Duleep Trophy 2024
-
రోడ్డు ప్రమాదం.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్కు గాయాలు
భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ ప్రమాదం బారిన పడినట్లు సమాచారం. తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్తో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్లో వీరికి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముషీర్ మెడకు తీవ్రంగా గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సొంత తమ్ముడు ముషీర్ ఖాన్.అండర్-19 వరల్డ్కప్లో అదరగొట్టిఅండర్-19 వరల్డ్కప్ తాజా ఎడిషన్లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్.. ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 360 పరుగులతో యువ భారత జట్టు టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం తొమ్మిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లలోనే 716 పరుగులతో దుమ్ములేపాడు. దులిప్ ట్రోఫీ-2024లో శతక్కొట్టిఅంతేకాదు.. తన స్పిన్ బౌలింగ్తో ఎనిమిది వికెట్లు కూడా కూల్చాడు. ఈ ఏడాది రంజీల్లో ముంబై చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ.. దులిప్ ట్రోఫీ-2024లో ఆడే అవకాశం ఇచ్చింది. ఇండియా-బి తరఫున బరిలోకి దిగిన ముషీర్ అరంగేట్రంలోనే 181 పరుగులతో అదరగొట్టాడు. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న ఈ యువ క్రికెటర్ ఇరానీ కప్-2024 నేపథ్యంలో ముంబై జట్టుకు ఎంపికయ్యాడు.కాన్పూర్ నుంచి లక్నోకురంజీ చాంపియన్ ముంబై- రెస్టాఫ్ ఇండియా మధ్య లక్నో వేదికగా అక్టోబరు 1-5 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో తండ్రి నౌషద్ ఖాన్తో కలిసి ముషీర్ కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ముంబై నుంచి బయల్దేరకుండా ముషీర్ ఖాన్ తండ్రితో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపిందికాగా ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయమైందని.. కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇరానీ కప్తో పాటు.. రంజీ తాజా ఎడిషన్కు దూరం కానున్నట్లు సమాచారం. మరోవైపు.. సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
సాయి సుదర్శన్ పోరాటం వృధా.. దులీప్ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ
2024 దులీప్ ట్రోఫీని ఇండియా-ఏ జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మూడో రౌండ్ మ్యాచ్లో ఇండియా-ఏ.. ఇండియా-సిపై 132 పరుగుల తేడాతో గెలుపొంది, టైటిల్ చేజిక్కించుకుంది.350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. ప్రసిద్ద్ కృష్ణ (3/50), తనుశ్ కోటియన్ (3/47), ఆకిబ్ ఖాన్ (2/26), షమ్స్ ములానీ (1/46) ధాటికి 217 పరుగులకే కుప్పకూలింది. సాయి సుదర్శన్ సెంచరీతో (111) వీరోచితంగా పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతనికి జట్టులో ఎవ్వరి నుంచి సహకారం లభించలేదు. కెప్టెన్ రుతురాజ్ ఒక్కడు (44) కాస్త పర్వాలేదనించాడు. గుర్తింపు ఉన్న ఆటగాళ్లు రజత్ పాటిదార్ (7), ఇషాన్ కిషన్ (17), అభిషేక్ పోరెల్ (0) నిరాశపరిచారు.శాశ్వత్ సెంచరీఈ మ్యాచ్లో తొలుత తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ.. 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కగా.. ఆవేశ్ ఖాన్ అజేయ అర్ద సెంచరీతో (51) రాణించాడు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు తీశారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి.. 234 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరచగా.. అభిషేక్ పోరెల్ ఒక్కడే అర్ద సెంచరీతో (82) రాణించాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, ఆకిబ్ ఖాన్ తలో 3, షమ్స్ ములానీ 2, తనుశ్ కోటియన్ ఓ వికెట్ పడగొట్టారు.రాణించిన రియాన్63 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ..రియాన్ పరాగ్ (73), శాశ్వత్ రావత్ (53) అర్ద సెంచరీలతో రాణంచడంతో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కుషాగ్రా (42), మయాంక్ అగర్వాల్ (34), తనుశ్ కోటియన్ (26 నాటౌట్) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.That Winning Feeling! 🤗 India A captain Mayank Agarwal receives the coveted #DuleepTrophy 🏆 The celebrations begin 🎉@IDFCFIRSTBank Scorecard ▶️: https://t.co/QkxvrUmPs1 pic.twitter.com/BH9H6lJa8w— BCCI Domestic (@BCCIdomestic) September 22, 2024సాయి సుదర్శన్ పోరాటం వృధా350 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా-సి 217 పరుగులకే ఆలౌటై, 132 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సాయి సుదర్శన్ (111) ఒంటరి పోరాటం చేసి ఇండియా-సిని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.రన్నరప్గా నిలిచిన ఇండియా-సిమూడు రౌండ్ల మ్యాచ్లు ముగిశాక 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా-ఏ టైటిల్ గెలుచుకోగా.. 9 పాయింట్లు సాధించిన ఇండియా-సి రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం -
Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం
దులీప్ ట్రోఫీ 2024 ఎడిషన్లో ఇండియా-డి ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇండియా-బితో ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మ్యాచ్లో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.ఆరేసిన అర్షదీప్373 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-బి.. అర్షదీప్ సింగ్ (6/40), ఆదిథ్య థాకరే (4/59) ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. ఇండియా-బి ఇన్నింగ్స్లో నితీశ్ రెడ్డి (40 నాటౌట్), అభిమన్యు ఈశ్వరన్ (19), సూర్యకుమార్ యాదవ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.రికీ భుయ్ అజేయ శతకంరికీ భుయ్ అజేయ సెంచరీతో (119) కదం తొక్కడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 305 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (50), సంజూ శాంసన్ (45) రాణించారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, నవ్దీప్ సైనీ 3, మోహిత్ అవస్థి, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. ఆదుకున్న సుందర్అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో (116), వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87) రాణించడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులు చేయగలిగింది. ఇండియా-డి బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, అర్షదీప్ 3, ఆదిథ్య ఠాకరే 2 వికెట్లు తీశారు.సంజూ మెరుపు సెంచరీ.. పడిక్కల్, భరత్, భుయ్ అర్ద సెంచరీలుతొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 349 పరుగులు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగగా.. దేవ్దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవదీప్ సైనీ 5, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: బంగ్లాతో రెండు టెస్టు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ -
ఆవేశ్ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
అనంతపురంలో సూర్యకుమార్ యాదవ్.. 5 పరుగులకే అవుట్ (ఫొటోలు)
-
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. నిరాశపరిచిన స్కై, రుతు, ఇషాన్
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతపురం వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్లో ఈశ్వరన్ 116 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (39), రాహుల్ చాహర్ (0) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, ఆధిత్య థాకరే 2, సౌరభ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇండియా-డి తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 139 పరుగులు వెనుకపడి ఉంది.సూర్యకుమార్ యాదవ్ విఫలంఇండియా-బి ఇన్నింగ్స్లో ఈశ్వరన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఎన్ జగదీషన్ (13), సుయాశ్ ప్రభుదేశాయ్ (16), ముషీర్ ఖాన్ (5), నితీశ్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు.సంజూ మెరుపు సెంచరీసంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 349 పరుగులకు ఆలౌటైంది. దేవ్దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవ్దీప్ సైనీ ఐదు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్ కిషన్అనంతపురంలోనే జరుగుతున్న మరో మ్యాచ్లో (ఇండియా-ఏతో) ఇండియా-సి ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.రాణించిన అభిషేక్ పోరెల్ఇండియా-సి ఇన్నింగ్స్లో అభిషేక్ పోరెల్ (82) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. పుల్కిత్ నారంగ్ (35 నాటౌట్), విజయ్ కుమార్ వైశాఖ్ (14 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-ఏ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇండియా-సి ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకిబ్ ఖాన్ 3, షమ్స్ ములానీ 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.శాశ్వత్ రావత్ సెంచరీ.. హాఫ్ సెంచరీ చేసిన ఆవేశ్ ఖాన్శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులు చేసింది. ఆవేశ్ ఖాన్ (51 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. టెయిలెండర్లు షమ్స్ ములానీ (44), ప్రసిద్ద్ కృష్ణ (34) పర్వాలేదనిపించారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: IND VS BAN 1st Test: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
శాంసన్ సూపర్ సెంచరీ.. 12 ఫోర్లు, 3 సిక్స్లతో విధ్వంసం
దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ దేశీవాళీ టోర్నీలో ఇండియా-డికి ప్రాతినిథ్యం వహిస్తున్న శాంసన్.. అనంతపూర్ వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లో వన్డే క్రికెట్ను తలపిస్తూ మెరుపు శతకాన్ని సంజూ నమోదు చేశాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 94 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 101 బంతులు ఎదుర్కొన్న శాంసన్.. 12 ఫోర్లు, 3 సిక్స్లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. సంజూకు ఇది 11వ ఫస్ట్క్లాస్ క్రికెట్ సెంచరీ కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా-డి జట్టు తొలి ఇన్నింగ్స్లో 349 పరుగులకు ఆలౌటైంది. సంజూతో పాటు శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: IND vs BAN: జైశ్వాల్ వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే? -
DT 2024: శ్రేయస్ నీవు ఇక మారవా? మళ్లీ డకౌట్
దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా అనంతపూర్ వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో.. భారత్ ‘డి’ కెప్టెన్గా బరిలోకి దిగిన అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు.ఐదు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్లో నితీష్ కుమార్కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ పెవిలియన్కు చేరాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్ల్లో శ్రేయస్ ఒక్కసారి మాత్రమే అర్ధ శతకం సాధించాడు. ఓవరాల్గా 5 ఇన్నింగ్స్లో 20.80 సగటుతో కేవలం 105 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత టెస్టు జట్టులో అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడం ఇప్పటిలో కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో శ్రేయస్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. శ్రేయస్ నీవు ఇక మారవా? అంటూ పోస్టులు పెడుతున్నారు.చెలరేగిన సంజూ..ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ ‘డి’ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. భారత-డి ఇన్నింగ్స్లో అయ్యర్ మినహా మిగితా బ్యాటర్లందరూ తమ వంతు పాత్ర పోషించారు. శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అదే విధంగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ 89 పరుగులతో క్రీజులో ఉన్నాడు.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్ -
భారత్-సితో మ్యాచ్.. శాశ్వత్ రావత్ అజేయ సెంచరీ
సాక్షి, అనంతపురం: మిడిలార్డర్ ఆటగాడు శాశ్వత్ రావత్ (235 బంతుల్లో 122 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో భారత్ ‘సి’జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ‘ఎ’జట్టు 77 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారత్ ‘సి’జట్టు బౌలర్ల ధాటికి 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ ‘ఎ’జట్టును శాశ్వత్ రావత్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ప్రథమ్ సింగ్ (6), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (6), హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2), కుమార్ కుషాగ్ర (0) విఫలమయ్యారు. ఈ దశలో షమ్స్ ములానీ (76 బంతుల్లో 44; 5 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి శాశ్వత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. దులీప్ ట్రోఫీలో అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో ఆకట్టుకుంటున్న ఆల్రౌండర్ షమ్స్ ములానీ మరోసారి తన విలువ చాటుకున్నాడు. భారత్ ‘సి’జట్టు బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్లో 8 వికెట్లతో సత్తాచాటిన అన్షుల్... ఆరంభంలోనే పదునైన పేస్తో ప్రత్యర్థి టాపార్డర్ను కుప్పకూల్చాడు. జట్టు స్కోరులో సింహభాగం పరుగులు చేసిన శాశ్వత్ అజేయంగా నిలవగా... అతడితో పాటు అవేశ్ ఖాన్ (16 బ్యాటింగ్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) సాయి సుదర్శన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; మయాంక్ అగర్వాల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; తిలక్ వర్మ (రనౌట్) 5; రియాన్ పరాగ్ (సి) సాయి సుదర్శన్ (బి) విజయ్ కుమార్ వైశాఖ్ 2; శాశ్వత్ రావత్ (నాటౌట్) 122; కుమార్ కుషాగ్ర (సి) ఇషాన్ కిషన్ (బి) విజయ్ కుమార్ వైశాక్ 0; షమ్స్ ములానీ (సి) రజత్ పాటిదార్ (బి) గౌరవ్ యాదవ్ 44; తనుశ్ కొటియాన్ (సి) బాబా ఇంద్రజిత్ (బి) అన్షుల్ కంబోజ్ 10; అవేశ్ ఖాన్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు: 13, మొత్తం: (77 ఓవర్లలో 7 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–11; 2–14; 3–17; 4–35; 5–36; 6–123; 7–154, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 14–2–40–3; గౌరవ్ యాదవ్ 17–7–46–1; విజయ్కుమార్ వైశాఖ్ 15–1–33–2; పులి్కత్ నారంగ్ 21–0–58–0; మానవ్ సుతార్ 10–1–38–0. -
సెంచరీకి చేరువలో సంజూ.. భారీ స్కోర్ దిశగా భారత్-డి
దులీప్ ట్రోఫీ-2024లో అనంతపురం వేదికగా భారత్ ‘బి’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ‘డి’ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘డి’ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.వికెట్ కీపర్ సంజు సామ్సన్ (83 బంతుల్లో 89 బ్యాటింగ్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీలు చేశారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) కూడా రాణించాడు. అయితే ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్లో డకౌట్గా అయ్యర్ వెనుదిరిగాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన శ్రీకర్ భరత్, పడిక్కల్తో కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందివ్వగా.. రికీ భుయ్, సంజు సామ్సన్ దాన్ని కొనసాగించారు. భారత్ ‘బి’ బౌలర్లలో రాహుల్ చహర్ 3, ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సామ్సన్తో పాటు సారాంశ్ జైన్ (56 బంతుల్లో 26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్ -
టీమిండియా ప్లేయర్లు విఫలం.. 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇండియా-సి
దులీప్ ట్రోఫీ 2024లో ఇవాళ (సెప్టెంబర్ 19) మూడో రౌండ్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి మ్యాచ్లో ఇండియా-డి, ఇండియా-బి తలపడుతుండగా.. రెండో మ్యాచ్లో ఇండియా-ఏ, ఇండియా-సి జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్లు అనంతపురం ఆర్డీటీ స్టేడియమ్స్లో జరుగుతున్నాయి.టీమిండియా ప్లేయర్లు విఫలంఇండియా-సితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (6), తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో ఆ జట్టు 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి ఇండియా-ఏ స్కోర్ 67/5గా ఉంది. షాశ్వత్ రావత్ (20), షమ్స్ ములానీ (19) ఇండియా-ఏని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అర్ద సెంచరీల దిశగా పడిక్కల్, శ్రీకర్ భరత్ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-డి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్దత్ పడిక్కల్ (44), శ్రీకర్ భరత్ (46) అర్ద సెంచరీల దిశగా సాగుతున్నారు.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇండియా-సి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఏడు, ఇండియా-ఏ ఆరు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన ఇండియా-డి సున్నా పాయింట్లతో చిట్టచివరి స్థానంలో ఉంది. చదవండి: ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం -
సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దులిప్ ట్రోఫీ-2024 ఫైనల్ రౌండ్ మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇండియా-‘బి’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ స్థానాన్ని సూర్య భర్తీ చేయనున్నాడు. కాగా టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా ఈ ముంబై బ్యాటర్ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.గాయంతో ఎన్సీఏలో చేరిఈ క్రమంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో సూర్యకుమార్ భాగమయ్యాడు. ముంబై తరఫున ఈ రెడ్బాల్ టోర్నమెంట్ బరిలో దిగాడు. అయితే, బ్యాట్తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య.. ఫీల్డింగ్ సందర్భంగా గాయపడ్డాడు. అతడి బొటనవేలికి గాయం కావడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు చేరుకున్నాడు.అక్కడి బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న సూర్యకుమార్ పూర్తిగా కోలుకున్నాడని.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని ఎన్సీఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ ఆడేందుకు సూర్యకు మార్గం సుగమమైంది. ఇండియా- ‘బి’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. అనంతపురం చేరుకున్న సూర్యకాగా బంగ్లాదేశ్తో గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఇప్పటికే దులిప్ ట్రోఫీ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అనంతపురం వేదికగా గురువారం(సెప్టెంబరు 19) నుంచి ఇండియా-‘బి’- ఇండియా- ‘డి’ జట్టుతో తలపడనుంది. ఇందుకోసం 34 ఏళ్ల సూర్య ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. ఇక ఇప్పటి వరకు.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా-‘బి’ దులిప్ ట్రోఫీ-2024లో రెండు మ్యాచ్లు ఆడింది. ఇండియా-‘ఎ’పై గెలుపొందడంతో పాటు.. ఇండియా-‘సి’తో మ్యాచ్ను డ్రా చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది.తదుపరి బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లోకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ను రోహిత్ వారసుడిగా ప్రకటించింది. ఇక సూర్య కెప్టెన్సీలో భారత జట్టు 3-0తో శ్రీలంకను క్లీన్స్వీప్ చేసింది. ఇక దులిప్ ట్రోఫీ తర్వాత సూర్య బంగ్లాదేశ్తో స్వదేశంలో టీ20 సిరీస్కు సిద్ధం కానున్నాడు.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి.చదవండి: శ్రేయస్ అయ్యర్కు మరో బిగ్షాక్!? -
శ్రేయస్ అయ్యర్కు మరో బిగ్షాక్!?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? ఇప్పట్లో అతడు టెస్టు జట్టులో పునరాగమనం చేయడం కష్టమేనా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. స్వయంకృతాపరాధం, నిలకడలేమి ఫామ్ శ్రేయస్ టెస్టు భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మార్చినట్లు తెలుస్తోంది.సెంట్రల్ కాంట్రాక్టు పాయెఈ ఏడాది ఇంగ్లండ్తో స్వదేశంలో చివరగా టెస్టు సిరీస్లో పాల్గొన్నాడు శ్రేయస్ అయ్యర్. తొలి రెండు మ్యాచ్లలో కలిపి కేవలం 104(35, 13, 27, 29) పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఈ మిడిలార్డర్ బ్యాటర్పై వేటు పడింది. మిగిలిన మూడు టెస్టులకు అతడిని పక్కనపెట్టింది బీసీసీఐ. అనంతరం రంజీల్లో ఆడాలని ఆదేశించగా.. ఫిట్నెస్ కారణాలు చూపి శ్రేయస్ అయ్యర్ ఈ దేశవాళీ టోర్నీకి దూరంగా ఉన్నాడు.ఐపీఎల్తో జోష్అయితే, పూర్తి ఫిట్గా ఉన్నా బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశాడన్న కారణంతో బీసీసీఐ అతడిపై కొరడా ఝులింపించింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డందుకు గానూ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. దీంతో దిగొచ్చిన శ్రేయస్ అయ్యర్ రంజీల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా వ్యవహరించి.. జట్టును చాంపియన్గా నిలిపాడు.అంతలోనే విఫలంఈ క్రమంలో శ్రీలంక పర్యటన సందర్భంగా శ్రేయస్ అయ్యర్ వన్డే రీఎంట్రీకి బీసీసీఐ అనుమతినిచ్చింది. అయితే, టెస్టుల్లో చోటు లక్ష్యంగా దేశవాళీ రెడ్బాల్ టోర్నీల్లో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. విజయవంతం కాలేకపోతున్నాడు. తొలుత బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ముంబై తరఫున ఆడిన అతడు.. అక్కడ ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా- ‘డి’ కెప్టెన్గా ఎంపికయ్యాడు.ఈ టోర్నీ తొలి మ్యాచ్లో అయ్యర్ ఇప్పటి వరకు 9, 54 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఇప్పటికే అతడిని పక్కన పెట్టేశారు టీమిండియా సెలక్టర్లు. ఇక దులిప్ ట్రోఫీ రెండో మ్యాచ్లో( 0, 41)నూ అయ్యర్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్తో రెండో మ్యాచ్కు కూడా అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఎవరి స్థానంలో? ఎందుకు చోటివ్వాలి?అంతేకాదు.. స్వదేశంలో తదుపరి న్యూజిలాండ్తో.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లకు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి. ‘‘ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్కు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశమే లేదు. ఎవరి స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవాలంటారు? దులిప్ ట్రోఫీలో అతడి షాట్ సెలక్షన్లు కూడా ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా! వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవడం లేదు’’ అని సదరు వర్గాలు తెలిపాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా రోహిత్ సేన బంగ్లాదేశ్తో రెండు, న్యూజిలాండ్తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.చదవండి: బుమ్రా కాదు!.. అతడితో పోటీ అంటే మస్తు మజా: ఆసీస్ స్టార్ -
అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర.. అగ్రస్థానంలోకి ‘సి’ జట్టు
దులిప్ ట్రోఫీ-2024 సందర్భంగా ఇండియా-‘సి’ బౌలర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ రెడ్బాల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన పేసర్గా నిలిచాడు. ఇండియా-‘బి’తో మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు దేబాశీష్ మొహంతి (10/46) ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్.. తొలి రెండు రౌండ్లలో కలిపి జరిగిన నాలుగు మ్యాచ్లలో మూడింటిలో ఫలితం తేలగా మరో మ్యాచ్ మాత్రం పేలవమైన ‘డ్రా’గా ముగిసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతపురం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో ఇండియా-‘బి’, ఇండియా-‘సి’ జట్లు సమంగా నిలిచాయి. ఆట నాలుగో రోజు ఉదయం వరకు కూడా ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్నైట్ స్కోరు 309/7తో ఆట కొనసాగించిన ‘బి’ తమ తొలి ఇన్నింగ్స్లో 332 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కాంబోజ్ (8/69) ప్రత్యర్థిని పడగొట్టాడు.అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ‘సి’ తమ రెండో ఇన్నింగ్స్ను 37 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. మొదటి ఇన్నింగ్స్లో 193 పరుగుల ఆధిక్యం సాధించిన ‘సి’ టీమ్కు 3 పాయింట్లు, ‘బి’ టీమ్కు 1 పాయింట్ లభించాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఓవరాల్గా తొమ్మిది పాయింట్లతో ఇండియా-‘సి’ ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అర్ధ శతకంతో మెరిసిన రుతురాజ్ఆదివారం భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 7 ఓవర్లు సరిపోయాయి. తమ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడూ పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఖాతాలోకే వెళ్లగా... కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఏకంగా 193 పరుగుల ఆధిక్యం ఉండి కాస్త దూకుడుగా ఆడి విజయం కోసం సవాల్ విసిరే స్థితిలో ఉన్న ‘సి’ టీమ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సాయి సుదర్శన్ (11) విఫలం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (93 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్లోనూ అర్ధ సెంచరీ చేశాడు. రుతురాజ్, రజత్ పటిదార్ (84 బంతుల్లో 42; 5 ఫోర్లు) రెండో వికెట్కు 96 పరుగులు జత చేశారు.ఇండియా-‘బి’ వర్సెస్ ఇండియా-‘సి’ స్కోర్లుఇండియా-‘బి’- 332 ఇండియా-‘సి’- 525 & 128/4 డిక్లేర్డ్ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్రెండో రౌండ్ ముగిసిన దులిప్ ట్రోఫీ-2024 పాయింట్ల పట్టిక ఇలా..👉ఇండియా- ‘సి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 9👉ఇండియా- ‘బి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 7👉ఇండియా- ‘ఎ’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(0)-ఓడినవి(1)- పాయింట్లు 7👉ఇండియా- ‘డి’- 2(ఆడినవి)- గెలిచినవి(0)- డ్రా(0)- ఓడినవి(2)- పాయింట్లు 0.చదవండి: మూడు వందల వికెట్ల క్లబ్కు చేరువలో కుల్దీప్ -
అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు.. ఫోటోలు
-
రికీ భుయ్ సూపర్ సెంచరీ
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్లో ఇండియా-డి ఆటగాడు రికీ భుయ్ అద్బుతమైన సెంచరీ (195 బంతుల్లో 113; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఈ మ్యాచ్లో భుయ్ సెంచరీతో మెరిసినా ఇండియా-డికి ఓటమి తప్పలేదు. 488 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇండియా-డి 301 పరుగులకే ఆలౌటై, 186 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భుయ్కి జట్టులో ఏ ఒక్క ఆటగాడి నుంచి సహకారం లభించలేదు. సంజూ శాంసన్ (40), శ్రేయస్ అయ్యర్ (41), యశ్ దూబేలకు (37) మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.Ricky Bhui smashed a 4th innings century while chasing 488 in the Duleep Trophy.- Salute, Bhui...!!! 🙇♂️🫡pic.twitter.com/tLnPMvO15w— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2024ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు షమ్స్ ములానీ (89), తునశ్ కోటియన్ (53) అర్ద సెంచరీలు చేసి ఇండియా-ఏకు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. ఇండియా-డి బౌలర్లలో హర్షిత రాణా 4, విధ్వత్ కావేరప్ప, అర్ష్దీప్ సింగ్ తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే కుప్పకూలింది. ఖలీల్ అహ్మద్ (3/39), ఆకిబ్ ఖాన్ (3/41) ఇండియా-డి పతనాన్ని శాశించారు. ఇండియా-డి ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ (92) టాప్ స్కోరర్గా నిలిచాడు.107 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ప్రథమ్ సింగ్ (122), తిలక్ వర్మ (111 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. మయాంక్ అగర్వాల్ (56), షాశ్వత్ రావత్ (64 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.THE WINNING MOMENT FOR INDIA A.- Riyan Parag takes the final wicket, A thumping 186 runs win. 💯 pic.twitter.com/8JnlzIDtja— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2024భారీ లక్ష్య ఛేదనలో ఇండియా-డి పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం పెద్దది కావడంతో ఇండియా-డికి ఓటమి తప్పలేదు. రికీ భుయ్ వీరోచిత సెంచరీ కూడా ఇండియా-డిని కాపాడలేకపోయింది. ఇండియా-ఏ బౌలర్లలో తనుశ్ కోటియన్ 4, షమ్స్ ములానీ 3 వికెట్లు తీసి ఇండియా-డిని దెబ్బకొట్టారు. చదవండి: ఈశ్వరన్ సూపర్ సెంచరీ.. 332 పరుగులకు ఇండియా-సి ఆలౌట్ -
ఈశ్వరన్ సూపర్ సెంచరీ.. 332 పరుగులకు ఇండియా-సి ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2024లో అనంతపురం వేదికగా భారత-సి జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత-బి జట్టు తొలి ఇన్నింగ్స్లో 332 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 309/07తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ ‘బి’ జట్టు అదనంగా మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్ను ముగించింది. దీంతో భారత-సి జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 193 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాగా ఇండియా-బి బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 బ్యాటింగ్), జగదీశన్ మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఇండియా-సి బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 8 వికెట్లతో చెలరేగాడు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్-సి బ్యాటర్లలో ఇషాన్ కిషన్(111) సెంచరీతో చెలరేగా.. మానవ్ సుత్తార్(82), బాబా ఇంద్రజిత్(78) పరుగులతో రాణించారు.చదవండి: IND vs BAN: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను -
అనంతపురం : దులీప్ ట్రోఫీ అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం గ్యాలరీ (ఫొటోలు)
-
నువ్విక మారవా?.. ఇలా అయితే టెస్టుల్లో చోటు కష్టమే!
టీమిండియా యువ బ్యాటర్ రియాన్ పరాగ్ దులిప్ ట్రోఫీ-2024లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇన్నింగ్స్ను మెరుగ్గా ఆరంభిస్తున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. నిర్లక్ష్య ఆట తీరుతో వికెట్ పారేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా అసోంకు చెందిన ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ రెడ్బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.తొలి మ్యాచ్లో ఇలాతాజా ఎడిషన్లో భాగంగా ఇండియా-‘ఎ’ తొలుత బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో మ్యాచ్ ఆడింది. ఇందులో రియాన్ చేసిన స్కోర్లు 30, 31. ఇక ప్రస్తుతం అనంతపురంలో ఇండియా-‘ఎ’ తమ రెండో మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇండియా-‘డి’ జట్టుతో తలపడుతోంది. మ్యాచ్లో జట్టు పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం రియాన్ పరాగ్ ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు.వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడుతొలి ఇన్నింగ్స్లో 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేసిన రియాన్.. మంచి జోష్లో కనిపించాడు. అయితే, కాస్త ఆచితూచి ఆడాల్సిన చోట వేగం పెంచి వికెట్ సమర్పించుకున్నాడు. అర్ష్దీప్ బౌలింగ్లో దేవ్దత్ పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పాత కథే పునరావృతం చేశాడు.ఇండియా-‘ఎ’ శతక ధీరుడు, ఓపెనర్ ప్రథమ్ సింగ్(122) అవుట్కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు రియాన్ పరాగ్. తిలక్ వర్మ(111 నాటౌట్)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల మాదిరే దూకుడుగా ఆడి మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024భారీ స్కోర్లుగా మలచలేకపోయాడుఇండియా-‘డి’ స్పిన్నర్ సౌరభ్ కుమార్ బౌలింగ్లో వరుస బౌండరీలు బాది.. అతడి చేతికే చిక్కి పెవిలియన్ చేరాడు. 31 బంతుల్లో 20 పరుగుల వద్ద ఉండగా.. అనవసరపు షాట్కు పోయి సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఆదిత్య థాకరేకు సులువైన క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్కు మాత్రమే రియాన్ పనికివస్తాడు. సంప్రదాయ క్రికెట్లోనూ ప్రతీ బంతికి దూకుడు ప్రదర్శిస్తానంటే కుదరదు. నిజానికి.. బంగ్లాదేశ్తో సిరీస్కు ముందు తనను తాను నిరూపించుకునేందుకు రియాన్కు మంచి అవకాశం వచ్చింది. ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.టెస్టు జట్టులో చోటు దక్కాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి’’ అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఇండియా-‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇండియా-‘డి’కి 426 పరుగుల భారీ లక్ష్యం విధించింది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'20(31) Riyan parag gifted his wicket after settled#riya #parag #riyanparang #DuleepTrophy2024 #cricket #IPL2025 #ipl #test pic.twitter.com/lMGSUBQZna— mzk (@Zuhaib006) September 14, 2024 -
తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. వీడియో వైరల్
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ దులిప్ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. ఈ రెడ్బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇండియా-‘డి’తో జరుగుతున్న మ్యాచ్లో మూడో రోజు ఆటలో భాగంగా 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లో పది పరుగులేకాగా తిలక్ వర్మ... ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఈ హైదరాబాదీ బ్యాటర్.. దులిప్ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ఆడుతున్న తిలక్.. ఆ టీమ్ ఆడుతున్న రెండో మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు.అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో ఇండియా-‘డి’ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇండియా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తిలక్ కేవలం పది పరగులకే పరిమితం కాగా.. షామ్స్ ములానీ(89), తనుశ్ కొటియాన్(53) వల్ల ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.ప్రథమ్, తిలక్ శతకాలతోఅయితే, ఇండియా-‘ఎ’ బ్యాటర్లు రాణించలేకపోయినా.. బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఇండియా-‘డి’ని తొలి ఇన్నింగ్స్ 183 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో వందకు పైగా రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన.. ఇండియా-‘ఎ’ ఈసారి బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అర్ధ శతకం(56) సాధించాడు.ఇంకొక్క రోజే ఆట.. ఇన్నింగ్స్ డిక్లేర్అయితే, మయాంక్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో బ్యాటింగ్కు దిగిన తిలక్ వర్మ ఆది నుంచే అదరగొట్టాడు. 193 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతర బ్యాటర్లలో రియాన్ పరాగ్(20) విఫలం కాగా.. శశ్వత్ రావత్ 64 పరుగులతో తిలక్తో నాటౌట్గా నిలిచాడు. అయితే, ఆటకు మరొక్క రోజే మిగిలి ఉండటంతో ఇండియా-‘ఎ’ జట్టు 98 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉండగా.. తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియా-‘డి’తో పోలిస్తే 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.తిలక్ వర్మకు ఐదో సెంచరీఫస్ట్క్లాస్ క్రికెట్లో తిలక్ వర్మకు ఇదో ఐదో శతకం కావడం విశేషం. ఇప్పటి వరకు 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన తిలక్.. ఖాతాలో 1169కి పైగా పరుగులు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడి 68, 16 టీ20లలో కలిపి 336 పరుగులు చేశాడు ఈ హైదరాబాదీ బ్యాటర్.చదవండి: AUS vs ENG: చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలుCreativity & Placement 👌👌Tilak Varma has played a fine knock so far and put India A in a strong position 💪#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/9sMhdgAQ3Z— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
గిల్ ప్లేస్లో ఎంట్రీ.. కట్ చేస్తే మెరుపు సెంచరీ?
దులీప్ ట్రోఫీ-2024ను ఇండియా-డి టీమ్ ఓపెనర్ ప్రథమ్ సింగ్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా అనంతపూర్ వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్లో ప్రథమ్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్ స్ధానంలో భారత-ఎ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రథమ్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. లెఫ్ట్హ్యాండర్ అయిన ప్రథమ్ సింగ్ తన క్లాసిక్ షాట్లతో ఆలరించాడు. హర్షిత్ రానా, అర్ష్దీప్ సింగ్ వంటి బౌలర్లను సైతం టార్గెట్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 189 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఎవరీ ప్రథమ్ సింగ్ నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ ప్రథమ్ సింగ్?31 ఏళ్ల ప్రథమ్ సింగ్ ఆగస్టు 31, 1992లో ఢిల్లీలో జన్మించాడు. అతడు ఫస్ట్క్లాస్ క్రికెట్ రైల్వేస్కు ఆడుతున్నాడు. 2017లో మహారాష్ట్రపై ప్రథమ్ ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. సీనియర్ రైల్వేస్ జట్టు తరపున ఆడేమందు.. రైల్వేస్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 29 మ్యాచ్లు ఆడిన ప్రథమ్ సింగ్.. 35.63 సగటుతో 169 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇప్పటివరకు రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రథమ్ ఐపీఎల్లో కూడా భాగమయ్యాడు. 2017లో గుజరాత్ టైటాన్స్ తరపున క్యాష్రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.20లక్షల కనీస ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. 2024 సీజన్ ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్ జట్టులో ప్రథమ్ సభ్యుడిగా ఉన్నాడు. కానీ అతడికి కేకేఆర్ తరపున ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు.చదవండి: భారత మాజీ క్రికెటర్కు షాక్.. నెల రోజులకే హెడ్కోచ్ పోస్ట్ ఊస్ట్?Century for Pratham Singh 💯6⃣, 4⃣, 4⃣What a way to get your maiden Duleep Trophy hundred 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/EmmpwDJX1Q— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
భారత్ ‘సి’తో మ్యాచ్.. ఇండియా ‘బి’ దీటైన జవాబు
సాక్షి, అనంతపురం: టాపార్డర్, లోయర్ ఆర్డర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యాట్కు పని చెప్పడంతో... అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో పరుగుల వరద పారుతోంది. భారత్ ‘సి’తో జరుగుతున్న మ్యాచ్లో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘బి’ 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు సాధించింది. కెప్టెన్అభిమన్యు ఈశ్వరన్ (91 బంతుల్లో 51 బ్యాటింగ్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జగదీశన్ (126 బంతుల్లో 67 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్ ‘బి’ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 401 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 357/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘సి’ 124.1 ఓవర్లలో 525 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), స్పిన్ ఆల్రౌండర్ మానవ్ సుతార్ (156 బంతుల్లో 82; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. ఆఖర్లో అన్షుల్ కంబోజ్ (27 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ (బి) ముకేశ్ 58; సాయి సుదర్శన్ (సి) నవ్దీప్ సైనీ (బి) ముకేశ్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ 12; మానవ్ సుతార్ (బి) రాహుల్ చహర్ 82; మయాంక్ మార్కండే (బి) నితీశ్ కుమార్ రెడ్డి 17; అన్షుల్ (బి) రాహుల్ చహర్ 38; విజయ్ కుమార్ వైశాఖ్ (సి) ఈశ్వరన్ (బి) రాహుల్ చహర్ 12; సందీప్ వారియర్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు: 23; మొత్తం (124.1 ఓవర్లలో ఆలౌట్) 525. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345, 6–382, 7–406, 8–461, 9–489, 10–525, బౌలింగ్: ముకేశ్ కుమార్ 32–4–126–4; సైనీ 23–3–101–1; వాషింగ్టన్ సుందర్ 18–1–67–0; నితీశ్ కుమార్ రెడ్డి 17–2–69–1; సాయికిశోర్ 18–2–78–0; రాహుల్ చహర్ 16.1–2–73–4. భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (బ్యాటింగ్) 51; జగదీశన్ (బ్యాటింగ్) 67; ఎక్స్ట్రాలు: 6, మొత్తం: (36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 124. బౌలింగ్: సందీప్ వారియర్ 1.1–0– 8–0; విజయ్ వైశాఖ్ 10–2–29–0; అన్షుల్ 8.5–2–30–0; మయాంక్ మార్కండే 5–0–18–0; మానవ్ సుతార్ 10–0–34–0.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్పై ఇంగ్లండ్పై ఘన విజయం -
పడిక్కల్ పోరాటం
సాక్షి అనంతపురం: ఓపెనర్లు ప్రథమ్ సింగ్ (82 బంతుల్లో 59 బ్యాటింగ్), కెపె్టన్ మయాంక్ అగర్వాల్ (87 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ శతకాలు బాదడంతో భారత్ ‘డి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ‘ఎ’ 28.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఆరంభం నుంచి సాధికారికంగా ఆడిన ఈ జంట తొలి వికెట్కు 115 పరుగులు జోడించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగియడానికి ముందు భారత్ ‘డి’ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్లో మయాంక్ ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 288/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ మరో రెండు పరుగులు జోడించి 290 వద్ద ఆలౌటైంది. షమ్స్ ములానీ (187 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు మాత్రమే జత చేయగలిగాడు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా 4... విద్వత్ కావేరప్ప, అర్‡్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ‘డి’ 52.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (124 బంతుల్లో 92; 15 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అఖీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 107 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’... రెండో ఇన్నింగ్స్ స్కోరుతో కలుపుకొని ఓవరాల్గా 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. పడిక్కల్ ఒక్కడే... భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్లో మిడిలార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్ కాగా.. వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (5), అథర్వ (4), యశ్ దూబే (14), రికీ భుయ్ (23), సారాంశ్ జైన్ (8), విఫలమయ్యారు. ఒక ఎండ్లో పడిక్కల్ క్రీజులో పాతుకుపోగా... మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించేవారే కరువయ్యారు. సహచరులతో ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా... పడిక్కల్ మాత్రం జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సామ్సన్ మరోసారి అంచనాలు అందుకోలేకపోగా... మెరుగైన ఆరంభం దక్కించుకున్న ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్... ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో హర్షిత్ రాణా (29 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ ‘డి’183 పరుగులు చేయగలిగింది.స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 288 ఆలౌట్; భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 4; యశ్ దూబే (సి) కుశాగ్ర (బి) అఖీబ్ 14; శ్రేయస్ (సి) అఖీబ్ (బి) ఖలీల్ 0; పడిక్కల్ (సి) కుశాగ్ర (బి) ప్రసిధ్ కృష్ణ 92; సంజూ సామ్సన్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అఖీబ్ 5; రికీ భుయ్ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 23; సారాంశ్ (ఎల్బీ) తనుశ్ 8; సౌరభ్ (సి) శాశ్వత్ (బి) అఖీబ్ 1; హర్షిత్ రాణా (బి) ములానీ 31; అర్‡్షదీప్ (రనౌట్) 0; విద్వత్ కావేరప్ప (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు: 3, మొత్తం: (52.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–4, 2–6, 3–44, 4–52, 5–96, 6–122, 7–141, 8–154, 9–170, 10–183. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 8–0–39–3; ప్రసిధ్ కృష్ణ 11–4–30–1; అఖీబ్ ఖాన్ 12–2–41–3; తనుశ్ కొటియాన్ 12–5–22–1; షమ్స్ ములానీ 9.1–1–50–1. భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (బ్యాటింగ్) 59; మయాంక్ అగర్వాల్ (సి అండ్ బి) శ్రేయస్ అయ్యర్ 56; మొత్తం: (28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 115. వికెట్ల పతనం: 1–115, బౌలింగ్: హర్షిత్ రాణా 3–0–12–0; విద్వత్ కావేరప్ప 3–0–18–0; సౌరభ్ కుమార్ 11–1–46–0; అర్‡్షదీప్ సింగ్ 4–0–21–0; సారాంశ్ జైన్ 7–1–18–0; శ్రేయస్ అయ్యర్ 0.1–0–0–1. -
ఆర్డీటీ స్టేడియంలో దులిప్ ట్రోఫీ.. రెండో రోజు ఇలా(ఫొటోలు)
-
అప్పుడు డకౌట్.. ఇప్పుడు వికెట్! శ్రేయస్ సెలబ్రేషన్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరేళ్ల తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి వికెట్ తీశాడు. దులిప్ ట్రోఫీ-2024 ఎడిషన్లో ఇండియా-‘డి’ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. ఇండియా-‘ఎ’ తో మ్యాచ్లో ఈ మేర తన బౌలింగ్ నైపుణ్యాలు ప్రదర్శించాడు. భారత టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా అయ్యర్ ఈ రెడ్బాల్ టోర్నీ బరిలో దిగాడు.తొలి టెస్టులో స్థానం దక్కలేదుఇండియా-‘సి’తో జరిగిన తమ తొలి మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో సారథిగా ఓటమిని చవిచూశాడు. ఈ మ్యాచ్లో 39 బంతుల్లో అర్ధ శతకం సాధించినప్పటికీ.. బంగ్లాదేశ్తో టీమిండియా ఆడబోయే తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్కు స్థానం దక్కలేదు. దీంతో దులిప్ ట్రోఫీ జట్టుతోనే ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రస్తుతం ఇండియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతపురం వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా-‘డి’ కెప్టెన్శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇండియా-‘ఎ’ను తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది ఇండియా-‘డి’.దేవ్దత్ పడిక్కల్ 92కానీ బ్యాటింగ్ పరంగా మాత్రం రాణించలేకపోయింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా.. మరో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన దేవ్దత్ పడిక్కల్ 92 రన్స్తో అదరగొట్టగా.. రికీ భుయ్ 23, హర్షిత్ రాణా 31 పరుగులతో పర్వాలేదనిపించారు. వీరి కారణంగా ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులు చేయగలింది.స్వయంగా రంగంలోకి దిగిన కెప్టెన్ఈ క్రమంలో వందకు పైగా పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘ఎ’ జట్టుకు ఓపెనర్లు ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని జోరు మరింత పెంచారు. ఈ జోడీని విడగొట్టడం ఇండియా-‘డి’ బౌలర్ల తరం కాలేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ స్వయంగా రంగంలోకి దిగాడు.రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల అయ్యర్.. ఇండియా-‘ఎ’ ఇన్నింగ్స్ 29వ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ మయాంక్ అగర్వాల్(56)ను అవుట్ చేశాడు. ఊహించని రీతిలో రిటర్న్ క్యాచ్ అందుకుని మయాంక్కు షాకిచ్చాడు. ఆరేళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో వికెట్ తీయడం ఇదే తొలిసారి. అంతకు ముందు సౌరాష్ట్రతో 2018 నాటి మ్యాచ్లో అతడు వికెట్(చేతన్ సకారియా) పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసేసరికి.. ఇండియా-‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్లో 28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఇండియా-‘డి’పై 222 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్Golden Arm! 💪Shreyas Iyer comes into the attack. Shreyas Iyer strikes first ball 👌An excellent low catch off his own bowling, and he breaks the 115-run opening stand at the stroke of stumps. #DuleepTrophy | @IDFCFIRSTBankScorecard ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/c1nXJsN8QM— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024 -
విఫలమైన సంజూ శాంసన్.. సింగిల్ డిజిట్ స్కోర్
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ తనకు వచ్చిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దులిప్ ట్రోఫీ జట్టుకు తొలిసారిగా ఎంపికైన అతడు.. ఆరంభ మ్యాచ్లోనే బ్యాటర్గా విఫలమయ్యాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో కేరళ కెప్టెన్గా వ్యవహరిస్తున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్.. చాలాకాలం తర్వాత దేశీ రెడ్బాల్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు.వారు వెళ్లిపోవడంతోమరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడిన నేపథ్యంలో ఇండియా-‘డి’ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కానీ.. ఈ టీమ్ ఆడిన తొలి మ్యాచ్లో సంజూకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అయితే, బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లు దులిప్ ట్రోఫీ నుంచి వైదొలగడంతో సంజూ ఎంట్రీకి మార్గం సుగమమైంది.ఈ క్రమంలో ఇండియా-‘ఎ’తో అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో ఇండియా-‘డి’ తరఫున సంజూ బరిలోకి దిగాడు. టాస్ గెలిచిన ఇండియా-‘డి’ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. తొలి ఇన్నింగ్స్లో ఇండియా-‘ఎ’ను 290 పరుగులకు ఆలౌట్ చేసింది.క్యాచ్తో హైలైట్ఇండియా- ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా(4/51) నాలుగు వికెట్లతో చెలరేగగా.. విద్వత్ కవేరప్ప(2/30). అర్ష్దీప్ సింగ్(2/73) రెండేసి వికెట్లు తీశారు. మిగతా వాళ్లలో సారాంశ్ జైన్(1/55), సౌరభ్ కుమార్(1/65) ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక కవేరప్ప బౌలింగ్లో ఇండియా-‘ఎ’ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్ను సంజూ పట్టిన తీరు హైలైట్గా నిలిచింది.ఐదు పరుగులకే అవుట్అనంతరం ఇండియా-‘డి’ బ్యాటింగ్కు దిగగా.. రెండో రోజు ఆటలో భాగంగా సంజూ ఐదో స్థానంలో వచ్చాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు.. కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆకిబ్ ఖాన్ బౌలింగ్లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘సంజూ రెడ్బాల్ క్రికెట్కు పనికిరాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక దేవ్దత్ పడిక్కల్ 92 పరుగులతో రాణించడంతో.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులు చేయగలిగింది. ఫలితంగా వందకు పైగా పరుగుల ఆధిక్యంతో ఇండియా- ‘ఎ’ రెండో ఇన్నిం గ్స్ మొదలు పెట్టింది.చదవండి: Shreyas Iyer: సన్గ్లాసెస్తో బ్యాటింగ్..! కట్ చేస్తే డకౌటయ్యాడు(వీడియో)Pacers Khaleel Ahmed & Aaqib Khan have impressed so far for India A with 2⃣ wickets each!Watch 📽️ all the 4⃣ India D wickets to fall in the morning session on Day 2 🔽#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0HttaH pic.twitter.com/7GIOzLwpa5— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024 -
సన్గ్లాసెస్తో బ్యాటింగ్..! కట్ చేస్తే డకౌటయ్యాడు(వీడియో)
దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ టోర్నీలో ఇండియా డి జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. మరోసారి నిరాశపరిచాడు. ఇండియా-సితో జరిగిన తొలి మ్యాచ్లో సెకెండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించి టచ్లో కన్పించిన శ్రేయస్.. ఇప్పుడు రెండో మ్యాచ్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు.అనంతపూర్ వేదికగా ఇండియా-ఎతో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అయ్యర్ డకౌటయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై ఆటగాడు.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఖాతా తెరవకుండా పెవిలియన్కు చేరాడు. ఓ చెత్త షాట్ ఆడి మిడాన్లో అయ్యర్ దొరికిపోయాడు. ఈ మ్యాచ్లో అయ్యర్ కూలింగ్ అద్దాలు పెట్టుకుని మరి బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్లు ఆడిన శ్రేయస్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలన్న అయ్యర్ కల ఇప్పటిలో నేరవేరేలా కన్పించడం లేదు.మరోవైపు బీసీసీఐ అగ్రహానికి గురైన ఇషాన్ కిషన్ మాత్రం అదరగొడుతున్నాడు. ఇండియా-సి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్.. భారత్-బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో సైతం కిషన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.చదవండి: AFG vs NZ: అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి? Shreyas Iyer dismissed for a duck in Duleep Trophy 2024 pic.twitter.com/MXJb4IvkKW— Dev Sharma (@Devsharmahere) September 13, 2024 -
రీఎంట్రీ ఇచ్చిన రుతురాజ్
ఇండియా-బితో జరుగుతున్న రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతను ఇన్నింగ్స్ ఆరంభంలో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. సింగిల్ తీసే క్రమంలో రుతురాజ్ కాలి మడమ మెలిక తిరగడంతో పెవిలియన్కు చేరాడు. అయితే, సెంచరీ హీరో ఇషాన్ కిషన్ ఔటయ్యాక రుతురాజ్ తిరిగి క్రీజ్లోకి వచ్చాడు. ప్రస్తుతం అతను 46 పరుగులతో అజేయంగా ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రుతురాజ్తో పాటు మానవ్ సుతార్ (8) క్రీజ్లో ఉన్నాడు. ఇండియా-సి ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40, ఇషాన్ కిషన్ 111, బాబా ఇంద్రజిత్ 78, అభిషేక్ పోరెల్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, నవ్దీప్ సైనీ, రాహుల్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.ఇషాన్ సూపర్ సెంచరీఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు.ఆదుకున్న ములానీఇవాళే మొదలైన మరో మ్యాచ్లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53), ప్రసిద్ధ్ కృష్ణ (8) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (88), ఖలీల్ అహ్మద్ (15) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్దీప్ సింగ్, హర్షిత రాణా తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: ఇండియా-సికి బిగ్ షాక్.. రుతురాజ్కు గాయం -
సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్
ఇవాళ (సెప్టెంబర్ 12) మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్లో ఇండియా-సి ఆటగాడు ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో కదంతొక్కాడు.అనంతపురం వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ ఈ ఫీట్ను సాధించాడు. ఇషాన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. Ishan Kishan century moment in the Duleep Trophy! 🌟- A class return by Kishan. 👏pic.twitter.com/xRMbxt36jU— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ సూపర్ ఫామ్లో ఉండటం భారత సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే భారత జట్టులో వికెట్కీపర్ బ్యాటర్లుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ ఉన్నారు. బంగ్లాదేశ్తో సిరీస్కు భారత జట్టు ఎంపిక ఇదివరకే పూర్తైన నేపథ్యంలో ఇషాన్ టీమిండియా నుంచి పిలుపు కోసం మరికొంత కాలం పాటు వేచి ఉండాల్సిందే.మ్యాచ్ విషయానికొస్తే... ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-సి.. 63 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (103), బాబా ఇంద్రజిత్ (62) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-సి ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీలకు తలో వికెట్ దక్కింది.ఇదిలా ఉంటే, ఇవాళే మొదలైన మరో మ్యాచ్లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ 70 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (64), ప్రసిద్ధ్ కృష్ణ (2) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్దీప్ సింగ్ చెరో 2, హర్షిత రాణా, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. -
హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్..
దులీప్ ట్రోఫీ-2024ను భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో ఇండియా-సికి ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్.. అనంతపూర్ వేదకగా ఇండియా-బితో మ్యాచ్లో అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కిషన్ 40 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రజిత్ పాటిదార్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కిషన్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కిషన్ ప్రస్తుతం 52 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా బీసీసీఐ ఆదేశాలను దిక్కరించి వేటుకు గురైన కిషన్ మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ ఏడాది జరగనున్న దేశీవాళీ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే తమిళనాడు వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నీలో సత్తాచాటిన కిషన్.. ఇప్పుడు మరో దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా తన మార్క్ను చూపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 41 ఓవర్లకు ఇండియా-సి జట్టు 2 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.చదవండి: Vinesh Phogat: వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే? -
ఇండియా-సికి బిగ్ షాక్.. రుతురాజ్కు గాయం
దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అనంతపురం వేదికగా ఇండియా బితో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్, భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో గైక్వాడ్ సాయి సుదర్శన్తో కలిసి ఇన్నింగ్స్ను ఆరంభించేందుకు క్రీజులోకి వచ్చాడు. తొలి బంతికే ఫోర్ కొట్టి మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. కానీ రెండో బంతికే గాయపడి గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అయితే రుతురాజ్ గాయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఈ మ్యాచ్ టెలికాస్ట్ లేనందున అతడికి ఏమైందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఆదిలోనే గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరగడంతో ఇండియా-సి జట్టు బాధ్యతను పాటిదార్, సాయిసుదర్శన్ తమ భుజాలపై వేసుకున్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి ఇండియా-సి జట్టు తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. సుదర్శన్(39), రజిత్ పాటిదార్(35) పరుగులతో ఆజేయంగా ఉన్నారు.తుది జట్లుఇండియా సి: అభిషేక్ పోరెల్ (వికెట్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పటీదార్, అన్షుల్ కాంబోజ్, బాబా ఇంద్రజిత్, బి సాయి సుదర్శన్, మయాంక్ మార్కండే, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, వైషక్ విజయ్కుమార్, సందీప్ వారియర్ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, ముఖేష్ కుమార్, ముషీర్ అహ్మద్ ఖాన్, నారాయణ్ జగదీసన్ (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, రాహుల్ చాహర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రింకు సింగ్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్చదవండి: క్రికెట్ ఫ్యాన్స్కు పండగే.. ఒకే జట్టులో విరాట్ కోహ్లి, బాబర్ ఆజం? -
దులీప్ ట్రోఫీ.. శాంసన్, రింకూ ఎంట్రీ! తుది జట్లు ఇవే
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా రౌండ్-2 మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. అనంతపురం వేదికగా ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా-డి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తొలుత భారత్-ఎను బ్యాటింగ్ ఆహ్హనించాడు. డి జట్టులోకి సంజూ శాంసన్, సౌరభ్ కుమార్ రాగా.. ఎ జట్టులోకి తిలక్ వర్మ, విధ్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా వచ్చారు. దులీప్ ట్రోఫీలో భాగమైన చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు సన్నద్దమయ్యేందుకు వెళ్లడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.తుది జట్లుఇండియా D : అథర్వ తైదే, యశ్ దూబే, శ్రేయాస్ అయ్యర్ (సి), దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, సౌరభ్ కుమార్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, విధ్వత్ కావరప్పఇండియా A : ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్(కెప్టెన్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్, కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్బౌలింగ్ ఎంచుకున్న ఇండియా-బిఇక ఈ టోర్నీలో మరోవైపు అనంతపూర్లో బి స్టేడియంలో ఇండియా-బి, ఇండియా-సి జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్-బి టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత-బి జట్టులోకిఇండియా సి: అభిషేక్ పోరెల్ (వికెట్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పటీదార్, అన్షుల్ కాంబోజ్, బాబా ఇంద్రజిత్, బి సాయి సుదర్శన్, మయాంక్ మార్కండే, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, వైషక్ విజయ్కుమార్, సందీప్ వారియర్ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, ముఖేష్ కుమార్, ముషీర్ అహ్మద్ ఖాన్, నారాయణ్ జగదీసన్ (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, రాహుల్ చాహర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రింకు సింగ్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్భారత బి జట్టులోకి ముఖేష్ కుమార్, రింకూ సింగ్, జగదీసన్ రాగా, ఇండియా సి జట్టులోకి మయాంక్ మార్కండే, రజిత్ పాటిదార్ ఎంట్రీ ఇచ్చారు. -
రింకూ, శ్రేయస్, సుందర్లపై దృష్టి
సాక్షి, అనంతపురం: దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో నేడు రెండో దశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యచ్ల్లో భారత్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘డి’... భారత్ ‘బి’ జట్టుతో భారత్ ‘సి’ తలపడనున్నాయి. తొలి రౌండ్ మ్యాచ్ల్లో భారత్ ‘బి’, ‘సి’ జట్లు విజయాలు సాధించాయి. ఈ నెల 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ మినహా టీమిండియా ప్లేయర్లెవరూ రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో పాల్గొనడం లేదు. తొలి మ్యాచ్లో ఆడిన శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్... తమతమ జట్లను వీడి టీమిండియాతో జట్టు కట్టారు. దీంతో భారత్ ‘సి’ జట్టులో మినహా మిగిలిన టీమ్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ‘ఎ’ జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహించనుండగా.. ‘బి’ టీమ్కు అభిమన్యు ఈశ్వరన్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. ‘సి’ టీమ్కు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నారు. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో దేశవాళీల్లో నిలకడ కొనసాగిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్లు మంచి అవకాశం కానున్నాయి. రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి వాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు. గత మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టుకు సారథిగా వ్యవహరించిన శుబ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్కు జట్టు పగ్గాలు దక్కాయి. రెండేళ్ల క్రితం జాతీయ జట్టు తరఫున చివరి టెస్టు ఆడిన మయాంక్ తిరిగి సెలెక్టర్ల దృష్టిలో పడాలంటే భారీగా పరుగులు చేయాల్సిన అవసరముంది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు కోసమే భారత జట్టును ఎంపిక చేయగా... దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేస్తే బంగ్లాతో రెండో టెస్టు కోసం ప్రకటించనున్న జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో తొలి టెస్టు కోసం ప్రకటించిన టీమిండియాలో సభ్యుడైన సర్ఫరాజ్... ఈ మ్యాచ్ అనంతరం నేరుగా చెన్నైలో జట్టుతో చేరనున్నాడు. భారత్ ‘బి’ జట్టు తరఫున బరిలోకి దిగనున్న సర్ఫరాజ్ ఖాన్... మరో మంచి ఇన్నింగ్స్తో రాణించి టీమిండియాలో చేరాలనుకుంటున్నాడు. ఇక గత మ్యాచ్లో భారీ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నాడు. అటు బ్యాట్తో ఇటు బంతితో సత్తాచాటగల స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన రజత్ పాటిదార్తో పాటు శ్రేయస్ అయ్యర్ తిరిగి సత్తాచాటి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు. గత మ్యాచ్ ప్లెయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకోలేకపోయిన దేవదత్ పడిక్కల్, సంజూ సామ్సన్ భారత్ ‘డి’ జట్టు తరఫున ఈ మ్యాచ్లోనైనా అవకాశం దక్కించుకుంటారా చూడాలి. ఇక పేస్ బౌలర్లు ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సుదీర్ఘ టెస్టు సీజన్కు ముందు లయ అందుకునేందుకు ఇది చక్కటి అవకాశం. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడనుండగా... పేస్ బౌలర్లకు విరివిగా అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో రాణించిన వారిపై సెలెక్టర్ల దృష్టి ఉండనుంది. ఇక గత మ్యాచ్లో ఎనిమిది వికెట్లతో సత్తాచాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.దులీప్ ట్రోఫీలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లుతిలక్ వర్మ (భారత్ ‘ఎ’) షేక్ రషీద్ (భారత్ ‘ఎ’) నితీశ్ కుమార్ రెడ్డి (భారత్ ‘బి’) రికీ భుయ్ (భారత్ ‘డి’) శ్రీకర్ భరత్ (భారత్ ‘డి’) -
DT: జట్లలో మార్పులు.. బంగ్లాతో టెస్టులో సర్ఫరాజ్కు నో ఛాన్స్!
Duleep Trophy second round 2024: దులీప్ ట్రోఫీలో రెండో దశ మ్యాచ్ల కోసం భారత్ ‘ఎ’, ‘బి’, ‘డి’ జట్లలో పలు మార్పులు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. బంగ్లాదేశ్తో తొలి టెస్టు కోసం ఎంపికైన ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ సెలక్టర్లు ఈ మేరకు కొత్త ప్లేయర్ల పేర్లను ప్రకటించారు. టీమిండియాకు ఎంపికైన వారిలో ఒక్క సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే దులీప్ ట్రోఫీ మ్యాచ్ కోసం అందుబాటులో ఉండగా... శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్ మాత్రం తమ జట్లను వీడారు.‘బి’ టీమ్లో రింకూ సింగ్ఇక కొత్తగా ప్రకటించిన ‘ఎ’ జట్టులో ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్కు చోటు దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన 19 ఏళ్ల రషీద్ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఉన్నాడు. అదే విధంగా.. 2022లో అండర్–19 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత జట్టులోనూ రషీద్ కీలక సభ్యుడు. ఇదిలా ఉంటే... రషీద్తో పాటు ప్రథమ్ సింగ్, అక్షయ్ వాడ్కర్, షమ్స్ ములాలీ, ఆకిబ్ ఖాన్ ‘ఎ’ టీమ్లోకి ఎంపికయ్యారు.ఇక ‘ఎ’ జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ‘బి’ టీమ్లో రింకూ సింగ్, సుయశ్ ప్రభుదేశాయ్, హిమాన్షు మంత్రి ఎంపికవ్వగా...సర్ఫరాజ్ ఖాన్ టీమ్తో కొనసాగుతాడు. ఇండియా ‘సి’ టీమ్లో ఎలాంటి మార్పులు జరగలేదు కానీ ‘డి’ జట్టులో నిశాంత్ సంధు ఎంపికయ్యాడు.అనంతపురంలోనేగత మ్యాచ్లో ‘డి’ టీమ్లో ఉండి గాయపడిన తుషార్ దేశ్పాండే స్థానంలో విద్వత్ కావేరప్పను తీసుకున్నారు. కావేరప్ప గత మ్యాచ్ ‘ఎ’ టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో భాగంగా ‘ఎ’, ‘డి’ మధ్య...‘బి’, ‘సి’ మధ్య రెండు మ్యాచ్లు అనంతపురంలోనే జరుగుతాయి. ఈ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా...భారత జట్టు సభ్యులకు ఈ నెల 12 నుంచి బెంగళూరులో సన్నాహక శిబిరం మొదలవుతుంది. ఇండియా-‘ఎ’ (అప్డేటెడ్)మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుమార్ కుశాగ్రా, అక్షయ్ వాడ్కర్, శస్వత్ రావత్, ప్రథమ్ సింగ్, తనూష్ కొటియాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, ఎస్కే రషీద్, షంస్ ములానీ, ఆఖిబ్ ఖాన్ఇండియా-బి(అప్డేటెడ్)అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థిఇండియా-సి(మార్పులు లేవు)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డి(అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, దేవ్దత్ పడిక్కల్, రికీ భుయ్, శరణ్ష్ జైన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విద్వత్ కావేరప్ప, హర్షిత్ రాణా, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్. -
పంత్, జైస్వాల్ స్థానాలను భర్తీ చేసేది వీరే..!
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఎంపిక జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత ఆటగా శిక్షణా శిబిరం సెప్టెంబర్ 12న నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టుకు ఎంపికైన మెజార్టీ శాతం ఆటగాళ్లు ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నారు. వీరి స్థానాలను బీసీసీఐ వేరే ఆటగాళ్లతో భర్తీ చేసింది.శుభ్మన్, కుల్దీప్ ప్రత్యామ్నాయాలు వీరే..!ఇండియా-ఏ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్ టీమిండియాకు ఎంపిక కాగా.. వీరి స్థానాలను ప్రథమ్ సింగ్, అక్షయ్ వాద్కర్, షేక్ రషీద్, షమ్స్ ములానీ భరీ చేయనున్నారు. సీమర్ విధ్వత్ కావేరప్ప ఇండియా-ఏ నుంచి ఇండియా-డికి బదిలీ కానున్నాడు. గిల్ స్థానంలో ఇండియా-ఏ కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ వ్యవహరించనున్నాడు.పంత్, జైస్వాల్ స్థానాలను భర్తీ చేసేది వీరే..!ఇండియా-బి విషయానికొస్తే.. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాల్ టీమిండియాకు ఎంపికయ్యారు. వీరి స్థానాల్లో సుయాశ్ ప్రభుదేశాయ్, హిమాన్షు మంత్రి, రింకూ సింగ్ ఇండియా-బిలో చేరతారు. ఇండియా-బి నుంచి సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాకు ఎంపికైనప్పటికీ.. అతను దులీప్ ట్రోఫీ రెండో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ బంగ్లాతో తొలి టెస్ట్కు మూడు రోజుల ముందు ముగుస్తుంది.ఇండియా-సి విషయానికొస్తే.. ఈ జట్టు నుంచి ఎవరూ టీమిండియాకు ఎంపిక కాలేదు. కాబట్టి ఈ జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు.ఇండియా-డి నుంచి అక్షర్ పటేల్ టీమిండియాకు ఎంపిక కాగా.. అతని స్థానాన్ని విధ్వత్ కావేరప్ప భర్తీ చేయనున్నాడు. ఇండియా-డి ఆటగాడు తుషార్ దేశ్పాండే గాయపడగా.. అతని స్థానంలో నిషాంత్ సంధు జట్టులోకి వచ్చాడు.కాగా, దులీప్ ట్రోఫీ సెకెండ్ రౌండ్ మ్యాచ్లు సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు జరుగనుండగా.. టీమిండియా, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి మొదలవుతుంది. -
Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త
టీమిండియాకు శుభవార్త!!... టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో సిరీస్ నాటికి అతడు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన అనంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.రెడ్బాల్ క్రికెట్పై దృష్టిఈ క్రమంలో శ్రీలంక పర్యటన సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ను టీ20 కెప్టెన్గా ప్రకటించింది బీసీసీఐ. పూర్తిస్థాయి సారథిగా తొలి సిరీస్లోనే భారత్కు ఈ ముంబై బ్యాటర్ క్లీన్స్వీప్(3-0) విజయం అందించాడు. అనంతరం టీమిండియాకు సుదీర్ఘ విరామం లభించగా.. టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా ‘స్కై’ రెడ్బాల్ క్రికెట్పై దృష్టి సారించాడు.గాయం బారిన పడిన సూర్యఈ క్రమంలో ముంబై తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ బరిలో దిగాడు. అయితే, ఈ టోర్నీలో ఒకే మ్యాచ్లో పాల్గొన్న సూర్య.. పరుగులు రాబట్టలేకపోయాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడి కుడిచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో ఆ టోర్నీతో పాటు దులిప్ ట్రోఫీ-2024 తొలి రౌండ్కు కూడా సూర్య దూరమయ్యాడు.సూర్య వేగంగా కోలుకుంటున్నాడుతిరిగి ఫిట్నెస్ సాధించేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరాడు సూర్య. ఈ క్రమంలో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఈ టీ20 ప్రపంచ రెండో నంబర్ బ్యాటర్.. గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. ఎన్సీఏ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయని హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘సూర్య వేగంగా కోలుకుంటున్నాడు. అతడు 100 శాతం ఫిట్నెస్ సాధించినట్లే’’ అని తెలిపినట్లు పేర్కొంది.టీమిండియాకు భారీ ఊరటఈ నేపథ్యంలో 33 ఏళ్ల సూర్య దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇండియా-సి జట్టులో ఉన్న అతడు సెప్టెంబరు 12 నుంచి అనంతపురం వేదికగా జరుగనున్న మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ కోలుకోవడం టీమిండియాకు శుభసూచకం. స్వదేశంలో అక్టోబరు 6 నుంచి బంగ్లాదేశ్తో మొదలయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సూర్య అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరగవుతాయి. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కంటే ముందు టీమిండియా బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. సెప్టెంబరు 19 నుంచి ఈ మ్యాచ్లు మొదలుకానున్నాయి.చదవండి: Afg vs NZ: ‘చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము’ -
DT 2024: గిల్ స్థానంలో కెప్టెన్గా కర్ణాటక బ్యాటర్
దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘ఎ’ జట్టు కెప్టెన్గా మయాంక్ అగర్వాల్గా ఎంపికయ్యాడు. శుబ్మన్ గిల్ స్థానంలో అతడికి ఈ జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ రెడ్బాల్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లలో ఇండియా-‘ఎ’ జట్టుకు మయాంక్ సారథ్యం వహించనున్నట్లు తెలిపింది.కాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఇండియా-‘ఎ’ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. అయితే, ఇటు సారథిగా.. అటు బ్యాటర్గా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.టీమిండియాలోకి గిల్బెంగళూరు వేదికగా ఇండియా-‘బి’తో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం 46 పరుగులు చేసిన గిల్.. జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. ఇండియా-‘బి’ చేతిలో ఇండియా-‘ఎ’ జట్టు 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో టీమిండియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు సంబంధించిన జట్టును బీసీసీఐ ఆదివారమే ప్రకటించింది. ఇందులో గిల్కు చోటు దక్కింది. ఈ క్రమంలో అతడు ఇండియా-‘ఎ’ జట్టును వీడనున్నాడు. ఫలితంగా గిల్ స్థానంలో మయాంక్ కెప్టెన్గా బాధ్యతలు నెరవేర్చనున్నాడు.కాగా గిల్తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ సైతం బంగ్లాతో టెస్టుకు ఎంపికైన నేపథ్యంలో ఇండియా-‘ఎ’ జట్టు నుంచి వైదొలిగారు.ఇక అనంతపురంలోఇక ఇండియా-‘ఎ’ జట్టు తదుపరి అనంతపురం వేదికగా ఇండియా-‘డి’తో సెప్టెంబరు 12 నుంచి మ్యాచ్ ఆడనుంది. కాగా కర్ణాటక ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ 2024లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. అంతకంటే ముందుగా ఇలా దులిప్ ట్రోఫీలోనూ కెప్టెన్గా పనిచేసే అవకాశం దక్కింది. ఇక ఇండియా-‘ఎ’ తొలి మ్యాచ్లో మయాంక్ వరుసగా 36, 3 పరుగులు చేశాడు.శుబ్మన్ గిల్ నిష్క్రమణ తర్వాత ఇండియా-‘ఎ’ జట్టు(అప్డేటెడ్):మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, అక్షయ్ నారంగ్, ఎస్కే రషీద్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, షామ్స్ ములానీ, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. చదవండి: మహారాష్ట్ర శాంసన్లా అతడి పరిస్థితి.. బీసీసీఐపై ఫ్యాన్స్ ట్రోల్స్ -
రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్.. వైరల్ వీడియో
బెంగళూరు వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్లో ఇండియా-బి వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. నవ్దీప్ బౌలింగ్లో పంత్ లెగ్ సైడ్ దిశగా వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లో ఎగిరి సూపర్ క్యాచ్గా మలిచాడు. పంత్ స్టన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పంత్ పట్టుకున్న క్యాచ్ ఇండియా-ఏ బ్యాటర్ ఆవేశ్ ఖాన్ది. Flying Rishabh Pant with a terrific catch. 🙇♂️pic.twitter.com/kmwmextgKx— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024ఈ మ్యాచ్లో పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండియా-బి.. ఇండియా-ఏపై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారీ శతకం చేసి ఇండియా-బి విజయానికి పునాది వేసిన ముషీర్ ఖాన్కు (181) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులకు ఆలౌటైంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ముషీర్ ఖాన్, నవ్దీప్ సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.ఇండియా-బి బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీ తలో 3, సాయికిషోర్ 2, యశ్ దయాల్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియా-ఏ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇండియా-ఏ బౌలర్ ఆకాశ్దీప్ ఐదు వికెట్లతో రాణించడంతో ఇండియా-బి రెండో ఇన్నింగ్స్లో 184 పరుగులకు ఆలౌటైంది. ఖలీల్ అహ్మద్ 3, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) మాత్రమే రాణించారు. వికెట్కీపర్ ధృవ్ జురెల్ ఏడు క్యాచ్లు పట్టుకున్నాడు.275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ.. 198 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (57) ఇండియా-ఏను ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆకాశ్దీప్ (43) వేగంగా పరుగులు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండియా-బి బౌలర్లలో యశ్ దయాల్ 3, ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీ తలో 2, సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. -
ముషీర్ ఖాన్ భారీ శతకం.. ఇండియా-ఏపై ఇండియా-బి విజయం
బెంగళూరు వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్లో ఇండియా-ఏపై ఇండియా-బి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి.. ముషీర్ ఖాన్ భారీ శతకంతో (181) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ముషీర్.. నవ్దీప్ సైనీ (56) సహకారంతో ఆదుకున్నాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.కలిసికట్టుగా రాణించిన ఇండియా-బి బౌలర్లుఇండియా-బి బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీ తలో 3, సాయికిషోర్ 2, యశ్ దయాల్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియా-ఏ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఐదేసిన ఆకాశ్దీప్ఇండియా-ఏ బౌలర్ ఆకాశ్దీప్ ఐదు వికెట్లతో రాణించడంతో ఇండియా-బి రెండో ఇన్నింగ్స్లో 184 పరుగులకు ఆలౌటైంది. ఖలీల్ అహ్మద్ 3, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) మాత్రమే రాణించారు. వికెట్కీపర్ ధృవ్ జురెల్ ఏడు క్యాచ్లు పట్టుకున్నాడు.టార్గెట్ 275275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ.. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆ జట్టు 198 పరుగులకు ఆలౌటై, 76 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. కేఎల్ రాహుల్ (57) ఇండియా-ఏను ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. The winning moment for India B. - A solid win to start Duleep Trophy for them, great booster for players. 👏pic.twitter.com/G1nJsxdTGB— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024ఆఖర్లో ఆకాశ్దీప్ (43) వేగంగా పరుగులు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇండియా-బి బౌలర్లలో యశ్ దయాల్ 3, ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనపీ తలో 2, సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. -
పోరాడుతున్న కేఎల్ రాహుల్
దులీప్ ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ టీమ్ ఎదురీదుతుంది. 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్ (57).. కుల్దీప్ యాదవ్తో (8) కలిసి ఇండియా-ఏను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి ఇండియా-ఏ టీమ్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రాహుల్, కుల్దీప్ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇండియా-ఏ గెలవాలంటే మరో 134 పరుగులు చేయాల్సి ఉంది. ఇండియా-ఏ ఇన్నింగ్స్లో రాహుల్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. మయాంక్ అగర్వాల్ 3, శుభ్మన్ గిల్ 21, రియాన్ పరాగ్ 31, ధృవ్ జురెల్ 0, తనుశ్ కోటియన్ 0, శివమ్ దూబే 14 పరుగులు చేశారు. ఇండియా-బి బౌలర్లలో యశ్ దయాల్ 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీ, నితీశ్ రెడ్డి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఇండియా-బి రెండో ఇన్నింగ్స్లో 184 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్దీప్ ఐదు వికెట్లు తీసి ఇండియా-బిని దెబ్బకొట్టాడు. ఖలీల్ అహ్మద్ 3, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) మాత్రమే రాణించారు.ఇండియా-బి తొలి ఇన్నింగ్స్: 321 ఆలౌట్, ముషీర్ ఖాన్ 181, నవ్దీప్ సైనీ 56, ఆకాశ్దీప్ 4/60ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్, రాహుల్ 37, మయాంక్ అగర్వాల్ 36, నవ్దీప్ సైనీ 3/60 -
ఒకే ఇన్నింగ్స్లో 7 క్యాచ్లు.. ధోని రికార్డు సమం చేసిన ధ్రువ్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అరుదైన రికార్డు సాధించాడు. దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న వికెట్ కీపర్గా ఎంఎస్ ధోని రికార్డును జురెల్ సమం చేశాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఈ అరుదైన ఫీట్ను ధ్రువ్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఇండియా- A జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్.. భారత-బి జట్టుపై ఈ ఘనతను అందుకున్నాడు. ఇండియా బి సెకెండ్ ఇన్నింగ్స్లో ధ్రువ్ ఏకంగా 7 క్యాచ్లు అందుకున్నాడు. తద్వారా మిస్టర్ కూల్ సరసన ఈ యంగ్ వికెట్ కీపర్ నిలిచాడు. దులీప్ ట్రోఫీ 200-2005 సీజన్లో ఈస్ట్జోన్ తరపున ఒకే ఇన్నింగ్స్లో ధోని 7 క్యాచ్లు అందుకున్నాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా ఎ జట్టు విజయానికి 169 పరుగులు అవసరమవ్వగా.. ఇండియా బి జట్టు గెలపునకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఇండియా ఎ ఆశలు అన్నీ కేఎల్ రాహుల్పైనే ఉన్నాయి. రాహుల్ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.చదవండి: IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. టీమిండియా క్యాంపులోకి యువ ఆటగాడు! ఎవరంటే? -
5 వికెట్లతో చెలరేగిన ఆకాష్.. ఇండియా ఎ లక్ష్యం 275 రన్స్
దులీప్ ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా బి జట్టు రెండో ఇన్నింగ్లో 184 పరుగులకు ఆలౌటైంది. 150/6తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బి జట్టు అదనంగా కేవలం 34 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే తొలి ఇన్నింగ్స్లో లభించిని ఆధిక్యాన్ని కలపునకుని ఇండియా ఎ-జట్టు ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బి జట్టు రెండో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్(61) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సర్ఫరాజ్ ఖాన్(46) పరుగులతో రాణించాడు.ఎ జట్టు బౌలర్లలో ఆకాష్ దీప్ 5 వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ 3, అవేష్, కొటియన్ తలా వికెట్ సాధించారు. కాగా ఇండియా బి జట్టు తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులు చేయగా.. బారత బి జట్టు 231 పరుగులకు ఆలౌటైంది.చదవండి: AUS vs SCO: గ్రీన్ విధ్వంసం.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ -
ధృవ్ జురెల్ కళ్లు చెదిరే క్యాచ్
బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-బి వికెట్కీపర్ ధృవ్ జురెల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఆకాశ్దీప్ బౌలింగ్ ముషీర్ ఖాన్ లెగ్ సైడ్ దిశగా ఆడిన షాట్ను జురెల్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుత క్యాచ్గా మలిచాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. The Dhruv Jurel stunner in Duleep Trophy. 🤯🙇♂️pic.twitter.com/Rteg0d0CX8— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2024ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో జురెల్ మొత్తం ఐదు క్యాచ్లు పట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 240 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (9), అభిమన్యు ఈశ్వరన్ (4), ముషీర్ ఖాన్ (0), నితీశ్ రెడ్డి విఫలం కాగా.. సర్ఫరాజ్ ఖాన్ (46), రిషబ్ పంత్ (61) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్లో ఉన్నాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్దీప్, ఖలీల్ అహ్మద్ తలో 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ చెరో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (36), శుభ్మన్ గిల్ (25), రియాన్ పరాగ్ (30), కేఎల్ రాహుల్ (37), తనుశ్ కోటియన్కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/62), నవ్దీప్ సైనీ (3/60), సాయికిషోర్ (2/10), యశ్ దయాల్ (1/39), వాషింగ్టన్ సుందర్ (1/15) సత్తా చాటారు.ముషీర్ భారీ శతకం..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి.. ముషీర్ ఖాన్ (181) భారీ శతకంతో చెలరేగడంతో 321 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇండియా-బిను దశలో ముషీర్, సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు. -
అనంతపురంలో ముగిసిన దులీప్ ట్రోఫీ మ్యాచ్.. ఫోటోలు
-
రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ టీమ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-బి టీమ్ భారీ లీడ్ దిశగా సాగుతుంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఇండియా-బి సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఓవరాల్గా ఆ జట్టు 227 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రిషబ్ పంత్ 59, నితీశ్ రెడ్డి 14 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇండియా-బి ఇన్నింగ్స్లో టాప్-3 ప్లేయర్లు విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్ 9, అభిమన్యు ఈశ్వరన్ 4, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ముషీర్ ఖాన్ 0 పరుగులకు ఔటయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ వేగంగా 46 పరుగులు చేశాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్దీప్ 2, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇన్నింగ్స్లో నాలుగుకు నాలుగు క్యాచ్లు వికెట్కీపర్ దృవ్ జురెలే పట్టుకోవడం విశేషం.పంత్ మెరుపు హాఫ్ సెంచరీఇండియా-బి సెకెండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. పంత్ కేవలం 34 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.231 పరుగులకు ఆలౌటైన ఇండియా-ఏఇండియా-ఏ టీమ్ తమ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (36), శుభ్మన్ గిల్ (25), రియాన్ పరాగ్ (30), కేఎల్ రాహుల్ (37), తనుశ్ కోటియన్కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/62), నవ్దీప్ సైనీ (3/60), సాయికిషోర్ (2/10), యశ్ దయాల్ (1/39), వాషింగ్టన్ సుందర్ (1/15) సత్తా చాటారు.ముషీర్ భారీ శతకం..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి.. ముషీర్ ఖాన్ (181) భారీ శతకంతో కదం తొక్కడంతో 321 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇండియా-బిను దశలో ముషీర్, సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు. -
శ్రేయస్ సేనపై రుతురాజ్ టీమ్ ఘన విజయం
దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురం వేదికగా ఇండియా-డితో జరిగిన మ్యాచ్లో ఇండియా-సి టీమ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి.. అక్షర్ పటేల్ (86) ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్లో 164 చేసింది. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ తలో 2, మానవ్ సుతార్, హృతిక్ షోకీన్ చెరో వికెట్ పడగొట్టారు.THUMPING WIN FOR INDIA C...!!!!- Well lead by Ruturaj Gaikwad & important score in the run chase in 4th innings. ✅ pic.twitter.com/08Lr2r8pb3— Johns. (@CricCrazyJohns) September 7, 2024అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి.. బాబా ఇంద్రజిత్ (72) మినహా ఎవరూ రాణించకడంతో 168 పరుగులు చేయగలిగింది. హర్షిత్ రాణా (4/33), అక్షర్ పటేల్ (2/46), సరాన్ష్ జైన్ (2/16), అర్ష్దీప్ సింగ్ (1/29), ఆదిత్య థాకరే (1/33) ఇండియా-సిని దెబ్బకొట్టారు.దీని తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-డి.. శ్రేయస్ అయ్యర్ (54), దేవ్దత్ పడిక్కల్ (56), రికీ భుయ్ (44) రాణించడంతో 236 పరుగులకు ఆలౌటైంది. మానవ్ సుతార్ 7 వికెట్లు తీసి ఇండియా-డిని దారుణంగా దెబ్బతీశాడు. విజయ్కుమార్ వైశాఖ్ 2, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. రుతురాజ్ గైక్వాడ్ (46), సాయి సుదర్శన్ (22), ఆర్యన్ జుయెల్ (47), రజత్ పాటిదార్ (44), అభిషేక్ పోరెల్ (35 నాటౌట్) తలో చేయి వేయడంతో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సరాన్ష్ జైన్ 4, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇండియా-సికి రుతురాజ్.. ఇండియా-డికి శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్లో డకౌట్
దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్లో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్లో తడబడి మళ్లీ నిలదొక్కుకుంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ముషీర్ ఖాన్ (181), నవ్దీప్ సైనీ (56) ఇండియా-బి ఆదుకున్నారు. ముషీర్ భారీ శతకంతో కదంతొక్కడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులు చేసింది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్దీప్ 4, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ తలో 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ.. ఇండియా-బి బౌలర్లు రెచ్చిపోవడంతో నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ముకేశ్ కుమార్ (3/62), నవ్దీప్ సైనీ (3/60), సాయికిషోర్ (2/10), యశ్ దయాల్ (1/39), వాషింగ్టన్ సుందర్ (1/15) ధాటికి ఇండియా-ఏ 231 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (36), శుభ్మన్ గిల్ (25), రియాన్ పరాగ్ (30), కేఎల్ రాహుల్ (37), తనుశ్ కోటియన్కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్లో డకౌట్తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీతో చెలరేగిన ఇండియా-బి బ్యాటర్ ముషీర్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్లో డకౌటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో ముషీర్ 6 బంతులు ఎదుర్కొని ఆకాశ్దీప్ బౌలింగ్లో దృవ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇండియా-బి సెకెండ్ ఇన్నింగ్స్లో ముషీర్తో పాటు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (9), అభిమన్యు ఈశ్వరన్ (4) కూడా విఫలమయ్యారు. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఇండియా-బి స్కోర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులుగా ఉంది. సర్ఫరాజ్ ఖాన్ (28), రిషబ్ పంత్ (24) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా-బి 159 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
7 వికెట్లతో చెలరేగిన మానవ్.. ఓటమి దిశగా శ్రేయస్ టీమ్
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా అనంతపూర్ వేదికగా భారత-డి జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత-సి జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. టీమ్-సి విజయానికి ఇంకా 155 పరుగుల దూరంలో నిలిచింది. అయితే 206/8 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన డి జట్టు.. 236 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఇండియా-సి జట్టు 168 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో భారత-బి జట్టుకు కేవలం 4 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. అనంతరం 4 పరుగుల వెనకంజతో సెకెండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన డి జట్టు 236 పరుగులకు ఆలౌటైంది. దీంతో సి జట్టు ముందు 233 పరుగుల లక్ష్యాన్ని టీమ్ డి ఉంచింది. కాగా శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని సి జట్టు తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే చాపచుట్టేసింది.7 వికెట్లతో చెలరేగిన మానవ్.. ఇక సెకెండ్ ఇన్నింగ్స్లో భారత-సి జట్టు స్పిన్నర్ మానవ్ సుతార్ 7 వికెట్లతో చెలరేగాడు. అతడి స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఇండియా డి జట్టు విల్లవిల్లాడింది. పడిక్కల్, రిక్కీ భుయ్ వంటి స్టార్ ఆటగాళ్లను ఔట్ చేసి డి జట్టును దెబ్బతీశాడు. ఈ మ్యాచ్లో 19.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మానవ్ సుతార్.. 49 పరుగులతో 7 వికెట్లు సాధించాడు. -
దులీప్ ట్రోఫీ.. సైనీ ఆల్రౌండ్ ప్రదర్శన
బెంగళూరు: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ ‘బి’ జట్టు 116 ఓవర్లలో 321 పరుగులకు ఆలౌటైంది. ముషీర్ ఖాన్ (373 బంతుల్లో 181; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) తన ఓవర్నైట్ స్కోరుకు మరిన్ని పరుగులు జోడించగా...పేసర్ నవ్దీప్ సైనీ (144 బంతుల్లో 56;8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో సత్తా చాటాడు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్కు 205 పరుగులు జోడించి భారత్ ‘బి’ని గట్టెక్కించారు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ముషీర్ ఖాన్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత భారత్ ‘బి’ ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఆకాశ్ దీప్ 4, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (25), మయాంక్ అగర్వాల్ (36; 8 ఫోర్లు) ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (27 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (23) క్రీజులో ఉన్నారు. ఈ రెండు వికెట్లూ నవదీప్ సైనీకే దక్కాయి. చేతిలో 8 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. -
రసవత్తరం.. ఫలితం ఖాయం
అనంతపురం: దులీప్ ట్రోఫీలో భాగంగా అనంత క్రీడాగ్రామం ప్రధాన స్టేడియంలో ఇండియా –సి, ఇండియా – డి జట్ల మధ్య రెండో రోజు శుక్రవారం జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒకే రోజు ఇండియా–సి జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ఇంద్రజిత్, ఇండియా–డి జట్టు కెపె్టన్ శ్రేయస్ అయ్యర్, పడిక్కల్ అర్ధసెంచరీలతో అలరించారు. ఇండియా –సి బౌలర్ మనవ్ సుతార్ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. అభిమానుల కేరింతలతో స్టేడియం హోరెత్తింది. ఇరు జట్ల బౌలర్లూ పోటాపోటీగా రాణిస్తున్నందున మూడో రోజు శనివారమే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇండియా –డి జట్టు రెండో ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇండియా–డి జట్టు 202 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఆదుకున్న ఇంద్రజిత్ ఓవర్నైట్ స్కోరు 91/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా–సి జట్టు 48.3 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు 77 పరుగులు మాత్రమే చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బాబా ఇంద్రజిత్ 149 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. ఇండియా–డి బౌలర్లలో పేసర్ హర్షిత్ రాణా 4, అక్షర్ పటేల్ 2, సరాన్‡్ష జైన్2, అర్షదీప్ సింగ్, ఆదిత్య థాక్రే చెరో వికెట్ తీశారు. సుతార్ దెబ్బకు తడబడిన ఇండియా–డి తొలి ఇన్నింగ్స్లో లాగే రెండో ఇన్నింగ్స్లోనూ ఇండియా–డి జట్టు తడబడింది. ఇండియా–సీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మనవ్ సుతార్ 15 ఓవర్లలో 30 పరుగులిచ్చి పడిక్కల్, శ్రీకర్ భరత్, సరాన్‡్ష జైన్, అర‡్షదీప్, రికీ భుయిలను పెవిలియన్కు పంపాడు. అతనికి తోడుగా పేసర్ వైశాక్ రెండు వికెట్లు తీసి రాణించాడు. దీంతో ఇండియా–డి ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్పటేల్ (11), హర్షిత్ రాణా (0) ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, డేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీలతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించే ప్రయత్నం చేసినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ 44 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 54 పరుగులు, పడిక్కల్ 70 బంతుల్లో 8 బౌండరీలతో 56 పరుగులు చేశారు. మరో బ్యాటర్ రికీ భుయి 44 (5 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులు చేశాడు. గ్రౌండ్లోకి దూసుకెళ్లిన అభిమాని రెండో రోజు ఆటలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. పరుగెత్తుకుంటూ వచ్చిన సదరు అభిమాని.. మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న భారత యువ ఓపెనర్, ఇండియా–సి జట్టు కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్కు పాదాభివందనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమాన శిఖరం క్రీడాగ్రామంలో జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు ఆట సందర్భంగా ఓ అభిమాని అందరినీ ఆకర్షించాడు. భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ వీరాభిమాని అయిన శంకర్ గీతా ధావన్ రూ.13 లక్షలు ఖర్చు పెట్టి తన శరీరంపై శిఖర్ ధావన్ ఫొటోలతో కూడిన టాటూలు వేయించుకున్నాడు. శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఎప్పుడు సెంచరీ సాధించింది తదితర అన్ని వివరాలు టాటూలో పొందుపరిచాడు. ముష్టూరు గ్రామానికి చెందిన శంకర్ గీతా ధావన్.. శిఖర్ ధావన్ ఎక్కడకెళ్లి మ్యాచ్ ఆడినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. విదేశాల్లో ఆడినా సరే అక్కడికి వెళ్లి మ్యాచ్ తిలకిస్తాడు. దీంతో మురిసిపోయిన శిఖర్ ధావన్ రూ.20 వేల విలువ చేసే తన చేతి గడియారాన్ని శంకర్ గీతా ధావన్కు బహుమానంగా ఇచ్చాడు. -
‘జఫ్పా’తో మాయచేసిన సైనీ.. గిల్ బౌల్డ్!.. స్కోరెంతంటే?
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ దులిప్ ట్రోఫీ-2024లో శుభారంభం అందుకోలేకపోయాడు. ఇండియా-‘ఏ’ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇండియా- ‘బి’తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తేలిపోయాడు. కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.నిరాశపరిచిన గిల్క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు సాధిస్తాడనుకున్న అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ పేసర్ నవదీప్ సైనీ సంధించిన ‘జఫ్ఫా(పర్ఫెక్ట్ బాల్)’ ధాటికి బౌల్డ్ అయ్యాడు. దులిప్ ట్రోఫీ తొలి రౌండ్లో భాగంగా ఇండియా-ఏ, ఇండియా-బి జట్ల మధ్య గురువారం తొలి మ్యాచ్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన శుబ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ముషీర్ ఖాన్ శతకం కారణంగా ఇండియా-బి మెరుగైన స్కోరుఈ క్రమంలో ఇండియా-బి తరఫున అరంగేట్ర బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత శతకం(181)తో ఆకట్టుకోగా.. పేసర్ నవదీప్ సైనీ సైతం సంచలన ఇన్నింగ్స్(56) ఆడాడు. వీరిద్దరు రాణించిన కారణంగా 321 పరుగుల వద్ద రెండోరోజు ఇండియా-బి తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించాడు.సైనీ జఫ్ఫా.. గిల్ బౌల్డ్ఈ కర్ణాటక బ్యాటర్ 45 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. నఅయితే, మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 43 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్ 14వ ఓవర్లో నవదీస్ సైనీ అవుట్సైడ్ ఆఫ్ దిశగా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా బంతి స్టంప్ను ఎగురగొట్టడంతో గిల్ తొలి వికెట్గా వెనుదిరిగాడు.వీడియో వైరల్అనంతరం నవదీప్ సైనీ బౌలింగ్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇవ్వడంతో మయాంక్ ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో రెండో రోజు ఆటలో ఇండియా-ఏ రెండో వికెట్ కోల్పోయింది. ఆట పూర్తయ్యే సరికి రియాన్ పరాగ్ 27, కేఎల్ రాహుల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గిల్ అవుటైన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ వైస్ కెప్టెన్గా ఎంపికైన గిల్.. తదుపరి బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక నేపథ్యంలో గిల్ తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు..Terrific delivery 🔥Excellent catch 👌Navdeep Saini bowled a peach to dismiss Shubman Gill and Rishabh Pant pulled off a superb diving catch to remove Mayank Agarwal.#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/z1cCHONjCI— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
అనంతపురంలో దులిప్ ట్రోఫీ: రెండో రోజు హైలైట్ ఫొటోలు
-
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్!
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రైజింగ్ స్టార్గా ప్రశంసలు అందుకుంటున్నాడు ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్. దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఇండియా-‘ఏ’ జట్టుతో మ్యాచ్ సందర్భంగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ పట్టుదలగా నిలబడ్డాడు.ఫోర్ల వర్షంమొత్తంగా 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 16 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. స్పిన్నర్ల బౌలింగ్లో దూకుడుగా ఆడుతూ ఈ మేర పరుగులు రాబట్టాడు. అయితే, చైనామన్ స్పి న్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ముషీర్ అవుట్ కావడం గమనార్హం.ఇక ముషీర్కు తోడు టెయిలెండర్ నవదీప్ సైనీ అర్ధ శతకం(144 బంతుల్లో 56)తో రాణించాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా- ‘బి’ తొలి ఇన్నింగ్స్లో 321 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.సచిన్ రికార్డు బద్దలుకాగా జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన ముషీర్ ఖాన్.. ఈ మ్యాచ్ సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు. టీనేజ్లోనే దులిప్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ను ముషీర్ వెనక్కినెట్టాడు.కాగా 1991, జనవరిలో గువాహటి వేదికగా జరిగిన దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. ఈస్ట్జోన్తో మ్యాచ్లో 159 పరుగులు చేశాడు. తాజాగా.. పందొమిదేళ్ల ముషీర్ సచిన్ను అధిగమించాడు.అన్నను మించిపోతాడేమో!దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్ టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్కు తోడబుట్టిన తమ్ముడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. గత రంజీ సీజన్లో ఓ ద్విశతకం బాదిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. ఓవరాల్గా 529 పరుగులు సాధించాడు. అంతేకాదు... అండర్-19 వరల్డ్కప్ టోర్నీలోనూ సత్తా చాటాడు. ఇప్పుడు దులిప్ ట్రోఫీలోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ముషీర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నను మించిన తమ్ముడు అంటూ కొనియాడుతున్నారు.దులిప్ ట్రోఫీ అరంగేట్రంలో టీనేజ్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు19 ఏళ్ల వయసులో బాబా అపరాజిత్- 212 పరుగులు(2013లో)19 ఏళ్ల వయసులో యశ్ ధుల్- 193 పరుగులు(2022లో)19 ఏళ్ల వయసులో ముషీర్ ఖాన్- 181 పరుగులు(2024లో)18 ఏళ్ల వయసులో సచిన్ టెండుల్కర్-159 పరుగులు (1991లో).A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
ఎట్టకేలకు.. శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్!
వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. దులిప్ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్లో.. రెండో ఇన్నిం గ్స్లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.బంగ్లాతో సిరీస్లో చోటు దక్కాలంటే..కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఈ సిరీస్ భారత్కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.వరుస మ్యాచ్లలో విఫలంఅయితే, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన అయ్యర్.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఇండియా-డి జట్టు కెప్టెన్గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో అభిషేక్ పొరల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అక్షర్ ఆల్రౌండ్ షోతోఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్ పెట్టారు. పేసర్లు హర్షిత్ రాణా(4/33), అర్ష్దీప్ సింగ్(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్ పటేల్(2/46), సారాంశ్ జైన్(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్ దూబే(5) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో షాట్కు యత్నించిన శ్రేయస్.. రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. టీ బ్రేక్ సమయానికి దేవ్దత్ పడిక్కల్ 42, రికీ భుయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్ -
గ్రౌండ్లోకి దూసుకెళ్లిన ఫ్యాన్! రుతు కాళ్ళు మొక్కి
దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా అనంతపూర్లోని ఆర్డీటీ స్టేడియం వేదికగా భారత్-సి, భారత్-డి జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన సదరు అభిమాని.. మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న భారత యువ ఓపెనర్, ఇండియా-సి టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు పాదాభివందనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా గైక్వాడ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకరు. అతడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో ధోని వారుసుడిగా సీఎస్కే సారథ్య బాధ్యతలు రుతురాజ్ చేపట్టాడు.అప్పటి నుంచి రుతురాజ్కు మరింత ఆదరణ పెరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా సి జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 168 పరుగులకు ఆలౌటైంది. సి బ్యాటర్లలో బాబా ఇంద్రజిత్(72) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. డి జట్టు బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తాచాటగా.. అక్షర్ పటేల్, జైన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్-డి జట్టు 164 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో సి జట్టుకు 4 పరుగుల ఆధిక్యంలో లభిచింది.చదవండి: కుల్దీప్ భాయ్తో అంత ఈజీ కాదు.. వారిద్దరి వల్లే ఇదంతా: సెంచరీ హీరో -
కుల్దీప్ భాయ్తో అంత ఈజీ కాదు.. వారిద్దరి వల్లే ఇదంతా: సెంచరీ హీరో
దేశీవాళీ క్రికెట్లో ముంబై యువ బ్యాటర్, భారత క్రికెటర్ సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా బి జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్న ముషీర్.. భారత బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ ‘బి’ 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ముషీర్ ఒంటరి పోరాటం చేశాడు. తన విరోచిత పోరాటంతో జట్టును అదుకున్నాడు. నవ్దీప్ సైనీ అండతో ముషీర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో భారత్ ‘బి’ జట్టు 79 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (227 బంతుల్లో 105; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు సైనీ (74 బంతుల్లో 29 ; 4 ఫోర్లు, ఒక సిక్సర్) నాటౌట్గా నిలిచాడు.ఇక తొలి రోజు ఆట తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముషీర్.. తన సెంచరీ క్రెడిట్ను భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుబ్మన్ గిల్కు ఇచ్చాడు. "నేను కుల్దీప్ యాదవ్కు ప్రత్యర్ధిగా ఆడటం ఇదే రెండో సారి. అతడొక వరల్డ్క్లాస్ బౌలర్ అని మనకు తెలుసు. కుల్దీప్ భాయ్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కానీ మా జట్టులో రిషబ్ పంత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. రిషబ్ భాయ్తో పాటు శుబ్మన్ గిల్ ఈ మ్యాచ్ కంటే ముందు నాకు కొన్ని సూచనలు చేశారు. కుల్దీప్ భాయ్ వేసిన బంతుల్లో ఏది అత్యంత ప్రభావవంతంగా ఉంటుందో వారు నాకు చెప్పారు. అతడి బౌలింగ్లో ఏ బంతులను ఎటాక్ చేయాలో నాకు వారిద్దరూ వివరించారు. దీంతో నేను క్రీజులో సెట్ అయ్యాక అతడిని సులభంగా ఎదుర్కొన్నాను" అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. -
టీమిండియా ఫ్యూచర్ స్టార్.. ముషీర్ ఖాన్
దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా-ఏతో ఇవాళ (సెప్టెంబర్ 5) మొదలైన మ్యాచ్లో ఇండియా-బి ఆటగాడు ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో (105 నాటౌట్) మెరిశాడు. ముషీర్ తన సహచరులంతా ఒక్కొక్కరుగా పెవిలియన్కు చేరుతున్నా.. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా క్రీజ్లో నిలదొక్కుకుని అద్భుత శతకం సాధించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది. ఈ దశలో ముషీర్.. నవ్దీప్ సైనీతో (29 నాటౌట్) సహకారంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.ఇండియా-బి ఇన్నింగ్స్లో ముషీర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (30), సర్ఫరాజ్ ఖాన్ (9), రిషబ్ పంత్ (7), వాషింగ్టన్ సుందర్ (0) ఉన్నా, తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అభిమన్యు ఈశ్వరన్ 13, నితీశ్ రెడ్డి 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.తొలి మ్యాచ్లోనే సెంచరీ..19 ఏళ్ల ముషీర్ దులీప్ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో కదంతొక్కాడు. వయసు ప్రకారం చూస్తే ముషీర్ ఇండియా-బి జట్టులో అందరికంటే చిన్నవాడు. ముషీర్ తన ఫస్ట్క్లాస్ కెరీర్లో కేవలం 11 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడాడు. ఇందులో మూడు సెంచరీలు చేశాడు. అండర్-19 వరల్డ్కప్లో సెకెండ్ హైయ్యెస్ట్ రన్గెటర్ అయిన ముషీర్.. గత రంజీ క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆతర్వాత సెమీస్లో హాఫ్ సెంచరీ.. ఫైనల్లో సెంచరీ చేశాడు.టీమిండియా ఫ్యూచర్ స్టార్..ముషీర్ బ్యాటింగ్ స్టయిల్ చాలా క్లాస్గా ఉంటుంది. ముషీర్ ఇప్పటికే తానెంటో రుజువు చేసుకున్నాడు. ముషీర్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముషీర్.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు స్వయానా తమ్ముడు. ముషీర్ భారత్ మిడిలార్డర్లో అన్నకు పోటీ అయ్యేలా ఉన్నాడు. ముషీర్ ఇదే ఫామ్ను దులీప్ ట్రోఫీ మొత్తంలో కొనసాగిస్తే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు ఎంపిక కావడం ఖాయం. తనకంటే సీనియర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ విఫలమైన మ్యాచ్లో ముషీర్ సెంచరీ సాధించడం హర్షించదగ్గ విషయం. -
Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీ
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో ఇవాళ (సెప్టెంబర్ 5) మొదలైన మ్యాచ్లో ఇండియా-బి ఆటగాడు ముషీర్ ఖాన్ సూపర్ సెంచరీతో (105 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. ఈ మ్యాచ్లో వన్డౌన్లో బరిలోకి దిగిన ముషీర్.. ఓ పక్క సహచరులంతా పెవిలియన్కు క్యూ కడుతున్నా తాను మాత్రం చాలా జాగ్రత్తగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముషీర్కు మరో ఎండ్లో నవ్దీప్ సైనీ (29 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) సహకారం అందిస్తున్నాడు. That celebration 🌟#DuleepTrophy2024 | #MusheerKhanpic.twitter.com/ziv0AE6liX— CricTracker (@Cricketracker) September 5, 2024ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ముషీర్, సైనీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇండియా-బి ఇన్నింగ్స్లో ముషీర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (30), సర్ఫరాజ్ ఖాన్ (9), రిషబ్ పంత్ (7), వాషింగ్టన్ సుందర్ (0) ఉన్నా, వీరు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అభిమన్యు ఈశ్వరన్ 13, నితీశ్ రెడ్డి 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు. -
శుభ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్.. పంత్కు ఫ్యూజులు ఔట్
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ ఆటగాడు శుభ్మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. లాంగ్ ఆఫ్ దిశగా ఇండియా-బి ఆటగాడు రిషబ్ పంత్ ఆడిన షాట్ను గిల్ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకున్నాడు. గిల్ స్టన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్లో పంత్ కేవలం ఏడు పరుగులు చేసి ఆకాశ్దీప్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.SHUBMAN GILL - THE STAR. ⭐- What a brilliant catch by Shubman Gill. 🔥pic.twitter.com/cKHuLPvG0k— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా ముషీర్ ఖాన్ (97), నవ్దీప్ సైనీ (21) ఆదుకున్నారు. మూడో సెషన్ సమయానికి ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ సెంచరీకి చేరువయ్యాడు. నవ్దీప్.. ముషీర్కు సరైన సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరూ ఈ రోజంతా ఆడగలిగితే ఇండియా-బి గౌరవప్రదమైన స్కోర్ చేయగలుగుతుంది.ఇండియా-బి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 30, అభిమన్యు ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.ఇవాళే మొదలైన మరో మ్యాచ్లో ఇండియా-సి, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్దీప్ సింగ్తో (13) కలిసి తొమ్మిదో వికెట్కు 84 పరుగులు జోడించాడు.అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 28 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) ఔట్ కాగా.. బాబా ఇంద్రజిత్ (13), అభిషేక్ పోరెల్ (19) క్రీజ్లో ఉన్నారు. -
పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!
దులీప్ ట్రోఫీ మ్యాచ్లు ఇవాల్టి (సెప్టెంబర్) నుంచి ప్రారంభమయ్యాయి. ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగుతుండగా.. ఇండియా-సి, ఇండియా-డి మధ్య రెండో మ్యాచ్ అనంతపురంలో జరుగుతుంది.తొలి మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి మూడో సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ కోసం ప్రాకులాడుతుంది. ముషీర్ ఖాన్ (77), నవ్దీప్ సైనీ (7) ఇండియా-బిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-బి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 30, అభిమన్యు ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.రెండో మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్దీప్ సింగ్తో (13) కలిసి తొమ్మిదో వికెట్కు 84 పరుగులు జోడించాడు.అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12) ఔట్ కాగా.. రజత్ పాటిదార్ (13), బాబా ఇంద్రజిత్ (2) క్రీజ్లో ఉన్నారు.పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!రెండో మ్యాచ్కు ముందు ఇండియా-డి ఆటగాడు ఇషాన్ కిషన్ గాయపడటంతో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. సంజూ తుది జట్టులో ఉండటం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే మేనేజ్మెంట్ అనూహ్యంగా సంజూను పక్కన పెట్టి శ్రీకర్ భరత్కు తుది జట్టులోకి తీసుకుంది. ఇండియా-సితో మ్యాచ్లో సంజూ బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్లో అవకాశం వస్తే తనను తాను నిరూపించుకుని టెస్ట్ జట్టులో చోటు కొట్టేయాలని సంజూ భావించాడు. చివరికి అతని ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. -
Duleep Trophy 2024: ఆదుకున్న అక్షర్ పటేల్
దులీప్ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఇండియా-సితో ఇవాళ (సెప్టెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్దీప్ సింగ్తో కలిసి తొమ్మిదో వికెట్కు 84 పరుగులు జోడించాడు. THE SHOW OF AXAR PATEL. 🔥He smashed an excellent fifty when his team was 8 down on just 76 runs - AXAR PATEL, THE CRISIS MAN. 👏pic.twitter.com/ezWupOFTKQ— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ (4) క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..ఇండియా-సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్కీపర్), బాబా ఇంద్రజిత్, ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, విజయ్కుమార్ వైశాఖ్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ఇండియా-డి: దేవదత్ పడిక్కల్, యష్ దూబే, రికీ భుయ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, అథర్వ తైడే (వికెట్కీపర్), అక్షర్ పటేల్, సరాన్ష్ జైన్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆదిత్య ఠాకరే -
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్
దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా అనంతరపురం, బెంగళూరు వేదికలుగా దేశవాళీ రెడ్బాల్ టోర్నీ గురువారం ఆరంభమైంది.ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్విఇందులో భాగంగా ఇండియా-‘ఏ’ - ఇండియా- ‘బి’ జట్ల మధ్య తొలి మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ఇండియా- ‘ఏ’ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ తమ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్తో కలిసి ఇండియా- ‘బి’ ఇన్నింగ్స్ ఆరంభించాడు.అనుభవజ్ఞుడైన అభిమన్యు ఈశ్వరన్కు ఇండియా- ‘ఏ’ పేసర్ ఆవేశ్ ఖాన్ అద్భుత బంతిని సంధించగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిమన్యు నిష్క్రమించగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. హాట్ ఫేవరెట్గా దిగి.. విఫలంఖలీల్ అహ్మద్ బౌలింగ్లో శశ్వత్ రావత్(సబ్స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా తరఫున ఇప్పటికే మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు బాదిన యశస్వి జైస్వాల్ హాట్ ఫేవరెట్గా దులిప్ ట్రోఫీ బరిలో దిగాడు. అయితే, ఆరంభంలోనే ఇలా విఫలమై అభిమానులను నిరాశపరిచాడు. కాగా బంగ్లాదేశ్తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో.. ఈ టోర్నీకి ప్రాధాన్యం ఏర్పడింది. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుంది. ఇదిలా ఉంటే.. తొలిరోజు 30 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇండియా-‘బి’ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. అన్నదమ్ములు ముషీర్ ఖాన్ ఆరు, సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇండియా-‘ఏ’ వర్సెస్ ఇండియా- ‘బి’ తుదిజట్లుఇండియా-‘ఏ’శుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.ఇండియా- ‘బి’అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, ముకేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్.చదవండి: ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్.. వీడియో వైరల్ -
టెస్టుల్లో మెరుగ్గా రాణించలేకపోయా.. ఇకపై: గిల్
టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన కెప్టెన్సీ స్కిల్స్ను మెరుగుపరుచుకునేందుకు మరో అవకాశం దక్కింది. పరిమిత ఓవర్లలో భారత వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇప్పుడు రెడ్బాల్ క్రికెట్పై దృష్టి సారించాడు.బంగ్లాదేశ్తో టెస్టులకు టీమిండియా వైస్ కెప్టెన్గా గిల్ ఎంపికయ్యే అవకాశముంది. అంతకంటే ముందు దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ రూపంలో గిల్కు ఛాలెంజ్ ఎదురుకానుంది. దులీప్ ట్రోఫీ-2024 ఇండియా ‘ఎ’ జట్టుకు గిల్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో భారత ఎ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శుబ్మన్ గిల్.. బి జట్టును తొలుత బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు కెప్టెన్ శుబ్మన్ గిల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన ఆటకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. "డిఫెన్స్ను మరింత బలోపేతం చేసుకునేందుకు సాధన చేశా. ట్రాక్పై స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తా. టి20లు ఎక్కువ ఆడటం వల్ల బ్యాటింగ్ పిచ్లపై డిఫెన్స్లో కాస్త వెనుకబడతాం. ఇంగ్లండ్ సిరీస్కు ముందు దానిపైనే దృష్టి సారించా. టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు అనుకున్న స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయా. ఈ సీజన్లో 10 టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఆటతీరు మరింత మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తా" అని గిల్ పేర్కొన్నాడు. -
శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. ఇక అంతే సంగతి మరి?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో తీవ్ర నిరాశపరిచిన అయ్యర్.. ఇప్పుడు దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.ఈ టోర్నీలో ఇండియా-సి జట్టుకు సారథ్యం వహిస్తున్న శ్రేయస్.. ఇండియా-డితో జరుగుతున్న తొలి మ్యాచ్లో విఫలమయ్యాడు. అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అయ్యర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. విజయ్ కుమార్ వైశ్యాఖ్ బౌలింగ్లో వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. కాగా ఈ టోర్నీలో మెరుగ్గా రాణించి భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించిన అయ్యర్.. ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండడంతో బంగ్లాతో టెస్టు సిరీస్కు అతడి ఎంపికపై సందిగ్ధం నెలకొంది. -
దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ షురూ.. తుది జట్లు ఇవే
దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2024 ప్రారంభమైంది. తొలి రౌండ్లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బి, ఇండియా జట్లు తలపడతుండగా.. అనంతపురం వేదికగా భారత్-డి, భారత్-సి జట్లు ఆడుతున్నాయి. బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా ఎ జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్.. బి జట్టును బ్యాటింగ్కు ఆహ్హనించాడు. మరోవైపు అనంతపూర్ ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా సి జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా 'ఎ' జట్టుకు శుబ్మన్ గిల్, బి జట్టుకు అభిమన్యు ఈశ్వరన్, సి జట్టుకు రుత్రాజ్ గైక్వాడ్, డి జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నారు.తుది జట్లు: ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్ఇండియా ఎ: శుభ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ఇండియా డి: దేవదత్ పడిక్కల్, యశ్ దూబే, రికీ భుయ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, అథర్వ తైదే(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, సరన్ష్ జైన్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆదిత్య ఠాకరేఇండియా సి:రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), బాబా ఇంద్రజిత్, ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, విజయ్కుమార్ వైషాక్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, హిమాన్షు చౌహాన్ -
నేటి నుంచి భారత దేశవాళీ క్రికెట్ సీజన్ మొదలు
బెంగళూరు: భారత జట్టు అంతర్జాతీయ సీజన్ ప్రారంభానికి రెండు వారాల ముందుగానే 2024–2025 దేశవాళీ క్రికెట్ సీజన్కు తెర లేవనుంది. ఇందులో భాగంగా గురువారం దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్లు మొదలుకానున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘బి’ జట్టు... అనంతపురంలో నిర్వహించనున్న మరో మ్యాచ్లో భారత్ ‘సి’ జట్టుతో భారత ‘డి’ జట్టు తలపడనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా మరో 10 టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా... ఈ టోరీ్నలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. భారత కెపె్టన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతినివ్వగా... మిగిలిన యువ ఆటగాళ్లందరూ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. రిషభ్ పంత్... చాన్నాళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ ఆడనున్నాడు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న శుభ్మన్ గిల్ భారత ‘ఎ’ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ భారత్ ‘బి’ నుంచి బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీని జాతీయ సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్న నేపథ్యంలో ఆటగాళ్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఉవి్వళ్లూరుతున్నారు. మిడిలార్డర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్పై ప్రధానంగా దృష్టి ఉంటుంది. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటుండగా... సిరాజ్ అనారోగ్యంతో టోరీ్నకి దూరమయ్యాడు. బుమ్రా కూడా అందుబాటులో లేకపోవడంతో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పేసర్లకు ప్రత్యేక గుర్తింపు దక్కడం ఖాయమే. దీంతో ముకేశ్ కుమార్, ఆకాశ్దీప్, అర్‡్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, విద్వత్ కావేరప్ప, విజయ్ కుమార్, హర్షిత్ రాణాలపై సెలెక్టర్లు దృష్టి సారించనున్నారు. స్పిన్ విభాగంలో సత్తా చాటేందుకు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సాయికిశోర్, సౌరభ్ కుమార్, మానవ్ సుతార్ సిద్ధంగా ఉన్నారు. ఇషాన్ కిషన్ అవుట్ దేశవాళీ టోర్నీల్లో ఆడని కారణంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్... దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఆడటం లేదు. కండరాల నొప్పితో బాధపడుతున్న ఇషాన్... భారత ‘డి’ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అనంతపురం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో భారత్ ‘సి’తో భారత్ ‘డి’ ఆడుతుంది. దీంతో గురువారం ప్రారంభం కానున్న పోరులో భారత్ ‘డి’ తరఫున ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ వికెట్ కీపర్గా వ్యవహరించే అవకాశాలున్నాయి. మరోవైపు భారత్ ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడు కూడా తొలి రౌండ్ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇషాన్ స్థానంలో సంజూ సామ్సన్ను జట్టులోకి తీసుకున్నారు.జట్లు భారత్ ‘ఎ’: శుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుశ్ కొటియాన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శాశ్వత్. భారత్ ‘బి’: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి (ఫిట్నెస్ సాధిస్తేనే), వాషింగ్టన్ సుందర్, నవ్దీప్ సైనీ, యశ్ దయాల్, ముకేశ్ కుమార్, రాహుల్ చహర్, సాయి కిశోర్, మోహిత్ అవస్తి, జగదీశన్. భారత్ ‘సి’: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పొరెల్, ఇంద్రజీత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, విజయ్కుమార్, అన్షుల్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, అర్యాన్ జుయల్, సందీప్ వారియర్. భారత్ ‘డి’: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడె, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, సంజూ సామ్సన్, రికీ భుయ్, సారాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్షదీప్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్, ఆకాశ్ సేన్ గుప్తా, శ్రీకర్ భరత్, సౌరభ్ కుమార్. -
అనంతపురంలో ఆడటం సంతోషంగా ఉంది: శ్రేయస్ అయ్యర్
దేశవాళీ క్రికెట్లో పాల్గొనటం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చని టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఈ టోర్నీల్లో ఆడటం వల్ల యువతలో స్ఫూర్తినింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. కాగా జాతీయ విధుల నుంచి విరామం లభించినపుడు.. ఫిట్గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీ-2024లో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, రిషభ్ పంత్, శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు పాల్గొనున్నారు. ఇండియా-ఏ, ఇండియా-బి- ఇండియా-సి, ఇండియా-డి జట్ల తరఫున ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఈ రెడ్బాల్ టోర్నీ పోటీలు అనంతపురం వేదికగా గురువారం ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రికెటర్లంతా అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.ఈ క్రమంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అనంతపురం లో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోర్-డే టోర్నీలో ఆడటం ద్వారా నైపుణ్యాలను పదునుపెట్టుకునే అవకాశం దొరుకుతుందని హర్షం వ్యక్తం చేశారు.దులిప్ ట్రోఫీ- 2024 జట్లుఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: సెంచరీ హీరో’కు గాయం.. సంజూ శాంసన్కు లక్కీ ఛాన్స్! -
అనంతపురం : దులీప్ ట్రోఫీలో భాగంగా క్రీడాకారులు సాధన (ఫొటోలు)
-
సంజూ శాంసన్కు లక్కీ ఛాన్స్!
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా అతడు ఇండియా-డి జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అతడి స్థానంలో మరో భారత వికెట్ కీపర్ బ్యాటర్ టీమ్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సెంచరీతో కదం తొక్కికాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ బరిలో దిగాడు.తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఈ రెడ్బాల్ టోర్నమెంట్లో జార్ఖండ్ కెప్టెన్గా వ్యవహరించిన ఇషాన్ సెంచరీతో అలరించాడు. అయితే, తన జట్టును మాత్రం సెమీస్ రేసులో నిలపలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ సందర్భంగానే ఇషాన్కు గాయమైనట్లు క్రిక్బజ్ వెల్లడించింది. ఫలితంగా.. సెప్టెంబరు 5న ఆరంభమయ్యే దులిప్ ట్రోఫీకి అతడు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది.సంజూ శాంసన్కు చోటు?ఇషాన్ కిషన్ స్థానంలో కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ ఇండియా-డి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా సెప్టెంబరు 19 నుంచి టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్లకు సన్నాహకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు.ఇషాన్కు తప్పని కష్టాలుఈ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో సిరీస్కు ఎంపికకావాలని కొందరు.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని మరికొందరు పట్టుదలగా ఉన్నారు. అయితే, తీవ్రమైన పోటీనెలకొన్న తరుణంలో ఇషాన్ కిషన్ ఇప్పట్లో రీఎంట్రీ ఇవ్వకపోయినా.. కనీసం సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉండేది. కానీ గాయం తీవ్రతరమైతే అతడు ఈ ఎడిషన్ మొత్తానికి దూరమైతే.. మళ్లీ రంజీ దాకా వేచిచూడాల్సిందే!! ఏదేమైనా ఇషాన్కు ఇప్పట్లో కెరీర్ కష్టాల నుంచి విముక్తి లభించేలా కనిపించడం లేదు!!దులిప్ ట్రోఫీ: బీసీసీఐ ప్రకటించిన ఇండియా-డి జట్టుశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: Duleep Trophy 2024: అనంతపూర్ చేరుకున్న క్రికెటర్లు -
#DuleepTrophy2024 : అనంతపురం చేరుకున్న క్రికెటర్లు (ఫొటోలు)
-
Duleep Trophy 2024: అనంతపూర్కు స్టార్ క్రికెటర్ల కళ..
దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఆరంభానికి సమయం అసన్నమైంది. ఈ టోర్నీకి బెంగళూరుతో పాటు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ దేశీవాళీ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది.అందులో 6 మ్యాచ్ లకు గాను.. అనంతపురంలో 5 మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే ఈసారి టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రికెటర్లు భాగం కానున్నారు. దీంతో ఈ టోర్నీకి స్టార్ కళ వచ్చింది.స్టార్లు వచ్చేశారు..ఈ క్రమంలో దులీప్ ట్రోఫీలో పాల్గోనేందుకు భారత స్టార్ క్రికెటర్లు అనంతపురానికి వచ్చేశారు. పలువురు క్రికెటర్లు సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. వీరిలో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. క్రికెటర్లు బసచేస్తున్న హాటల్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని సందడి చేశారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, పంత్, సిరాజ్, గిల్ సైతం త్వరలోనే అనంతపుర్కు రానున్నారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రాలకు బీసీసీఐ సెలెక్టర్లు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించారు.సరికొత్త మార్పులతో..అయితే ఈసారి టోర్నీ గతం కంటే భిన్నంగా జరగనుంది. గతంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ మొత్తం ఆరు జోన్లు తలపడేది. ఇప్పుడు వాటిని ఎ, బి, సి, డి జట్లుగా మార్చారు. ఇండియా ‘ఎ’ జట్టుకు శుభ్మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ‘బీ’ జట్టుకు అభిన్యు ఈశ్వరన్, ‘సి’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ లు కెప్టెన్లుగా ఉండనున్నారు.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
సూర్యకుమార్కు గాయం.. దులీప్ ట్రోఫీకి దూరం
ముంబై తరఫున బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా గాయడపడ్డాడు. తమిళనాడుతో మ్యాచ్ సందర్భంగా స్కై చేతికి గాయమైంది. ఈ కారణంగా అతను దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ రౌండ్కు దూరం కానున్నాడు. స్కై దులీప్ ట్రోఫీలో ఇండియా-సికి ఆడాల్సి ఉండింది. దులీప్ ట్రోఫీలో ఇండియా-సి మ్యాచ్ సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు అనంతపురం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్లో ఇండియా-సి.. ఇండియా-డితో తలపడనుంది. సూర్యకుమార్ గాయపడిన విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి. సై.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో రిపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది.స్కై గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్కు దూరం కావడంతో టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలన్న అతని కలలు కల్లలుగా మారిపోయాయి. స్కై లేకుండానే టీమిండియా మిడిలార్డర్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఒకవేళ దులీప్ ట్రోఫీలో స్కై ఊహించిన దానికంటే అధికంగా రాణించినా జట్టులో చోటు దక్కడం కష్టమే అవుతుంది. మిడిలార్డర్లో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటినుంచే తలలు పట్టుకుని కూర్చుంది. దులీప్ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీలో సీనియర్లు మినహా టీమిండియాలో చోటు ఆశిస్తున్న వారంతా పాల్గొంటున్నారు.దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య సెప్టెంబర్ 5న బెంగళూరు వేదికగా మొదలవుతుంది. అదే రోజు అనంతపురంలో ఇండియా-సి, ఇండియా-డి జట్లు పోటీపడతాయి. ఈ టోర్నీలో మొత్తం ఆరు మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి జట్టు తలో మూడు మ్యాచ్లు ఆడుతుంది. ఈ టోర్నీ అనంతరం స్వదేశంలోనే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. సెప్టెంబర్ 19న తొలి టెస్ట్, సెప్టెంబర్ 27న రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు టీ20 జరుగుతాయి. -
సూర్యకుమార్ ఆశలపై నీళ్లు.. ఊహించని షాక్!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఊహించని షాక్ తగిలింది. టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా బుచ్చిబాబు టోర్నమెంట్ బరిలో దిగిన ఈ స్టార్ బ్యాటర్ గాయపడ్డాడు. తమిళనాడు జట్టుతో మ్యాచ్ సందర్భంగా అతడి చేతికి గాయమైనట్లు సమాచారం. దీంతో సూర్య దులిప్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది.బంగ్లాతో సిరీస్ నాటికీ కష్టమేఫలితంగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నాటికి కూడా సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఈ టీ20 టాప్ స్టార్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్లో సూర్య కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!ఈ క్రమంలో ఈ టీ20 స్పెషలిస్టుకు మళ్లీ టెస్టు జట్టులో స్థానం దక్కలేదు. అయితే, త్వరలో స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రీ ఎంట్రీ ఇవ్వాలని భావించిన సూర్యకుమార్ యాదవ్.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ బరిలో దిగాడు. దేశవాళీ క్రికెట్లో తన సొంతజట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తూ తమిళనాడుతో మ్యాచ్ ఆడాడు.కోయంబత్తూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 30 పరుగులే చేసిన సూర్య.. అనంతరం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. అతడి చేతికి గాయం కాగా.. నొప్పితో విలవిల్లాడినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తెలిపింది. దీంతో అతడు దులిప్ ట్రోఫీలో పాల్గొనడంపై సందిగ్దం నెలకొంది. ఆశలపై నీళ్లుఒకవేళ గాయం తీవ్రతరమైతే సూర్యకుమార్ యాదవ్ టెస్టు రీఎంట్రీకి ఇప్పట్లో అవకాశం ఉండకపోవచ్చు. కాగా ఆఖరిగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సిద్ధమవుతోంది.దులిప్ ట్రోఫీ ఇండియా-సి టీమ్లో సూర్యరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.చదవండి: Eng vs SL: శతక్కొట్టిన ఇంగ్లండ్ పేసర్.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్ -
‘బీసీసీఐని కాపీ కొట్టండి.. మనమూ గెలుస్తాం’
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెడ్బాల్ టోర్నీలపై దృష్టి పెట్టకుండా.. పరిమిత ఓవర్ల క్రికెట్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఆటను ఎలా అభివృద్ధి చేయాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి పీసీబీ నేర్చుకోవాలని సూచించాడు. పాక్ క్రికెట్ సరైన గాడిలో పడాలంటే మూలాల నుంచి ప్రక్షాళన అవసరమని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా టెస్టు మ్యాచ్లో పాక్ ఓడిపోయింది. తొలిసారి బంగ్లా చేతిలో పాక్ ఓటమితొలి టెస్టులో ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ లేకుండా ఏకంగా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగి భారీ మూల్యం చెల్లించింది. మరోవైపు.. బంగ్లాదేశ్ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో రంగంలోకి దిగింది. ఇక పాక్ అత్యుత్సాహంతో 6 వికెట్లకే తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా... ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ ఏకంగా 117 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఆట చివరి రోజు బంగ్లాదేశ్ సీనియర్ స్పిన్నర్లు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్ చెలరేగిపోవడంతో పాక్కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో షాన్ మసూద్ బృందం ఆట తీరు సహా పీసీబీ విధానాలపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు సిరీస్ తర్వాత చాంపియన్స్ కప్ అనే వన్డే టోర్నీని నిర్వహించబోతున్నారు. బీసీసీఐని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోండిపీసీబీ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు ఏం చేసినా కాపీ కొట్టేది. మరి పొరుగు దేశం భారత్ వైపు ఒకసారి చూడవచ్చు కదా! దయచేసి వాళ్ల వ్యవస్థను కూడా కాపీ కొట్టండి. మార్పులు కూడా అవసరం లేదు. ఎందుకంటే.. కాపీ కొట్టడంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారని తెలుసు. అందుకే వాళ్లేం చేస్తే యథాతథంగా మీరూ చేసేయండి. ఇండియాలో తదుపరి దులిప్ ట్రోఫీ మొదలుకాబోతోంది. అదేమీ టీ20 లేదా వన్డే టోర్నమెంట్ కాదు. నాలుగు రోజుల ఆట ఉండే రెడ్బాల్ టోర్నీ. మూలాల నుంచి క్రికెట్ను పటిష్టం చేయడంపై వాళ్లు దృష్టిసారించారు.అందుకే ఆ జట్టు విజయవంతమైనదిగా నిలుస్తోంది’’ అంటూ పీసీబీ యాజమాన్యాన్ని తూర్పారపడుతూనే హితవు పలికాడు. పాక్ జట్టు వరుస వైఫల్యాలుఇప్పటికైనా రెడ్బాల్ క్రికెట్పై దృష్టి సారించకపోతే పాక్ జట్టు మరిన్ని పరాభవాలు చవిచూడక తప్పదని బసిత్ అలీ ఈ సందర్భంగా హెచ్చరించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ఇటీవలి కాలంలో ఘోరంగా విఫలమవుతోంది. వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో, న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో... ఆటగాళ్ల ఫిట్నెస్ లేమి, సెలక్షన్ విషయంలో బంధుప్రీతి కారణంగానే ఇలా పరాజయాలు అంటూ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఈ క్రమంలో పాక్ కొత్తగా మూడు దేశవాళీ టోర్నీలు ప్రవేశ్పెట్టి.. ప్రాథమిక దశ నుంచే క్రికెట్ను అభివృద్ధి చేస్తామని తెలిపింది. కొత్తగా మూడు టోర్నీలుదేశవాళీ క్రికెట్ 2024- 2025లో భాగంగా చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్క్లాస్ కప్ టోర్నీ నిర్వహిస్తామని పేర్కొంది. మరోవైపు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా ఫిట్గా ఉంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే నిబంధన విధించిన విషయం తెలిసిందే.చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’ -
‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఎందుకిలా?’
టీమిండియా సీనియర్లు దులిప్ ట్రోఫీ టోర్నీలో పాల్గొనాల్సిందని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. వారికి ఇప్పటికే కావాల్సినంత విశ్రాంతి దొరికిందని.. అయినా ఈ దేశవాళీ టోర్నమెంట్కు దూరంగా ఉండటం ఏమిటని ప్రశ్నించాడు. యువ క్రికెటర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్మెషీన్ విరాట్ కోహ్లి, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇందులో ఆడితే బాగుండేదని పేర్కొన్నాడు.ఆ నలుగురు దూరంకాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ముందు భారత క్రికెటర్లకు దులిప్ ట్రోఫీ రూపంలో కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. రోహిత్, కోహ్లి, అశూ, బుమ్రా మినహా టీమిండియాలోని దాదాపు అందరు ఆటగాళ్లు ఈ రెడ్బాల్ టోర్నీ బరిలో దిగనున్నారు. అయితే, పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఆఖరి నిమిషంలో తప్పుకోగా.. సిరాజ్, ఉమ్రాన్ స్థానాలను నవదీప్ సైనీ, గౌరవ్ యాదవ్తో భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారమే ప్రకటించింది.ఐదేళ్లలో 249 మ్యాచ్లు.. వీరు ఆడింది మాత్రంఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఎక్స్ వేదికగా సీనియర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గత ఐదేళ్లలో టీమిండియా 249 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. వీటిలో రోహిత్ కేవలం 59 శాతం, విరాట్ 61 శాతం, బుమ్రా 34 శాతం మ్యాచ్లు మాత్రమే ఆడారు. వీళ్లకు దొరికినంత విశ్రాంతి మరే ఇతర భారత క్రికెటర్లకు దొరలేదన్నది నా అభిప్రాయం. వీరిని దులిప్ ట్రోఫీకి ఎంపిక చేయాల్సింది’’ అని పేర్కొన్నాడు. కనీసం ఫస్ట్రౌండ్లోనైనా ఈ మేటి క్రికెటర్లు పాల్గొనాల్సిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.వరుస టెస్టు సిరీస్లుకాగా సెప్టెంబరు 5 నుంచి దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ ఆరంభం కానుంది. అనంతపురం, బెంగళూరులలో ఈ టోర్నీ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇక శ్రీలంక పర్యటన తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబరు 19 నుంచి టీమిండియా మళ్లీ బిజీకానుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ తర్వాత బెంగళూరు, పుణె, ముంబై వేదికగా భారత్ న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిండియా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్లు భారత్కు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలోనే సీనియర్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటనIndia has played 249 international matches in the last 5 years. Rohit has played only 59% of those. Virat 61 % & Bumrah 34%. I see them as well rested India players. Could have been selected for the Duleep trophy.— Sanjay Manjrekar (@sanjaymanjrekar) August 28, 2024 -
Duleep Trophy: ఆ ముగ్గురు దూరం.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీకి దూరమయ్యారు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్, కశ్మీరీ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. టోర్నీ మొదలయ్యే నాటికి వీరిద్దరు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని తెలిపింది.సిరాజ్, ఉమ్రాన్ స్థానాల్లో వీరేఫిట్నెస్ కారణాల దృష్ట్యా సిరాజ్, ఉమ్రాన్ దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి దూరం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్-బి నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఇందుకు గల కారణం మాత్రం తెలపలేదు. ఇక టీమ్-బిలో భాగమైన సిరాజ్ దూరం కావడంతో.. అతడి స్థానంలో హర్యానా రైటార్మ్ పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.అదే విధంగా.. టీమ్-సిలో ఉమ్రాన్ మాలిక్ స్థానాన్ని పాండిచ్చేరి ఫాస్ట్ బౌలర్ గౌరవ్ యాదవ్తో భర్తీ చేసినట్లు తెలిపింది. అయితే, జడ్డూ రీప్లేస్మెంట్ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇక టీమ్-బిలో ఉన్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఈ టోర్నీలో పాల్గొంటాడని తెలిపింది.కాగా నాలుగు రోజుల ఫార్మాట్లో జరిగే దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ సెప్టెంబరు 5 నుంచి మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.దులిప్ ట్రోఫీ- 2024 రివైజ్డ్ టీమ్స్ఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన -
Duleep Trophy: ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే అందరి దృష్టి!
శ్రీలంక పర్యటన తర్వాత.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా క్రికెటర్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్బాల్ టోర్నీ బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. సుమారుగా యాభై మందికి పైగా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు.ఈ టోర్నీకి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే నాలుగు జట్ల వివరాలను వెల్లడించింది. ఆటగాళ్లను టీమ్-ఏ, టీమ్-బి, టీమ్-సి, టీమ్-డిగా విభజించింది. టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తదితరులు పాల్గొననున్న ఈ టోర్నీలో.. ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా హైలైట్గా నిలవనున్నారు.అభిమన్యు ఈశ్వరన్బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ దులిప్ ట్రోఫీ-2024లో టీమ్-బి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 94 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇప్పుడు ఈ టోర్నీలో గనుక ఈశ్వరన్ సత్తా చాటితే.. బంగ్లాతో సిరీస్లో టీమిండియా బ్యాకప్ ఓపెనర్గా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యశ్ దయాల్దులిప్ ట్రోఫీ-2024లో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ టీమ్-బికి ఆడనున్నాడు. 26 ఏళ్ల ఈ యూపీ బౌలర్ ఇప్పటి వరకు 23 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 23 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున కూడా సత్తా చాటాడు. దులిప్ టోర్నీలో యశ్ దయాల్ ఆకట్టుకుంటే బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో అతడి పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంటుంది.హర్షిత్ రాణాఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు హర్షిత్ రాణా. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ ఢిల్లీ బౌలర్ జింబాబ్వేతో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే, ఈ 22 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు.ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడి 28 వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. దులిప్ ట్రోఫీలో టీమ్-డికి ఆడనున్నాడు. మెరుగైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాలని పట్టుదలగా ఉన్నాడు.నితీశ్కుమార్ రెడ్డిఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్కుమార్ రెడ్డి. ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ.. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ దురదృష్టవశాత్తూ గాయపడి.. జింబాబ్వే టూర్కు వెళ్లలేకపోయాడు. అయితే, దులిప్ ట్రోఫీ(టీమ్-బి)లో సత్తా చాటితే మాత్రం.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.ముషీర్ ఖాన్టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న ఆల్రౌండర్. దేశవాళీ క్రికెట్లో ముంబైకివ ఆడుతున్న ముషీర్.. గత రంజీ సీజన్లో ఓవరాల్గా 529 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. కేవలం ఆరు ఫస్ట్క్లాస్ మ్యాచ్లలోనే ఈ మేర స్కోరు చేశాడు. పందొమిదేళ్ల ముషీర్ ఖాన్ దులిప్ ట్రోఫీలో టీమ్-బికి ఆడనున్నాడు. అన్నకు పోటీగా బ్యాట్తో రంగంలోకి దిగనున్నాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ