరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు రావాలని సూచించారు. 1991 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు అర్హులని స్పష్టం చేశారు. వివరాలకు 9666067764ను సంప్రదించాలని సూచించారు. 26న రామాపురంలో ఎడ్ల పోటీలు రాచర్ల: మండలంలోని గుడిమెట్ట పంచాయతీ పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలోని సిద్ధిభైరవేశ్వరస్వామి వారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్త మదిరె శ్రీరంగారెడ్డి, ఉప ధర్మకర్త శ్రీరంగపు వెంకటనారాయణరెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న ఎడ్ల యజమానులు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా 500 రూపాయలు ప్రవేశ రుసుం చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పోటీల విజేతలకు మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతి రూ.20 వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలు అందజేస్తామని వివరించారు. వివరాలకు 94408 91465ను సంప్రదించాలని సూచించారు. ‘వెలిగొండ’కు రూ.2 వేల కోట్లు కేటాయించాలి ఒంగోలు టౌన్: అసెంబ్లీలో త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి, నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్య పరిష్కారానికి 2 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని సీపీఐ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నప్పటికీ ప్రకాశం జిల్లా మాత్రం నిత్య కరువుతో అల్లాడుతోందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాతోపాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని 36 మండలాలు కరువు నుంచి బయట పడతాయన్నారు. 4.5 లక్షల ఎకరాలకు సాగు నీరు, 20 లక్షల మందికి తాగు నీరు అందుతుందని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న కెనాల్ పనుల పూర్తి కోసం 4 వేల కోట్లు అవసరం అవుతాయని ఇంజినీర్లు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు 2026 కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, అందుకు తగిన చర్యలు తీసుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కార్యక్రమంలో వడ్డే హనుమా రెడ్డి, కె.వీరారెడ్డి, శ్రీరాం శ్రీనివాసులు పాల్గొన్నారు. భర్త పురుగుమందు తాగాడని.. ● డయల్ 100కు ఫోన్ చేసిన భార్య ● పరుగులు తీసిన మద్దిపాడు పోలీసులు మద్దిపాడు: తన భర్త పురుగుమందు తాగాడంటూ ఓ మహిళ డయల్ 100కు ఫోన్ చేయడంతో మద్దిపాడు పోలీసులు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన బండి రోశయ్య తాను పురుగుల మందు తాగానని, మద్దిపాడు సమీపంలోని కొస్టాలు సెంటర్లో ఉన్నానని గురువారం భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె సాయంత్రం 4 గంటలకు డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో మద్దిపాడు పోలీసులు ముమ్మరంగా గాలించారు. రాత్రి ఏడు గంటల సమయంలో బండి రోశయ్య మేదరమెట్ల బైపాస్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అక్కడ పురుగుల మందు తాగడానికి ప్రయత్నించినట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగా భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతోనే పురుగుమందు తాగుతున్నట్లు ఫోన్ చేశానని రోశయ్య పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విధులకు డుమ్మా.. వైద్యుల తొలగింపు ఒంగోలు టౌన్ : శాఖా పరంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, కనీసం సెలవు కూడా పెట్టకుండా విధులకు హాజరు కాకుండా తిరుగుతున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 55 మందిని తొలగించారు. అందులో జిల్లాకు చెందిన ఆరుగురు వైద్యులు వున్నట్లు తెలిసింది. -
పశ్చిమాన జోరుగా గంజాయి విక్రయం!
గిద్దలూరు(బేస్తవారిపేట): పశ్చిమ ప్రకాశంలో గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. మార్కాపురం, కంభం, గిద్దలూరులో గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, అమ్మకందారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిఘా వైఫల్యం కారణంగానే గంజాయి విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో గిద్దలూరులోని కొంగలవీడు రోడ్డులో గంజాయి విక్రేతలు నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. గిద్దలూరులోని పూసలబజార్ సమీపంలోని ఎస్టీ కాలనీలో ఈ ముఠా ఉన్నట్లు స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి గిద్దలూరుకు గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని సమాచారం. రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లతోపాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ఉంటూ గంజాయి దందా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే గంజాయి రాకెట్ వచ్చే అవకాశం ఉంది. పోలీసులు గంజాయి సరఫరా, అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పల్లెలకు విస్తరించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇదేంది సారూ.. రోజూ పప్పుచారు!
పెద్దదోర్నాల: విద్యార్థుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్న నగదు ఎటు పోతోందో తెలియదు కానీ ఆ రెసిడెన్సియల్ పాఠశాల విద్యార్దినుల కష్టాలు మాత్రం గట్టెక్కడం లేదు. పాఠశాలలో హాస్టల్ నిర్వహణ, సిబ్బంది పనితీరుపై అధికారుల పర్యవేక్షణ, విద్యార్థినుల సంక్షేమంపై అధ్యాపకులు అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు కేంద్ర బిందువయ్యాయి. కాగితాలకే పరిమితమైన ఆహార పట్టికతో పాటు, తాగేందుకు పరిశుభ్రమైన నీరు సైతం దొరకని పరిస్థితులు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఇలా ఎన్నో సమస్యలు ఆ మోడల్ పాఠశాలను పట్టి పీడిస్తున్నాయంటే సమస్యలను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పిల్లలకు సరైన భోజనం పెట్టటం లేదంటూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాఠశాలను ‘సాక్షి’ విజిట్ చేయగా వసతి గృహంలోని డొల్లతనం బట్టబయలైంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని మోట్ల మల్లికార్జునాపురంలోని ఏపీ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహ విద్యార్థినులు భోజనంతో పాటు వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలపై ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ను ప్రశ్నిస్తే ‘నేను పదేళ్ల పాటు పలు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశా. ఎవరికి చెప్పినా ఏమీ చేయలేర’న్న ధోరణితో వ్యవహరించడం గమనార్హం. మోడల్ పాఠశాలలో సుమారు 529 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల ప్రాంగణంలోనే ఉన్న బాలికల హాస్టల్లో 100 మంది వరకు ఉంటున్నారని సిబ్బంది చెపుతున్నారు. అయితే హాస్టల్ బాలికలు గత కొంత కాలంగా అన్నం, పప్పు చారుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బాలికలు ట్యాంకు నీటినే తాగుతున్నారు. దీనిపై పార్ట్టైం వార్డెన్ను ప్రశ్నించగా.. తనకు ఏమీ తెలియదని, ప్రిన్సిపాల్ ఏది చెబితే అదే వండుతున్నానని, మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయటం లేదని ఆమె సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా ఏ రోజు ఏమి వండాలో కూడా తెలియని పరిస్థితి వంట మనుషుది. వసతి గృహంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ వివరాలే లేకపోవడం గమనార్హం. మెనూ ఏమిటో చెప్పాలని ప్రిన్సిపాల్ను కోరగా నీళ్లు నమలడం ఆయన వంతైంది. ఇతర పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఫోన్ చేసి మోనూ వివరాలు వాట్సాప్లో తెప్పించుకున్నారంటే ఇక్కడ ఏం జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థినుల సంఖ్య 100 అని ప్రిన్సిపాల్ చెబుతుండగా అంతమంది లేరని మిగిలిన సిబ్బంది పేర్కొంటున్నారు. ఒక్కో విద్యార్థినికి ప్రభుత్వం నెలకు రూ.1600 ఖర్చు చేస్తోంది. ఆ మేరకు కూరగాయలు, ఆకుకూరలు వండకుండా కేవలం అన్నం, నీళ్ల చారు మత్రమే పెడుతుండటం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకుని, మెనూ పాటించేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
తేట తెలుగు భావితరాలకు వెలుగు
ఒంగోలు మెట్రో/మార్కాపురం: ‘తిక్కన పద్యమొక్కటి చక్కగ చదివిన చాలు తెలుగుజాతి నుడికారము తెలిసికొన్న యటౌను’ తెలుగు నుడికారం గొప్పదనాన్ని వివరిస్తూ దాశరథి పేర్కొన్న మాటలివి. నుడికారమనేది పద్యాలకు, కావ్యాలకు, గ్రంథాలకు, కవులకు, పండితులకే పరిమితం కాదు. నుడికారానికి ముడిసరుకు మనం మాట్లాడే భాషే. నుడికారమనేది పండితులకంటే ముందు పామరుడి సొత్తు. మాటల్లోని చమత్కారం అర్థం కావాలంటే ఆ మాటలు పుట్టిన సమాజంలో పుట్టి పెరగాల్సి ఉంటుంది. భాష ఒకటే అయినప్పటికీ ప్రాంతాన్ని బట్టి, ప్రజల జీవనాన్ని బట్టి నుడికారం మారుతుంది. 2 వేల ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాష గొప్పదనాన్ని గ్రహించి, మాతృ భాషను బతికించుకోవాల్సిన బాధ్యత తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి పౌరుడికీ ఉంది. ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవడం ద్వారానే మనం సాంస్కృతిక, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో పేర్కొంది. శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా సాహిత్య సేద్యం చేస్తున్న జిల్లా ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం..అన్ని తరగతుల్లో తెలుగు బోధించాలిఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ,అందులో కనీసం 50 శాతం మార్కులు వస్తేనే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్టుగా జీవో ఇవ్వాలి. పిల్లలతో తెలుగు పుస్తకాలు చదివించే అలవాటు చేయాలి. ప్రభుత్వ, కార్పొరేట్ స్కూళ్లలో తెలుగు సాహిత్యంపై పోటీలు నిర్వహించాలి.– తేళ్ల అరుణ, న.ర.సం గౌరవాధ్యక్షురాలుభాష.. మనిషికి శ్వాసమన అస్తిత్వాన్ని తెలిపేది భాష. అలాంటి భాషను ప్రాణంగా భావించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రజలతోపాటు ప్రభుత్వాలు సైతం బాధ్యత తీసుకోవాలి. పరభాషలపై మోజును వదిలిపెట్టాలి.– డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, కవి, రచయితశతకాల రచయిత అన్నపురెడ్డివయోజన విద్యాశాఖలో రీజినల్ జాయింట్ డైరెక్టర్గా రిటైరైన డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలుగు సాహిత్యంలో అక్షర సేద్యం చేస్తున్నారు. వంద రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం ఇతర రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. సుమారు 5 లక్షల మంది ఈ పుస్తకాన్ని చదివినట్లు అంచనా. 2001–02లో ఈ పుస్తకం ప్రచురితం కాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పశ్చిమ ప్రకాశంలో గ్రామ నామాలపై లోతైన పరిశోధన చేసి పుస్తక రూపంలోకి తెస్తున్నారు. ఇది ఆకాశవాణిలో ధారావాహికగా ప్రసారమవుతోంది.అక్షర తపస్వి, మహోపాధ్యాయ బిరుదులు అందుకున్న ఆయన పదుల సంఖ్యలో శతకాలు రచించారు.మాతృభాషా పరిరక్షణ అందరి బాధ్యతభాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం మన మాతృ భాషలను సంరక్షించుకోగల్గుతామని అందరూ గ్రహించాలి. తల్లి లాంటి మాతృ భాష అభివృద్ధికి అందరూ కృషి చేయాలి. మాతృభాషలో చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా.– డా.నూనె అంకమ్మరావు, కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడుకవిత్వమంటే శాస్త్రికి ప్రాణంసాధన డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాగా పనిచేస్తున్న డాక్టర్ కప్పగంతుల మధుసూధన శాస్త్రి తెలుగు సాహిత్యంపై 200కు పైగా చేసిన రచనలు, వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 130కి పైగా ఆకాశవాణిలో ఉపన్యాసాలు ప్రసారమయ్యాయి. బతుకుబండి పేరుతో స్వీయ కవితా సంపుటి, కరుణశ్రీ సాహిత్యంలో మానవత్వం, ప్రకాశం జిల్లాలో అవధాన కళపై రెండు పరిశోధనా గ్రంథాలను ఆయన రచించారు. ప్రకాశం జిల్లాలో అవధాన కళపై డాక్టరేట్ పొందారు.తెలుగు భాష ఘనమైనదిచిన్నప్పటి నుంచే పిల్లలకి తెలుగు పద్యాలు నేర్పడం వల్ల వారిలో భాషాభిమానం ఏర్పడుతుంది. సుమతి శతకం, వేమన శతకము మొదలైనవి తేలికగా అర్థమవుతాయి. మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం వల్ల సామాజిక జ్ఞానం ఏర్పడుతుంది. కృష్ణవేణి చరితం, గుండ్లకమ్మ చరితం, శంకర విజయం మొదలైన నృత్య రూపకాలు రచించి తెలుగు భాష రుణం కొంత తీర్చుకున్నానని భావిస్తున్నా.– నెమ్మాని సీతారామమూర్తి, గిడుగు సాహితీ పురస్కార గ్రహీత -
బాలల సంరక్షణకు సమన్వయంతో పనిచేయాలి
ఒంగోలు సిటీ: రాజ్యాంగ వ్యవస్థలోని అన్ని చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసి బాలల సంరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి సూచించారు. జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో బుధవారం ఉదయం బాలల సంరక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాల పురోగతిపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల మానసిక శారీరక ఎదుగుదలతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు తెలిపారు. బాలల సంరక్షణ లక్ష్యంగా అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అపహరణ, బాలికలపై లైంగిక దాడులు వంటి అమానవీయ సంఘటనలు జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని బాల బాలికలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించామన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజన్, జిల్లా కార్మిక శాఖ కమిషనర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఐసీడీఎస్ వివిధ విభాగాల అధికారులు, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ● జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి అధికారులు దృష్టి సారించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు. సంక్షేమ శాఖ, వసతి గృహాల సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలు అనేక ఇబ్బందులకు, మానసిక వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ వసతి గృహాలు ఉండే పిల్లలకు, పాఠశాలలో పాఠ్యాంశాలతో పాటు బాలల చట్టాలపై కూడా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ నరసింహస్వామి, ఎస్టీ, బీసీ సంక్షేమ అధికారి అంజలి, వికలాంగుల శాఖ అధికారి అర్చన, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి -
నేను చస్తా.. నా బిడ్డలు జాగ్రత్తా..
● సోషల్ మీడియాలో కలకలం రేపిన వీఓఏ లెటర్ సింగరాయకొండ: ‘నేను డబ్బులు కాజేశానని డ్వాక్రా గ్రూఫు సభ్యుల మధ్య దోషిగా నిలబెట్టి అవమానించారు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నా ఆత్మహత్యకు టీడీపీ నాయకుడు పులి ప్రసాద్, ఏపీఎం భాగ్యలక్ష్మి కారణం. నా బిడ్డలకు న్యాయం చేయండి’ అంటూ సింగరాయకొండ మండలంలోని బింగినపల్లి గ్రామానికి చెందిన వీఓఏ జి.ఈశ్వరి పేరుతో రాసిన లెటర్ సోషల్ మీడియాలో బుధవారం హల్చల్ చేసింది. ఈ లేఖ గ్రామ స్థాయిలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరును బట్టబయలు చేసింది. లేఖలో ఏముందంటే.. ‘నేను వీఓఏగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నా. టీడీపీలో పులిప్రసాద్, సన్నెబోయిన మాలకొండయ్య వర్గాలున్నాయి. నేను మాలకొండయ్య వర్గం కావడంతో పులిప్రసాద్ వర్గం వారు నాపై అవినీతి ఆరోపణలు చేశారు. దానికి ఏపీఎం కూడా సహకరించి నన్ను గ్రూపు సభ్యుల మధ్య పంచాయితీలో నిలబెట్టారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు గంగమ్మ గ్రూపు సభ్యులు బ్యాంకులో కట్టేందుకు అప్పుడప్పుడు డబ్బు ఇస్తుంటారు. కానీ వారు ఎక్కువగా మా చిన్నత్త పి.ప్రభావతికే డబ్బు ఇస్తారు. 16 నెలలుగా ఆమె వాయిదాలు కట్టకపోతే నేను ఎలా బాధ్యురాలిని అవుతా. టీడీపీలో గ్రూపు విభేదాల వల్ల ప్రసాద్ వర్గానికి చెందిన గ్రూపు సభ్యులు ముగ్గురు నాతో గొడవకు దిగారు’ అని వీఏఓ ఆరోపించింది. దీనిపై ఏపీఎంను వివరణ కోరగా.. ‘వీఓఏ ఈశ్వరి సుమారు రూ.7.85 లక్షలు వాడుకుందని గంగమ్మ గ్రూపు సభ్యులు ఫిర్యాదు చేయడంతో గ్రామానికి వెళ్లా. అప్పటికే ఆమె తన ఇంట్లో మంచంపై పడుకుని సైలెన్ కట్టించుకుని ఉంది. నాతో బాగానే మాట్లాడింద’ని వివరించారు. -
భూముల కబ్జాకు ముఠా యత్నం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నలభై మూడేళ్ల క్రితం విక్రయించిన భూములను కబ్జా చేసేందుకు కడప నుంచి వచ్చిన ముఠా ప్రయత్నించడం, గ్రామస్తులు తిరగబడడం బుధవారం సాయంత్రం సంచలనంగా మారింది. గ్రామస్తుల కథనం ప్రకారం... ఒంగోలు మండలంలోని ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన సూదనగుంట సుబ్బయ్య కుమారులు హనుమంతరావు, విశ్వేశ్వరరావు, పాండురంగారావులు 1982లో గ్రామంలోని సర్వే నంబర్ 191, 255లలోని 3.55 ఎకరాల భూమిని రావి ఆంజనేయులు, పాతూరి వెంకటశ్వర్లు, పెద్దిరెడ్డి ఆదినారాయణ రెడ్డి, మువ్వా వీరాంజనేయులకు విక్రయించారు. ఈ భూమిని 1988లో 162 ప్లాట్లు వేసి విక్రయించారు. ఆ తరువాత భూమిని విక్రయించిన నలుగురు మరణించారు. అయితే బెంగళూరులో నివసించే సూదనగుంట పాండురంగారావు భార్య శైలజ ఇటీవల ఆ భూమిని తన పేరుపై ఆన్లైన్ చేయించుకున్నట్లు సమాచారం. ఆ తరువాత శైలజ కుమారుడు సాయి ఈ భూములను కడపకు చెందిన వ్యక్తులకు విక్రయించినట్లు చెబుతున్నారు. దీంతో కడపకు చెందిన కొందరు వ్యక్తులు కొద్ది రోజుల క్రితం ముక్తినూతలపాడు గ్రామానికి వచ్చి సర్వే నంబర్ 255 భూమిని తాము కొనుగోలు చేశామని, ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే స్థలాల వద్దకు వచ్చి మా భూముల్లోకి రావడానికి మీరెవరంటూ కడప నుంచి వచ్చిన ముఠాపై తిరగబడ్డారు. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఆ తరువాత ప్లాట్లు కొనుగోలు చేసిన గ్రామస్తులు కలిసి ఆ భూములను శుభ్రం చేసుకొని రాళ్లు పాతుకున్నారు. అయితే బుధవారం మళ్లీ కడప బీటెక్ రవి అనుచరులమంటూ కొందరు ముక్తినూతలపాడు గ్రామానికి వచ్చారు. భూములు శుభ్రం చేసింది ఎవరంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. సర్వే నంబర్ 191,255లోని భూములన్నీ మావేనని, గ్రామస్తులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అక్కడ వేసి ఉన్న హద్దురాళ్లను తొలగించి సొంతంగా వేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన ప్లాట్లు కొనుగోలు చేసిన గ్రామస్తులు తమ రిజిస్టర్ బాండ్లతో అక్కడకు చేరుకున్నారు. ఈ భూములు తాము కొనుగోలు చేసినట్లు సాక్ష్యంగా రిజిస్టర్ కాగితాలను చూపెట్టారు. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపెట్టమని అడగడంతో వారంతా తెల్లముఖాలు వేశారు. తహసీల్దార్ వద్దకు వెళదామని చెప్పగానే..వారంతా అక్క నుంచి తుర్రుమన్నారు. అయితే వచ్చిన వారంతా కడప బీటెక్ రవి మనుషులమని బెదిరించారని, వారి చేతుల్లోని మొబైల్ ఫోన్లు, కార్లపై కూడా టీడీపీ స్టిక్కర్లు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ముఠా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామంలో హల్చల్ చేసినట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. టీడీపీ నేత బీటెక్ రవి మనుషులమంటూ బెదిరింపు గ్రామస్తుల తిరుగుబాటుతో పలాయనం -
ప్రతి ఇంటికి పన్నులు వేయాలి..
నగరంలో అనేక ఇళ్లకు పన్నులు వేయడం లేదని, అన్నీ ఇళ్లకు పన్నులు వేసి వసూలు చేయడం ద్వారా ఆదాయం వస్తుందని ఒక సభ్యుడు సూచించారు. నగరంలో అనేక ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటన్నింటిపై పన్నులు వేస్తే సుమారు రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తుందని మరో సభ్యుడు సలహా ఇచ్చారు. బడ్జెట్ సమావేశంలో అధికార పార్టీ సభ్యులంతా దాదాపుగా ప్రజలపై పన్నులు వేయడం గురించే సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే నెల తర్వాత ఖాళీ స్థలాలపై పన్నులు వేసేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. ఈ మొత్తం చర్చలో ప్రజల నుంచి ముక్కు పిండి కొత్త కొత్త పన్నులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న అంశం స్పష్టమవుతోంది. ఇక ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ (ఒడా) నుంచి కూడా రూ.10 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇప్పటికే ఒడా పేరుతో అపార్ట్మెంట్ యజమానుల నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ రూ.10 కోట్ల పన్నులు వేస్తే వారు భయంతో పారిపోవడం ఒక్కటే మిగులుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. -
రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పామూరు: భూ రీసర్వే పనులను రెవెన్యూ సర్వే సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని చింతలపాలెంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో కనిగిరి ఆర్డీఓతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వే జరుగుతున్న తీరుపై తహసీల్దార్, మండల సర్వేయర్లతో చర్చించి మ్యాప్లను పరిశీలించారు. భూ రీసర్వేపై స్థానిక రైతులతో చర్చించి సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. భూ రీసర్వే రైతులకు మంచి అవకాశమని, రైతులు తమ పొలాలకు చెందిన పత్రాలు సర్వే సిబ్బందికి ఇచ్చి తమ పొలాల హద్దులను ఏర్పాటు చేయించుకోవాలన్నారు. భూ రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాటు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే ఉపేక్షించమని సిబ్బందికి సూచించారు. రీసర్వే నిర్దేశిత సమయం లోగా పూర్తిచేయాలని తహసీల్దార్, మండల సర్వేయర్లను ఆదేశించారు. ఏడీ జిల్లా సర్వే గౌస్బాషా, తహసీల్దార్ బీవీ రమణారావు, మండల సర్వేయర్ కే.స్నేహ, వీఆర్ఓ జె.సరస్వతి, సచివాలయ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు. -
గంటలోనే ముగించేశారు..!
ఒంగోలు టౌన్: నగరపాలక సంస్థ కీలకమైన బడ్జెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం ఎక్స్ ఆఫీషియో సభ్యులైన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్లు 3 గంటలు ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. పోనీ అలస్యంగానైనా ప్రారంభించినా కీలకమైన బడ్జెట్ సమావేశంలో ఏమైనా చర్చించారా అంటే అదీ లేదు. మొక్కుబడిగా గంట పాట నిర్వహించి మమ అనిపించి చేతులు దులుపేసుకున్నారు. సమావేశంలో ప్రజల సమస్యలు తలెత్తిన సభ్యులపై ఎమ్మెల్యే దామచర్ల ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిందే నగర ప్రజల నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల పన్ను బకాయిలను వసూలు చేయాల్సిందేనంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధికారులను ఆదేశించారు. 2024–25 సంవత్సరానికి గాను సవరించిన బడ్జెట్ను, 2025–26 సంవత్సరం బడ్జెట్ అంచనాలను కలుపుకొని రూ.210 కోట్ల బడ్జెట్ను సమావేశంలో ఆమోదించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంచినీటి సమస్యను ప్రస్తావించిన వైఎస్సార్ సీపీ సభ్యులపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు గతంలో వైఎస్సార్ సీపీలో గెలిచి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న మేయర్ గంగాడ సుజాత, ఇతర పాలకవర్గ సభ్యులు నివ్వెరపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నగరాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు. రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా... నగర ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆదాయాన్ని పెంచాలని ఎమ్మెల్యే దామచర్ల సూచించారు. ప్రజల నుంచి సక్రమంగా పన్నులు వసూలు చేయకపోవడంతో బకాయిలు పేరుకొని పోయాయని చెప్పిన ఆయన కొత్త కూరగాయల మార్కెట్లో రూ.12 కోట్ల అద్దె బకాయిలను ప్రస్తావించారు. ప్రజలు రోడ్లపై చెత్త వేస్తే జరిమానా వేయాలని అధికారులకు సూచించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి కేవలం 8 నెలలు మాత్రమే అయ్యిందని, అపుడే విమర్శలు చేయడం మంచి సంస్కృతి కాదని మండిపడ్డారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని, మా ప్రభుత్వం కూడా త్వరలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. నిధుల కోసం ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి చుట్టూ తిరుగుతున్నానని చెప్పుకున్నారు. మంచినీటి సమస్య ప్రస్తావించకూడదా..? నగరంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, బడ్జెట్లో మంచినీటి సమస్య పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. నగర శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఒంగోలు నగరంలోని శివారు ప్రాంత ప్రజలకు మంచి నీరు అందించేందుకు రూ.15 కోట్లు కేటాయించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయడానికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేవలం రూ.15 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. దీంతో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా లేచి విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. బడ్జెట్ సమావేశంలో మంచి నీటి సమస్య గురించి ఎలా మాట్లాడతారని అడ్డగోలుగా వాదించారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతున్నా వినిపించుకోకుండా గొడవ చేశారు. అయినా ఇమ్రాన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఒంగోలు నగరంలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా రూ.350 కోట్లు కేటాయించిందని, ప్రస్తుత బడ్జెట్లో దాని ప్రస్తావన లేదని చెప్పారు. మున్సిపల్ లైట్ అండ్ హెవీ వెహికల్ మరమ్మతుల కోసం రూ.2 కోట్లు, డంపింగ్ యార్డ్ నిర్వహణ కోసం రూ.70 లక్షలు కేటాయించారని, ఇలాంటి వాటి ఖర్చు తగ్గించుకొని మంచినీటి కోసం వెచ్చించాలని సూచించారు. అయినా టీడీపీ సభ్యులు మూకుమ్మడిగా మాట్లాడుతుండటంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోయింది. బడ్జెట్ సమావేశం ప్రారంభిస్తూ సభ్యులు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని మేయర్ కోరారాని, సూచనలు ఇస్తుంటే టీడీపీ సభ్యులు అడ్డు తగులుతున్నారని ఇమ్రాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడవద్దంటే ఎలా అని ప్రశ్నించారు. ఆ తరువాత మాట్లాడిన ఎమ్మెల్యే దామచర్ల వైఎస్సార్ సీపీ సభ్యుడు ఇమ్రాన్ లేవనేత్తిన అంశాలకు జవాబు ఇవ్వకుండా విమర్శలు చేశారు. మైకు చేతిలో ఉందని ఏది పడితే అది మాట్లాడితే నేను కూడా మాట్లాడగలను అంటూ మండిపడ్డారు. మొత్తం మీద ఒకరిద్దరు సభ్యులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చి బడ్జెట్ ఆమోదించినట్లు మేయర్ ప్రకటించారు. సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశానికి 3 గంటలు ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలు గంటలోనే సమావేశం ముగింపు కీలకమైన బడ్జెట్ సమావేశంపై చర్చ లేకుండానే ముగింపు సమస్యలు ప్రస్తావించిన సభ్యులపై ఎదురుదాడి నిధుల కోసం సీఎం చుట్టూ తిరుగుతున్నానంటూ ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యలు -
అభివృద్ధి చేస్తారట..!
అంకెల గారడీతో..ఒంగోలు నగర వ్యూసాక్షి ప్రతినిధి, ఒంగోలు: అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకు నగర పాలకులు చేసిన ప్రయత్నం బడ్జెట్ సమావేశంలో స్పష్టంగా కనిపించింది. పేరుకు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన నగర పాలకులు..సమావేశంలో జరిగిన చర్చలో మాత్రం ఆదాయ మార్గాల గురించి ప్రధానంగా దృష్టి సారించడం గమనార్హం. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని చెప్పిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్...ప్రజల నుంచి రావాల్సిన వివిధ రకాల పన్నులను మొత్తం వసూలు చేయాల్సిందేనంటూ పదే పదే చెప్పడం గమనార్హం. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ మొత్తంలో గ్రాంట్లు వస్తాయని ఆశలు చూపుతూనే..మరోవైపు ప్రజలపై ఎన్ని రకాల పన్నులు వేయవచ్చో ఆరా తీయడం సభ్యులను విస్మయానికి గురిచేసింది. మొత్తం మీద ప్రజలను బురిడీ కొట్టించేందుకు నానా తంటాలు పడిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూ.210 కోట్ల బడ్జెట్ పేరుతో ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. రూ.210 కోట్ల బడ్జెట్... నగరపాలక సంస్థ 2025–26 బడ్జెట్ను రూ.210.79 కోట్లతో ఆమోదించారు. ఇందులో ఖర్చులు రూ.196 కోట్లు కాగా మిగులు బడ్జెట్ రూ.13.98 కోట్లుగా తేల్చారు. పైకి చూసేందుకు ఈ బడ్జెట్ రంగుల కలలను ఆవిష్కరిస్తుంది. వాస్తవంలోకి వచ్చి చూస్తే ఒట్టి చేతులు మాత్రమే మిగులుతాయని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ రూ.210 కోట్ల బడ్జెట్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ క్రమబద్ధీకరణ (బీపీఎస్) బకాయిలు రూ.10 కోట్లను కూడా చూపారు. నిజానికి 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని పెట్టారు. అప్పుడు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వకపోవడంతో అది పెండింగ్లో ఉండిపోయింది. అయితే ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కూడా బడ్జెట్లో ఈ బకాయిలను చూపించేవారని, ఇప్పుడు కూడా ఆ నాటి బకాయిలను చూపించడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలని అధికార పార్టీ కార్పొరేటర్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపోతే కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లపైనే పాలకవర్గం ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఏకంగా రూ.52.20 కోట్ల గ్రాంట్లు వస్తాయని ఈ బడ్జెట్లో అంచనా వేశారు. ఒక వైపున కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో రాష్ట్రానికి ఒట్టి చేతులు చూపింది. అమరావతి నిర్మాణం గురించి సైతం కనీసం ప్రస్తావించలేదు. అలాంటిది నగర పాలక సంస్థలకు గ్రాంట్లు ఇవ్వడం అనేది భ్రమ మాత్రమేనని మేధావులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.లక్ష కోట్లు అప్పులు చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు గానీ, గ్రాంట్లు గానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విషయం తెలుసు కనుకనే నిధుల మంజూరు కోసం సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చుట్టూ తిరుగుతున్నానని ఎమ్మెల్యే దామచర్ల చెప్పడం గమనించవచ్చు. మంచినీటికే రూ.15 కోట్లే... నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. జనాభా సైతం పెరిగిపోతోంది. వేసవికి ముందే నగరంలో మంచినీటి సమస్య తలెత్తనుంది/ కనుక ఇతరత్రా వృథా ఖర్చులను తగ్గించుకొని ఆ డబ్బులతో ప్రజలకు మంచినీరు అందించాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా పాలక పార్టీ సభ్యులు, ఎమ్మెల్యే దామచర్ల ఆయనపై ఎదురుదాడికి దిగారు. నెమళ్లు, గుర్రాల బొమ్మలకు లక్షలు ఖర్చు చేస్తున్న పాలకవర్గం ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించేందుకు సంసిద్ధంగా లేకపోవడం విచారకరమని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నగరపాలక సంస్థ బడ్జెట్ అంతా కాకి లెక్కలే..! 2017 బీపీఎస్ బకాయిలను ఈ బడ్జెట్లో చూపిన వైనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లపై ఆశలు రూ.210 కోట్ల పద్దులో ఖర్చులకే రూ.196 కోట్లు వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు సుమారు రూ.100 కోట్లు ప్రజలపై పన్నుల భారం కుట్ర బకాయిల కోసం దుకాణాలు కూల్చివేస్తారా?ఆదాయ మార్గాల గురించి ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ కొత్త కూరగాయల మార్కెట్ కూల్చివేత గురించి ప్రస్తావించారు. ఇటీవల కొత్త కూరగాయల మార్కెట్లో దుకాణాలను నగర పాలక సంస్థ కూల్చివేయడం తెలిసిందే. గత ఇదేళ్లుగా మార్కెట్లోని వ్యాపారులు అద్దెలు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయాని ఎమ్మెల్యే చెప్పారు. మొత్తం బకాయిలు రూ.12 కోట్ల వరకు ఉందని, వివిధ మార్గాల ద్వారా అధికారులు ఒత్తిడి తీసుకుని వస్తే రూ.54 లక్షలు వసూలయ్యాయని సభకు వివరించారు. ఈ విషయంపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బకాయిలు ఉంటే దుకాణాలను ఖాళీ చేయించి టెండర్ వేసి మరొకరికి అద్దెకు ఇవ్వాలి గానీ కూల్చివేయడం సమర్ధనీయం కాదని నిలదీశారు. -
డీఆర్డీఏ పీడీగా నారాయణ బాధ్యతల స్వీకరణ
ఒంగోలు వన్టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా టి.నారాయణ బుధవారం ప్రగతి భవన్లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. వారబంధి పకడ్బందీగా అమలు చేయాలి ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: వారబంధి విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద నుంచి వస్తున్న నాగార్జున సాగర్ నీటిని నిరంతరం గమనిస్తూ ఉండాలని చెప్పారు. వస్తున్న నీటిని పరిగణనలోకి తీసుకొని జిల్లాలో నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు మళ్లించాలని దిశానిర్దేశం చేశారు. రైతులు కూడా సాగు అవసరాలకే వినియోగించుకోవాలని, నీటిని వృథా చేయకుండా అధికార యంత్రాంగానికి సహకరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. గత డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తీసుకున్న సమస్యలపై ఆరా తీశారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, ప్రాజెక్టు ఎస్ఈ నాగమురళి, ఇరిగేషన్ ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయాలని ధర్నా మార్కాపురం: మార్కాపురాన్ని వెంటనే జిల్లా చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. 25 మండలాలు కలిపి మార్కాపురాన్ని జిల్లా చేయడంతో పాటు శ్రీశైలాన్ని కూడా మార్కాపురంలో కలపాలని కోరారు. గిద్దలూరులో ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, మార్కాపురంలో యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని, హనుమాన్ జంక్షన్, గొట్లగట్టు, గజ్జలకొండ, తాటిచర్ల మోటు గ్రామాలను మండలాలుగా చేయాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేసి నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలను సందర్శించిన సంయుక్త సంచాలకులు నాగులుప్పలపాడు: పాఠశాల విద్య గుంటూరు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లింగేశ్వరరెడ్డి మండలంలోని పోతవరంలో ఎయిడెడ్ పాఠశాల, ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పాఠశాల నిర్వహణపై ఉపాధ్యాయులతో సమీక్షించి సలహాలు, సూచనలు చేశారు. అదేవిధంగా నాగులుప్పలపాడు హైస్కూలు ఆవరణలో జరుగుతున్న జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలంతా ఆరు రోజుల పాటు ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి టి.రవి, ఇన్చార్జ్ హెచ్ఎం వెంకట సుబ్బయ్య, రిసోర్స్ పర్సన్లు మాలకొండయ్య, నాగరాజు, సూపర్వైజర్లు ఉషారాణి, శ్రీదేవి పాల్గొన్నారు. -
ఓ పక్క నవోదయం.. మరో పక్క తాగి పొర్లుదాం!
కొమరోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి నవోదయం 2.0 కార్యక్రమాన్ని గొప్పలు చెప్పుకుంటూ మరీ బుధవారం ప్రారంభించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ గొప్పలు అతిగా అనిపిస్తున్నాయి. మండల కేంద్రమైన కొమరోలులో బుధవారం నడిరోడ్డుపైన ఓ వ్యక్తి బెల్టు షాపులో మద్యం సేవించి స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. కొమరోలులో బెల్టుషాపుల్లో మద్యం ఏరులై పారుతోంది అనడానికి ఈ చిత్రమే నిదర్శనం. కొమరోలులోని బ్రహ్మంగారిమఠం వీధికి వెళ్లే రహదారిలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి సోయ లేకుండా పడి ఉన్నాడు. రోజూ ఈ ప్రాంతంలో రాష్ట్రీయ రహదారిపై ఉన్న మద్యం దుకాణాలు లేదా బెల్టు షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తున్న వారు వీధిలోని చెట్ల కింద తాగుతూ దొర్లుతూ కాలక్షేపం చేస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. బ్రహ్మంగారిమఠంకు వెళ్లే రహదారిలో రోజూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి. స్థానికంగా ఉండే మహిళలు మందుబాబుల ఆగడాలకు భయపడుతూ అలాగే తమ పనులకు వెళ్తున్నారు. నవోదయం 2.0ను అట్టహాసంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి తగినట్లుగా చర్యలు తీసుకుని కొమరోలులో, చుట్టుపక్కల దుకాణాలలో బెల్టుషాపులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
కూటమి షాక్!
మీటర్ రీడర్లకు కంభం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు చిరుద్యోగుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. పాలకులు అమలు చేస్తున్న ఒక్కో నిర్ణయం ఒక్కో శాఖలో పనిచేసే చిరుద్యోగుల పొట్టకొట్టేలా ఉండటంతో ఎవరి ఉద్యోగాలు ఉంటాయో.. ఎవరివి ఊడిపోతాయో అంతుచిక్కడం లేదు. గతంలో ఉన్న కరెంటు మీటర్ల స్థానంలో ప్రస్తుతం రీచార్జ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తుండటంతో గడిచిన 18 ఏళ్లుగా విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న మీటర్ రీడర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మీటర్ రీడర్లు 2001వ సంవత్సరం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు మాన్యువల్ విధానంలో బిల్లులు ఇస్తుండగా 2001లో మీటర్ రీడర్స్ బిల్లులు ఇవ్వడం ప్రారంభించారు. 2001లో రూరల్ ప్రాంతంలో ఒక బిల్లుకు 75 పైసలు, పట్టణంలో ఒక బిల్లుకు రూ.50 పైసల నుంచి మొదలై ప్రస్తుతం రూరల్లో ఒక బిల్లుకు రూ.3.10 పైసలు, పట్టణంలో రూ.3.00 చొప్పున చెల్లిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జనవరి నుంచి కొత్త కాంట్రాక్టర్ల ద్వారా ఇదే విధంగా ఇస్తున్నారు. స్మార్ట్ మీటర్లతో భవిష్యత్ ప్రశ్నార్థకం గత రెండు నెలల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. అవి పూర్తయిన వెంటనే గృహాల్లో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ ప్రారంభం కానుంది. స్మార్ట్ మీటర్లు బిగించడం పూర్తయితే జిల్లాలో పనిచేస్తున్న 250 మంది మీటర్ రీడర్ల ఉద్యోగాల్లో గాల్లో దీపాల్లా మారిపోతాయి. తమ ఉద్యోగ భధ్రత కోసం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు మంత్రులు నారాలోకేష్, పవన్ కళ్యాణ్ వద్ద గోడు వెళ్లబోసుకున్నా మీటర్ రీడర్లకు భవితకు హామీ లభించలేదు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం లేదని మంత్రులు సర్దిచెప్పి పంపడంపై మీటర్ రీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కమర్షియల్ స్మార్ట్ మీటర్లు బిగించేస్తున్నారని, ఆ తర్వాత గృహాల్లో ఏర్పాటు చేస్తారని, అప్పుడు తమను కరివేపాకులా తీసి పడేస్తారని వాపోతున్నారు. గత 18 ఏళ్లుగా పనిచేస్తున్న మీటర్ రీడర్లకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మీటర్ రీడర్లు డిమాండ్ చేస్తున్నారు. నేడు విజయవాడలో మహాసభ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 4 వేల మంది మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్రస్థాయిలో మహాసభ నిర్వహించనున్నారు. ఈ మహా సభలో ఉద్యోగ భద్రత కోసం చేయాల్సిన పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటన తదితర అంశాలపై చర్చించనున్నట్లు సంఘ నాయకులు చెబుతున్నారు. మహసభలు విజయవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే మహాసభలపై ప్రచారం నిర్వహించిన మీటర్ రీడర్లు విజయవాడకు పయనమయ్యారు. చిరుద్యోగుల పొట్టకొట్టేలా కూటమి ప్రభుత్వం అడుగులు స్మార్ట్ మీటర్ల రాకతో విద్యుత్ మీటర్ రీడర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం జిల్లాలో 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న 250 మంది మీటర్ రీడర్లు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఉద్యోగులు నేడు విజయవాడలో రాష్ట్ర స్థాయి మహాసభ -
మహిళల భద్రత మనందరి బాధ్యత
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు సిటీ: మహిళల భద్రత మనందరి బాధ్యత అని, మహిళా ఫిర్యాదుల పరిష్కారానికి ఎల్లప్పుడు సంసిద్ధంగా ఉండాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. బుధవారం ఒంగోలులోని పోలీస్ కల్యాణ మండపంలో అన్ని పోలీస్ స్టేషన్ల మహిళా సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళా ఫిర్యాదుదారులతో పోలీసులు వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ వద్ద మహిళా సిబ్బంది ఉండాలని చెప్పారు. మహిళలు, బాలలు పోలీస్ స్టేషన్కు వచ్చి నిర్భయంగావారి ఫిర్యాదు చేయగలిగే వాతావరణాన్ని కల్పించాలన్నారు. మహిళలతో గౌరవంగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికగా వినాలని హితవు పలికారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడానికి అన్ని విధాలా ప్రయత్నించాలని సూచించారు. అవసరమైన సాక్ష్యాలు సేకరించి భద్రపరచాలన్నారు. మహిళల ఫిర్యాదులను గోప్యంగా ఉంచాలని, వారి వ్యక్తిగత సమాచారం, కేసు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని స్పష్టం చేశారు. మహిళా హెల్ప్ డెస్క్ వద్ద తగిన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. న్యాయ సహాయం, వైద్య సహాయం అందించడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. మహిళలు, పిల్లల కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలలకు పోలీసు సిబ్బంది వెళ్లి గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఆకర్షణ ప్రేమ ప్రభావాలు, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, స్వీయ రక్షణలపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా సిబ్బంది సంక్షేమం దృష్ట్యా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక మెడికల్ క్యాంపులు సైతం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఒంగోలు టౌన్ మహిళా ఎస్సైలు రజియా సుల్తాన్, అనిత, కష్ణ పావని, సువర్ణ, ఆర్ఎస్సై సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఎయిడెడ్’లో సీఆర్పీలను కేటాయించాలి
● ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్ ఒంగోలు సిటీ: జిల్లా వ్యాప్తంగా ఉన్న 40 సింగిల్ ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్లు సెలవు పెడితే సీఆర్పీలను కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సింగిల్ ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ సెలవు పెడితే ఆ పాఠశాలకు కొంత మంది మండల విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులను, సీఆర్పీలను పంపకపోవడాన్ని తప్పుబట్టారు. సెలవు పెట్టిన టీచర్లే ప్రైవేట్ టీచరును ఏర్పాటు చేసుకోవాలని ఎంఈఓలు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెడితే.. ఇద్దరు ఎయిడెడ్ టీచర్లు ఉన్న స్కూళ్ల నుంచి పంపుతున్నారు కానీ ఎయిడెడ్ స్కూళ్లలో టీచరు సెలవు పెడితే ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. డీఈఓ స్పందించి ఎయిడెడ్ స్కూళ్లకు సీఆర్పీలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
స్మార్ట్ మీటర్లు రావన్నారు.. ఇప్పుడు బిగిస్తున్నారు
మా యూనియన్ నాయకులు మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు స్మార్ట్ మీటర్లు రావని చెప్పారు. ఇప్పుడేమో అవే మీటర్లు బిగించేస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత మా ఉద్యోగాలు ఉంటాయో లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – సయ్యద్ హుస్సేన్, మీటర్ రీడర్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలి నేను 18 ఏళ్లుగా మీటర్ రీడర్గా పనిచేస్తున్నా. ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అర్థం కావడం లేదు. ఒక వేళ తొలగించాల్సి వస్తే మాకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ శాఖలో లేదా ఇతర శాఖల్లో ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలి. – కె.సురేంద్రబాబు, మీటర్ రీడర్ కంభం -
ఉచ్చులు బిగించే వారిపై కేసు నమోదు
యర్రగొండపాలెం: అడవిలో ఉచ్చులు బిగించి జంతువులను వేటాడే వారిపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన మండలంలోని కొలుకుల బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అడవి పందుల కోసం ఉచ్చు బిగించారు. ఈ ఉచ్చులో చిక్కుకొని చిరుతపులి మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ కేసును ముమ్మరం చేసిన ఫారెస్ట్ అధికారులు బుధవారం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అనుమానితులైన కొలుకులకు చెందిన ఇద్దరు, చెన్నరాయునిపల్లెకు చెందిన మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. కేసు విచారణ పూర్తయిన అనంతరం ఆ నలుగురు అనుమానితులను అరెస్ట్ చేయనున్నట్లు తెలిసింది. అందుకు ఫారెస్ట్ అధికారులు స్థానిక సీఐ సీహెచ్ ప్రభాకరరావు సహకారాన్ని కోరినట్లు సమాచారం. -
40 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
కొండపి: అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండపి ఎస్సై ప్రేమ్ కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని తాటాకులపాలెం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గ్రామ శివారులో తనిఖీ చేపట్టారు. మినీ ట్రక్లో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వట్టికొండ బంగారయ్య, గరితోటి అశోక్ను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బిడ్డతో సహా తల్లి బలవన్మరణం
చెరువులో దూకి ● మతిస్థిమితం లేకనే అంటున్న కుటుంబ సభ్యులు సంతనూతలపాడు: ఎనిమిది నెలల పసిబిడ్డతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతనూతలపాడులో బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సంతనూతలపాడుకు చెందిన బాపట్ల వెంకటేషన్కు బోడపాలెం గ్రామానికి చెందిన సుజాత(28)తో నాలుగున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరు స్థానిక ముద్రగడ బజారులోని అంకమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నారు. సురేష్ గొర్రెలను పెంచుతూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. వీరికి తొలుత ఆడబిడ్డ జన్మించగా అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందింది. అనంతరం 8 నెలల క్రితం మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏడాది క్రితం వెంకటేష్కు చెందిన రూ.లక్షల విలువైన పశువులు అంతు చిక్కని వ్యాధులతో మరణించాయి. దీంతో ఆ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలి అనే దిగులుతో పాటు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత మతిస్థిమితం లేక.. బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున స్థానిక చెరువులో చంటి బిడ్డ బాపట్ల ఏశ్వజ్ఞ (8నెలలు) మృతదేహం బయటపడడంతో ఈ విషయం వెలుగు చూసింది. తల్లీబిడ్డల ఆత్మహత్యపై సమాచారం అందుకున్న సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ కుమార్ గాలింపు చర్యలు చేపట్టి మహిళ మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లీబిడ్డ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కృష్ణం వందే జగద్గురుం
తర్లుపాడు: అశేష భక్తజనం భక్తిపారవశ్యంతో శ్రీకృష్ణ నామాన్ని స్మరిస్తుండగా వేణుగోపాలుడు ఉభయ దేవేరులతో కలిసి రథంపై ఊరేగాడు. తర్లుపాడులోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉభయ దేవేరులతో కలిపి స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అర్చకులు ప్రతిష్ఠించి పూజలు చేశారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పొదిలి సీఐతో పాటు తర్లుపాడు ఎస్సై బ్రహ్మనాయుడు ఇంకా పలువురు ఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర్, గ్రామ ప్రముఖులతోపాటు ఈఓ చెన్నకేశవరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాతల ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ చేయడంతోపాటు మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు, పానకం, వడపప్పు పంపిణీ చేశారు. వైభవంగా వేణుగోపాలుని రథోత్సవం భక్తుల శరుణుఘోషతో మారుమోగిన తర్లుపాడు వీధులు -
స్కూల్ బస్సును ఢీకొన్న ఆటో
● ఏడుగురికి స్వల్ప గాయాలు జరుబులవారిపాలెం (కారంచేడు): రోడ్డు పక్కన ఆగి ఉన్న స్కూల్ బస్సును కూలీలతో వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన కారంచేడు మండలంలోని జరుబులవారిపాలెం నుంచి ఇంకొల్లు వెళ్లే మార్గంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై వి.వెంకట్రావు కథనం మేరకు.. ఇంకొల్లుకు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు విద్యార్థుల కోసం కేశవరప్పాడు వచ్చి వెళ్తోంది. ఈ సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును వ్యవసాయ కూలీలతో ఇంకొల్లు నుంచి కేశవరప్పాడు వస్తున్న ఆటో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లోకి దూసుకెళ్లగా కూలీల్లో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా స్థానికులు మాత్రం ఆటోను స్కూల్ బస్సు వచ్చి ఢీకొట్టిందని చెబుతున్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై చెప్పారు. -
మిర్చి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
నాగులుప్పలపాడు: ఈ ఏడాది మిర్చి రైతులు తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయారని, ఆ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మండలంలోని ఒమ్మెవరం గ్రామంలో మిర్చి కళ్లాల్లో పంటను మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ మిర్చి పంటకు సరైన ధర లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులు ఏనాడూ గిట్టుబాటు ధర కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వమే అండగా నిలిచిందన్నారు. పొగాకు రైతులను ఆదుకున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. గత ఏడాది మిర్చి ధరలు క్వింటాలుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలికాయని, ప్రస్తుతం ఈ ధరలు క్వింటాకు రూ.12 వేలకు పడిపోవడం బాధాకరమన్నారు. రైతులకు ఎకరాకు రూ.2.50 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని, ఈ పరిస్థితుల్లో నల్లి, తామర తెగులుతో దిగుబడులు భారీగా తగ్గాయని అన్నారు. ఎకరాకు దిగుబడి 10 నుంచి 15 క్వింటాళ్లకు మించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. తద్వారా ఒక్కో ఎకరానికి రైతు సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం సరైన పధ్ధతి కాదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పి నేటికీ అందచేయక పోగా పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ ఎత్తివేసి రైతులను మోసం చేసిందన్నారు. ఇప్పటికై నా నష్టాల్లో ఉన్న మిర్చి రైతులను దళారుల బారి నుంచి కాపాడి వారికి ధర గిట్టుబాటు అయ్యేలా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నలమలపు కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, కంచర్ల సుధాకర్, కోటిరెడ్డి, కుమ్మూరి సుధాకర్, గండు వెంకట్రావు, హరిబాబు, మాదాసు రాంబాబు, అంజిరెడ్డి, బాలకృష్ణ, సుబ్బారావు, వెంకటేష్, ప్రవీణ్ ఉన్నారు. ధరల పతనంతో నష్టాల్లో మిర్చి రైతులు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా రమణారెడ్డి
ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన కేవీ రమణారెడ్డిని నియమించారు. ఆ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ బదిలీ గిద్దలూరు(బేస్తవారిపేట): గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ డి.వెంకటదాసు నంద్యాల మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిద్దలూరు నగర పంచాయతీ నూతన కమిషనర్గా ఐ.శ్రీనివాసులు నియమించారు. గుడివాడ మున్సిపాలిటీ మేనేజర్గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై గిద్దలూరులో నియమితులయ్యారు. క్యాథ్ల్యాబ్ను త్వరగా ప్రారంభించాలిఒంగోలు టౌన్: జిల్లాలో రోజురోజుకూ గుండె జబ్బులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత ప్రభుత్వం క్యాథ్ ల్యాబ్ మంజూరు చేసిందని, ప్రస్తుతం ల్యాబ్ ఏర్పాటు పూర్తయిన దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా చెన్నయ్య కోరారు. ఈమేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి.కృష్ణబాబును కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఇటీవల నిరుపేద ప్రజలు ఎక్కువగా గుండెజబ్బుల బారిన పడుతున్నారని, చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ధర దండిగా
ఆశలు పండగా..చీమకుర్తి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలిపి మొత్తం 11 వేలం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒంగోలు–1, ఒంగోలు–2, వెల్లంపల్లి, టంగుటూరు, కొండపి, పొదిలి, కనిగిరి, కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డీసీపల్లి కేంద్రాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల్లో గత ఏడాది 88 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతినివ్వగా రైతులు అనుమతికి మించి సాగు చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు 153 మిలియన్ కేజీల పొగాకును బోర్డు కొనుగోలు చేసింది. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం పొగాకు సాగు విస్తీర్ణం కూడా పెరగటంతో అధికారకంగా బోర్డు 103 మిలియన్ కేజీలు కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. రైతులు సాగు చేసిన విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో ఈ సారి కూడా బోర్డు నిర్ణయించిన దానికంటే గత ఏడాది కొనుగోలు చేసిన 153 మిలియన్ కేజీలను మించి పోతుందేమోనని బోర్డు అధికారులు అంచనాలు లెక్కగడుతున్నారు. పెరుగుతూ వస్తున్న సాగు విస్తీర్ణం... నాలుగేళ్లుగా వస్తున్న లాభాలతో పొగాకు సాగు చేసే రైతుల సంఖ్య, విస్తీర్ణం ఏటికేడు పెరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం 68,500 హెక్టార్లకు మించి పొగాకు సాగుచేయొవద్దని బోర్డు అధికారులు రైతుల చెవిలో గూడుకట్టుకొని ప్రచారం చేసినా లాభాల ఊహల్లో తేలుతున్న రైతులు వారి సూచనలను పెడచెవిన పెట్టారు. ఏకంగా 88 వేల హెక్టార్లలో సాగు చేశారు. అంటే బోర్డు అధికారులు చెప్పిన విస్తీర్ణం కంటే 28 శాతం ఎక్కువ సాగు చేశారు. జిల్లాలోని 11 వేల కేంద్రాల పరిధిలో మొత్తం 24 వేల బ్యారన్ల ద్వారా 30 వేల మంది రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. గతంలో కాడి కింద పడేసిన రైతులు సైతం తమకున్న పొలంతో పాటు ఇతరుల పొలాన్ని కూడా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. బ్యారన్లను అద్దెలకు తీసుకొని మరీ సాగు చేయటానికి రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఎకరం పొలం కౌలు గతంలో రూ.10 వేలు ఉండేది. ఇప్పుడు రూ.20 వేలకు పెరిగింది. గతంలో బ్యారన్ కౌలు రూ.50 వేల నుంచి 60 వేల మధ్య ఉండేది, అది కాస్త ఇప్పుడు రూ.1.50 లక్షల నుంచి 1.80 లక్షలకు పెరిగింది. ఈ నెల 25 అధికారుతో సమావేశం: రాష్ట్ర పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో జిల్లాలోని 11 వేల కేంద్రాలకు సంబంధించిన అధికారులతో ఈ నెల 25న సమావేశం జరగనుందని బోర్డు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. ఆ సమావేశంలో జిల్లాలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభం కావాలో అనే అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రైతులను వేధిస్తున్న మల్లె.. పొగాకు సాగులో వేళ్ల మీద పెరిగే మల్లె రైతులను వేధిస్తోంది. ఇది మొక్కలు ఏపుగా పెరగటంలో ఆటంకం కలిస్తుందని రైతులు, బోర్డు అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు ఇటీవల కురిసిన ముసురు వర్షాలు, దాని వలన ఏర్పడిన తెగుళ్ల వలన కూడా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు పొగాకు సాగులో రూ.లక్షలు ఖర్చుపెట్టారు. తెగుళ్ల వలన దెబ్బతిని పోయిన పంట పోయినా ఉన్న పొగాకుకు మంచి నాణ్యమైన రంగు వస్తే మంచి ధర పలుకుతుందనే ధీమాలో రైతులు ఆశలు పెంచుకున్నారు. కర్నాటకలోని ధరలు రైతుల్లో ఇంకాస్త ఊపిరిపోశాయి. కర్నాటక రేట్లతో పొగాకు రైతుల్లో ఆశలు అక్కడ కేజీ పొగాకు గరిష్ట ధర రూ.331 గత ఏడాది మన జిల్లాలో గరిష్ట ధర రూ.320 ఇప్పటికే లక్ష్యానికి మించి పొగాకు సాగు 68,500 హెక్టార్లకు అనుమతి ఇవ్వగా 88 వేల హెక్టార్లలో సాగు 103 మిలియన్ కేజీలు కొనుగోలుకు అనుమతి కొనుగోలు తేదీపై స్పష్టత ఈనెల 25 తేదీనకర్నాటకలో మంచి ధరలు వస్తున్నాయి కర్నాటకలో పొగాకుకు మంచి ధరలు వస్తున్నాయి. కేజీ పొగాకు గరిష్టంగా రూ.331, సరాసరిన రూ.268 పలికింది. లోగ్రేడు కూడా రూ.220కు పైగా ధర పలుకుతోంది. దానిని బట్టి మన జిల్లాలోని పొగాకుకు మంచి ధరలు రావచ్చని అంచనా ఉంది. కానీ రైతులకు 68,500 హెక్టార్లలో పొగాకు సాగు చేయాలని అనుమతినిస్తే వారు మాత్రం ఏకంగా 88 వేల హెక్టార్లలో సాగు చేశారు. దాని ప్రభావం ఎలా ఉంటుందో వేలం మొదలైతే గానీ చెప్పలేం. – ఆర్.లక్ష్మణ్రావు, ఆర్.ఎం, ఒంగోలు పొగాకు బోర్డు -
అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించండి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా టంగుటూరు: రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను చేయతగినవి, చేయలేనివి విభజించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులు, రిజిష్టర్లు పరిశీలించారు. రైతులకు పొలాల ఆన్లైన్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించారో లేదో రైతులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొణిజేడులో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించి రీ సర్వే సమయంలో సంబంధిత రైతులకు నోటీసులు ఇచ్చారో లేదో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనాథ్, డిప్యూటీ ఇన్స్పెక్షన్ అధికారి భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. చేతులెత్తేసిన చిట్టీల వ్యాపారి ● లబోదిబోమంటున్న బాధితులు పొదిలి: పట్టణంలోని ఓ చిట్టీల వ్యాపారి చేతులెత్తేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..పట్టణంలో వస్త్ర దుకాణం నిర్వహించే మహిళ కొన్ని ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తోంది. సదరు మహిళ భర్త ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావడంతో ఆమె వద్ద ఎంతో మంది చిట్టీలు వేశారు. కొన్నేళ్లుగా చిట్టీల నిర్వహణ సక్రమంగా సాగింది. అయితే గత రెండు మూడు సంవత్సరాలు చిట్టీల కాలం పూర్తయినా పాడుకున్న వారికి నగదు సకాలంలో ఇవ్వడం లేదు. దీంతో చిట్టీలు వేసిన వారు ఆమె వద్ద ప్రాంసరీ నోట్లు రాయించుకున్నారు. వారితో పాటు మరికొంత మంది సదరు మహిళ వడ్డీ పేరుతో నగదు తీసుకుంది. నగదు చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో చిట్టీల పాడుతున్న వారు ఆమెను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆమె నిర్వహిస్తున్న వస్త్ర దుకాణం వద్ద జరిగిన గొడవ బాధితులందరిలో మరింత అనుమానం రేకెత్తించింది. డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. బాధితులంతా మధ్య తరగతి చెందిన వారే. చిరు వ్యాపారులు, చిరుద్యోగులు రూపాయి రూపాయి కూడబెట్టి భవిష్యత్లో పిల్లల వివాహ, విద్యా అవసరాలకు పనికి వస్తాయని చిట్టీలు వేశారు. సదరు చీటీల నిర్వాహకురాలు భర్త ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావడంతో ఎప్పుడైనా తమ డబ్బులు వస్తాయని ఆశతో ఎదురు చూశారు. కానీ సకాలంలో నగదు ఇవ్వకపోవడంతో చిట్టీలు వేసిన వారు దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించారు. చిట్టీల కాలం పూర్తయినా నగదు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని, మా డబ్బులు మాకు ఇప్పించేలా చూడాలని ఫిర్యాదు చేశారు. -
ప్రకాశంలో బర్డ్ ఫ్లూ లేదు
● పశు సంవర్ధకశాఖ జేడీ బేబీరాణి సంతనూతలపాడు: జిల్లాలో బర్డ్ఫ్లూ లేదని, ప్రజలు కోడి మాంసం, కోడిగుడ్లు తినవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.బేబీరాణి స్పష్టం చేశారు. మంగళవారం సంతనూతలపాడు పశువైద్యశాలలో చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. ఇతర జిల్లాల నుంచి పశువుల దాణా, కోడిగుడ్లు, కోళ్లను జిల్లాకు రవాణా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో పశుగణన సర్వే దాదాపుగా పూర్తయినట్టు చెప్పారు. ఇప్పటికే కోళ్ల ఫామ్ యజమానులకు బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించి, కోళ్లకు వ్యాక్సిన్ కూడా వేశామన్నారు. వ్యర్థాల తొలగింపునకు కూడా ప్రత్యేక సూచనలిచ్చామన్నారు. సమావేశంలో ఏడీ డాక్టర్ కె.సుధీర్ బాబు, పశు వైద్యాధికారులు టి.మనురూప్, వై.పేరయ్య, పి.చిరంజీవి, బి ప్రతాపరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కూటమికి బాజా!
ఎకై ్సజ్ ఖాజా.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఫక్తు రాజకీయ నాయకుడిలా ప్రసంగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ స్వామి భక్తిని చాటుకోవడమే కాకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం వివాదాస్పదంగా మారింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం నవోదయ పథకాన్ని అమలు చేసిందని, నాటుసారా నిర్మూలనకు కృషి చేసిందని, ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో సారా వినియోగం బాగా పెరిగిందని, మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చేందుకు నవోదయ 2.0 అమలు చేస్తున్నారని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఖాజా మొహిద్దీన్ చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎకై ్సజ్ సూపరెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన స్వామి భక్తిని ప్రదర్శించే విషయంలో తొలిరోజు నుంచి వెనకాడటం లేదు. మీడియా సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచేయడం ఆయనకు రివాజుగా మారింది. యథాలాపంగానే మంగళవారం జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కూడా అదే తీరుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో నవోదయ 2.0 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వివరాలు వెల్లడించేందుకు ఖాజా మొహిద్దీన్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తాను జిల్లా ఉన్నతాధికారినన్న విషయాన్ని మరచిపోయి ఒక రాజకీయ నాయకుడి తరహాలో గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆయన ఇదే శాఖలో విధులు నిర్వహించిన సంగతి మరిచిపోయినట్టున్నారు. రమణ వ్యవహారంలో పాత్ర? ఒంగోలు ఎకై ్సజ్ శాఖలో రమణ చౌదరి అనే కానిస్టేబుల్ 2.34 కోట్ల రుపాయల గోల్మాల్కు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. నగరంలోని ఎలైట్ మాల్లో విక్రయించిన మద్యం తాలూకు డబ్బును ఏరోజుకారోజు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే రమణ చౌదరి అనే కానిస్టేబుల్ ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా రూ.2.34 కోట్లు కాజేశాడు. ఈ వ్యవహారం బయట పడకుండా ఉండేందుకు ఎలైట్ మాల్ను తగలబెట్టాలని ప్రయత్నించినట్లు కథనాలు వచ్చాయి. అవినీతి బట్టబయలైన తరువాత కానిస్టేబుల్ రమణ చౌదరి అధికారులకు అందుబాటులో లేకుండా పరారరయ్యాడు. అతని పరారీ వెనక కూడా ఖాజా మొహిద్దీన్ హస్తం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎకై ్సజ్ శాఖకు రూ.కోట్లలో కన్నం వేసిన కానిస్టేబుల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తిలాపాపం తలా పిడికెడు తరహాలో రమణ చౌదరి కాజేసిన డబ్బును రికవరీ పేరుతో తలా కొంత వేసుకుని చెల్లించడంతో చివరికి ఈ పరారీ కథ కంచికి చేరింది. రమణ చౌదరి కేసు వ్యవహారాన్ని మాఫీ చేసేందుకు కూటమి పెద్దల ఆశీస్సులతో ఈఎస్ ఖాజా మొహిద్దీన్ చివరి నిమిషం వరకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ కోట్ల రుపాయల నిధులను ఎలా కాజేయగలడన్న ప్రశ్నకు ఇప్పటికీ జవాబు లేదు. కూటమి పెద్దల మెప్పు కోసం ఖాజా భాయ్ ఎంతకై నా తెగిస్తారని ఆ శాఖ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. బెల్ట్ షాపుల సంగతేంటి సార్? రాష్ట్రంలో నాటు సారా నిర్మూలించడం సంగతి పక్కనబెడితే జిల్లాలో జోరుగా సాగుతున్న బెల్ట్ షాపులపై ఈఎస్ నోరు మెదపడడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారీ మద్యం దుకాణాలను ఎత్తివేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం తెలిసిందే. వాటికి అనుసంధానంగా ప్రస్తుతం జిల్లాలో సుమారు 2000కు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు అంచనా. ప్రతి గ్రామంలో కూటమి నేతల ఆశీస్సులతో సాగుతున్న బెల్ట్ షాపులను ఎకై ్సజ్ అధికారులు చూసీచూడనట్టు వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. భారీగా ముడుపులు పుచ్చుకొని చోద్యం చూస్తున్నట్లు ఈఎస్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. టీడీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో బెల్ట్ షాపు పెట్టి బహిరంగంగా మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోని ఈఎస్ కూటమి నేతల భజనలో మునిగి తేలడం వివాదాస్పదంగా మారింది. బదిలీల్లో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకై ్సజ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. అపుడు రమణ చౌదరి అనే కానిస్టేబుల్తో చేతులు కలిపిన ఈఎస్ ఖాజా మొహిద్దీన్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. చేతులు తడిపిన వారికి మాత్రమే కోరుకున్న చోట పోస్టింగు ఇచ్చినట్లు ఆ శాఖలోని ఉద్యోగులే వాపోయారు. దీంతోపాటుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. అయినా ఈయనపై వచ్చిన ఆరోపణలను కూటమి పాలకులు పట్టించుకోకపోవడం ఆరోపణకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వంలో సారా విక్రయాలు ఎక్కువయ్యాయంటున్న ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే తీరు కానిస్టేబుల్ బదిలీల్లో అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోని ప్రభుత్వంపై స్వామి భక్తి సొంత శాఖలో జరిగిన రూ.2.34 కోట్ల గోల్మాల్లో ఖాజా పాత్రపై ఆరోపణలు రమణ చౌదరిని రక్షించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు -
హైవే దొంగతనాలపై ఎస్పీ సీరియస్
ఒంగోలు టౌన్: హైవేల వెంట నిలిపి ఉంచిన లారీల నుంచి డీజిల్ దొంగిలిస్తున్న ముఠాల గురించి ‘హైవేలపై కేడీలు’ అనే శీర్షికతో సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పందించారు. హైవేలపై దీర్ఘకాలంగా పనిచేస్తున్న హైవే పోలీసులను ఆ విధుల నుంచి తొలగించి వారి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. మంగళవారం ఉదయం జరిగిన సెట్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన జిల్లాలో హైవేల వెంట ఉన్న పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. హైవేలపై ఇన్ని చోరీలు జరుగుతుంటే మీరేమి చేస్తున్నారని మండిపడినట్లు తెలిసింది. ఎలాంటి అవకతవకలకు పాల్పడినట్లు తెలిసినా శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే ఎస్పీ కొంత సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దొంగ డీజిల్ విక్రయాలకు పాల్పడుతున్న వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఒక ఎస్ఐ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో అతడిపై చర్యకు సమాయత్తం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఛేంజ్ ద డెన్... ఇదిలా ఉండగా సాక్షిలో కథనం ప్రచురితమైన వెంటనే సోమవారం ఉదయం ఒంగోలు సమీపంలోని ఒక కళ్యాణ మండపం పక్కన ఉన్న డెన్ను పోలీసులు దగ్గర ఉండి మరీ తొలగించినట్లు సమాచారం. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు పాకను తొలగించివేశారు. అయితే హైవే దొంగల వద్ద నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి విక్రయించే వ్యాపారి తన డెన్ను ఉలవపాడుకు మార్చినట్లు తెలుస్తోంది. అతడొక్కడే కాకుండా జిల్లాలో దొంగ డిజిల్ విక్రయిస్తున్న దాబా నిర్వాహకులు కూడా సరుకును ఎక్కడికక్కడ సర్దేసినట్లు సమాచారం. నగరంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో దొంగలు తీసుకొచ్చిన జాకీలు, బ్యాటరీలను కొనుగోలు చేసే వ్యాపారులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు తమ డెన్లను సేఫ్ జోన్కు మార్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ విషయాన్ని ఎస్పీ సీరియస్గా తీసుకోవడంతో పోలీసులు, దొంగ డీజిల్ విక్రేతల గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి. ఇన్నాళ్లు దాబాల్లో ఉచితంగా బిర్యానీలు తింటూ, మూడు డీజిల్ క్యానులు, ఆరు బ్యాటరీల చందంగా రెండు చేతులా సంపాదించిన కొందరు పోలీసులు ఎవరి మీద దెబ్బ పడుతుందోనని ఆందోళన చెందుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హైవే సిబ్బందిని తొలగించి కొత్త వారికి బాధ్యతల అప్పగింత హైవే పోలీసు స్టేషన్ సమీపంలోని పోలీసులకు హెచ్చరికలు చోరీలపై విచారించి నివేదిక ఇవ్వాలని సీసీఎస్ సిబ్బందికి ఆదేశాలు -
కంభంలో ఇరువర్గాల ఘర్షణ
కంభం: ఇరువర్గాల మధ్య ఘర్షణలో నలుగురికి గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి కంభంలోని తెలుగు వీధిలో చోటుచేసుకుంది. వివరాలు.. తెలుగు వీధిలో నివాసం ఉంటున్న వారు మంగళవారం ఉదయం దేవరకు పెట్టుకున్నారు. అక్కడి పరిణామాలపై మాటామాటా పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. సత్యలింగమూర్తి అనే వ్యక్తికి తలకు గాయాలు కాగా అరుణ్కుమార్, ప్రసాద్, మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ఘర్షణ అనంతరం ఓ వర్గం వారు అక్కడ ఉన్న కొస్టానికి నిప్పంటించగా చుట్టుపక్కల వారు నీళ్లు పోసి ఆర్పేశారు. తలకు గాయమైన లింగమూర్తిని మార్కాపురం వైద్యశాలకు తరలించారు. వీధిలో ఓ ఏఎస్సై, ఇద్దరు సిబ్బంది పహరా కాస్తున్నారు. ఘర్షణకు దిగిన ఇరువర్గాల వారు టీడీపీ సానుభూతిపరులేనని తెలిసింది. ఈ విషయమై ఎస్సై నరసింహారావును వివరణ కోరగా గొడవకు సంబంధించి బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
వైపాలెం తహసీల్దార్ బాల కిషోర్ సస్పెన్షన్
యర్రగొండపాలెం: స్థానిక తహసీల్దార్ బాల కిషోర్, వీఆర్వో ఎల్లయ్య, సర్వేయర్ దిలీప్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం రోడ్డులో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ ఎదురుగా సర్వే నంబర్ 58, 58/1లతో పాటు రోడ్లు, భవనాల శాఖకు చెందిన స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యేందుకు సహకరించిన వారిపై ఈ వేటు పడింది. దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఈ స్థలాలను మండలంలోని సర్వాయపాలేనికి చెందిన ఒకరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని అతనికి కావలసిన డాక్యుమెంట్లు అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న వాస్తవ స్థల హక్కుదారులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆమేరకు కలెక్టర్ ఆదేశాలతో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రీవినాగ్ ఈ నెల 3వ తేదీ ఆ స్థలాలపై దర్యాప్తు చేసి నివేదికను అందజేశారు. ఆ నివేదిక ప్రకారం ఈ నెల 15వ తేదీ వీఆర్వో 2 ఎల్లయ్యను పాలుట్ల పంచాయతీకి, సర్వేయర్ దిలీప్ను కాశికుంట తండాకు బదిలీ చేశారు. తహసీల్దార్ బాల కిషోర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం వలన ఆయన్ను బదిలీ చేయలేదు. ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్ నలగాటి మల్లికార్జున నాయుడికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి ఇన్చార్జి తహసీల్దార్గా నియమించారు. ఆ తరువాత వారిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మరో రెండు శాఖలకు చెందిన అధికారులు కూడా పెద్ద మొత్తాల్లో దండుకొని అక్రమ రిజిస్ట్రేషన్కు సహకరించినట్లు తెలిసింది. ఆ స్థలాల్లో సర్వేనంబర్ 58లో ఉన్న రేకుల షెడ్డుకు సర్వాయపాలేనికి చెందిన దొడ్డపనేని శ్రీనివాసరావు పన్ను చెల్లిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఈదుల రాజశేఖరరెడ్డి రశీదు ఇచ్చాడు. తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి తగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం వలన తాము రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆ శాఖ అధికారులు సబ్ కలెక్టర్ విచారణలో చెప్పారు. రెవెన్యూ, పంచాయతీ, రిజిస్ట్రేషన్ అధికారుల అండదండలు ఉండటం వలన శ్రీనివాసరావు గతనెల 16వ తేదీ, 22వ తేదీన తన భార్యతో రిజిస్ట్రేషన్ చేయించాడు. తగిన ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. వీఆర్వో, సర్వేయర్లు కూడా.. రూ.5 కోట్ల విలువైన స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్కు సహకరించినందుకే వేటు -
అధికారుల నిర్లక్ష్యం ఖరీదు రూ.10 కోట్లు
సింగరాయకొండ: భూముల రీసర్వేలో మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రభుత్వానికి సుమారు రూ.10 కోట్లు నష్టం వాటిల్లగా, వందల ఎకరాల్లో భూ యజమానులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 108 కు రీ సర్వే లో భాగంగా 860 ఎల్పీఎం నంబరు కేటాయించారు. ఈ ఎల్పీఎం కింద సుమారు 51 సర్వే నంబర్లు ఉండగా 281 ఎకరాల విస్తీర్ణం ఉంది. అయితే ఈ ఎల్పీఎం నంబరు పరిధిలో ప్రభుత్వ జూనియర్ కాలేజి కూడా ఉండటంతో ఆ నంబరును నిషేధిత జాబితాలో చేర్చారు. రెవెన్యూ అధికారులు చేసిన పొరబాటుకు నాలుగు నెలలుగా 108 సర్వే నంబరులో భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రోజుకు సుమారు రూ.8 లక్షల నష్టం వాటిల్లుతోంది. అంటే ఈ నాలుగు నెలల్లో సుమారు రూ.10 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. అంతేకాక భూముల ధరలు కూడా అమాంతం పడిపోయాయి. దీంతో భూముల కొనుగోలుదారులు, అమ్మకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సింగరాయకొండ, సోమరాజుపల్లి, పాతసింగరాయకొండ, కనుమళ్ల, శానంపూడి గ్రామ పంచాయతీలోని సుమారు 1,500 ఎకరాల భూములు దేవదాయ శాఖ పరిధిలోకి రావటంతో ఆ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ఉంచటంతో 11 సంవత్సరాలుగా భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో నష్టం వాటిల్లింది. భూముల ధరలు పడిపోయి ప్రజలు అమ్ముకోలేక, బ్యాంకుల్లో రుణాల కోసం తనఖా పెట్టుకునే అవకాశం లేక ఆర్థికంగా నష్టపోయారు. కానీ ఇప్పుడు కేవలం అధికారులు నిర్లక్ష్యం కారణంగా 281 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోవటంతో మళ్లీ ఎప్పుడు సమస్య పరిష్కారమై రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారో అర్థం కావటం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూలగుంటపాడులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉందని నిషేధిత జాబితాలో 860 ఎల్పీఎం నంబర్ రీసర్వేలో అధికారుల నిర్వాకం ఆ ఎల్పీఎం కింద 51 సర్వే నంబర్లలో 281 ఎకరాలు నాలుగు నెలలుగా ఆగిన భూముల రిజిస్ట్రేషన్ పడిపోయిన భూముల ధరలు రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండినివేదిక వస్తే చర్యలు తీసుకుంటాం 108 సర్వే నంబరుకు సంబంధించి విచారణకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను నియమించాం. ఆయన ఇచ్చే నివేదిక ప్రకాారం నా లాగిన్ ద్వారా ఆ సర్వే నంబరును నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి మళ్లీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాను. – గోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ ప్రభుత్వానికి రోజుకు రూ.8 లక్షల నష్టం సుమారు నాలుగు నెలలుగా 108 సర్వే నంబరులో రిజిస్ట్రేషన్ల ప్రకియ ఆగిపోవడంతో ప్రభుత్వానికి రోజుకు సుమారు రూ.8 లక్షల మేర నష్టం వస్తోంది. ఈ మండలానికి ప్రభుత్వం రూ.30 కోట్ల టార్గెట్ ఇస్తే ఇప్పటికి రూ.15 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఈ విధంగా నిషేధిత జాబితా లో భూములు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని ఏవిధంగా చేరుకోవాలో అర్థం కావడం లేదు. – షేక్.షాన్, సబ్రిజిస్ట్రార్ -
క్యాన్సర్ను జయించొచ్చు
తొలి దశలో గుర్తిస్తే మద్దిపాడు: క్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే ప్రతి ఒక్కరూ జయించవచ్చని ప్రముఖ సినీ నటి, లైఫ్ ఎగెయిన్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకురాలు గౌతమి అన్నారు. క్యాన్సర్పై అవగాహన కోసం మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో మంగళవారం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు, బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సకాలంలో పరీక్షలు, సత్వర వైద్యం, మనో ధైర్యంతో క్యాన్సర్ పై తాను విజయం సాధించాలని తెలిపారు. శరీరంలో ఏమాత్రం మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దని, పరీక్షలు చేయించుకోవడంలో సిగ్గు పడరాదని అన్నారు. వ్యాధులు ముందుగా గుర్తిస్తే ఆహారంలో మార్పుల తోపాటు వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం ద్వారా ఎన్నో రోగాలను అదుపు చేసుకోవచ్చని చెప్పారు. మహిళలకు క్యాన్సర్ పై అవగాహన పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సరైన అవగాహన, సత్వర వైద్యంతో క్యాన్సర్ను జయించవచ్చని రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. మూడు రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని గత ఏడాది నవంబర్ 14న ప్రక్రియ ప్రారంభించామన్నారు. క్యాన్సర్లలో 63 శాతం నివారించుకోవచ్చు అని, మిగతా 37 శాతం జన్యుపరమైన కారణాల వలన నివారణ కష్టం అన్నారు. ఏడుగుండ్లపాడు గ్రామంలో 329 మందికి స్క్రీనింగ్ చేయగా 11 క్యాన్సర్ అనుమానత కేసులను గుర్తించామని, వీటిలో పది నోటికి సంబంధించినవి కాగా, ఒకటి రొమ్ముకు సంబంధించిన కేసు అని ఆయన తెలిపారు. తన తల్లి, అక్కా క్యాన్సర్ కారణంగా మరణించారని చెప్పారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో 4,07,85,186 మంది 18 ఏళ్లు నిండిన ప్రజలు ఉన్నారని, వీరిలో 94,99,268 మందికి ఇప్పటి వరకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వీరిలో 37 వేలకు పైగా నోటి, 24 వేలకు పైగా రొమ్ము, 26 వేలకు పైగా గర్భాశయ ముఖ ద్వార అనుమానిత కేసులను గుర్తించామన్నారు. క్యాన్సర్ నివారణకు స్క్రీనింగ్ చేయించుకుంటామని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బీఎన్.విజయ్ కుమార్ , ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమ రాష్ట్ర నోడల్ ఆఫీసర్ కె.శ్యామల, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, డీఎంహెచ్వో టి.వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ సూరిబాబు, ఆర్.బీ.ఎస్.కె.డి.పి.ఎం. డాక్టర్ భగీరధి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహశీల్దార్ సుజన్ కుమార్, సర్పంచ్ శిల్ప సౌందర్య పాల్గొన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి ప్రముఖ సినీ నటి గౌతమి -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు సిటీ: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించమని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఒంగోలు, కొత్తపట్నం, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండలాల తహసీల్దార్లతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలు, వాటి కేటగిరిలు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలు, పురోగతిపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా సహేతుక పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీవో కె.లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. దాడికి పాల్పడిన నిందితులకు రిమాండ్ పీసీపల్లి: మండల పరిధిలోని మురుగమ్మిలో ఈనెల 13న పొలం వివాదంలో లెక్కల వెంగళరెడ్డి, శబరి కంటారెడ్డిలపై దాడికి పాల్పడిన వల్లెం రాజశేఖర్రెడ్డి, భార్య వల్లెం రాజ్యలక్ష్మిలను అరెస్టు చేశారు. వారిని జడ్జి ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించగా..ఒంగోలు జైలుకు తరలించినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. కేసు విచారణ సాగుతోందని, మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. -
ప్రకాశం
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. 7మిస్టరీగా మృతదేహాలు ఒంగోలు నగర పరిధిలో ఒకే రోజు ఇద్దరు యువకులు ఒకే తరహాలో అర్ధరాత్రి రోడ్డు పక్కన మృతిచెంది ఉండటం అనుమానాలకు తావిస్తోంది. – 8లో.. బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 202532/22గరిష్టం/కనిష్టం -
కుటుంబ సభ్యులే అంతమొందించారు
కంభం: కంభంలో సంచలనం రేపిన కదం శ్యాం ప్రసాద్ హత్య కేసులో కుటుంబ సభ్యులే పాత్రధారులని మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం కంభం పట్టణం జయప్రకాశ్ వీధిలోని ఇరిగేషన్ పంట కాల్వ గట్టు వెంబడి చిల్లచెట్ల మధ్య పసుపు రంగులో ఉన్న మూడు గోనె సంచులను పోలీసులు గుర్తించారు. అది కదం శ్యాంప్రసాద్(35) మృతదేహంగా నిర్ధారించుకుని విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యులే హత్య చేశారు కదం శ్యాంప్రసాద్ చెడు వ్యసనాలకు బానిసై పనికి వెళ్లకుండా, సంపాదన లేకుండా మద్యం సేవించి తిరుగుతుండేవాడు. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ గొడవపడేవాడు. గతంలో తన చిన్నమ్మలైన చిన్న వెంకుబాయి, పెద్ద వెంకుబాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించగా పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి మందలించారు. ఈనెల 8న తన తల్లితో అసభ్యకరంగా ప్రవర్తించగా అన్న సుబ్రమణ్యం, తమ్ముడు కాశీరావు తీవ్రంగా మందలించారు. 12వ తేదీ లారీ క్లీనర్గా కర్నూలు జిల్లా ఓర్వకళ్లుకు వెళ్లిన శ్యాం ప్రసాద్.. డ్రైవర్ ఉస్మాన్బాషాతో అక్కడ గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి, సోదరులు అక్కడికి వెళ్లి అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. 13వ తేదీన తల్లి లక్ష్మీదేవి, అన్న సుబ్రమణ్యం, తమ్ముడు కాశీరావు కలిసి శ్యాం ప్రసాద్ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. సుబ్రమణ్యం స్నేహితుడైన ఆటోడ్రైవర్ వల్లంశెట్టి మోహన్తో కలిసి అదే రోజు రాత్రి హత్య చేశారు. గొడ్డలి, కత్తితో 8 ముక్కలుగా నరికారు శ్యాంబాబును ఇంట్లో హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లేందుకు తోపుడు బండ్లు, ఇతర వాహనం కోసం ప్రయత్నించగా అవి దొరకలేదు. మృతదేహం వాసన వస్తే చుట్టుపక్కల వారికి తెలిసిపోతుందని భావించి నలుగురూ కలిసి గొడ్డలి, కత్తితో 8 ముక్కలుగా నరికారు. మూడు గోతాల్లో శరీర భాగాలను కుక్కి ఎవరూ లేని సమయంలో మోసుకెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న పంటకాల్వ వెంట పడేసి పరారయ్యారు. కాగా మంగళవారం నలుగురు నిందితులనూ పోలీసులు రిమాండ్కు తరలించారు. మీడియా సమావేశంలో సీఐ కె.మల్లికార్జున, ఎస్సై నరసింహారావు పాల్గొన్నారు. కంభంలో సంచలనం రేపిన యువకుడి హత్య కేసులో నిందితులు అరెస్టు ఆటో డ్రైవర్తోపాటు తల్లి, ఇద్దరు సోదరుల హస్తం కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు -
నేడు, రేపు తపాలా జీవిత బీమా మెగా మేళా
ఒంగోలు వన్టౌన్: తపాలా జీవిత బీమా మెగా మేళాను బుధ, గురువారాలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ప్రకాశం డివిజన్ ఒంగోలు ఎండీ జాఫర్ సాధిక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెయ్యి మందికి నూతనంగా తపాలా జీవిత బీమా కవరేజ్ అందించాలని లక్ష్యాలను నిర్దేశించినట్లు చెప్పారు. 1 కోటి రూపాయల ప్రీమియం సమీకరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోస్టాఫీసులో జీవిత బీమా వలన తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్లతో కూడిన పాలసీలను పొందవచ్చన్నారు. గ్రామీణ తపాల బీమాను గ్రామీణ ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితమైన పోస్టాఫీసు బీమా, ప్రస్తుతం పట్టభద్రులందరికీ డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ వారికి కుడా అందుబాటులోకి వచ్చిందన్నారు. -
మిస్టరీగా మృతదేహాలు
ఒంగోలు టౌన్: ఒకే రోజు ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ ఇద్దరు కూడా అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి సహజంగా జరిగిన రోడ్డు ప్రమాదాలేనా లేక ఎవరైనా కావాలని చేసిన హత్యలా అనేది మిస్టరీగా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే...సోమవారం అర్ధరాత్రి త్రోవగుంట గ్రామ పరిధిలోని గుంటూరు నెల్లూరు రోడ్డులో ఒక షోరూం ఎదురుగా రోడ్డు పక్కన 25 ఏళ్ల వయసు కలిగిన యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం వచ్చిందని తాలుకా పోలీసులు చెబుతున్నారు. ఈ యువకుడి ఒంటిపై షర్టు లేదు. బ్లూ రంగు జీన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. ముక్కుపై గాయాలు కావడంతో రక్తస్రావం అయినట్లు కనిపిస్తుంది. అదే రోజు మరో యువకుడు కూడా ఇదే తరహాలో మరణించాడు. అదివారం అర్ధరాత్రి నగరంలోని వెంగముక్కలపాలెం జంక్షన్ దగ్గరలో ఒక యువకుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఒంగోలు వైపు నుంచి వెళుతున్న కారు ఢీ కొనడంతో తల, నడుముకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆ యువకుడు మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇతడి ముక్కుపై కూడా గాయం అయి ఉండడం గమనార్హం. ముక్కు నుంచి రక్తం స్రవించిన గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు మరణాల గురించి నగరంలో చర్చ సాగుతోంది. 17వ తేది అర్ధరాత్రి కాస్త అటు ఇటుగా ఒకే సమయంలో ఒకే వయసు కలిగిన ఇద్దరు యువకులు ఒకే తరహాలో మృతి చెందడం అనుమానాలను రేకిత్తిస్తుంది. నిజంగానే ఈ యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారా లేక ఎక్కడైనా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది సందిగ్ధంగా మారింది. ప్రస్తుతానికి తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో కానీ నిజనిజాలు బయటపడవు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు గుర్తు తెలియని యువకుల మృతి అనుమానాలకు తావిస్తున్న మరణాలు ఒకే తరహాలో ముఖంపై గాయాలు మరణాల వెనక మిస్టరీ ఏంటని చర్చించుకుంటున్న ప్రజలు -
ప్రైవేటుకు రా బడి
● వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజులు పెంచేందుకు కార్పొరేట్ స్కూళ్ల సన్నద్ధం ● ప్రస్తుతం ఎల్కేజీకే ఫీజు రూ.30 వేలు వసూలు ● అదనంగా బుక్స్కి మరో రూ.6 వేలు వసూలు చేస్తున్న వైనం ● వచ్చే ఏడాది నుంచి ఫీజులో 15 శాతం నుంచి 40 శాతం పెంచేలా యాజమాన్యాలు ● ప్రభుత్వ విద్య అంటే పట్టని చంద్రబాబు ● జిల్లాలో 545 ప్రైవేట్ పాఠశాలలు.. ప్రభుత్వం చతికిల బడి..ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరిట అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. ఫీజులను భారీగా పెంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై భారం మోపనున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, డెవలప్మెంట్ ఛార్జీలు, పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. డిమాండ్ను బట్టి ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న ఫీజులకు అదనంగా 25 శాతం నుంచి 40 వరకూ పెంచేందుకు ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన కూటమి కూటమి ప్రభుత్వం సర్కార్ స్కూళ్లను పట్టించుకోవడం మానేసింది. నాడు–నేడు పనులను నిలిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా ఒక్క తరగతి గది కూడా నిర్మించలేదు. ఫలితంగా పలు స్కూళ్లలో సరిపడా గదుల్లేకి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు రక్షిత మంచినీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయడంలేదు. సరైన మౌలిక వసతుల్లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎన్నికల ముందు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ నీకు..రూ.15,000, నీకు రూ.15,000, నీకు రూ.15,000 అంటూ ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేశారు. ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ వాయిదాలు వేస్తూ వస్తోంది. వైఎస్సార్ హయాంలో నాలుగు విడతలు అమ్మఒడి కింద రూ.1357,83,15,000 తల్లుల ఖాతాలో జమచేసింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం చతికిలపడింది. ఒంగోలు సిటీ: ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అంతే లేకుండా పోతోంది. యాజమాన్యాలు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోంది. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు 551 ఉన్నాయి. వీటిల్లో 1,27,768 మంది విద్యార్థులు చదువుతున్నారు. 176 ప్రైమరీ స్కూళ్లలో 38,305 మంది విద్యార్థులు, 132 యూపీ స్కూల్స్లో 19,900 మంది, 237 హైస్కూల్స్లో 66,240 మంది, సీబీఎస్ఈ సిలబస్తో 4 హైస్కూల్స్లో 2,121 మంది, ఐసీఎస్ఈ సిలబస్ తో 2 హైస్కూల్స్లో 1,202 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఫీజుల భారం.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో తమ పిల్లల్ని చదివించాలంటే సామాన్య, మధ్య తగరతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కార్పొరేట్ స్కూళ్లకు ముకుతాడు వేశారు. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ గాడితప్పింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇస్టానుసారంగా ఫీజులు పెంచేశాయి. ఒంగోలు నగరంలోని కార్పొరేట్ స్కూలులో ఎల్కేజీకి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. హైస్కూలు అయితే 6వ తరగతి వరకూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ ఉన్నాయి. కొన్ని పెద్ద విద్యా సంస్థలైతే రూ.లక్షన్నర వరకూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రాంతాల వారీగా ఫీజులు నగరంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. మార్కాపురం, దర్శి, చీమకుర్తి, కనిగిరి, పొదిలి పట్టణాల్లో స్కూళ్లల్లో ఫీజులు ఒంగోలు నగరంలో మాదిరిగా ఉన్నాయి. మిగతా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఫీజుల వ్యత్యాసం స్వల్పం. ఇక పుస్తకాల పేరుతో అదనంగా రూ.6,500 నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ట్యాబ్ల పంపిణీ.. డిజిటల్ విద్యలో భాగంగా విద్యార్థులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసింది. బైజూస్, టోఫెల్ కంటెంట్తో 8 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు ట్యాబులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 21,617 మంది విద్యార్థుల్లో 20,436 మందికి ట్యాబ్లు పంపిణీ చేశారు. వైఎస్ జగన్ హయాంలో సర్కార్ స్కూళ్లకు వైభవం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సర్కార్ స్కూళ్లకు మహర్దశ పట్టింది. నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశారు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించారు. అలాగే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ను అమలు చేశారు. సరిగ్గా స్కూలు తెరిచే సమయానికి ముందు ‘‘జగనన్న విద్యా కానుక’’ కింద పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, షూస్, బెల్ట్, టైలు, ఇంగ్లిష్ డిక్షనరీలు అందజేశారు. అలాగే అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాలో రూ.15 వేలు జమ చేశారు. అలాగే డిజిటల్ విద్యను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు.ఫీజు నియంత్రణ చట్టం ఏది? ఫీజు నియంత్రణ చట్ట ప్రకారం నిర్ణయించిన ఫీజులను నోటీసు బోర్డులో బహిరంగంగా ప్రకటించాలి. దీనిని కార్పొరేట్ విద్యాసంస్థలు పాటించడం లేదు. పుస్తకాలు, దుస్తులు సైతం స్కూల్ లోనే కొనాలని నిబంధన పెట్టి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్ వంటి పేర్లను ఉపయోగించకూడదు. అయినా కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారు. – సీహెచ్ వినోద్, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
అర్జీలు సత్వరమే పరిష్కరించేలా చర్యలు
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 243 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క అర్జీ పై ప్రత్యేక శ్రద్ధపెట్టి వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలన్నారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలని, అలాగే వచ్చిన అర్జీలకు సరైన పరిష్కారం చూపుతూ రీ ఓపెన్ కేసులు రాకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో చినఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, పార్ధసారధి, వరకుమార్, విజయజ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనులను కాంట్రాక్టర్ లకు ఇవ్వకూడదన్న హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని జేసీకి వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు నన్నెబోయిన రవికుమార్ యాదవ్, బేస్తవారిపేట జెడ్పీటీసీ బండ్లమూడి వెంకటరాజు, రావిపాటి రమేష్రెడ్డి, మైనారిటీ నాయకులు నాసర్వలి, కాశీ విశ్వనాథ్, బోయపాటి రామకృష్ణ, ఏడుకొండలు వినతిపత్రం అందించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి ఒంగోలు టౌన్: రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల దినంలో ఐద్వా ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్పొరేట్ల అనుకూల విధానాల ఫలితంగానే దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, నిరుపేద మధ్యతరగతి ప్రజల జీవితాలపై పెనుభారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే దాని ప్రభావం కుటుంబంలో మహిళపైనే పడుతుందన్నారు. ఆదాయాలు, నిత్యావసర వస్తువుల ధరలకు పొంతన లేకుండా పోవడంతో ప్రజలు అర్ధాకలితో అలమటించే రోజులు దాపురించాయని చెప్పారు. దీంతో సరైన పోషకాహారం లేక మహిళలు, చిన్నారుల ఆరోగ్యం దెబ్బ తింటుందని, రక్తహీనత, గర్భకోశ వ్యాధులు, కాల్షియంతో ఎదుగుదల లోపాలతో అల్లాడిపోతున్నారన్నారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, కార్పొరేట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు బి.గోవిందమ్మ, నాయకురాళ్లు రాజేశ్వరి, పెద గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. -
జీబీఎస్ అంటువ్యాధి కాదు
● డీఎంహెచ్వో టి.వెంకటేశ్వర్లు కొమరోలు: జీబీఎస్ అంటు వ్యాధి కాదని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి టి.వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని అలసందలపల్లె గ్రామంలో జీబీఎస్ వైరస్తో కమలమ్మ ఆదివారం మృతువాత పడిన విషయం తెలిసిందే. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి టి.వెంకటేశ్వర్లు సోమవారం అలసందలపల్లె గ్రామాన్ని సందర్శించారు. కమలమ్మ ఇంటికి వెళ్లి కమలమ్మ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీబీఎస్ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకదని, ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి వ్యాపించదని తెలిపారు. కండరాల బలహీనత, జ్వరం, కాళ్లనొప్పులు, విరేచనాలు వంటివి ఉంటే సమీప ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించాలని, ఎక్కువ రోజులు ఆ వ్యాధులతో బాధపడుతూ ఉండవద్దని ప్రజలకు సూచించారు. దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్న వారికి తప్పించి జీబీఎస్ వైరస్ సోకితే నూటికి నూరు శాతం రికవరీ అవుతారని తెలిపారు. ప్రజల్లో ఉన్న భయాన్ని విడనాడేలా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఈ వైరస్ సోకుతుందన్నారు. రాజుపాలెం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రజియత్భాను సోమవారం కూడా గ్రామంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.పద్మావతి, ఎంపీడీవో మస్తాన్వలి, మండల విస్తరణాధికారి బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి రమణ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి
● ముస్లిం ప్రజా సంఘాల నిరసన ఒంగోలు వన్టౌన్: వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లిం ప్రజా సంఘాలు సోమవారం నిరసన వ్యక్తం చేశాయి. ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ సమీపంలోని మౌలానా అబుల్ కలాం అజాద్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వక్ఫ్ చట్టం సవరణపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నా చట్టాన్ని ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ఏపీ ప్రభుత్వం చట్టాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ముస్లింలకు పెద్దన్నగా ఉంటానని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ముస్లింల మనోభావాలను గౌరవించి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీలు ఓటింగ్లో పాల్గొనకుండా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం సమాజానికి అండగా నిలబడాలన్నారు. నిరసన కార్యక్రమంలో ముస్లిం సంఘాల ఐక్యవేదిక, ఆవాజ్, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి సమితి, ముస్లిం సంక్షేమ సంఘం తదితర సంఘాల నాయకులు పఠాన్ కరిమూల్లా ఖాన్, సయ్యద్ ఇస్మాయిల్, ఎస్కే మహ్మద్ రఫీ, సయ్యద్ హుస్సేన్, కరీముల్లా, ఎస్కె అమిర్, మహ్మద్ ఆషిక్, పఠాన్ మసూద్ ఖాన్, పఠాన్ రహమాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఏకేయూలో ఎంపీఈడీ పుస్తకావిష్కరణ ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.పి.ఎడ్) చేస్తున్న విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టరు ఐ.దేవీ వరప్రసాద్ రచించిన ‘అడ్వాన్సింగ్ ఫిజియాలజీ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్’ పుస్తకాన్ని వీసీ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పుస్తకం విద్యార్థులకు కోర్సు పరంగానే కాకుండా ఇతరత్రా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాఠ్యాంశాలను సులభశైలిలో అర్థం చేసుకొని విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు తయారు కావడానికి ఉపకరిస్తుందన్నారు. పుస్తక రచయిత దేవీవరప్రసాద్ వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యాపకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్రైవేటుకు రా బడి
● వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజులు పెంచేందుకు కార్పొరేట్ స్కూళ్ల సన్నద్ధం ● ప్రస్తుతం ఎల్కేజీకే ఫీజు రూ.30 వేలు వసూలు ● అదనంగా బుక్స్కి మరో రూ.6 వేలు వసూలు చేస్తున్న వైనం ● వచ్చే ఏడాది నుంచి ఫీజులో 15 శాతం నుంచి 40 శాతం పెంచేలా యాజమాన్యాలు ● ప్రభుత్వ విద్య అంటే పట్టని చంద్రబాబు ● జిల్లాలో 545 ప్రైవేట్ పాఠశాలలు.. ప్రభుత్వం చతికిల బడి..ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరిట అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. ఫీజులను భారీగా పెంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై భారం మోపనున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, డెవలప్మెంట్ ఛార్జీలు, పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. డిమాండ్ను బట్టి ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న ఫీజులకు అదనంగా 25 శాతం నుంచి 40 వరకూ పెంచేందుకు ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన కూటమి కూటమి ప్రభుత్వం సర్కార్ స్కూళ్లను పట్టించుకోవడం మానేసింది. నాడు–నేడు పనులను నిలిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా ఒక్క తరగతి గది కూడా నిర్మించలేదు. ఫలితంగా పలు స్కూళ్లలో సరిపడా గదుల్లేకి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు రక్షిత మంచినీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయడంలేదు. సరైన మౌలిక వసతుల్లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎన్నికల ముందు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ నీకు..రూ.15,000, నీకు రూ.15,000, నీకు రూ.15,000 అంటూ ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేశారు. ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ వాయిదాలు వేస్తూ వస్తోంది. వైఎస్సార్ హయాంలో నాలుగు విడతలు అమ్మఒడి కింద రూ.1357,83,15,000 తల్లుల ఖాతాలో జమచేసింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం చతికిలపడింది. ఒంగోలు సిటీ: ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అంతే లేకుండా పోతోంది. యాజమాన్యాలు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోంది. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు 551 ఉన్నాయి. వీటిల్లో 1,27,768 మంది విద్యార్థులు చదువుతున్నారు. 176 ప్రైమరీ స్కూళ్లలో 38,305 మంది విద్యార్థులు, 132 యూపీ స్కూల్స్లో 19,900 మంది, 237 హైస్కూల్స్లో 66,240 మంది, సీబీఎస్ఈ సిలబస్తో 4 హైస్కూల్స్లో 2,121 మంది, ఐసీఎస్ఈ సిలబస్ తో 2 హైస్కూల్స్లో 1,202 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఫీజుల భారం.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో తమ పిల్లల్ని చదివించాలంటే సామాన్య, మధ్య తగరతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కార్పొరేట్ స్కూళ్లకు ముకుతాడు వేశారు. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ గాడితప్పింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇస్టానుసారంగా ఫీజులు పెంచేశాయి. ఒంగోలు నగరంలోని కార్పొరేట్ స్కూలులో ఎల్కేజీకి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. హైస్కూలు అయితే 6వ తరగతి వరకూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ ఉన్నాయి. కొన్ని పెద్ద విద్యా సంస్థలైతే రూ.లక్షన్నర వరకూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రాంతాల వారీగా ఫీజులు నగరంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. మార్కాపురం, దర్శి, చీమకుర్తి, కనిగిరి, పొదిలి పట్టణాల్లో స్కూళ్లల్లో ఫీజులు ఒంగోలు నగరంలో మాదిరిగా ఉన్నాయి. మిగతా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఫీజుల వ్యత్యాసం స్వల్పం. ఇక పుస్తకాల పేరుతో అదనంగా రూ.6,500 నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ట్యాబ్ల పంపిణీ.. డిజిటల్ విద్యలో భాగంగా విద్యార్థులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసింది. బైజూస్, టోఫెల్ కంటెంట్తో 8 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు ట్యాబులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 21,617 మంది విద్యార్థుల్లో 20,436 మందికి ట్యాబ్లు పంపిణీ చేశారు. వైఎస్ జగన్ హయాంలో సర్కార్ స్కూళ్లకు వైభవం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సర్కార్ స్కూళ్లకు మహర్దశ పట్టింది. నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశారు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించారు. అలాగే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ను అమలు చేశారు. సరిగ్గా స్కూలు తెరిచే సమయానికి ముందు ‘‘జగనన్న విద్యా కానుక’’ కింద పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, షూస్, బెల్ట్, టైలు, ఇంగ్లిష్ డిక్షనరీలు అందజేశారు. అలాగే అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాలో రూ.15 వేలు జమ చేశారు. అలాగే డిజిటల్ విద్యను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు.ఫీజు నియంత్రణ చట్టం ఏది? ఫీజు నియంత్రణ చట్ట ప్రకారం నిర్ణయించిన ఫీజులను నోటీసు బోర్డులో బహిరంగంగా ప్రకటించాలి. దీనిని కార్పొరేట్ విద్యాసంస్థలు పాటించడం లేదు. పుస్తకాలు, దుస్తులు సైతం స్కూల్ లోనే కొనాలని నిబంధన పెట్టి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్ వంటి పేర్లను ఉపయోగించకూడదు. అయినా కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారు. – సీహెచ్ వినోద్, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం
● సిబ్బంది హామీతో తెరుచుకున్న వైనం మార్కాపురం: మండలంలోని పెద్ద నాగులవరం గ్రామ సచివాలయానికి అద్దె చెల్లించలేదని యజమాని బ్రహ్మయ్య సోమవారం తాళం వేశాడు. దీంతో సిబ్బంది కొంత సేపు బయటే వేచి ఉన్నారు. త్వరలోనే అద్దె చెల్లిస్తామని నచ్చజెప్పడంతో ఆయన తాళం తీశారు. ఐదు నెలలుగా సుమారు 13 వేల రూపాయల అద్దె చెల్లించకపోవడంతో బ్రహ్మయ్య తన ఇంట్లో ఉన్న సచివాలయానికి తాళం వేశారు. పంచాయతీ సెక్రటరీ ఎ.శ్రీనివాసులు అద్దె చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో తాళాలు తీసి ఉద్యోగులను అనుమతించారు. రెండు పొగాకు బ్యారన్లు దగ్ధం పొన్నలూరు: మండలంలోని వెంకుపాలెం గ్రామంలో మాదాల ప్రసాద్, బత్తిన కొండయ్య, పర్వతనేని రవికుమార్, పర్వతనేని వెంకట్రావుకు చెందిన రెండు పొగాకు బ్యారన్లు సోమవారం ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. పొగాకు క్యూరింగ్ చేస్తుండగా అల్లిక కర్ర జారి మొద్దుగొట్టంపై పడటంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. బ్యారన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోవడంతో రూ.8 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత రైతులు వాపోయారు. నేటి నుంచి జ్ఞానజ్యోతి శిక్షణ ఒంగోలు సిటీ: జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో 76 కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి 120 రోజుల పాటు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లకు నిర్వహించనున్నట్లు డీఈఓ అత్తోట కిరణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సమన్వయంతో ఆరు రోజుల పాటు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. డీఆర్పీల ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతుందని, సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు కోర్సు డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. శిక్షణను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెలిగొండకు రూ.2 వేల కోట్లు ఇవ్వాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కనిగిరి రూరల్(హనుమంతునిపాడు): పశ్చిమ ప్రాంత ప్రజల వర ప్రదాయిని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు తక్షణమే రూ.2 వేల కోట్లు నిధులు విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం కనిగిరి ఆర్డీఓ కార్యాలయం ముందు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సయ్యద్ యాసీన్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి పీసీపల్లి మండలాన్ని చేర్చాలని, కనిగిరి ప్రాంతంలోని రిజర్వాయర్లను అనుసంధానించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజ్ అందించాలన్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి కరువు ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కేశవర్థనరెడ్డికి వినతి ప్రతం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు జీపీ రామారావు, గుజ్జుల బాలిరెడ్డి, ఖాశిం పీరా, పందిటి మోహన్, మౌలాలి, పూర్ణచంద్రరావు, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసే వాతావరణం పోలీసు స్టేషన్లలో ఉండాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. మహిళలతో గౌరవంగా మాట్లాడినపుడే వారు తమ సమస్యలను ధైర్యంగా చెప్పడానికి అవకాశం ఉంటుందన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మహిళా ఎస్ఐలు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మహిళల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సత్వర పరిష్కారంపై పలు సూచనలిచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీసు స్టేషన్లోనూ ఉమెన్ హెల్ప్ డెస్క్ వద్ద ఒక హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల సమస్యలు సావధానంగా విని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. మహిళలపై నేరాలను అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసులుగా పరిగణించాలని, తగిన సాక్ష్యాలు సేకరించి న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్లను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, టౌన్ మహిళా ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, అనిత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: అంగన్వాడీ వర్కర్లకు గతంలో సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీలకు జీవోలివ్వాలని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పి.కల్పన డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలు ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని గతంలో 42 రోజులపాటు సమ్మె సందర్భంగా ఇచ్చిన మినిట్స్ కాపీలను జీవో రూపంలో ఇవ్వాలన్నారు. ఒంగోలు నగర కార్యదర్శి టి.మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అతి తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారన్నారు. 2019లో అంగన్వాడీ వర్కర్లకు ఆనాటి ధరలకు అనుగుణంగా వేతనం పెంచారన్నారు. నిత్యవసర ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా కార్మికులకు వేతనాలు పెంచడంలో ప్రభుత్వాలు మీనవేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు. అంగన్వాడీలకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని గ్రాడ్యూటీ అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్గా మార్పు చేయడంతోపాటు పెండింగ్లో ఉన్న డీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలన్నారు. అన్ని యాప్లు రద్దు చేసి ఒకే యాప్గా మార్పు చేయాలని, కేంద్రాలకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే కార్మిక సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు స్వామిరెడ్డి, యూనియన్ ఒంగోలు నగర ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, కె.ఎమియా, నాయకులు కే.వి.సుబ్బమ్మ, నిర్మల, పద్మ, శేషమ్మ, సంద్య, జ్యోతి, రాజేశ్వరి, శోభ, శ్రీదేవి, గౌసియా, కవిత తదితరులు పాల్గొన్నారు. సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీలకు జీవోలివ్వాలి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ -
తరచూ ప్రమాదాలు
మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అత్యధికంగా గిద్దలూరు–దిగువమెట్ట, గిద్దలూరు–బేస్తవారపేట, మార్కాపురం–కంభం, మార్కాపురం–దేవరాజుగట్టు, దేవరాజుగట్టు–కుంట, కుంట నుంచి త్రిపురాంతకం మధ్య ఉన్న నేషనల్ హైవేపై సర్వీసు రోడ్లు సరిగా లేకపోవడంతో టూ వీలర్స్పై వచ్చేవారు రోడ్డెక్కే సమయంలో తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా గిద్దలూరు నుంచి త్రిపురాంతకం మధ్య హైవేపై ప్రతి వారం ఒక మేజర్ రోడ్డు యాక్సిడెంట్ చోటుచేసుకుంటోంది. డివిజన్లో 15 బ్లాక్ స్పాట్స్ మార్కాపురం డివిజన్లో మొత్తం 15 బ్లాక్ స్పాట్స్ను అధికారులు గుర్తించారు. ఇందులో మార్కాపురం మండలం కుంట, పెద్దారవీడు మండలం కుంట, గొబ్బూరు, త్రిపురాంతకం, దరిమడుగు వై జంక్షన్, తిప్పాయపాలెం, జంగంగుంట్ల, బేస్తవారపేట క్రాస్రోడ్స్, గిద్దలూరు, తర్లుపాడు–తాడివారిపల్లి హైవే ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నా ఆశించిన ఫలితం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
ఒంగోలు టౌన్: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన జాతీయ రహదారిపై స్థానిక త్రోవగుంట సమీపంలో చోటుచేసుకుంది. ఒంగోలు తాలూకా పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని త్రోవగుంట వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఒక షోరూం ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు తాలూకా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని కాలు విరిగి, తలకు తీవ్ర గాయాలై ఉన్నాయి. మృతుడి వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుంది. 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. నీలిరంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ఏదైనా వాహనం ఢీకొనడం వలన చనిపోయి ఉండవచ్చని, వాహనం ఆగకుండా వెళ్లిపోయి గుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా వెళుతున్న వాహనం నుంచి కిందకు పడిపోయి కూడా ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత ఇక్కడకు తెచ్చి పడేసి ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్లోని మార్చురీకి తరలించారు. మృతుడి సమాచారం తెలిసిన వారు 9121102127, 9121104779 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఒంగోలు తాలూకా సీఐ అజయ్ కుమార్ తెలిపారు. -
అర్జీలు సత్వరమే పరిష్కరించేలా చర్యలు
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 243 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క అర్జీ పై ప్రత్యేక శ్రద్ధపెట్టి వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలన్నారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలని, అలాగే వచ్చిన అర్జీలకు సరైన పరిష్కారం చూపుతూ రీ ఓపెన్ కేసులు రాకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో చినఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, పార్ధసారధి, వరకుమార్, విజయజ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనులను కాంట్రాక్టర్ లకు ఇవ్వకూడదన్న హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని జేసీకి వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు నన్నెబోయిన రవికుమార్ యాదవ్, బేస్తవారిపేట జెడ్పీటీసీ బండ్లమూడి వెంకటరాజు, రావిపాటి రమేష్రెడ్డి, మైనారిటీ నాయకులు నాసర్వలి, కాశీ విశ్వనాథ్, బోయపాటి రామకృష్ణ, ఏడుకొండలు వినతిపత్రం అందించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి ఒంగోలు టౌన్: రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల దినంలో ఐద్వా ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్పొరేట్ల అనుకూల విధానాల ఫలితంగానే దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, నిరుపేద మధ్యతరగతి ప్రజల జీవితాలపై పెనుభారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే దాని ప్రభావం కుటుంబంలో మహిళపైనే పడుతుందన్నారు. ఆదాయాలు, నిత్యావసర వస్తువుల ధరలకు పొంతన లేకుండా పోవడంతో ప్రజలు అర్ధాకలితో అలమటించే రోజులు దాపురించాయని చెప్పారు. దీంతో సరైన పోషకాహారం లేక మహిళలు, చిన్నారుల ఆరోగ్యం దెబ్బ తింటుందని, రక్తహీనత, గర్భకోశ వ్యాధులు, కాల్షియంతో ఎదుగుదల లోపాలతో అల్లాడిపోతున్నారన్నారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, కార్పొరేట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు బి.గోవిందమ్మ, నాయకురాళ్లు రాజేశ్వరి, పెద గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనం గుంతలో పడి యువకుడు మృతి
సింగరాయకొండ: రోడ్డుపై ఉన్న గుంతలో పడి వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురై ద్విచక్ర వాహనదారుడు మృతిచెందిన సంఘటన మండలంలోని పాకల రోడ్డులో మర్రిచెరువు సమీపంలో జరిగింది. స్థానిక జీవీఆర్ ఆక్వా కంపెనీలో పనిచేస్తున్న వాయిల రాము (30) ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో పాకల క్రాంతినగర్లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి సింగరాయకొండ వస్తున్నారు. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న గుంతలో వాహనం పడి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో తలకు గాయాలై అక్కడికక్కడే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి.మహేంద్ర వివరించారు. రాము దహన సంస్కారాలను కంపెనీ నిర్వహిస్తుందని, వారి కుటుంబానికి అండగా ఉంటుందని జీవీఆర్ కంపెనీ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. రాముకు వివాహం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. -
c/o యమపురి
జాతీయ రహదారి మార్కాపురం: జాతీయ రహదారిపై ప్రయాణం సాఫీగా సాగిపోతుందని ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసినట్టే! పశ్చిమ ప్రకాశంలో పలు రహదారులు, మూలములుపులు ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. అనంతపురం–విజయవాడ నేషనల్ హైవేపై తరచూ సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు వందలాది కుటుంబాల్లో విషదాన్ని నింపాయి. నేషనల్ హైవే వెంట ఉన్న గ్రామాల వద్ద క్రాస్రోడ్లు, మూల మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, వాహనదారుల అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. క్షతగాత్రులై చావు అంచుల వరకు వెళ్లి వచ్చినవారు మృతులకు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. అనంతపురం–విజయవాడ నేషనల్ హైవే పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు సమీపం నుంచి మొదలై త్రిపురాంతకం వరకు విస్తరించి ఉంది. ఈ హైవే రోడ్డులో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 354 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 331 మంది మృత్యువాతపడ్డారు. ఆయా ప్రమాదాల్లో 685 మంది క్షతగాత్రులయ్యారు. -
బఫర్ గోడౌన్ను తనిఖీ చేసిన జేసీ
మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి గ్రామంలో ఓం శ్రీ భావనాసాయి వేర్హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బఫర్ గోడౌన్ను జేసీ గోపాలకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో ఉన్న స్టాక్ వివరాలను పరిశీలించారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించి అనుసంధానం చేయబడిన మిల్లులకు రవాణా చేయబడి క్లస్టర్ మిల్లింగ్ ద్వారా మిల్లింగ్ చేయబడిన ఫోర్టిఫైడ్ రైస్ నిల్వ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని గోడౌన్ సిబ్బందికి సూచించారు. ఇతర జిల్లాల నుంచి రవాణా చేయబడి బఫర్ గోడౌన్లో నిల్వ చేయబడి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మార్చి 2025 అలాట్మెంట్కు సిద్ధంగా ఉన్న బియ్యం వివరాలను పరిశీలించారు. ఈ బియ్యాన్ని జిల్లాలోని 10 మండల స్టాక్ పాయింట్లకు రవాణా చేయడానికి కావాల్సిన హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎగుమతి, దిగుమతి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టాక్ వివరాలను గోడౌన్ల వారీగా తెలుపుతూ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. బియ్యం గోతాల నుంచి కారిపోయిన బియ్యాన్ని కూడా సేకరించి శుభ్రపరిచి గోదాంలో భద్రపరచాలని సిబ్బందికి సూచించారు. ముందుగా కొలచనకోట గ్రామంలో జరుగుతున్న రీ సర్వేని జేసీ పరిశీలించారు. రెవెన్యూ సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. రీ సర్వే జరుగుతున్న క్రమంలో ప్రతి రైతుకూ నోటీసులిస్తున్నారా.. లేదా..? అనే అంశాలను పరిశీలించి సర్వే అసిస్టెంట్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రైతుకూ నోటీసులు అందించి వారి ఎదుటే సర్వే చేయాలని ఆదేశించారు. జేసీ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, మద్దిపాడు తహసీల్దార్ సుజన్కుమార్, జిల్లా సివిల్ సప్లయిస్ మేనేజర్ వరలక్ష్మి పాల్గొన్నారు. -
బెంగళూరులో కేసు నమోదైందంటూ మోసం
కూలీల కోసం ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సు ● ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు ఒంగోలు టౌన్: మీ మీద బెంగళూరులో కేసు నమోదైందని, అరెస్టు చేయకుండా బెయిల్ ఇవ్వాలంటే డబ్బు చెల్లించాలంటూ సీబీఐ పోలీసు అధికారులుగా నటిస్తూ వీడియో కాల్ చేశారని కనిగిరికి చెందిన ఒక బాధితుడు ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఫిర్యాదు చేశారు. తమ వద్ద నుంచి భారీగా డబ్బులు కూడా వసూలు చేశారని తెలిపారు. వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు తమను భయభ్రాంతులకు గురిచేశారని, తమ అకౌంటు నుంచి ఆర్టీజీఎస్, ఫోన్ పే ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని చెప్పారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. అదేవిధంగా రైల్వేలో ఉద్యోగం పేరుతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఒంగోలుకు చెందిన వ్యక్తి తమ వద్ద నుంచి డబ్బు వసూలు చేశాడని పల్నాడు జిల్లాకు చెందిన మరో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తీరా చూస్తే.. నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్లు తెలుసుకుని నిలదీయగా జవాబు ఇవ్వడంలేదన్నారు. తమ వద్ద నుంచి వసూలు చేసిన డబ్బు తిరిగివ్వమని అడుగుతుంటే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి 81 మంది బాధితులు ఎస్పీని కలిసి వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. డిజిటల్ అరెస్టుల పేరుతో ఫోన్ వస్తే పోలీసులకు తెలియజేయాలి... సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ దామోదర్ అన్నారు. మీ మీద కేసు నమోదైందని, డిజిటల్ అరెస్టు చేయకుండా ఉండాలంటే డబ్బు చెల్లించమని ఎవరికై నా ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డిజిటల్ అరెస్టుల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి భయాందోళనకు గురవకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. సీబీఐ, ఈడీ, కస్టమ్, ఏసీబీ అధికారుల మాదిరిగా నటిస్తూ వీడియో కాల్ చేయడంతో పాటు ముందుగా సేకరించిన వివరాలతో భయాందోళనకు గురిచేస్తున్నారని వివరించారు. అచ్చం పోలీసుల మాదిరిగా లోగోలు కనిపించేలా నటిస్తూ ప్రశ్నలు సంధిస్తారని, లక్షలు కాజేస్తున్నారని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎప్పుడూ లోకల్ పోలీసులను సంప్రదించకుండా ఎవరినీ అరెస్టులు చేయవని, కొత్త వ్యక్తుల నుంచి అనుమానాస్పద ఫోన్లను లిఫ్టు చేయకపోవడమే మంచిదని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 ఫోన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై షేక్ రజియా సుల్తానా, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపిక
సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణలో ఆదివారం ప్రకాశం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపిక నిర్వహించారు. బాలుర విభాగంలో ఆర్ కార్తికేయ, ఎం శివశంకర్, వీ వెంకటేశ్వర్లు రెడ్డి, డీ కౌశిక్బాబు, కే హర్షవర్దన్, బాలికల విభాగంలో బీ జాస్మియా, పీ జాహ్నవి, ఎల్ నిఖిత, బీ పద్మ, బీ కృప ఎంపికై నట్లు అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎన్టీ ప్రసాద్ తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికై న వారు ఈనెల 20, 27 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ కే శంకరరావు పాల్గొన్నారు. -
వాలీబాల్ విజేత ప్రకాశం
● పురుషుల, మహిళల విభాగాల్లో ప్రథమస్థానం ● ద్వితీయ స్థానంలో తూర్పుగోదావరి, విజయవాడ ఒంగోలు: మూడురోజుల పాటు ఉత్కంఠగా సాగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ కరవదిలో ఆదివారం ముగిసింది. పోటీల్లో ప్రకాశం జిల్లా క్రీడాకారులు పురుషుల విభాగం, మహిళల విభాగంలో రాణించి ప్రథమస్థానంలో నిలిచి ప్రకాశం క్రీడా పతాకాన్ని రెపరెపలాడించారు. ఫ్లడ్లైట్ల వెలుతురులో జరుగుతున్న పోటీలు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సాహభరితంగా, ఉత్కంఠగా సాగిన పోటీల్లో ప్రకాశం జట్టు పురుషుల విభాగంలోను, మహిళల విభాగంలోను పైచేయి కనబరిచి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో తూర్పుగోదావరి జట్టు ద్వితీయ స్థానంతో నిలిచింది. మహిళల విభాగంలో ఎంవీపీ ట్రస్టు విజయవాడ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో కృష్ణా, వైఎస్సార్ కడప జట్టు 3,4 స్థానాలలో నిలవగా, మహిళల విభాగంలో వైఎస్సార్ కడప జట్టు తృతీయస్థానంలో నిలిచింది. పోటీల అనంతరం విజేతలకు బహుమతులను ప్రముఖులు డాక్టర్ శంకరరావు, డాక్టర్ మల్లికార్జునరావు, పారిశ్రామిక వేత్త సుబ్బారెడ్డి, అడ్వకేట్ శిరిగిరి రంగారావు, బైబిల్ మిషన్ గుంటూరు గవర్నింగ్ బాడీ సభ్యులు ఆర్ఎంపీ కుమార్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు తదితరులు ప్రదానం చేశారు. -
అక్కడ బేరాల్లేవ్.. ఇక్కడ గిరాకీ ఫుల్..
గోదావరి జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు చికెన్ కిలో రూ.250 ఉండగా ప్రస్తుతం రూ.180కి తగ్గించినా కొనుగోళ్లు బాగా మందగించాయి. ఒంగోలులో చికెన్ దుకాణాలన్నీ కళ తప్పాయి. మరో పక్క మటన్, చేపలకు గిరాకీ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మటన్ అమ్మకాలు సాగాయి. చేపల ధరలను మాత్రం బాగానే పెంచి విక్రయించారు. బర్డ్ ఫ్లూకు ముందు కిలో మోయ చేపలను రూ.200 నుంచి రూ.250లకు విక్రయించగా.. ఇప్పుడు రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయించారు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని అన్నీ రకాల చేపలపై రూ.50 నుంచి రూ.100 అదనంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. –ఒంగోలు టౌన్