పట్టుబట్టి.. కొలువులు కొట్టి | - | Sakshi
Sakshi News home page

పట్టుబట్టి.. కొలువులు కొట్టి

Published Tue, Apr 1 2025 1:58 PM | Last Updated on Tue, Apr 1 2025 1:58 PM

పట్టుబట్టి.. కొలువులు కొట్టి

పట్టుబట్టి.. కొలువులు కొట్టి

పట్టణానికి చెందిన వెంకటేశ్‌కు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

దుబ్బాక: కలెక్టర్‌ అయ్యి పేద ప్రజలకు సేవా చేయాలన్నదే తన లక్ష్యమని దుబ్బాక పట్టణానికి చెందిన గ్రూపు 1 ర్యాంకర్‌ బైండ్ల వెంకటేష్‌ సోమవారం తెలిపారు. దుబ్బాకకు చెందిన రిటైర్డ్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బైండ్ల నారాయణ కుమారుడు వెంకటేశ్‌ గ్రూప్‌ 1 జనరల్‌ కేటగిరీలో 543 ర్యాంక్‌, ఎస్సీ కేటగిరీలో 31వ ర్యాంక్‌ సాధించాడు. ఇది వరకే గ్రూప్‌ 4లో ర్యాంక్‌ కొట్టి సంగారెడ్డి రెవెన్యూ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా గ్రూప్‌ 1 ఫలితాల్లో ర్యాంక్‌ సాధించడం విశేషం. తనకు ఆర్డీవో లేదా డీఎస్పీ ఉద్యోగం రావొచ్చని వెంకటేశ్‌ తెలిపారు. తన విజయంలో తల్లిదండ్రుల పాత్రనే కీలకమని, కలెక్టర్‌ కావడమే లక్ష్యమని చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement