5 వికెట్లతో చెలరేగిన ఆకాష్‌.. ఇండియా ఎ లక్ష్యం 275 రన్స్‌ | India B 184 all out vs India A In Second Innings | Sakshi
Sakshi News home page

Duleep trophy: 5 వికెట్లతో చెలరేగిన ఆకాష్‌.. ఇండియా ఎ లక్ష్యం 275 రన్స్‌

Published Sun, Sep 8 2024 11:10 AM | Last Updated on Sun, Sep 8 2024 1:36 PM

India B 184 all out vs India A In Second Innings

దులీప్‌ ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా భార‌త్‌-ఎ జ‌ట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా బి జ‌ట్టు రెండో  ఇన్నింగ్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. 150/6తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బి జట్టు  అదనంగా కేవలం 34 పరుగులు మాత్రమే చేయగల్గింది. 

అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిని ఆధిక్యాన్ని కలపునకుని ఇండియా ఎ-జట్టు ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బి జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్‌(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సర్ఫరాజ్ ఖాన్‌(46) పరుగులతో రాణించాడు.

ఎ జట్టు బౌలర్లలో ఆకాష్ దీప్ 5 వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ 3, అవేష్‌, కొటియన్ తలా వికెట్ సాధించారు. కాగా ఇండియా బి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేయగా.. బారత బి జట్టు  231 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: AUS vs SCO: గ్రీన్ విధ్వంసం.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement