క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్ట‌నున్న స‌చిన్‌ | Sachin Tendulkar launches first edition of International Masters League | Sakshi
Sakshi News home page

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్ట‌నున్న స‌చిన్‌

Published Mon, Sep 30 2024 8:45 PM | Last Updated on Mon, Sep 30 2024 9:22 PM

Sachin Tendulkar launches first edition of International Masters League

వెట‌ర‌న్ క్రికెట‌ర్లు సంద‌డి చేసేందుకు మ‌రో టీ20 క్రికెట్ లీగ్‌ పుట్టుకొచ్చింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీ తొట్ట‌తొలి సీజ‌న్ ఈ ఏడాది జ‌ర‌గ‌నుంది. సోమ‌వారం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొదటి ఎడిషన్‌ను భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్క‌ర్ లాంచ్ చేశారు. 

ఈ లీగ్ కమీషనర్‌గా టీమిండియా మాజీ ఓపెన‌ర్ సునీల్ గవాస్కర్ నియమితుడయ్యాడు. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక మొత్తం ఆరు జ‌ట్లు పాల్గోనున్నాయి. ఈ  ఆరు దేశాల నుంచి క్రికెట్ స్టార్లు పాల్గొనున్నారు. సచిన్ టెండూల్క‌ర్ కూడా ఈ లీగ్‌లో భార‌త త‌ర‌పున ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

"క్రికెట్‌కు భార‌త్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతూనే ఉంది.  గ‌త ద‌శాబ్దం నుంచి టీ20 క్రికెట్‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెరిగింది. ఈ పొట్టి క్రికెట్‌లో త‌మ‌కు ఇష్ట‌మైన‌ మాజీ క్రికెట‌ర్లు ఆడితే చూడాల‌న్న కోరిక అభిమానుల్లో ఉంది.

 వెట‌ర‌న్ క్రికెట‌ర్లు ఆడే ప్ర‌తీ లీగ్‌కు ఫ్యాన్స్ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారని స‌చిన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. కాగా లీగ్‌లోని మ్యాచ్‌లు ముంబై, లక్నో, రాయ్‌పూర్‌లలో జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement