సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి
దుబ్బాక: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సోమ వారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలన్నారు. హాస్టళ్ల నిర్వహ ణ కొరవడటం.. నాణ్యమైన భోజనం అందడటంలేదన్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవాలన్నారు. హబ్షీపూర్ గురుకులంలో 7 వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారన్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా విషయం బయటకు రానివ్వడంలేదన్నారు. ఏ హాస్టల్కు వెళ్లినా ఫుడ్పాయిజన్, సిబ్బంది సక్రమంగా ఉండక సౌకర్యాలు సరిగ్గా లేక అవస్థలు పడుతున్నారన్నారు.
విద్యార్థులు ఆత్మహత్యలకు
పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదు..
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment