
మిషన్ భగీరథ ఎస్ఈగా వెంకట్రెడ్డి
సిద్దిపేటజోన్: జిల్లా మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)గా వెంకట్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టర్ మనుచౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల ఎస్ఈ చారి పదవీ విరమణ పొందడంతో మహబూబ్నగర్ జిల్లా గ్రిడ్ ఈఈగా పనిచేసిన వెంకట్ రెడ్డి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు.
బాధ్యతలు స్వీకరించిన ఇన్చార్జ్ డీటీఓ
సిద్దిపేటరూరల్: జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన క్రిష్టఫర్ బుధవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీటీఓగా ఉన్న కొండల్రెడ్డి పదవీ విరమణ పొందారు. దీంతో గజ్వేల్ రవాణా శాఖ అధికారిగా కొనసాగుతున్న క్రిష్టఫర్ను ఇన్చార్జ్ డీటీఓగా ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
పథకాలు సద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
సిద్దిపేటజోన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అద నపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రం భారత్నగర్లోని 35 రేషన్షాప్లో ఆమె సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇక ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని, పేదలు ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తనూజ, తహసీల్దార్ సలీమ్ మియ్యా పాల్గొన్నారు.
కమ్యూనికేషన్
సీఐగా శ్యాంసుందర్
సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ కమ్యూనికేషన్ సీఐగా శ్యాంసుందర్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు శ్యాంసుందర్ సీపీ అనురాధను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని సీపీ సీఐకి సూచించారు.
ఆన్లైన్ మోసాలపై
అప్రమత్తత అవసరం
సిద్దిపేటకమాన్: ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్లు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహనతోపాటు, అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వాసుదేవరావు సూచించారు. సైబర్ జాగృక్ దివాస్ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాలపై బుధవారం వారు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్, మేసేజ్లకు ఎవరూ స్పందించకూడదని తెలిపారు. ఏటీఎం పిన్, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు ఇతరులకు తెలపకూడదని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్లకూడదన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ ఎస్ఈగా వెంకట్రెడ్డి

మిషన్ భగీరథ ఎస్ఈగా వెంకట్రెడ్డి