జాన్‌ వెస్లీ అరెస్టు అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

జాన్‌ వెస్లీ అరెస్టు అప్రజాస్వామికం

Mar 28 2025 6:15 AM | Updated on Mar 28 2025 6:13 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి

సిద్దిపేటఅర్బన్‌: పభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ గ్రూపు యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని పోరాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు రంగారెడ్డి జిల్లా నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల క్రితం ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే ఆ స్థలాలను రామోజీ యాజమాన్యం ఆక్రమించి పట్టాలున్న పేదలను స్థలంలోకి రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం రామోజీ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాలస్వామి, శశిధర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement