శ్రేయస్‌ సేనపై రుతురాజ్‌ టీమ్‌ ఘన విజయం | Duleep Trophy 2024: India C Defeated India D By 4 Wickets | Sakshi
Sakshi News home page

Duleep Trophy 2024: శ్రేయస్‌ సేనపై రుతురాజ్‌ టీమ్‌ ఘన విజయం

Published Sat, Sep 7 2024 4:00 PM | Last Updated on Sat, Sep 7 2024 7:29 PM

Duleep Trophy 2024: India C Defeated India D By 4 Wickets

దులీప్‌ ట్రోఫీలో భాగంగా అనంతపురం వేదికగా ఇండియా-డితో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-సి టీమ్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-డి.. అక్షర్‌ పటేల్‌ (86) ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 చేసింది. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌, హిమాన్షు చౌహాన్‌ తలో 2, మానవ్‌ సుతార్‌, హృతిక్‌ షోకీన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-సి.. బాబా ఇంద్రజిత్‌ (72) మినహా ఎవరూ రాణించకడంతో 168 పరుగులు చేయగలిగింది. హర్షిత్‌ రాణా (4/33), అక్షర్‌ పటేల్‌ (2/46), సరాన్ష్‌ జైన్‌ (2/16), అర్ష్‌దీప్‌ సింగ్‌ (1/29), ఆదిత్య థాకరే (1/33) ఇండియా-సిని దెబ్బకొట్టారు.

దీని తర్వాత రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇండియా-డి.. శ్రేయస్‌ అయ్యర్‌ (54), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (56), రికీ భుయ్‌ (44) రాణించడంతో 236 పరుగులకు ఆలౌటైంది. మానవ్‌ సుతార్‌ 7 వికెట్లు తీసి ఇండియా-డిని దారుణంగా దెబ్బతీశాడు. విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 2, అన్షుల్‌ కంబోజ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (46), సాయి సుదర్శన్‌ (22), ఆర్యన్‌ జుయెల్‌ (47), రజత్‌ పాటిదార్‌ (44), అభిషేక్‌ పోరెల్‌ (35 నాటౌట్‌) తలో చేయి వేయడంతో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సరాన్ష్‌ జైన్‌ 4, అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  కాగా, ఇండియా-సికి రుతురాజ్‌.. ఇండియా-డికి శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement