Ranji Trophy 2024: ఆంధ్ర జట్టు కొంపముం‍చిన ఒకే ఒక్క వికెట్‌.. | Ranji Trophy: Nagwaswalla Stars In Gujarats One Wicket Win Over Andhra, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024: ఆంధ్ర జట్టు కొంపముం‍చిన ఒకే ఒక్క వికెట్‌..

Published Tue, Oct 22 2024 9:39 AM | Last Updated on Tue, Oct 22 2024 5:02 PM

Nagwaswalla stars in Gujarats one wicket win over Andhra

రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మాజీ చాంపియన్‌ గుజరాత్‌ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఒక్క వికెట్‌ తేడాతో ఓటమి పాలైంది.

ఆంధ్ర నిర్దేశించిన 144 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్‌ జట్టు 50.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 131 పరుగులవద్ద గుజరాత్‌ 9వ వికెట్‌ను చేజార్చుకోగా... అర్జన్‌ నాగ్‌వాస్‌వాలా (16 నాటౌట్‌; 1 ఫోర్‌) గుజరాత్‌ జట్టును గట్టెక్కించాడు.

ఆంధ్ర జట్టు స్పిన్నర్‌ లలిత్‌ మోహన్‌ 76 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి తమ జట్టుకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. శశికాంత్‌కు ఒక వికెట్‌ దక్కగా... మరో వికెట్‌ రనౌట్‌ రూపంలో వచి్చంది. అంతకుముందు ఫాలోఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 203/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు 90.5  ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. 

శ్రీకర్‌ భరత్‌ (47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (32; 3 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (34; 6 ఫోర్లు), త్రిపురాణ విజయ్‌ (30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో అర్జన్‌ నాగ్‌వాస్‌వాలా 4 వికెట్లు తీయగా... సిద్ధార్థ్‌ దేశాయ్, రవి బిష్ణోయ్‌ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు.
చదవండి: Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన!
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement